అగ్ని మహా పురాణము
283 - అథ నానారోగ హరాణ్యౌషధాని
ధన్వన్తరి రువాచః
ధన్వంతరి చెప్పెను. సింహి, శటి రెండు విధముల పసుపు వత్సకము వీటి క్వాథము శిశువునకు కలుసు ఆన్ని అతిసారములను స్తన్యదోషములను తొలగించును శృంగి, కృష్ణ, ఆతివిష, వీటి చూర్ణమును తేనెతో నాకించవలెను. లేదా ఒక్క అతివిషనే నాకించవలెను. దీనినే శిశువుల దగ్గువమనము, జ్వరము, నశించును. పిల్లలకు దుగ్ధ ముతో ఘృతము లేదా తైలముతో వచఇవ్వవలెను. లేదా యష్టికను గాని, శంఖపుష్పిని గాని, పాలతో త్రాగించవలెను, ఆట్లు చేయుటచే వారి వాక్శక్తిరూప సంపత్తి ఆయువు బుద్ధి కాంతి వృద్ధిచెందును. వచ ఆగ్ని శిఖ వాస్తా శుంఠి పిప్పలి, పసుపు కూటము, యష్టిక, సైంధవము వీటి చూర్ణము ప్రాతః కాలమున బాలకులకు ఇచ్చినచో మేధావృద్ధి కలుగును. దేవదారు. మహాశిగ్రు త్రిఫలా, పయోముక్కుల క్వాథముగాని, కృష్ణ, మృద్విక లతో చేసిన కలముగానీ, సర్వకృమి రోగము లను అపహరించును. త్రిఫల, భృంగరాజ విశ్వముల రసములందును మధు ఘృతములందును, మేషీ క్షీరమునందు కాని, గోమూత్రము నందుకాని తడిపినచో శిశురోగ ములను తొలగించును. దూర్వార సమును నశ్యముగా ఇచ్చినచో వాసా రక్తము శాంతించును. లడకము (తెల్లఉల్లి) ఆర్ద్రకము, శిగ్రు, వీరి రసమును చెవిలో పోసనను, అల్లము రసముకాని, తైలముగాని పోసినను చెవిపోటును ఓష్ఠ రోగములను నశించును - జాతి పత్రము. త్రిఫల, వ్యోషము గోమూత్రము, పసుపు, గోదుగ్ధము, ఆ భయాకల్కము, తైలము, వీటిని కబలించుటచే దంత బాధ తొలగును. ధాన్యము నారికేళ జలము, గోమూత్రము. పోన్ శొంఠి వీటి క్వాథమును నోటిలో వుంచుకొన్నచో జిహ్వా వ్యాధితోలగును. లాంగలీ కలమునందు నిర్గుండి రసముతో సాధించిన తైలము ఆగండమాల గల గండ దోషములను నశింపచేయును. ఆర్క పూతిక స్ను హీ, రుగ్ఘాత, జాతిక పత్రములమ గోమూత్రముతో నూరి ఒంటికి రాసినచో చర్మరోగము లన్నియు నంచును. వకుచిని తిలలలో ఒక సంవత్సరము తిన్న చో కుష్ఠరోగసంను నశించును. పథ్య భల్లాతకీ గుడము, తైలము, పిండ ఖర్జూరము ఇప్ కుష్టరోగ నాశకములు, యూథిక, చిత్రకము పసుపు, త్రిఫల, వ్యోషముల చూర్ణమును తక్రముతో త్రాగినను గుడముతో ఉసిరికాయ తిన్నను హర్షరోగము నశించును, ప్రమేయరోగము కలవాడు త్రిఫల, దారి విషముల క్వొథమును గాని, ఉసిరికాయ రసమును, పసుపు కలము, తేనె వీటితో కల్పిగానీ సేవించవలెను. వాసాగర్భమును వ్యాధి ఘాత క్వాథమునందు ఆముదము కలిపి త్రాగినచో వాతశోణిత రోగము తగ్గును పిప్పలి ప్లీహరోగమును తొలగించును.
