మత్స్య మహా పురాణము

Table of Contents

282 - పంచలాంగలకదాన విధానము.

శ్రీమత్సుడు మనువున కిట్లు చెప్పెను:ఇపుడు ఇక అను(అత్యుత్తమమగు పంచలాంగలక దానమను మహా దానపు విధానమును తెలిపేదను; అది మహాపాతక నాశనము; యుగాది మన్వాది చంద్రసూర్యగ్రహణాది రూపమగు పుణ్య తిథియందు లాంగల పంచకముతో కూడ భూదానము చేయవలయును; దానము చేయు భూ పరిమాణము పంట పైరులతో నిండినదగు 1. ఖర్వటము (పర్వత సమీప గ్రామము) 2. ఖేటము (చిన్న పల్లెగూడేము) 3. గ్రామము 4. నూరు నివర్త నములు (1159వ పుట చూడుడు.) 5. దానిలో నగము-వీనిలో నేదయిననే యుండవలెను; విచక్షణుడగు దాత బలము గల దారువుతో ఐదు నాగళ్లను వానికి కావలసిన సర్వోపకరణములతోను - అవి కాక ఐదు పలములకు పైగా వేయి వలము లకు లోపల తూకము గల బంగరుతో ఐదు సాగళ్ల ప్రతిమలను చేయింవలయును; కొయ్య నాగళ్ల కై మంచి లక్షణములు కలవియు బాగుగ బరువు మోయగలవియునగు పది ఎద్దులను కూడ వేరుగ ఉంచి వాటికి బంగరు కొమ్ముల సొమ్ములను నాగళ్లకు ముత్తెపు సొమ్ములను వెండితో పాదాగ్రపు (గిట్టల) సొమ్ములను వెండి తిలకములను ఎర్ర పట్టువస్త్రపు గవు నె నలను మాలలను దండలను చందనాలంకారములను కూర్చి వాటిని శాలయందు నిలిపి ఆధివాసనము జరుపవలయును; వర్జన్యుని ఆదిత్యులను రుద్రుని ఉద్దేశించి గురుడు ఒకే కుండమందు చరుపాయసమును నిర్వహించి నివేదించవలయును; పలాశ సమిధలను ఆజ్యమును నల్లనూవులను కూడ వేల్చవలేను; తులాపురుష దానమందువలేనే లోకపాలావాహనము చేయ వలయును; తరువాత మంగళ వాద్య వైదిక ధ్వనులతో బ్రాహ్మణులచే స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని వస్త్ర ములను పూలను ధరించి ద్వీజదంపతుల నాహ్వానించి వారిని బంగరు దండలతో ఉంగరములతో కడియములతో మురుగు లతో మణులతో పట్టు వస్త్రములతో పూజించవలయును; ఉపసరములతో కూడ శయ్యను ఒక పాడి యావును వారి కీయవలెను; అంతకు ముందే ఆష్టాదశ ధాన్యములను . ఆధివాసనము చేసియుండి ఈ చెప్పిన సర్వసామగ్రిని అగ్నిని బ్రాహ్మణులను త్రిః ప్రదక్షిణించి దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రము నుచ్చరించుచు ఆవన్ని యు ఆచార్యుడు మొద లగు వారి తీయవలెను.

“సర్వ దేవగణములును చరస్థావర భూతములును ధురంధరమగు నాగళ్ల అవయవములందే యుండును; కావున ఆట్టివాని దయ చే సోకు శివునియందు భక్తి కలుగుగాక! ఇతర దానములేవియు భూదానములో వదారవ పాలునకు నరిపోలవు; కావున ఆ దానపు మహిమచే నాకు ధర్మమునందు దృఢభక్తి కలుగుగాక !”

ఏడు మూరల పొడవు ఒక దండము అనియు ముప్పది దండముల చదరపు భూమి నివర్తనమని వ్యవ హారమనియు దానినుండి మూడవవంతు తగ్గినది గోచర్మ పరిమాణమనియు ప్రజాపతి వ్యవస్థ చేసియుండెను; అనగా (7x30)2 =(210) 2 = 44100 చదరపు మూరలు నివర్తనము; దీని భుజమందలి మూడవవంతు- 10 దం. తగ్గించగా 7x20x7x20 = 140x140=19600 చదరపు మూరలు గోచర్మము అగును. (ప్రథమ సంపుటమున వివరణములు చూడవలెను. భాస్కరాచార్యులు 'పది మూరలు ఒక వంశ మగును; ఇరువది వంశముల చదరము నివర్తనము.' అనెను. దీని ననుసరించి 10x20x10x20 = 40000 చదరపు మూరలు నివర్తనము.) ఈ మానముల ననుసరించి నూరు నివ ర నముల భూమిని దానము చేసిన వానికి పాపరాశియంతయు శీఘ్రమే క్షీణించును; శక్తి లేనిచో ఏబది నివర్తనములో గోచర్మ మాత్రమే భవనమునకు సరిపోవు మాత్రమే ఐన నిచ్చినచో పాపము క్తి యగును; ఇట్లు భూమి ప్రదానము చేసిన మానవుడు ఆ భూమియందు ఎన్ని నాగటి చాళ్లు ఏర్పడునో దాన మిచ్చిన పాడియావు శరీరమందలి రోమము లేన్ని యుండునో అన్ని సంవత్సరములు శివనగరమున వసించును. గంధర్వ కింనర సురాసుర సిద్ధ సంఘములు చామరములు వీచుచుండు మహా విమాన మారోహించి ఆమర నాయకుడే పితృపితామహ బంధుయుక్తుడై శివపురమున కేగి ఆట సంపూజితుడై సుఖించును; గోవును భూమిని లాంగలములను వాటి ధురంధరములగు (బరువును లాగు) ఎద్దులను దాన మిచ్చుటతో కలుగు పుణ్యఫలముతో పోల్చినప్పుడు యాగాది పుణ్య కార్యములచే లభించు *ఇంద్రత్వాది పదములు కూడ క్షీణించునవియే యగును; అందు వలన పాపరాశి పటలమును క్షయింపజేయునదియు భూతిభవము (ఆభ్యుదయ నిఃశ్రేయన వృద్ధి) ఉద్భవింపజేయునదియు నగు భూదానము చేయవలయును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమునందు పంచలాంగలక ప్రదానికమను రెండు వందల ఎనుబది రెండవ అధ్యాయము.

ఇందు సంప్రదానత్ అనగా ఇచ్చుటవలన అని చెప్పినచో ఇంద్రత్వ క్షయమునకు ఇది హేతువనవలయును; కాని ఇది అనంగతము; 'ఇచ్చుటను బట్టి చూచినచో -ఏతత్సంప్రదానాపేక్షేయా' అని అర్థము సంగతము. ఇది తెనుగు కారకము వలెనే యున్నది.)