అగ్ని మహా పురాణము

Table of Contents

101 - అథ ప్రాసాదప్రతిష్ఠా విధిః

 ఈశ్వర ఉవాచః-

పరమేశ్వరుడు పలికేను ; స్కందా! నే నిపుడు ప్రాసాడ (దేవాలయ ప్రతిష్టావిధి చేప్పెదను. దానియందు చైతన్యసంబంధమును చూపుచున్నాను. దేవాలయమునందలి శుక నాసము సమాప్తియగు చోటపూర్వవేదిమధ్యభాగమునందు ఆధార్చ శని భావించి ప్రణవమంత్రముతో కమలమున్యాసము చేయవలెను. దాని పైన సువర్ణదీధాతువులలో ఏదైన ఒక దానితో చేసిన కలశను స్థాపించవలెను. దానిలో పంచగవ్యములు, మధువు, పాలు, రత్నములు, మొదలగు ఐదు శస్తువులు ఉంచ వలెను. కలశ పై గంధము పూసి, వస్త్రముచే కప్పి, సుగంధపుష్పములతో వాసితము చేసి, చూతాదిపంచవృక్షముల పల్లవము లచే దాని ముఖమును ఆచ్చేదీంచవలెను. హృదయముత్రముతో హృదయకమలభావన చేయుచు ఆ కలశను అచట స్థాపించ వలేను. పిదప గురువు పూరక ప్రాణాయామముతో శ్వాసను లోనికి గ్రహించి, శరీరమతో సకలీకరణక్రియ చేయవలెను. స్వమంత్రముతో కుంభక ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును లోపల ఆవరుద్దము చేయవలెను. ఈశ్వరుని అనుమతితో సర్వోత్మాభిన్న మొన జీవచైతన్యమును జాగృతము చేయవలెను, రేచక ప్రాణాయామముతో ప్రజ్వలించుచున్న అగ్నికణము వలె నుండు జీవ చైతన్యమును ద్వాదశాంతస్థానమునుండి గ్రహించి, కలశములో స్థాపించి, దానియందు అతివాహికశారీరచ్యాసము. చేసి, దాని గుణములను బోధించు కాలాదీకమును, ఈశ్వరసహితము అగు పృధ్వీపర్వంతతత్త్వ సముదాయమును దాని, యందు వివేకింపచేయవలెను. పదమూడు ఇంద్రియములను, తదధిపతులను నామమాత్రముతోకలక పై స్థాపించి,ప్రణవను మొదట చేర్చిన నామముత్రములతో పూజించవలెను. తమతమ కార్యములు చేయించు మాయాపాక నియామీక లను ప్రేరకులగు విద్యేక ఉలను, సర్వవ్యాపియగు నీవనీ తమమంత్రములతో న్యాసముచేసి హజించవలెను. సకల అంగముల న్యాసముచేసి అవరోధినీము ద్రతో వాటి విన్నింటిని నిరోధించవచ్చు. లేదా సువర్గాదిధాతువులతో ఒక మానవాకృతి నిర్మించి, దానిని పంచగవ్యములతోను, కషాయద్రవ్యములతోను శుద్ధి చేసి శయ్యపై కూర్చుండబెట్టి ఉమాపతి యైన రుద్రుని ధ్యానించుచు, శివపుత్రముతో ఆ పురుష శరీరమునందు వ్యాపకరూపమున ఆ శివుని న్యాసము చేయవలెను. శివసాన్నిధ్యముకోర తై హోమ-ప్రోక్షణ-స్పర్శ-జపములు చేయవలెను. సునిధాపనము రోధకము మొదలగు సకలకార్యములను భాగత్రయవిభాగపూర్వకముగ చేయవలెను. ఈ విధముగ ప్రకృతిపర్యంతవ్యాసము నకు సంబంధించిన న్యాసవిధానము పూర్తి చేసి ఆ పురుషుని కలశములో స్థాపించవలేను.

ఆగ్ని మహాపురాణమునందు ప్రాసాదప్రతిష్ణావిధానమను నూటఒకటవ అధ్యాయము సమాప్తము.