మత్స్య మహా పురాణము

Table of Contents

141 - నిమేషాది దివ్య వత్సరాంతకాల నిర్ణయము  

 ఋషులు సూతుని 'పూర్వము స్వాయంభువ మన్వంతరమున వ్యవస్థ చేయబడిన చతుర్యుగముల వ్యవస్థను స్వరూపమును సంఖ్యా పరిమాణమును సవిస్తరముగ వినగోరుచున్నాము.' అని అడిగిరి. సూతు డిట్లు చెప్పసాగెను. పృథివీలోక ద్యులోక ( భూగోళ, ఖగోళ వ్యవస్తాకథన) ప్రసంగమున నేను ఇదివరకు మీకు అది చెప్పి యుండ లేదు. ఇపుడది మీకు తెలి పెదను. ఎరుగుడు. మొదట మీకు మానుష ప్రమాణముతో సంవత్సర పరిమాణమును నిష్పన్నము చేసి దాని ఆధారమున చతుర్యుగ పరిమాణమును తెలి పెదను. పదునై దు నిమేషములు జెప్పపాటు కాల ములు) కాష్ఠ; ముప్పదికాష్ఠలు కల; ముప్పది కలలు ముహూర్తము; ముప్పది ముహూర్తములు ఒక రేయింబగలు; రవి రేయింబవళ్లుగా మానవ లౌకిక కాలమును విభజించుచున్నాడు. మానవులు పనులు చేసికొనుటకు పగలు-నిద్రించుటకు రాత్రి ఉపయోగపడుచున్న వి. ఒక మానవమాసము పితరులకు ఒక రేయింబవలు; అందునను కృష్ణపక్షము పగలు; శుక్ల పక్షమురాతి; మానవ మాసములు ముప్పది కలిసి పితరుల కొక మాసము; మానవ మాసములు మున్నూ టరువదిక లిసి పితృ సంవత్సర ము; మానవ మానము చే సూరు సంవత్సరము లైనచో పితరులకు-మూడు సంవత్సరముల నాలుగు మాసము లగును. మానవ లౌకిక ప్రసూణమున సంవత్సరము దేవత లకు రేయింబగలు. అని వేదము తెలుపుచున్నది. అందును. మానవుల ఉత్తరాయనము దేవతలకు పగలు దక్షిణాయనము రాత్రి; మానవ లౌకిక వత్సరములు ముప్పది దేవమాన మాసము; మానవ వత్సరములు నూరే నచో దేవతలకు మూడు మాసములు (మరి పది దినములు) అగును; మానవ లౌకిక వత్సరములు మూడువందలఆరువది యైనచో ఒక దేవవత్సరము. (మాత్రా.లఘూచ్చారణ కాలము నిమేషము)

మూడువేల ముప్పది - మానవ లౌకిక సంవత్సరములు ఒక న పరి వత్సరము. దీనికి మూడింతలు. అనగా తొమ్మిది వేల తొంబది మానవ లౌకిక సంవత్సరములు ఒక ధ్రువ సంవత్సరము. ముప్పది ఆరు వేల మానవ లౌకిక సంవత్సరములు నూరు దివ్య సంవత్సరములు; మూడు లక్షల అరువది వేల మానవ లౌకిక సంవత్సరములు వేయి దివ్య సంవత్సరములు; ఇట్లు దివ్య దేవ సంబంధి) ప్రమాణానుసారము చతుర్యుగవ్యవస్థ పెద్దలచే చేయబడినది; ఋషి వచనాను సారము భారత వర్షమున కృత త్రేతా ద్వాపర కలియుగములు నాలుగు వ్యవహార మందున్న ఏ. నాలుగువేల దివ్య వర్ష ములు కృతయుగము; అన్ని వందల దివ్య వర్షములు కృత త్రేతా సంధికాలము; అవే నాలుగు వందల దివ్య వర్షములు సంధ్యాంశ కాలము; ఇట్లే మూడు వేల దివ్య వర్షములు త్రేతాయుగ పరిమాణము; మూడు వందల దివ్య వర్ష ములు దాని సంధ్యాకాలము; మరి మూడు వందల దివ్య వర్షములు దాని సంధ్యాంశ కాలము; రెండువేల దివ్య వర్షములు ద్వాపరయుగ ప్రమాణము; రెండు వందల దివ్య వరములు దాని సంధ్యాకాలము; రెండు వందల దివ్య వర్గములు దాని సంధ్యాంశ కాలము; వేయి దివ్య వర్షములు కలియుగ ప్రమాణము; నూరు దివ్య వర్షములు దాని సంధ్యా కాలము; నూరు దివ్య వర్ష ములు దాని సంధ్యాంక కాలము.