ఉదర రోగము గలవాడు స్నుక్ క్షీరమునందు అనేక పర్యాయములందు భావన చేసిన పిప్పలి సేవించవలెను. చిత్రక విడంగ త్రికటు కలములతో సిద్ధమగు క్షీరము, అరుచి రోగమును తొలగించును గ్రంథికా, ఉగ్ర ఆథయ, కృష్ణ, విడంగములను నేతిలో కల్పం వుంచి గాని కేవలము తక్రముతో గాని, ఒక మాసము సేవించుటచే గ్రహణహర, పాండు గుక్మకోగములు క్రుమి రోగములు వశించును. త్రిఫల, అమృత, వాస, తిక్త భూనింబ, ముల క్వాథమును తేనెతో సేవించినచో పాండురోగము కామలారోగము నశించును. రక్తపిత్తము కలవాడు వాసారసమును పటిక బెల్లము తేనే కలిపి, త్రాగినను శతావరి ద్రాక్ష బరి, శుంఠిలలో సాధించిన పాలు త్రాగినను ఆరోగము నశించును. క్షయరోగి శతావరి, విదారి, పథ్య, బలాతయ, పోసక, శ్వదంష్ట్రాలను చూర్ణము చేసి తేనె, నెయ్యి కలిపినాకవలేను. పథశిగ్రు, కరంజ, అర్క, త్వక్సార మధు సైంధవములను గోమూత్రముతో కలిపి రాసినచో విద్రథిని పక్వముచేసి మాన్పుటకు మంచిది. త్రివృతా, జీవంతీ దంతీ, మంజిష్ణ ద్వివిధ శర్వరీ, తార్షజా, నింబపత్రముల లేపము భగరంద్రమునకు మంచిది. రుద్ఘాత, హరిద్ర, లావా చూర్ణములను గోమృతముతోను తేనెతోను కలిపి వస్త్రముతో వర్తి చేసి ప్రణము నందుంచినచో వ్రణమును శుద్ధముచేసి మాన్పును. శ్యామా, యష్టి హరిద్రా లోధ్ర, పద్మక, ఉత్పలం చందన మరీచములతో క్షీరములో కాచిన తైలము వ్రణములను మాన్పును, శ్రీ కార్పాసదళ భస్మ , త్రిఫల, ఉపల, నిశ లతో గోళములు చేసి అమపాత్రయందు ఉడికించి ఆతైలమును గాయమునందు వ్రాయవలేను. కుంభిసార మును నిప్పు పై మాడ్చి దానిని పాలతో కలిపి వ్రణముపై వ్రాయవలెను. లేదా కొబ్బరి చెట్టు మొదటిలోనున్న నున్న మట్టిలో మృతము కలిపి కాచినచో వ్రణము మానును.
విశ్వ, అజమోర సైంధవ చించాత్వక్కుల సమ భాగము గల అభయతో కలిపి తక్రము గాని, ఉష్ణ జలము గాని త్రాగుటచే అతిసారము నశించును. ఇంద్రయవ, అతి విష, విశ్వము సలు వేసి, కాచిన క్యాథము ఆ సహిత మగు జీర్ణాతి సారమును శూలముతో కూడిన రక్తతిసార మును పోగొట్టును. అంగారములపై కాల్చిన సుగతమును సింధువును వేడినీళ్ళతో త్రాగవలెను. పిదప శూల బాధ కల వాడు దానిని వేడి నీళ్ళతో త్రాగ వలెను లేదా సైంధవము, ఇంగువ, పిప్పలి ఆథయ వీటితో వేడి నీళ్ళతో త్రాగి వలెను లేనెలో తడిపిన కటురోహ, కమల, ఆతంక, లాజ చూర్ణములను గుడ్డ చుట్టబెట్టి ముఖము వందుంచుకున్నచో దాహము తగ్గును. పాఠదార్వి జాతీదలములను, ద్రాక్ష, మూల త్రిఫలములతో సాధించి మధుక్వాథముతో కలిపి ముఖము నందుంచి చప్పరించినచో దాహము తగ్గును. కృష్ణ, అతి విష, తిక్త ఇంద్రదారు, పాఠ, ప యో ముక్కుల క్వాథమును గోమూత్రము నందు మరిగించి తేనె కలిపినచో స్వర కంఠ రోగములను పోగొట్టును పథ్యగోక్షుర, దుఃస్పర్శ, రాజ వృక్ష. శిలాజిత్తుల కషాయమును తెనెతో త్రాగినచో