అగ్ని మహా పురాణము

Table of Contents

273 - అథ సూర్యవంశవర్ణనమ్

అగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. ఇపుడు సూర్యవంశమును ఇతర రాజవంశమును గూర్చి చెప్పెదను. మహావిష్ణువు నాభికమలమునుండి బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు. ఆతని కుమారుడు వివస్వంతుడు. ఆతనికి సంజ్ఞ, రాజై, ప్రథయను ముగ్గురు భార్యలుండిరి. రాజై రైవతకునిపుత్రి. ఆమె రేవంతుడను కుమారుని కనెను. ప్రభ ప్రభాతుడను పుత్రుని, త్వష్టకుమార్తెయైన సంజ్ఞ మనువుయను పుత్రుని, యమున, యమడుయను కవలలను కనెను, ఛాయయను నామాంతరముగల సంజ్ఞ సావర్ణ్యమనువును, శవిని, తపతి, - విష్టి, యనుక న్యలను కనెను. పిదప సంజ్ఞకు అశ్వినీ కుమారులు జన్మించిరి. వైవస్వత మనువుకి, ఆతనితో సమానులగు - పదిమంది కుమారులుపుట్టిరి. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు నృగుడు దిష్టుడు కరూశుడు, పృషధ్రుడు ఆను ఈ పదిమంది మహాబలులును అయోధ్యలో నివసించిరి. మనువునకు ఇలయనుకన్య పుట్టెను. ఆమెయందు బుధునకు, పురూరవుడు పుట్టెను. పురూరవుని కనిన పిమ్మట ఆ ఇలశుద్యుమ్నుడిగా మారిపోయెను. సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు వినతాశ్వుడు అను రాజులు జన్మించిరి. ఉత్కలునకు ఉత్కలము రాష్ట్రమాయెను. పశ్చిమదేశము వినతాశ్వుల రాజ్యమాయెను. రాజ శ్రేష్టుడైన గయునకు పూర్వదిక్కున అధికారము లభించెను. ఆతని రాజధాని గయాపురి. వశిష్ఠుని వాక్యము ప్రకారము సుద్యుమ్నుడు ప్రతిష్టానపురము చేరెను. అచట రాజ్యమును పొంది దానిని పురూరవసునకు ఇచ్చెను. నరిష్యంతుని పుత్రునకు శకులను పేరు. నాఖాగున విష్ణభక్తుడగు అంబరీషుడు జనించెను. ఆతడు. ప్రజలను బాగుగ పరిపాలించెను. ధృష్టుని నుండి ధాష్ట్రక వంశము విస్తరించెను. శర్యాతికి సుకన్య, ఆనర్తుడు, జనించిరి. ఆనర్తునకు రేవుడు జనించెను ఆతనిదేశము ఆనర్త దేశ ము. కుశస్థలి ఆతనిరాజధాని. రేవునకు రైవతుడు, జనించెను. ధార్మికుడైన ఆతనికి కకుద్మియని కూడ పేరు తన తండ్రి నూర్గురు కుమారులలో ఇతడుజ్యేష్ఠుడగుటనే కుశస్థలిరాజ్యము ఆతనికి లభించెను

