అగ్ని మహా పురాణము

Table of Contents

185 - అథ నవమీవ్రతాని.

అగ్ని రువాచః-

ఆగ్నిదేవుడు పలికెను; ఇపుడు భుక్తిముక్తిప్రదములగు నవమీవ్రతములను గూర్చి చెప్పెదను. ఆశ్వయుజ శుక్ల నవమినాడు గౌరీనవమీవ్రతము నాచరించి దేవీపూజ చేయవలెను. ఈ నవమికి ‘పిష్టకనవమి’ అని పేరు. ఈ వ్రతము చేయువాడు దేవీపూజ చేసి పిష్టాన్నమును భుజించవలెను. ఆశ్వయుజశుక్ల నవమినాడు మూలనక్షత్రముండి, సూర్యుడు కన్యారాశిగతు డైనచో ‘మహానవమి’ యని పేరు. ఆది సర్వపాపవినాశకము. ఆనాడు నవదుర్గలను తొమ్మిదిస్థానము అందు గాని, ఒక స్థానమునందు గాని స్థాపించి పూజించవలెను. మధ్యయందు ఆష్టాదశ భుజమహాలక్ష్మిని, రెండు పార్శ్వము లందును మిగిలిన దుర్గలను పూజించవలెను. నవదుర్గలను క్రింద చెప్పిన క్రమమున, అంజన-డమరుసహికలగా స్థాపించవలేను. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, పూజ్య, చండరూప, ఆచండిక-వీరందరి మధ్యయందు అష్టాదశభుజ యగు ఉగ్రచంగా మహిషమర్దనీ దుర్గను పూజించవలెను. “ఓం దుర్గే దుర్గ రక్షణి స్వాహా” అనునది దశాక్షరముతము ఈ విధానము ననుసరించి ఈ దళాక్షరమంత్రజపము చేయువానికి ఎవరినుండియు బాధలు కలుగవు. దుర్గాదేవి వామహస్తములందు కపాల -భేటక-ఘంటా-దర్పణ-తర్జనీముద్రా-ధనుష్-ధ్వజ-డమరు-పాశములను, దక్షిణహస్తములందు శక్తి-ముద్గర -త్రిశూల-వజ్ర –ఖడ్గ-కుంతక-శంఖ-చక్ర-శలాక లను ధరించి యుండును. ఈ ఆయుధ ములను కూడ పూజించవలెను. “కాలి కాలి వజ్రేశ్వరి లోహదడ్డాయై నమః” అను మంత్రము పఠించుచు ఖడ్గముతో బలి పశువును చంపవలెను. ఆ బలిపశువు రక్తమాంసములను “పూతనాయై నమః” అని నైరృతిదిక్కునందును, “పాపరాక్షస్యై నమః” అని వాయవ్యమునందును, “చర క్ర్యై నమః” అని ఈశాన్యమునందును, “విదారికాయై నమః” అని ఆగ్నేయము నందును ఆ దేవతల నుద్దేశించి సమర్పించవలెను. రాజు దాని ఎదుట స్నానము చేసి స్కందవిశాఖుల నిమిత్తమై పిష్ట నిర్మితశత్రుబలి ఇవ్వవలెను. రాత్రియందు బ్రాహ్మి మొదలగు శ క్తుల పూజ చేసి “జయంతి, మంగల, కాలి, భద్రకాలి, కపాలిని, దుర్గ, శివ, క్షమ,ధాత్రి, స్వాహా, స్వధా అను పేర్లు గల ఓ దేవీ; నమస్కారము.” ఇత్యాదిమంత్రములు పఠిం చుచు ప్రార్థించవలెను. దేవికి పంచామృతస్నానము చేయించి వివిధోపచారముతో ఆమెను పూజించవలెను. దేవిని ఉద్దేశించి చేసిన ధ్వజదానము, రథయాత్ర, బలిదానము సకలాభీష్టముల నొసగును.

అగ్ని మహాపురాణమునందు నవమీవ్రతవర్ణన మను నూటఎనుబదియైదవ అధ్యాయము సమాప్తము.