మూత్ర కృచ్చ్రము పోవును. వెదురు బెరడు వరుణ వృక్షపు బెరడుతో చేసిన క్వాథమ శర్కరన, ఆత్మరీ రోగమును నశింప చేయును స్లీపద రోగము కలవాడు శాకోటక క్వాథముమ తేనెతో కలిపి తినవలెను. మాష, ఆర్కత్వక్కులను, ఆర్కవృక్షపాలను, తైలమును, మైవమున, సైంధవమును కలిపి ఉపయో గించినచో పాద రోగములు నశించును. శాంతి సౌవర్చము, హింగు చూర్ణము వీటిని శొంఠి రసముతో కాని, నేతితో కాని, లేదా వీటి క్వాథములు కాని, మలబంధ దోషమును పోగొట్టును. గుల్మ రోగము కలవాడు, సౌవర్చల చిత్రక హింగు అజా మోదముల రసముతో కలిపి లేదా విడంగ చిత్రకములతో కలిపి తక్రసానము చేయవలెను. రాత్రి, పటోల, మగధముల క్వాథము, ఆజ్యముతో కలిపి తీసుకున్నచో విసర్ప రోగము తొలగును. శోంఠి దేవదారు, నవాక్షర క్వాథము గోమూత్రముతో కలిపి తీసుకున్న చో విసర్ఫరోగమును పొందును. వ్యోష, ఆరణ, వార శ్రీవల క్వాథమ శోధ రోగ ములు తొలగించును. గుడ శిగ్రు త్రివృత్, సైంధవల వణమాల చూర్ణముతో చేసిన క్వాథము శోధ రోగ మును తొలగించును, విశోధ త్రిఫల, గుడములతో చేసిన క్వాథము విరేచకరము. వచా, నల కషాయము నుండి తీసిన జలము వమనకారి. భృంగ రాజ రసమున ఖావితమైన త్రిఫల నూరు పలములు వాయు విడంగలోహ చూర్ణములు, పదవ భాగము కలవరి, గుడూచి, చిత్ర మూలములను ఇరువది ఐదు పలములు గ్రహించి చూర్ణము చేసి, దానిని మధు, ఘృత, జై లములతో సేవించినచో వళులు పలితములు తొలగిపోవును. అట్లు సేవించిన వాడు సకల రోగ ము కుడి నూరు సంవత్సరములు జీవించును. మధు శర్కరలు కలిపి సేవించి త్రిఫల సర్వరోగ ఎకరము. కృష్ణా సహికమగు త్రిఫలను సితా మధు మృతములతో సేవించినచో అట్టి ఫలమే యిచ్చును. పథ్య, చిత్రక, శొంఠి గుడూచి, ముసలీ చూర్ణములను గుడ ముతో భక్షించినచో రోగములను తొలగించి మూడు పందల సంవత్సరముల ఆయుర్దాయము యిచ్చును. జపా పుష్పమును కొంచెము నలిపి నీటిలో కలిపి ఆ చూర్ణ జల మును కొంచెము తైలములో కల్పినచో ఆ తైలము మృతమువలె యగును. పిల్లి మావితో ధూపము వేసినచో చిత్రము కన బడదు. మరల మైనము ధూపము వేసినచో పేనుక టీ వలెనే కనబడును. కర్పూరము, జలగ, భేక తైలము, వీటిని పాటలి మూలముతో కలిపి నూరి పాదములకు రాసుకొని మనుష్యుడు నిప్పుల మీద నడువగలడు. తృణోత్తాపనాదము చేయుచు, అశ్చర్యకరముగ నడు వగలడు. ఎషములను తొలగించుట, రోగ నాశము, గ్రహణాశము, తుచ్ఛక్రీడలు, కామ నాపరమైనవి, ఇహ లోక పర లోకము లందు సిద్ది నిచ్చు కర్మలను షట్కర్మ సహితముగ నీకు చెప్పితిని మంత్ర, ధ్యాన ఔషధ, కథా, ముద్రా, యజ్ఞములు ఈ ఆరును ఇచట పిడి కళ్ళు ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చు దీనిని ఎవడు పఠించునో ఆతడు స్వర్గము నకు వెళ్ళును.
ఆగ్ని మహాపురాణమున నానారోగ హరౌషధ కథ మను రెండు వందల యేనుబది మూడవ అధ్యాయము సమాప్తము.
