అగ్ని మహా పురాణము
285 - అథ మృతసంజీవనకర సిద్ధయోగః
ధన్వంతరి రువాచః
ఆత్రేయ ఉవాచః
ధన్వంతరి చెప్పెను. ఆత్రేయుడు చెప్పి నవియు, దివ్యములును సర్వవ్యాధి నివారకములును మృత సంజీవనకర ములును యగు సిద్ద యోగములను మరల చెప్పేదను ఆత్రేయుడు చెప్పేను. వాత జ్వర మన బిల్వాది పంచమూల క్వాథము శ్రేష్ఠము. జీర్ణ శక్తికి పిప్పలి మూల గుడూచి కంఠీ క్వాథము ఇవ్వవలేను. ఆమలక అభయా కృష్ణ చిత్రక క్వాథము సర్వ జ్వర నాశకము. బిల్వమూల అగ్ని మంథశ్యానాక, కాశ్మరులం పాటలా, స్థిర, త్రికంటక, పృష్ఠిపర్ణి, బృహతీ, కంటి కారికలు వీటికి దశ మూలములని పేరు. వీటి క్వాథము కుశ మూల. క్వాథము. జ్వరమును అజీర్ణమును పార్శ్వశూలను దగ్గును నశింప చేయును. గుడూచి, పర్పటి, ముస్త, కిరాత, విశ్వ భేషజములతో చేసిన పంచ భద్ర క్వాథము ఛాత పిత్త జ్వరమున ఇవ్వవలెను. తివృత్, విశాల, కటుక, త్రిఫం, ఆరగ్వధమునితో చేసిన క్వాథమును, యవ ర మ కలిపి, త్రాగించినచో యది విరేచకమై, 'సంపూర్ణ జ్వరములను నశింప చేయును. దేవదారు, బల, వాస, త్రిఫల, వ్యోష, పద్మక, వాయు, విడంగ, సీతలను సమాన భాగములో చూర్ణము చేసి సేవించినచో పంచ విధకాసములను తొలగించును. హృదయ రోగ గ్రహణి పార్శ్వ రోగ హిక్కా, శ్వాస, కాస రోగ ములను పోగొట్టు పీకు దశ మూల శరీరాస్న పిప్పలి, బిల్వ, పౌష్కర శృంగీ ఆమలకీ, బార్లీ, గుడూచి, నాగవల్లులతో యథా శాస్త్రముగ చేసిన క్వాథమును గంజిని త్రాగ వ రెసు మధు యుక్త మగు మధుకమును శర్కరాసహిత మగు పిప్పలిని గుడ యుక్త నాగరమును లవణత్రయమును సేవించిన ఎక్కిళ్ళు పోవును. కారవి, ఆజాజి, మరిచ, ద్రాక్ష, వృక్షామ్ల దాడిమ, సౌవర్చల, గుడ మును సమాన భాగ ము గ గ్రహిు) చేసిన చూర్ణ ముతో తేనే కలిపి తయారు చేసిన కారవ్యాధి వటి సర్వ విధములగు అరుచి రోగములను నశింప చేయును. ఆల్ల పుర సమును తేనె కలిపి త్రాగించినచో అరుచి, శ్వాస, కొసలు, జలుబు, కఫము నశించును.