దీప్యమానముచే యుగ ప్రమాణము సంవత్సర ములలో

యుగము । యుగపు మానము । యుగ సంధ్య । యుగ సంధ్యాంశము । మొ త్తము

కృత                 4000+                      400                +400                           = 4800       

త్రేతా                3000+                      300                +300                         = 3600

ద్వాపర            2000+                      200                +200                         = 2400        

కలి                  1000+                       100                 +100                          = 1200          

చతుర్యుగము । 10000+                  ।1000 । +1000         ।           = 12000

మానవ మానముచే యుగ ప్రమాణము సంవత్సరములలో

యుగము ।     యుగ ప్రమాణము । యుగ సంధ్యాం । యుగ సంధ్యాంశము।మొ త్తము     

కృత                1440000+                144000+                  144000 =           1728000

త్రేతా                1080000+               1080000+               1080000=         1296000

ద్వాపర            720000+                 72000+                   72000=            864000   

కలి                  360000+                 36000+                   36000=           432000

। 3600000+            ।360000+                           । 360000=   । 4320000

ఈ విధమగు చతుర్యుగమునకు దివ్య యుగమని వ్యవహారము. ఇటువంటి దివ్యయుగములు డెబ్బదియొకటి పై చిల్లర యైనచో ఒక మన్వంతరమగును. ఇది మనుష్య లౌకిక మానానుసారము ముప్పదియొక్క కోట్ల పదిలక్షల ముప్పది రెండువేల ఎనిమిది వందల ఎనుబది సంవత్సరముల ఆరు మాసములగును. ఇదే మన్వంతర పరిమాణము దివ్య మానము ననుసరించి తొమ్మిది లక్షల నలువదివేల సంవత్సరములగును.

విశేషాంశ ము : వాస్తవమున వేయి దివ్య యుగములు. అనగా వేయి మాసవ మహాయుగ ములు. అయినచో బహ్మకు ఒక పగలు; బ్రహ్మ దేవుని రాత్రికి కూడ ఇదే పరిమాణము; అనగా 12000000 దివ్య సంవత్సరములు = 12000000x3604820000000 మానవ సంవత్సరములు బ్రహ్మకు ఒక పగలు; అనగా సృష్టి కాలము; ఇంతయే బ్రహ్మకు రాత్రి-అనగా ప్రళయకాలము; ఒక సృష్టి కాలములో 14గురు మనువులు జీవించి తమతమ ప్రవృత్తులను లోకమున ప్రవర్తిల్లజేయుదురు; కావున 1 మన్వంతరము 12000000-1 = సుమారుగా 857148 దివ్య సంవత్స "రములు - 432000000 ,14 - 80857148.సంవత్సరములమీద 7 మాసములు కావలయును; కాని ఇచ్చట పురాణములో ఇచ్చిన మన్వంతర వరిమాణములో దేవమానముచేకాని మానవ మానము చేకాని సరి పోవుటలేదు. ఇంతే కాదు; పైని దివ్యమానానుసారము ఇచ్చిన మన్వంతర పరిమాణమగు 940000 దివ్య వర్షములను 860తో గుణించగా మానవమాన సంవత్సరములు 888400000 మానవ వర్షములు కావలయును. కాని పెని - మానవ . మానానుసారము ఇచ్చిన మన్వంతర పరిమాణ సంఖ్య వేరుగా నున్న ది.

ఇది సరిపోవుట ఎట్లు? ఆలోచించవలెను.

