అగ్ని మహా పురాణము

Table of Contents

280 - అథ సర్వరోగ హరాణ్యౌషధాని

ధన్వంతరి రువాచః-

భన్వంతరి చెప్పెను : రోగములు శారీరములు మానసము, ఆగంతుకములు సహజములు యని నాల్గువిధములు. జ్వరకుషాదులు శారీరములు. క్రోధాదులు మానసములు. దేబ్బలు తగులుట మొదలగునవి ఆగంతుక ములు, ఆకలి ముసలి తనమనునవి సహజములు. శారీర ఆగంతుక వ్యాధులను తొలగించుకొనుటకు శనివారమున బ్రాహ్మణుని పూజించి ఆతనికి మృతము గుడము, లవణము, సువర్ణము దానము చేయవలెను. సోమవారమున బ్రాహ్మణునకు అభ్యంగన స్నానము చేయించిన వాడు సర్వ రోగవిముక్తుడగును. శనివారమున తైలదానము చేయవలయును. ఆశ్వీయుజ మాసమున గోరస ములను దానము చేయవలయును. శివలింగమునకు దధిమృతములతో స్నానము చేయించినవాడు రోగ విముక్తుడగుచు. త్రిమధురములలో ముంచి దూరంగా గాయత్రి మంత్రముతో హోమము చేసినవాడు, రోగవిముక్తుడగును. ఏనక్షత్రమున రోగము పుట్టినదో ఆ నక్షత్రమునందే స్నానము చేసి బలి ఇవ్వవలెను. మానస రోగములను విష్ణస్తోత్రము హరించును. ఇపుడు వాత పిత్తకఫములను దోషములను గూర్చియు ధాతువులను గూర్చియు వినుము.

అన్న అహారము పక్వాశయమునుండి రెండుమార్గములుగా పోవును. ఒక భాగము కిట్టమగును. రెండవ భాగము రసనుగును. కిట్టభాగము మలము. అది మనమూత్ర స్వేదదూషికాదిరూపమునను నాసామల కర్ణమల దేహ మలరూపమునను పరిణతిచెందును. రసభాగమంతయు రక్తముగ మారును. రక్తమునుండి మాంసము దానినుండి మేదస్సు దానినుండి అస్తి, దానినుండి మజ్జ, దానినుండి శుక్రము, దానినుండి రాగ ఓజస్సులు పుట్టును. చికిత్సకుడు దేశ కాల పీడాబల శక్తి ప్రకృతి భేషజ బలములను గుర్తించి తదను కూలముగ చికిత్స చేయవలయును. రికాతిథులు (4, 9;14) భౌమవాసరము మందక్రూర సక్షత్రములు విడిచి చికిత్సా ప్రారంభము చేయవలయును. విష్ణుగో బ్రాహ్మణ చంద్ర సూర్యాదుల పూజ చేసి రోగినుద్దేశించి “బ్రహ్మదక్షుడు, అశ్వినీ దేవలల, రుద్ర, ఇంద్ర, నూర్య, అనిల, ఆనల, ఋషులు, ఓషధి సముదాయము, భూతసముదాయము నిన్న రక్షింతురుగాక! ఋషులకు రసాయనము ఎట్లో, దేవతలకు అమృతము ఎట్లో, ఉత్తమ నాగులకు సుధ ఎట్లో అట్లే నీకు ఈ ఔషధము ఆరోగ్యకరము, ప్రాణరక్షణము అగుగాక” అను ఆర్థములు గల మూలో క శ్లోకము లను పఠించుచు, ఔషధ ప్రారంభము చేయవలయును. బహు వృక్షములు, అధిక జలముకలిగి అనూపమను పేరుగల దేశము వాతశ్లేష్మకరము. అట్లుకానిది జాంగలము. అల్పవృక్షోదకములు గల దేశము సాధారణము. జాంగలము పిత్తమును వృద్ధిపొందించును. సాధారణదేశము, మధ్యముగ నుండును.