వట, శృంగి. శిల, లోధ్ర, దాడిమ, మధుకములను చూర్ణము చేసి, ఆచూర్ణముతో సమానముగ పటిక బెల్లము కలిపి తేనెతో సేవించవలెను. ఈ వటశృంగాది 'అవలేహమును జలముతో త్రాగినచో వనమును దాహమును తొలగించును. గుడూచి, వాసక, లోధ్ర పిప్పలి చూర్ణమును తేనెలో కలిపి సేవించినచో కఫయుక్తమగు రక్తము, దాహము, దగ్గు జ్వరము నశించును, తేనె కలిపిన పోసకరసము, తామర భస్మము కాసమును పోగొట్టును. శిరీష పుష్ప రసముచే భావన చేసిన మరిచ చూర్ణము హితకరము మసూరము ఆన్ని భాధలను పోగొట్టును. తండులీయకము. పిత్త దోషమును తొలగించును. నిర్గుండి, శారిబ లు అంకోలములు విషనాశకములు, శుంఠి అమృత, క్షుద్ర పుష్కర గ్రంథి. పిప్పల మూలములతో చేసిన క్వాథము, మూర్చను మదమును తొలగించును. హింగు, సౌవర్చల, వ్యోషము లను రెండేసి పలములు నాలుగు శేర్లమృతము కలిపి నాలుగు రెట్ల గోమూత్రముతో సిద్దము చేసినచో ఉన్మాదనాశక ము శంఖ పుష్పివచి, కుష్ట సిద్ద, బ్రాహ్మి రసములను కలిపి గుటికలు చేసి, ఇచ్చినచో పాత ఉస్మాదమును ఆపస్మార మును తొలిగించి మంచి మేధాశ క్తిని యిచ్చును. అభయముతో పంచగవ్యమును మృతమును కలిపి సేవించిన కష్టము వశించును. పటోల త్రిఫల, నింబ, గుడూచి, ధావని, వృష, కరంజములతో తయారు చేసిన మృతము కుష్టరోగ మును తొలగించును "వజకము" నింబ, పటోల, వ్యాఘ్, గుడూచి, వాసకములను పదేసి పలములు తీసుకుని బాగుగా నూరవలేను. పదునారు శేరుల జలముతో క్వాథము చేసి దానిలో ఒక శేరు మృతము త్రిఫలా చూర్ల కల్కము, వేసి నాల్గవ వంతు మిగులు. వరకు వండవలెను, ఈ పంచ తిక్త మృతము కుష్ఠరోగమును ఎనుబది విధములగు వాత రోగములను నలుబది విధములగు పిత్తరోగిమలను ఇరువది విధములగు కఫరోగ ములను పీవస, ఆరో, వ్రణాదులను నశింపచేయును. ఈ యోగరాజము సూర్యుడు అంధకారము నశింపచేసినట్లు ఇతర రోగములను కూడ నిస్సంశయముగ నశింపచేయుష.
ఉపదంశము శమించుటకే త్రిఫలాకషాయ భృంగరాజర సములతో వ్రణమును కడిగివేసి పటోలపత చూర్ణ మతో గాని, దాడిమ చూర్ణము తోగాని, గజచూర్ణముతోగాని త్రిఫలా చూర్ణముతోగాని, ఆ వణమును కప్పవలెను త్రిఫలా, లోహ చూర్ణ, యష్టిక, ఆర్కవ, నీలక మల, మరిచ, సైంధవములు వేసి, వండిన తైలమునుమర్ధించినచో వచనములు శాంతించును. క్షీర మార్క వరస, మధుక, ఉత్పలములను రెండు శేర్లు తీసుకొని తైలము నాల్గవ వంతు మిగులు వరకు వండి దానిని నశ్యముగ ఉపయోగించినచో పలితము తగ్గును. నింబపట్ల, త్రిఫలా, గుడూచి, ఖదిర, వృష, భూనింబ, పాఠాత్రి ఫలా, గుడూచి రక్త చందనములుఅను ఈ రెండు యోగములు జ్వరమును తొలగించును. కుష్ణ విస్పోట కాదులను నశింపచేయును. పటోల, అమృత, భూనింబ, వాస, ఆరిష్టక, పర్పట, ఖదిరల క్వాథము, విస్ఫోట జ్వర ములను తొలగించును. దకమూవీ, భిన్న రుహా, పథ్యాదారు. పునర్నవ, గ్రు, విశ్వజిత్ లతో చేసిన క్వాథము జ్వర, విద్రథి, శోథములందు హితకరములు. మధూకము, నింబ పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర దార్వీ, న్యగ్రోధ, అతిబల, కుశ, నింబ, పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర దార్వి, న్యగ్రోధ, అతి బల, కుశ, నింబ, మూలక పత్రములతో చేసిన కషాయములు శరీర బాహ్య శోధనమునకు మంచివి. కరంజ, అరిష్ట, నిర్గుండి రసములు, గాయము నందలి క్రుములను నశింప చేయును. ధాతకీ, చందన, విలాస మంగా మధుక, ఉత్పల, దారు , మేదలను నేతితో కలిపి లేపముగ వ్రాసిన వ్రణములను మాన్పను.
