అగ్ని మహా పురాణము

Table of Contents

371 - అథ నరక నిరూపణమ్

అగ్ని రువాచః

అగ్ని దేవుడు పలికెను. యమరాజ మార్గ ములను గూర్చి చెప్పియుంటిని. మనుష్యుల మరణములను గూర్చి చెప్పే దను. శరీరమున వాయువేగము ఆధికమైనపుడు పిత్తము ప్రకో పించి శరీరమును అవరుద్ధము చేసి సకల దోషములను ఆవరించి ప్రాణ స్థానములను, మర్మస్థానమును భేదించును. శైత్యముచే వాయువు ప్రకోపించి ఐయటకు పోవుటకు రంధ్రములను అన్వేషించుట ప్రారంభించును. శరీరము పైభాగమున రెండు నేత్రములు, రెండు కర్ణములు, రెండు నాసా పుటములు, సుఖము అను ఎనిమిది రంధ్రములున్నవి. సాధారణముగా పుణ్యాత్ముల ప్రాణము వీటి ద్వారా బయటకుపోవును. పాపాత్ముల ప్రాణము క్రిందమన్న పాయూప స్థ ద్వారా పోవును. యోగుల ప్రాణము బ్రహ్మ రంధ్రమును భేదించి బయ టకు పోవును. ఆ జీవుడు ఇచ్చానుసారముగ వెడలి పోవును. అంత కాలము వచ్చినపుడు ప్రాణము ఆపానములో కలిసి పోవును, తమస్సుచే ఆవృతుడై పోవును. మర్మ స్థానములు ఆచ్చాదితములగును. అపుడు జీవుడు వాయువుచే బాధితుడై నాభి స్థానము నుండి చలించును. అష్టాంగములు కల ప్రాణ వృత్తులను తీసుకొని శరీరము నుండి బయటకు వచ్చును. దేహము నుండి బయటకు వచ్చుట మరియొక జన్మ గ్రహించుట వివిధ యోను లందు ప్రవేశించుట మొదలగు సమయములలో ఆ జీవుని సిద్ద పురుషులను దేవతలును దివ్య దృష్టితో చూడగలుగుదురు. మరణ సమనంతర మే జీవుడు ఆతి వాహిక శరీర మును గ్రహించును. అతడు త్యజించిన శరీరము నుండు ఆకాళ, వాయు. తేజస్సులు పైనున్న మూడు తత్వములలో కలసి పోవును. జల పృథ్యంశములు క్రింది తత్త్వములలో కలసి పోవును. పురుషుడు పంచత్వమును పొందుట అనగా ఇదియే. యమదూతలు వానిని ఆతివాహిక శరీరములోనికి ప్రవేశ పెట్టుదురు. యమ లోక మార్గము దాడి భయంకరము. ఎనభై ఆరు వేల యోజనముల దూరము. ఆ మార్గమువ ప్రయాణించు జీవుడు తన బంధువులిచ్చిన అన్నోదకము.ను ఆనుక వించుము. యముని చూచి ఆతని ఆజ్ఞ ప్రకారము చిత్రగుప్తుడు చెప్పిన భయంకరము సాగు నరకములను పొందును. ధర్మా త్ముడై నచో స్వర్గమునకు పోవును

పాపాత్ములు అనుభవించు నరకములను, బాధలను చేప్పెదను. భూమి క్రింద ఇరువది ఎనిమిది నరక శ్రేణులు వున్నవి. అవి సప్తమ తలము క్రింద ఘోరాంధకారమున నున్నవి. వీటికి వరుసగా ఘోరా, సుఘోరా, అతి మోరా, మహా మోరా, ఘోర రూపా, తరలూ - భయానకా - థయోత్కటా, కారి రాత్రీ, మహా చండా, చండా, కోలాహలా, ప్రచండా, పద్మా, నరక నాయికా, పద్మావతీ, భూషణా, భీమా కరాలికా, మహా వజ్రా, త్రికోణా, పంచ కోణికా, సుదీరా, వర్తులా, సప్త భూమా, సుభూమికా, దీపమాయా యని పేర్లు. ఈ ఇరువది ఎనిమిది శ్రేణులును పాపాత్ములకు దుఃఖముల నిచ్చును. వీటిలో ఒక్కొక్క దాని యందు ఐదేసి చొప్పున ప్రధాన స్థానము లుండును. వాటికి రౌరవాది నామములు. వీటి మొత్తము సంఖ్య నూట నలుబది ఐదు. లాస అంధతామిస మహా గౌరవ గౌరవ - అసిపత్రవన, లోహభార, కాలసూత్ర మహా నరక, సంజీవన, మహావీచి, తపన, సంప్రలాపన, సంఘాత, కాజోల, కుర్మల, పూతివృత్తిక, లోహశంకు, ఋజీష, ప్రధాన శాల్మలీవృక్ష, వై తరిణీనది మొదలైన వాటిని అన్ని నరకములందను కోటీ నాయకులుగా తెలుసుకొనవలెను. ఇవి చాల భయంకరములు. పాపాత్ములను వీటిలో ఒక ్కక్క దాని యందు లేదా అనేకము లందు పడవేయ వచ్చును. యమ దూతల ముఖములు మార్జార, ఉలూక, గోమాయు, గృధ్రాదుల ముఖముల వలె వుండును. నూనె తొట్టిలో మనుష్యుని పడ వేసి అగ్నిని రగల్చెదరు. కొంతమందిని బొగ్గుల మీదను, కొంతమందిని తామ్ర పాత్రమునందును, మంగలముందును, లోహ పాత్రలఁదును పడవేయుదురు. కొందరిని శూలము పై గుచ్చుదురు. కొందరిని నిరకములో పడవేసి ఛేజించుదురు. కొందరిని కొరడాలతో కొట్టుదురు. కొందరిచే కాలిన ఆయో గోళములను మింగిఁప చేయుదురు. చాల మంది యమ దూతలు కలసి వారిచే ధూళి, మము, రక్తము, కఫము మొదలైన వాటిని తినిపించుచు, కాచిన మద్యమును త్రాగింతురు. కొందరిని రంపముతో కోయుదురు. కొందరిని గానుగలో వేసి త్రిప్పుదురు. కొందరిని కాకులు మొదలగునవి పొడిచి పొడిచీ కొందరిపై ఉష్ణ తైలము చల్ల బడును. కొందరి శిరస్సులు ఛేదింపబడును. ఆ సమయమున జీవులు ఏడ్చుచు తమ పాప కర్మను నిందింతురు. ఈ విధముగా పాపాత్ములు తమ పాపములకు నలముగ వరక బాధలననుభవించి మరల మర్త్య లోకమున జన్మింతురు.