వాతము రూక్ష శీతళల స్వభావము కలది. పిత్తము ఉష్ణము. కటుత్రయము పిత్తమును పెంచును. కఫము స్థిర ఆమ్ల స్నిగ్ధ మధుర స్వభావము కలది. సమాన వస్తువులచే యిది వృద్ధి చెందును. అసమాన వస్తువులచే తగ్గును. మధుర, ఆమ్ల, లవణ, రసములు శ్లేష్మకరములు, వాయునాశకములు. కటుతిక కషాయరసములు వాయువృద్ధీకరములు కఫనాశకములు. కలు ఆమ్లలవణ రసములు పిత్తవర్ధకములు. తిక్త మధుర కషాయరసములు పిత్తనాశకములు. ఈ గుణ ములు రసములవి కాపు, వాటి విపాకమునకు చెందినవని గ్రహించ వలెను, ఉష్ణవీర్యములు కథనాశకములు, శీతవీర్యములు పిత్తనాశక ములు. ఓ సుశ్రుతా! ఇవన్నియు తన ప్రభావముచే ఆయా కార్యములను చేయును. శిశిర వసంత గ్రీష్మము లందు క్రమముగ, కఫములకు చయము, ప్రకోపము, ప్రశ మనము వుండును. సుశ్రుతా ! వాయువునకు గ్రీష్మ, వర్ష, రాత్రి శరదృతువులందు వరుసగ చయ, ప్రకోప, పశమములు చెప్పబడినవి. ఇట్లే వర్ష, శరత్, హేమంతములందు క్రమముగి పిత్తములకు చయ, ప్రకోప, ప్రశమములు చెప్పబడినవి. వర్ష ఋతువు నుండి హేమంతమువరకు మూడు ఋతువులు ను విసర్గకాలము. శిశిరమునుండి గ్రీష్మము వరకు మూడు ఋతువులు ఆదాన కాలము. విసర్గకాలము సౌమ్యము. ఆదాన కాలము ఆగ్నేయము. వరాది ఋతుత్రయమున సంచరించుచున్న చంద్రుడు ఓషధులలో క్రమముగ, ఆమ్ల లవణ మధుర రసములను పుట్టించును. శిశిరాది ఋతుత్రయమున సంచరించుచున్న సూర్యుడు క్రమముగ, తిక్త కషాయ కటు రసములను వృద్ధిపొందించును. రాత్రులు పెరుగుచున్న కొలది ఓషధుల బలము పెరుగుచుండును. రాత్రులు తగ్గుచున్న కొలది మనుష్యుల బలము క్రమముగ తగ్గుచుండును, రాత్రి, దిన, భోజనాంతమునందును, వయస్సు యొక్క ఆది మధ్య అవసాన కాలములందును కఫ పిత్త వాయువులు ప్రకోపించును. ప్రకోప ప్రారంభమున వీటికి జయము కలుగును. ప్రకోపా నంతరము వీటికి శకునము కలుగును ఆతి భోజనము పలనను ఆధికోపవాసము వలనను, మలమూత్ర వేగనిరోధము వలనను కూడ అన్ని రోగములు పుట్టును. ఉదము నందలి రెండు భాగములను అన్న ముతోను, ఒక భాగమును జముతోను నింపి ఒక భాగమును పాయ్వాది సంచార మునకై విడువవలయును. వ్యాధికి ఏది మూలకారణమో, దానికి విపరీత మైనది ఔషధము. ఆట్టి ఔషధమును ఇవ్వవలెను. ఇదియే అన్నింటి సారము. అని నేను చెప్పుచున్నాను.

నాభిపైన పిత్తస్థానము దాని క్రింద శ్రేణీగుదములు వాతస్థానములు. కాని ఇవన్నియు శరీరమునందు తిరుగు చునుండును. విశేషించి వాయువు తిరుగును దేహమధ్యమున హృదయమున్నది. అది మనస్సునకు స్థానము స్వభావత దుర్బలుడును, అల్ప కేశములు కలవాడును. చంచలుడును ఎక్కువ మాటలాడు వాడును విషమమైన జఠరాగ్ని కలవాడును, ఆకాశమునందేగురుచున్నట్లు స్వప్నములు చూచువాడను. వాత ప్రకృతి కలవాడు. ఆకాలమున జుట్టు నరసిన వాడును క్రోధశీలుడును ఎక్కువ చెమట పట్టువాడును తీపి ఇష్టమైన వాడును, స్వప్నమునందు అగ్ని చూచువాడును పిత్త ప్రకృతి. దృఢమైన అవయవములు కలవాడును స్థిరచిత్తుడు మంచికాంతి కలవాడు దట్టమైన కేశములు కలకాడు స్వప్నమున నిర్మ లోదకమును చూచువాడు, కపప్రకృతి ఈ విధముగనే తామస, రాజస, సాత్త్వికులని మనుష్యులు మూడు విధములు ఓ ముని శ్రేష్ణా ! మానవులందర ను వాత, పిత్తకఫాత్మకులు మైథునము చేతను, బరువు పనులు చేయుట చేతను రక్త పిత్తము కలుగును. చెడ్డ ఆహారము తినుటవలనను శోక మువలనను వాయు ప్రకోపము కలుగును ద్విజోత్తమా ! దాహ మను కల్పించు వాటిని కబుతి క్త కషాయ పదార్థములను తినుట చేతను నడచుట చేతను భయము చేతను పిత్త ప్రకోపము కలు గును. ఎక్కువ జలము త్రాగువారికిని గురు వైన భోజనము చేయువానికిని భుజించి వెంటనే నిద్రపోవువానికిని, సోమరుల కును, శ్లేష్మ ప్రకోపము కలుగును. లక్షణములను బట్టి వాతాది రోగములను గుర్తించి వాటిని శమింప చేయవలయును. ఎముకలు విరుగుట, నోటి చేదు నోరుఎడుట, ఆవు లింతలు, రోమాంచము, ఇది వాత వ్యాధి లక్షణములు గోళ్ళు నేత్రములు నాడులు పచ్చబడుట, ముఖమునందు చేదదాహము వేయుట శరీరము వెచ్చగా నుండుట ఇవి పిత్త వ్యాధి లక్షణములు. సోమరితనము నోటిలో నీళ్ళు ఊరుట. శరీరము బరువుగావుండుట నోటితీపి వేడినికోరుట ఇవి కఫ వ్యాధి లక్షణములు; స్నిగ్ధము ఉష్ణమును అయిన అన్నమును, అభ్యంగ స్నానము, తైలపావాదికము, పాతరోగమును నివారించును నెయ్యి పాలు, పటిక బెల్లము, చంద్రకిరణాదులు పిత్తమును తొలగించును. త్రిఫలా తైలమును తేనెలో సేవించుట వ్యాయామాది కము కఫరోగ మును తొలగించును. విష్ణుపూజాధ్యానములు సర్వరోగ నివారకమలు.

అగ్ని మహాపురాణమున సర్వరోగహరౌషధాదికథవమను రెండువందల ఎనుబదవ అధ్యాయము సమాప్తము.