గుగ్గులు, త్రిఫలా, వ్యోషములను సమాంశమున గ్రహించి ఘృతము కలపి. పూసినచో నాడీ వ్రణములు దుష్ట వ్రణములు శూల భగందరము మొదలగునవి నశించును. గోమూత్రము నందు, శుద్ధము చేయబడిన హరీతకిని తైలము నందు వేయించి ప్రతి దినము లవణముతో ప్రాతః కాలమున సేవించినచో కఫ వాత రోగములు తొలగును. త్రికటు, త్రిఫలా క్వాథమును వార లవణము కలిపి త్రాగినచో కఫ వాత ప్రకృతి గల వారికి విరేచన మగును. కఫ వృద్ధి తగ్గును. పిప్పలి, పిప్పలీమూల, వ, చిత్రక, నాగరములతో చేసిన క్వాథమును గాని, పేయమును గాని త్రాగినచో ఆమ వాతము తొల గును. రాస్నా గుడూచి, హేరండ, దేవదారు డుంఠుని క్వాథము సర్వాంగ వాతమును సంధి కాలమును, ఆస్తి మజ్జి గత ఆమవాతమును తొలగించును. దశ మూల కషాయమును నాగర జలముతో కలిపి త్రాగినను పైరోగములు శాంతించును. శుంఠి గోక్షుర క్వాథమును ప్రతి దినమున ప్రాతః కాలమున సేవించినచో ఆమ వాత సహితమగు కటి శూలము పాండు రోగము నశించును. శాఖా పత్ర సహిత మగు ప్రసారిణి తైలము కూడ పైరోగములు తగ్గించును. గుడూచి స్వర సము కల్కము, చూర్ణము, లేదా క్వాథము చాల కాలము సేవించినచో వాత రోగము పోవును. పిప్పలి, కాని, వర్తమానము గాని, గుడముతో గాని, పథ్యతో గాని సేవించవలెను. పటోల, త్రిఫలా, తీవ్ర కుటకి, ఆమృతముల పాకము తయారు చేసి, సేవించినచో దాహ యుక్త వాత రక్త రోగము శీఘ్రముగ నశించును. గుగ్గు 2ను గోరువెచ్చటి నీటితో త్రివ:ను సమ శీతోష్ణ జలముతోసు లేదా బలా, పునర్నవ, హేరండమూల, బృహతీద్వయ, గోక్షుర, పాలగు, లవణములతోను తీసుకునినచో వెంటనే వాత రోగము నశించును. ఒక కర్షము పిప్పలీమూలము పంచ లవణములు పిప్పలీ, చిత్రక, శుంఠి, త్రిఫలా, త్రివృత్, వచా, షారద్వయ, శాద్వల, దంతీ స్వర్ణ క్షీరి, విపాళిక లను కలిపి రేగి పండు ప్రమా ణము గల గుటికలు చేసి, గంజితో త్రాగ వలెను. శోధము నందును దాని వలన కలిగిన ఆమపాకము నందును దీనిని సేవించ వచ్చును. ఉదర వృద్ధి యందు కూడ దీనిని సేవించ వచ్చును. దారు వర్షాభూ, శుంఠి క్షీరముల శోధ నాశక ములు. ఆర్క, వర్షాభూ, నింబ, క్వాథ కూడ శోధను తొలగించును. వ్యోషముతో గూడిన మృతమును మూడు రెట్లు పలాశ భస్మ జలముతో సిద్ధము చేసి త్రాగినచో వాని ఆర్ఘ రోగము తప్పక నశించును. విశ్వక్సేన ఆప్ష నిర్గుండులతో సాధితమైన లవణము కూడ విడంగ ఆవల సైంధవ, రాస్న దుర్థ దేవదారు వచలతో నాలుగు రెట్ల కటు ద్రవ్యములు కలిపిన తైలము మర్దించుటచే గండమాల గల గండ రోగములు నశించును.
శటీ, కొనాగ, వలయ, క్వాథమును క్షీర రస పయస్యా: పిప్పలి వాసా కల్కమును క్షీరముతో సేవించినచో క్షయ రోగ ము నశించును. వచా, విట్ల వణ, అథయా, శుంఠి, హింగు, కుష్ఠ అగ్ని, దీభ్యకములను రెండు, మూడు, ఆరు నాలుగు, ఒకటి, ఏడు, భాగముల చొప్పున, వరుసగ గ్రహించి చూర్ణము చేసి సేవించినచో గుల్మ రోగమును, ఉదర రోగమును శూలరోగమను కాసర్గమును తొలగించును. పాఠ, నికుంది, త్రికటు త్రిఫల, చిత్రకముల చూర్ణమును గోమూత్రముచే సాధించి గుటికలు చేసి సేవించినచో గుల్మ ప్లీహాదికములు నశింప చేయును. వాసా, నింబ పటోల త్రిఫల ములు, వాత పిత్తములను తొలగించును వాయు విడంగ చూర్ణమును తేనెతో సేవించినచో కుమి వినాశకర ము, విడంగ సైధవ, యవక్షారములు, గోమూత్రముతో కలిపి సేవించిన హరీతకీ, క్రుమిఘ్నములు. శల్ల కీ, బదరీ, జంబూ, ప్రియాల, ఆమ, ఆర్జున వృక్షముల, బెరడు తేనెతో కలిపి, పాలతో సేవించినచో, రకాతి సొర ము నశించును. బిల్వ ఆమ్ర ధాతకీ, పాఠా శుంఠి మోచర సములు సమములుగా గ్రహించి చేసిన చూర్ణమును గుడ మిశ్ర తక్రముతో సేవించినచో దుర్జయ మగు అతిసారమును జయించును. చాంగే, కోల, దధ్యంబు, శుంఠి యవక్షార ముని క్వాథమును ఘృతముతో సేవించినచో గుదభ్రంశ రోగము తొలుగును. విడంగ. అతి విషా, ముస్త, దేవదారు పాఠా కలింగ కములు క్వాథము మిర్చ చూర్ణముతో కలిపి సేవించినచో శోధ అతి సారములు నశించును.
