అగ్ని మహా పురాణము

Table of Contents

70 - అథ వృక్షాది ప్రతిషాకథనమ్

శ్రీ భగవంతుడు చెప్పెను : ఇపుడు భోగ మోక్షము నిచ్చు వృక్ష ప్రతిష్ఠనుగూర్చి చెప్పెను. వృక్షముకు సర్వౌషధిజలములు పూసి, సుగంధచూర్ణము చల్లి , చూలలచే ఆలంక రించి. వస్త్రములు చుట్టబెట్టవలెను. అన్ని వృక్షములకు బంగారు సూదులతో కర్ణవేధనము చేసి, సువర్ణమయ శలాక తో ఆంజన ముంచవలెను. వేదిక పై ఏడు ఫలము లుంచి, ఒక్కొక్క వృక్షమునకు అధివాసనము చేసి, కుంభము సమర్పించ వలెను. పిదప ఇంద్రాది దిక్పాలకుల నుద్దేశించి బలిప్రదా నము చేయవలెను. వృషాధివాసన సమయమున, ఋగ్వేదమంత్రములతోగాని, యజుర్వేదమంత్రములతో గాని, సామవేద మంత్రములతోగాని, వరుణ దేవతాక మంత్రములతో గాని, మత్తభైరవమంత్రములతో గాని హోమము చేయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వృక్షవేదిక పై నున్న కలశలతో వృక్షములకును, యజమానునకును స్నానము చేయించవలెను. యజమానుడు ఆలంకరించుకొని బ్రాహ్మణులకు గో భూ-భూషణవస్తాదులు దక్షిణగా ఇచ్చి నాలుగు దివసములు క్షీరయుక్త భోజనము పెట్టవలెను. తిల.మృత-పలాశ సమిధలతో హోమము చేయించవలేను. ఆచార్యునకు రెట్టింపు దక్షిణ ఇవ్వవలెను. మండపాడి నిర్మాణము వెనుక చెప్పిన విధముననే చేయవలెను. వృక్ష-ఉద్యానముల ప్రతిష్ఠ చేయుటచే పాపములు నశించి పరమసిద్ది లభించును, ఇపుడు సూర్య-శివ-గణపతి-శక్తి -శ్రీహరి పరివారముల ప్రతిష్టా విధానమును వినుము. దీనిని మహేశ్వరుడు కుమారస్వామికి చెప్పెను.

అగ్ని మహాపురాణమునందు పాదపారామప్రతిష్ఠావిధాన కథన మను డెబ్బదవ అధ్యాయము సమాప్తము.