అగ్ని మహా పురాణము

Table of Contents

119 - అథ మహాద్వీపాదివర్ణనమ్.

అగ్ని రువాచః-

అగ్ని దేవుడు చెప్పెను : జంబూద్వీపము ఒక లక్ష యోజనముల విస్తారము కలది. అది న మూలలందును ఒక లక్ష యోజనముల విస్తారముగల వార సముద్రముచే పరివేష్టిత మైనది. ఆ క్షీరసముద్రమును చుట్టి ప్లక్షద్వీప మున్నది. మేధాతిథిపుత్రులు ఏడుగురు ఆ ప్లక్షద్వీపమునకు ఆధిపతులు. శాంతభయ.శిశిర సుఖోచయ-ఆనంద శివ. మధ్రువు లను పేరు గల ఆ ఏడుగురి పేర్లతో ఏడు వర్షము లున్నవి. గోమేధ-చంద్ర.నాకవ-దుదుభి-సోమక-సుమనస్-రైలమును పర్వతములు ఈ వర్షము మర్యాదపర్వతములు. ఆట వైర్రాజు లను సుచరులు వివసించుచుందురు. ఈ ద్వీపము నండు ఏడు ప్రధాన నదు లున్నవి, ప్లక్షద్వీపమునుండి శాకద్వీపమువరకును ఉయ ప్రదేశమున నివసించువారి ఆయు ర్దాయము ఐదు వేల సంవత్సరములు. అచట వర్ణాశ్రమధర్మము 2 పాలింపబడుచుకును. ఆర్య-కురు, ఏవిశ.వి. అనునవి ఆచట నుండు బ్రాహ్మణాదుల పేర్లు, ఆరాధ్యదేవత చంద్రుడు. ప్లక్షద్వీప విస్తారము రెండు లక్షల యోజనములు, అంతయే ప్రమాణము గల ఇక్షురస సముద్రము దానిని చుట్టి యున్నది. దీని తరువాత నున్నది శాల్మలిద్వీపము. ఇదీ ప్లక్షద్వీపముకంటె రెట్టింపు ఉండును. వపుష్మంతుని ఏడుగురు కుమారులు. శ్వేతహరిత జీమూత. పాతవై ద్యుత మానససు ప్రభ నామధేయులు ఈ ద్వీపమునకు అధిపతులు. అచు వీరి పేర్లతో ఏడు వర్షము లేర్పనవి. దానికంటే రెట్టింపు వై కార్యము గల సునోదముద్రము దానిని చుట్టి యున్నది. కుముద అనల-బలాహక-ద్రోణకంక- మహిష- కకుద్మ పర్వతములు దీని మర్యాహాపర్వతములు, ఏడు ప్రధాననదులున్నవి. అచటి బ్రాహ్మణాది వర్ణముకు కపి- ఆరుణపీత-కృష్ణ అని పేరు. అచటివారు వాయుదేవతారాధకులు. దీని తర్వాత కుశ ద్వీపము జ్యోతిష్మంతుని ఏడుగురు కుమారులు. ఉద్భిదుడు, ధేనుయుతుడు, ద్వేరథుడు, లంబనుడు, ధైర్యుడు, కపిలుడు, ప్రభాకరుడు అనువారు దీని అధిపతులు. వీరి పేర్లతోడనే ఏడు వర్షము లేర్పడినవి. దధి మొదలగువారు ఇచట నుండు బ్రాహ్మణాదు. వీరు బ్రహ్మరూపధారి యగు విష్ణువును పూజింతురు. విద్రువ. హేమ శైల-ద్యుతిమల్.పుష్పవల్-కుశేశయ-హరి-మదరాచలములు ఇచటి వర్షపర్వతములు. ఈ కుశ ద్వీపము చుట్టి, దానితో సమానమైన వైశాల్యము గల మృతసముద్ర మున్నది. ఈమహాద్వీపాదివర్ణమి మృతసముద్రమును క్రౌంచద్వీపముపరివేష్టించి యున్నది. ద్యుతిమంతుని కుమారులు ఈ ద్వీపమునకు ఆధిపతులు. వారి పేర్లతోడనే ఇచటి వర్షములు ప్రసిద్ధము లే నవి.