శర్కరా సైంధవ శుంఠులతో కాని కృషా, మధు గుడములతో గాని ప్రతిదినము రెండేసి, కర్కాయలు తీను వాడు నూరు సంవత్సరములు సుఖముగ జీవించును. పిప్పలి యుక్తమగు త్రిఫలను కూడ మధుమృతములతో సేవించిన ఆ విధముగనే ఫలము నిచ్చును. ఆమలక సురస భావితమగు ఆమలకమును మధుమృత, శర్కరులతో కలిపి దుర్గ పానము చేసినవాడు స్త్రీలకు ప్రభువగును. మాష, పిప్పల, శాలి, యవగోధూమల, చూర్ణమును సమాన ప్రమాణములో గ్రహించి, పిప్పలికను వండి దానిని భక్షించి, శర్కరాయుక్తమగు, మధుర దుగ్గ మును చేసినవాడు, చటక పక్షివలె నిస్సంశయముగ పది పర్యాయముగా స్త్రీ సంగమము చేయసమర్థుడగును, సమంగ, రాతకి పుష్ప, లోధ్ర నీలో త్పలము లను పాలతో ఇచ్చినచో స్త్రీల ప్రదర రోగమును నశించును. కరంటక బీజము, మధుకము, శ్వేతచందనము, పద్మోత్పల వబాలములు, మధుకము, శల్కరతిలలు, వీటి చూర్ణమును గర్భపాత శంఖ కలుగునపుడు, సేవించిన గర్భమును స్థిర ముగి వుంచును. దేవదారు, నథః కష్ట, నలద, విశ్వ భేషజములను గంజిలో నూరి తైలము కలిపి పూసినచో శిరో రోగమలు పోవును. సైంధవలవణమును, వస్త్రముతో శుద్దము చేసి, కొంచెము వేడి తైలములో కలిపి, కర్ణములో పోసి నచో కర్ణ శూల రోగము తగ్గును, లశున, ఆర్ధక, శిర్రు కదళీల వేరు వేరు రసము కర్ణశూలహరము. ఐలా, శతావరి, రాస్నా, అమృతా సైకియక త్రిఫలలతో సిద్ధము చేసినమృతము, తిమిర రోగమును తొలగించును. త్రిఫలా, వ్యోష. సైంధవములు కలిపిన ఘృతము, త్రాగినచో కండ్లకు హితము విరేచనక రము. హృదయమునకు పాతము జఠరాగ్ని దీపనము, కఫరోగనాశ కము. నీలో తల కింజల్కము. గోమయ రసముతో కనిపి గుటి కాంజనముచేసి, ఉపయోగించి నచో ఆది దినాంధ రాత్ర్యంధులకు హితకరము. యష్టి, 'మధువచ, పిప్పలీబీజ కుటజముల బెరడుతో కల్కముసు నింది క్వాథమును కలిపి ఇచ్చినచో ఆదివమనకారకము, తడిసినయవల నీరు విరోచనకరము. దీనిని అనుచితముగ ప్రయోగించి నచో అగ్నిమాంద్యము, ఉదరము గౌరవము, అరుచిపుట్టును. పథ్యా సైంధవ ప్పిలములను సమాన భాగములుగ గ్రహించి చూర్ణముచేసి, ఉషోదకముతో లాగినచో నారాచ సంజ్ఞక మగు ఈ చూర్ణము విరేచనకరము. సర్వరోగ వినాశకము, ఆత్రే యుడు మునులకు చెప్పిన సిద్ధయోగములలో శ్రేష్ఠములైన సర్వరోగనాశక యోగములను సుశ్రుతుడు తెలుసుకొనెను.
అగ్ని మహాపురాణ మున మృత సంజీవనీకర సిద్ధయోగ ములను రెండువందల యేన బది యైదవ ఆధ్యాయము సమాప్తము.