యుగ పరిమాణములకు నాలుగింటికిని దివ్యమానములోగాని మానవ మానము లో కాని సంధ్యా సంధ్యాంశములు ఉన్న బ్లీ సృష్టికాలము (బ్రహ్మదినము)నకు కూడ సంధ్యా సంధ్యాంశలు కలవు. కాని యుగముల విషయములో దివ్య మానమున యుగ పరిమాణము ఎన్ని వేల దివ్య సంవత్సరములో అన్ని వందల దివ్య సంవత్సరములే ఆయుగపు సంధ్యయు. అంతయే ఆయుగపు సంధ్యాంశమును; కాని ఈ సృష్టి కాలమునకు కల సంధ్యా సంధ్యాంగ పరిమాణము. అట్లు కాదు. ఈ చెప్పిన 12000000 దివ్యమాన సంవత్సరములు = 4320000000 మానవ సంవత్సరములలో 14 వంతును మరియు ఆ 14వ వంతులో 8వ వంతును కలిసి యగునంత కాలము మొత్తము సంధ్యా సంధ్యాంశము లగునని తోచు చున్నది. అట్లు చూడగా 12000000లో 14వ వంతు 857148 దివ్య వత్సరములును దీనిలో 8వ వంతు 285714 దివ్య వర్షములును కలిసి 1142857 దివ్య వర్షము లగును. ఈ సంఖ్యను సహస్ర దివ్య యుగముల కగు సంవత్సరము లతో కలిపి 14తో భాగించగా అవి ఇక్కడ ఇచ్చిన దివ్యమాన మన్వంతర పరిమాణము ఇంచుమించుగా అగును. దానిని 860తో గుణించగా మానవ మానములో ఇంచుమించుగా 388032885 సంవత్సరముల పై ఆరు మాసము లగును. దీనిని బట్టి దూల ప్రతులలో ఒకానొక కాలమున పాఠభ్రంశము జరిగెననియు పై మూల శ్లోకపు పంక్తులు:

అని యుండవలెననియు తోచుచున్నది,

అపుడు ముప్పది మూడు కోట్లును. అశీతి సహ సాణి-దశ -ఆన్యానీచ భాగశ ? - అనగా xX -  అగును. మిగిలిన  వేలు  వందలు  అను సంఖ్యలు సమానమే. కాగా పైన చెప్పిన  అగును. ఇది ఇంకను లోతుగా ఆలోచించవలసిన విషయము. )

మన్వంతరమునకు పదునాలుగు రెట్లు కల్ప ప్రమాణము; ఇదే బ్రహ్మకు పగలు.

దీనికి రెండింతలు సంపూర్ణ ప్రళయకాలము; దీనికి మహా ప్రళయకాల మనియు పేరు; ద్వాపర కలియుగములు రెండును పర స్పరము విడదీయరానివై కలిసియుండుటచే వాని లక్షణము వేరువేరుగా వివరించ వీలుగాక నేను మీకు వివరించలేదు. అట్లే త్రేతాయుగ లక్షణములను గూడ ఋషివంక ప్రసంగమున నాకు కలిగిన వ్యగ్రతచే - ప్పీయుండలేదు. శేషాంశమగు ఆత్రేతాయుగ విషయము ఇపుడు చెప్పే వినుడు.

శుభకరములగు త్రేతాయుగ ధర్మములను వినుడు. త్రేతాయుగారంభమున స్వయంభూ - బ్రహ్మ స్వాయంభువ మనువునకును మరీచ్యాది సప్త ప్రజాపతులగు) సప్త ఋషులకును శాశ్వతమగు శౌత స్మార్తమగు ధర్మమును విధి రూపమున బోధించెను. దొరాగ్ని హోత సంబంధము గల అగ్ని హోత్ర విధాన సంబంధులగు శ్రాత కర్మముల నను ష్ఠించు విధానము ఋగ్యజుః సామాత్మకమగు వేద సంహితలు తత్సంబంధి ధర్మములు తదంగములు తత్సంబంధీ విద్యలు ఈ మొదలగు విస్తృత శ్రేత ధర్మమును సప్త ఋషులును తమ తరువాతి తరముల వారికి ప్రతిపాదించి లోకమున ఆ ధర్మములను ప్రవర్తిల్ల చేసిరి. సామయాచారికధర్మమను ప్రసిద్ధిగల వర్ణాశమాచార ధర్మములను తనకు బ్రహ్మనుండి గురు పరంపర గా లభించిన వానిని స్వాయంభువ మనువు ఈ లోకమున ప్రవర్తిల్ల జే నేను. ఇవి స్మార (స్మృతిప్రో క) ధర్మములు .