కుశలుడు, మనోనుగుడు, ఉష్ణును ప్రధానుడు, అంధకారకుడు. కుతి, దురభిఅనువారు ద్యుతిమంతుని ఏడుగురు కుమారులు. ఆ ద్వీపమున ఏడు న్యూరాపర్వతము, ఏడు నదులు ఉన్నవి. క్రొంచ-వామన-అంధకారక రత్న శైల దేవావతి-పు-చరీ చుడగు పర్వికములు. ఈ ద్వీపము క్రమముగ రెట్టింపు విస్తారము గలవి. పూర్వపూర్వద్వీప ముల ప్రమాణము ఏంది ఉత్తరోత్తర ద్వీపర్వకము ప్రమాణము రెట్టింపు ఉండును. ఆచటి బ్రాహ్మణాది వర్ణములకు వరుసగ పురుషధన్య-శిష్యులని పేర్లు. వారు శ్రీ మహా-ష్ణువును ఆరాధించుచుందురు. క్రౌంచద్వీపమును చుట్టి తక్ర (మజ్జిగ) ముద్రమున్నది. ఆసముద్రమును శాకద్వీపము పువేష్టించి యున్నది. అచటి రాజైన భవుని ఏడుగురు కమారులు జకుమార-సుకుమార-మణీవకలకు తర-మోదాకి-ద్రుము-నువారు, శాకద్వీపపాలకులు. చటి వర్షములు గూడ వీరి పేర్లతో పశిద్ధి పొందినవి. ఉదయగిరి-జంధర-రై వత-శ్యామకోద్రక ఆంబికేయ- కేసరి, అను ఏడు పర్వత ములు, ఏడు ?దులు ఉన్నవి. అచట నున్న పోహ్మణాదుకు మగ -మగధమాన స్య మందగు అని పేర్లు. వారు సూర్య రూపధారి యగు నారాయణుని ఆరాధించుచుందురు, శాకద్వీపమును చుట్టి క్షీరసాగర మన్నది. దానిని పుష్కర ద్వీపము పరివేష్టించి యున్నది. అచట ప్రభు వగు సవనమహారాజుకు మహావాతుడు. ధరకి అను ఇద్దరు పుత్రులుండిరి అచటి రెండు వర్ణములు వారి పేర్లతో ప్రసిద్ది చెందినవి, మానసోత్తర మను ఒకే వర్షపర్వతము. వర్గ మధ్యమున వలయాకారమున నున్నది. దాని విస్తారము కొన్ని వేల యోజనములు. ఎత్తు విస్తారముతో శతకము. ఆనాటి జనులు పది శ్రీమదగ్ని మహాపురాణము సంవత్సరములు జీవింతురు. అచట దేవతలు బ్రహ్మను పూజింతురు. పుష్కరద్వీపము చుట్టు మధుర జలసముద్ర మున్నది. దాని విస్తారము ద్వీపవిస్తారముతో సమానము. మహామునీ! అచట సముద్రజలము పెరుగుట గాని, తరుగుట గాని ఉండదు. శుక్ల పక్షములందు చంద్రోదయాస్తమయము లందు సముద్రజలమున కేవలము ఐదువేల పది ఆంగుళముల జలము పెరుగుట. తరుగుట కనబడును. తియ్యని నీరు గల ఆ సముద్రము నలు వైపుల రెట్టింపు వ్రణము గల సువర్ణమయ భూమి యుండును. కాని అచట ప్రాణం లేవియు ఉండవు. దాని తరువాత లోకాలోక పర్వత మున్నది. దాని వైశాల్యము పది వేల యోజనములు. లోకాలోకపర్వతము ఒక వైపున అంధకారావృత మై యుండును. ఆ అంధకారము ఆండకటాహముచే అవరింపబడి యున్నది. ఆండకటాహసహిత మగు మొత్తము భూమి వైశాల్యము ఏబది కోట్ల యోజనములు,

అగ్ని మహాపురాణమునందు మహాద్వీపాది వర్ణవ మను నూటపందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.