అగ్ని మహా పురాణము

Table of Contents

137 - అథ మహామారీవిద్యా

ఈశ్వర ఉవాచః-

పరమేశ్వరుడు చెప్పెను : దేవీ; ఇపుడు నేను శత్రుమర్దని యగు మహామారీవిద్యను గూర్చి చెప్పెదను. “ఓం హ్రీం మహామారి...హూం ఫట్ స్వాహా” అనునది మూలో కమంత్రము) మహామారీమంత్రము. (మూలోక్తము లైన) “ఓం మహామారి హృదయాయనమః...అస్త్రాయహుంఫట్” అనునవి అంగన్యాసాదులు. సాధకుడు ఈ అంగన్యాసమును తప్పక చేయవలెను. శవముపై కప్పిన వస్త్రము తీసికొని వచ్చి చతురశ్రముగా ఖండించవలెను. దాని పొడవు వెడల్పులు మూడేసి హస్తము లుండవలెను. ఆ వస్త్రముపై అనేక విధములైన రంగులతో నల్లని దేవీఆకారము చిత్రించవలెను. మూడు ముఖములు, నాలుగు భుజములు ఉండవలెను. హస్తములలో ధనస్సు, శూలము, కర్తరి, మంచము కోడు ధరించియుండును. ఆ దేవి ప్రథమముఖము పూర్వాడిశాభిముఖమై తన కాంతిచే ప్రకాశింపచేయుచు, దృష్టి పడగనే ఎదుట నున్న మనుష్యుని తినివేయునట్లు ఉండవలెను. రెండవ ముఖము దక్షిణభాగమునం దుండవలెను. ఆమె నాలుక ఎట్టిగా, చూచుటకు భయం కరముగా నుండవలెను. వికృతమైన ఆమె ముఖము కోరలతో భయంకరముగా నుండవలెను. నాలుకతో చెక్కిళ్ళు నాకు చుండవలెను. దృష్టి పడగానే ఎదుట నున్న గుఱ్ఱములు మొదలగు వాటిని తినివేయు నట్లు ఉండవలెను. దేవి మూడవ ముఖము పశ్చిమాభిముఖమై తెల్లగా ఉండవలెను. దృష్టి పడగనే ఏనుగలు మొదలైనవాటిని తినివేయు నట్లు ఉండవలెను. గంధపుష్పాదులతోను, తేనె నెయ్యి మొద లగు నైవేద్యములతోను దానిని పూజించవలేను, పూర్వో క్ర మంత్రమును స్మరించి నంతమాత్రముననే నేత్రశిరోరోగాదులు నశించును. యక్షరాక్షసులు కూడ వశ మగుదురు. శత్రువులు నశింతురు. మను ష్యుడు క్రోధముతో వేపచెట్టు పుల్లలు హోమము చేసినచో తన శత్రువులను చంపగలడు; ఇందు సందేహము లేదు. శత్రు సేవాభిముఖుడై ఒక సప్తాహము ఈ సమిధలతో హోమము చేసినచో శత్రుసైన్యము నానావిధరోగ పీడితమై నశించును. ఎవని పేరు పెట్టి వెయ్యి సమిధల హోమము చేయబడునో వాడు బ్రహ్మ రక్షించినను మరణించక తప్పదు. వెయ్యి దత్తూర సమిధలను, ర క్తము, విషము కలిపి మూడు దినములు హోమము చేసినచో శత్రువు సైన్యనమేతముగ నశించును. ఆవాలు ఉప్పు హోమము చేయగా శత్రు సైన్యమునందు కలవరము పెట్టి శత్రువు పారిపోవును. దానిని గాడిదరక్తముతో కలిపి హోమము చేసినచో శత్రువును పారద్రోలును. పారిపోవలే నని ఆతని మనస్సునందు తీవ్రముగ కోరిక పుట్టును. కాకి రక్తము కలిపి హోమము చేసినచో శత్రువును పెకలించివేయవచ్చును. సాధకుడు ఆతనిని చంపుటకు సమర్థు డగును. సాధకుని మనస్సులో కలుగు కోరిక లన్నియు సఫల మగును. సాధకుడు యుద్ధసమయమున ఇరువురుకన్యలతో గజము నెక్కి, పూర్వోక్త మంత్రముచే ఆభిమంత్రించి, మహామాయాప్రతిమ ఉన్న వస్త్రమును, యుద్ధరంగమునందు, ఎత్తునుండి ఎగుర వేసి, శత్రు సేనాభిముఖుడై ఆ పటమును వారికి చూపవలెను. పిదప ఆ కన్యలకు భోజనము పెట్టవలెను. పిదప మరల పిండిని త్రిప్పుచు శత్రుసైన్యము శిల వలె నిశ్చల మైపోయి నట్లు భావన చేయవలెను. శత్రుసైన్యమున యుద్ధము చేయు ఉత్సాహము పోయి నట్లును, భయముతో పారిపోవుటకు సిద్ధముగా నున్నట్లును కూడ భావన చేయవలెను. ఇట్లు చేయుట చే శత్రు సేనా స్తంభనము కలుగును. నేను చెప్పిన ఈ స్తంభనప్రయోగమును ప్రతివానికిని ఉపదేశించరాదు. ఈమె మూడు లోకముల పైనను విజయము నిచ్చు 'మాయ', ఈమె ఆకారముచే చిత్రిత మైన పటము “మాయాపటము” దుర్గా-భైరవీ-కుబ్జకా-రుద్రదేవ-నృసింహుల మూర్తులను గూడ ఈ విధముగనే వస్త్రము పై చిత్రించవచ్చును. ఇట్టి పటము లచే గూడ స్తంభనప్రయోగము చేయవచ్చును.

అగ్ని మహాపురాణమునందు మహామారీవిద్యావర్ణన మను నూట ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.