 బ్రహ్మ హత్య చేసిన వాడు, లేడి, కుక్క, పంది, ఒంటెయై పుట్టును. మద్యము త్రాగిన వాడు చండాల, మ్లేచ్చ జన్మ పొందును. సువర్ణము ఆపహరించిన వాడు పురుగుగాను, మిడతగాను పుట్టను. గురుతల్పగుడు తృణముగాను, గుల్మముగాను జట్టును. బ్రహ్మహత్య చేసినవాడు క్షయ రోగి యగును. సురాపానము చేసిన దాని దంతములు నల్లగా వుండును. సువర్ణ సేయము చేసిన నాని నఖములు చేడిపోవును. గురుపత్నీ గమనము చేసిన వాని చర్మము దూషిత మగును. ఏ పాపము చేసెనో ఆ పాపము యొక్క చిహ్నములతో పుట్టును. అన్నము అపహరించినవాడు మా మావి అగును. వాణిని ఆపహరించిన వాడు మూగ వాడగును. ధావ్యము అపహరించిన వానికి ఏదో ఒక అంగము అధికముగా వుండును. చాడీలు చెప్పిన వాని ముక్కు నుండి దుర్గంధము వచ్చును. తైలము అపహరించిన వాడు గబ్బిలము ఆగను. ఒకరిపై ఒకరికి చెప్పు వాడు దుర్గంధ ముఖము కలవాడగును. పర స్త్రీలను, బ్రాహ్మణ ధన మన ఆపహరించిన వాడు నిర్జన వనమున బ్రహ్మ రాక్షసుడై పుట్టును. రత్నములు హరించిన వాడు నీచ జాతిలో పుట్టును. గంధ ద్రవ్యములు హరించిన వాడు చుంచుపై పుట్టును. పత్రశాకములను అపహరించిన వాడు కోడి గాన, ధాన్యమును అపహరించిన వాడు ఎలుక గాను, పశవులను హరించిన వాడు మేక గాను, పాలు హరించిన వాడు కాకి గాను, వాహనము హరించిన వాడు ఒంటి గాను, ఫలములు హరించిన వాడు కోతి గాను, తేనే హరించిన వాడు ఈగ గాను, ఫలములు హరించిన వాడు గృధ్రము గాను, ఇంటిలోని సామాను అపహరించిన వాడు గృహకాకము గాను పుట్టును. వస్త్రములు హరించినవాడు బొల్లి కలవాడు గాను, రసమున ఆపహరించిన వాడ ను, ఉప్పును అపహరించిన వాడును ఈగగా జన్మించును. ఇది ఆధ్యాత్మిక తాపవర్ణవము. శస్త్రాదులచే కలిగిన లాపము ఆధీ భౌతికము. గృహ ఆగ్ని దేవూదుల వలన కలిగినది. ఆది భౌతికము. గృహ ఆగ్ని దేవతాదుల వలన కలిగినది ఆది దైవికము. ఈ త్రివిధ లోపముతో కూడిన సంసారమును మానవుడు జాన యోగమును కఠిన వ్రతమును దావాదులమ, విష్ణ పూజాదులన చేసి, దాట వలెను.

ఆగ్ని మహా పురాణమున వరక నిరూపణ మను మూడు వందల డెబ్బది ఒకటవ అధ్యాయము సమాప్తము.