ఒకనాడు అతడు కన్యాసహితుడై బ్రహ్మదగ్గరకువెళ్ళి అచట సంగీతమును వినుచుండెను. అచట బ్రహ్మకు ముహూర్తమొకటి మాత్రమే గడచెను. అంతలో మర్త్యలోక మున అనేక యుగ ములు సమా ప్రమాయెను. అతడు శీఘ్ర మగ యాదవులతో కూడిన తన నగరమునకు వచ్చెను. ఆచట కుశ స్థలిస్థానమున అనేక ద్వారములు కలది, మనోహర మైవదియగు ద్వారవతీపట్టణము నిర్మితమై యుండెను. వాసుదేవుడు నాయకులుగాగల భోజవృష్టి అంధకులు దానిని రక్షించుచుండిరి. రేవతిని బలరామునకు ఇచ్చి సంసార మును అనిత్యవిషయమును తెలుసుకొని సుమేరు పర్వత శిఖరమువ తపస్సు చేసి ఎన్టపడి ముమ చేరెను. నాతాగుని యిద్దరు పుత్రులు వైశ్యులు. వారు బ్రాహ్మణత్వమును పొందిరి. కరూషు నకు యుదోన్మత్తులగు కరూషులను క్షత్రియులు జన్మించిరి. వృషధ్రుడు గురువుయొక్క గోవును హింసించుటచే శూద్రు డాయెను. మనుపుత్రుడైన ఇక్ష్వాకునకు దేవరాజుయైన ఆవిడక్షి" పుట్టెను. వికుడి పుత్రుడు క కుత్సుడు. అతని పుత్రుడు సుయోధనుడు, ఆతని పుత్రుడు పృథువు, అతని పుత్రుడు విశ్వనాశ్వుడు. అతనిపుత్రుడు వాయువు. వాని పుత్రుడు. యవనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడైన శ్రావంతుడ: తూర్పు దిక్కున లౌవంతి కాపురమును నెలకొల్పేను. అతని పుత్రుడు బృహదశ్వుడు, వాని కుమారుడు కువలాశ్వుడు. ఇతడు పూర్వము దుంధు అను రాక్షసుని చంపుటచే దుంధుమారుడను పేరుపొందెను. ఆతనికి దృఢాశ్వుడు. దండుడు, కపిలుడు, ఆను ముగ్గురురాజులు జన్మించిరి. దృఢశ్వునకు హర్యశ్వుడు, ప్రమోదకుడుయను పుత్రులు పుట్టిరి హర్యశ్వుని కుమారుడు నికుంభుడు. ఆతనికుమారుడు సంహతాశ్వుడు. సంహతాశ్వునకు ఆకృషాశ్వుడు రణాశ్వుడుయను పుత్రులు పుట్టిరి. రణాశ్వునపుత్రుడు యువనాశ్వుడు. ఆతనిపుత్రుడు మాంధాత. ఆతనికి పురుకుల్త్సుడు ముచికుందుడు, ఆను పుత్రులు పుట్టిరి.

పురుకుత్స్థునకు నర్మదయందు త్రసద్దస్యుడుయను సంభూతుడను నామాంతరముగల పుత్రుడు పుట్టెన-- సంభూతునికుమారుడు సుధన్వ. ఆతనిపుత్రుడు త్రిధన్వ, ఆతనిపుత్రుడు తరుణుడు. ఆతని పుత్రుడు సత్యవ్రతుడు. ఆతనీపుత్రుడు సత్యరథుడు. ఆతనికి హరిశ్చంద్రుడు, ఆతనికిరోహితాశ్వుడు, ఆతనికి వృకుడు, ఆతనికిఙాహువు ఆతనికి సగరుడు పుట్టెను. సగరుని ప్రియురాలగు ప్రథకు ఔర్వముని ప్రసాదముచే అరువదివేల పుత్రులను నెను. రెండవ భార్యయైన భానుమతికి అసమంజసుడను ఒక కుమారుడు జనించేను. సగరుని ఆరువదివేలమంది కుమారులును . భూమీనీ త్రవ్వుచు కపిలునిచే చేయబడిరి. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఆతని కుమారుడు దిలీపుడు, ఆతనికి గంగను భూలోకమునకు తీసుకునివచ్చిన భగీరథుడ నుకుమారుడు పుట్టెను. అతనికి నాభాగుడు, అతనికి అంబరీషుడు, ఆతనికి సింధుద్వీపుడు వానికి శ్రుతాయువు, వానికి ఋతుపర్ణుడు, వానికి కల్మషపాదుడు, వానికి సర్వకర్మ, వానికి అనరణ్యుడు; వానికి నిఘ్నుడు, దానికి దిలీపుడు, వానికి రఘువు, వానికి ఆజుడు, వానికి దశరథుడు పుట్టెను. దశరథునకు నారాయణ స్వరూపులగు నలుగురు కుమారులు పుట్టిరి. వారిలో జ్యేష్ఠుడు రాముడు. రావణాంతకుడైన ఆ రఘూత్తముడు అయోధ్యకు రాజాయెను. ఆతని చరిత్రమును వారదునినుండి విని వాల్మీకి రామాయణముగ రచించెను. రామునకు సీతయందు, కులవర్గమగు కుశలవులు జన్మించిరి. కడునకు అతిథి ఆతనికి నిషధుడు. ఆతనికి నలుడు, అతనికి నభుడు, ఆతనికి పుండరీకుడు ఆతనికి సుధన్వుడు, అతనికి దేవానీకుడు, ఆతనికి ఆహీనాశ్వుడు, అతనికి సహస్రాశ్వుడు, అతనికి చంద్రాలోకుడు, ఆతనికి తారాపీడుడు, ఆతనికి చంద్ర పర్వతుడు, ఆతనికి భానురథుడు, ఆతనికి శ్రుతాయువు, జన్మించెను. ఇక్ష్వాకు వంశీయులందరును సూర్యవంశ ప్రవర్తకులుగా చెప్పబడుదురు.

ఆగ్ని మహాపురాణమున సూర్యవంశ కీర్తనమను రెండువందల డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.