ఈ సప్తర్షులును స్వాయంభువ మనువును కల్పాది త్రేతాయుగాదియందు - సత్యము బ్రహ్మచర్యము శ్రుతము (శాస్త్రములను సంప్రదాయ శుద్ధితో అధ్యయనము చేయుట తపస్సు నియమ పాలనముతో శరీరమును శ్రమకు పాల్పరచుట. ఆ నేడు ఈ ప్రక్రియలతో అతి తీవ్రమగు తపస్సు, ఆచరించిరి. (ఇచ్చట తపస్సు అనగా చిత్తమునకు ఆత్యుత్తమ సంస్కారమును సంపాదించుట); తత్పలముగా వారికి తమ సంకల్ప మేమియు లేక యే వారికి మరెవ్వరి నుండియు ఉపదేశము లేక యే ఆదియే ఈ కల్పమున ప్రథమ పర్యాయముగా వేదమంత్రములు అన్నియు ఆభివృత్తము లయ్యెను (వారి దగ్గరకు అవి తమంతట తామే వచ్చెను.) వైదిక మంత్రములు వీరికి సాక్షాత్కరించుట దర్శనమున (మంత్రములందు ప్రతిపాదింపబడు విషయము శబ్దరూపమున చిత్తమునకు మాత్రమే కాక చెవికి గూడ గోచరించుట) ‘తారక' రూపమున (నక్షత్రములందు అంతరిక్షముననే ఈ మంత్రరూపములును వానియందు ప్రతిపాదింపబడు దేవతా తత్వములును పానితో ఆచరించవలసిన యాగాది ప్రక్రియలును గోచరించుట -దతా తేయాది యోగులు ఎరిగిన తారక యోగసిద్ధిచే ఈ విషయములు వారి చిత శ్రవణములకు గోచరించుట). ఇట్టి అద్భుత విధానములతో జరిగేను. ఈ వేద మంత్రములు దేవతలకు అందర కును శబ్దాత్మక ములగు ఆశ్రయములు. మరి ఈ వేదమంత్రములు సప్తరులకు ఎట్లు మొదటిసారిగా ఈ కల్పమున ప్రతిభాతములు స్పురించినవి అయ్యెను? అనిన - ఇతః పూర్వపు కల్పములందును ఆయా ప్రమాణ జ్ఞానమునందు సిద్ది నందిన ఆయా మహానుభావులకు అంతకు ముందటి కల్పములందు వలెనే స్ఫురించగా వారు వానిని ఆ కల్పములందు లోకములందు ప్రవర్తిల్ల జేసిరి. ఇవి వేలకొలది మంత్ర ద్రష్టలకు వేలకొలదిగా ప్రతిభాతములై యుండెను. అవియే ఈ కల్పమునందు మరల ఈ సప్తర్షులకును స్వాయంభువ మనువునకును వారి వారి ప్రతిభ (స్వయం సిద్ధమగు బుద్ధి స్పందన యందు గోచరించెను. అని సమాధానము. ఇవి ఋగ్యజుః సామాథర్వణ రూపములగు నాలుగు వేదములు. వీనినే సప్తర్షులు తాము దర్శించి లోకమున ప్రవచించిరి (ఇచట సపరులనగా వారును వారి వంశజులగు మరి ఇతరులగు ఋషులును) స్మార్త ధర్మమును స్వాయంభువ మనువు లోకమున ప్రవ రిల్లజేసెను. ఇట్లు కల్పాది. యందలి త్రేతాయుగాదియందు సంహతములయిన వ్యవస్థాపూర్వకముగా అమర్చబడిన) వేదములు ధర్మ సేతువులుగా ధర్మాతిక్రమణము జరుగకుండ కాపాడు అడ్డుకట్టలుగా) అయ్యెను. ఆయుః పరిమాణము మొదలగు శక్తులు తగ్గుటచే ఈ ద్వాపరయుగము నాటికి అవి మొదటివలె నుండక వ్యత్యాస మందినవి. ఈ వేదములను ఋషులు తమ తపోబలా ధిక్యముచే అహోరాత్రములు అధ్యయనము చేయుచుందురు. దీనికి ఆదియు అంతమును లేదు. ఇవి నిత్యశబ్దములు) వీటిని స్వయంభూ బ్రహ్మ తాను స్వయముగా. ఆ ని ప్రతిపాదించు ధర్మము పొటియందు చక్కగా ముస్కరింపబడిన రూప ములో నిలిపి ఆయా యుగ ధర్మములకు అనుగుణముగా ఉండు రూపములో వాటి ఆంగములతో కూడ- ప్రతియుగము (కల్పభేదమునందును ప్రవచించును. కాని ఆయా యుగములలో ధర్మ వ్యవస్థయందలి మార్పుల ననుసరించి ఒక వేదముకంటె మరియొక వేదము మార్పు నొంది కనబడును. ఈ శుతులను అనుసరించి తెలియు తత్వము ఏమనిన లోక క్షేమకర మగు కర్మలను ఉత్సాహముతో తమ విక్రమముతో ఆచరించుటయే క్షత్రియులకును. హవిస్సులు (ప్రజల నిత్య జీవనములకు సాధనము లగు ఆహారాది పవిత్ర వస్తువులు) జనులకు సమకూర్చుటయే వైశ్యులకును. తమ శారీరక శ్రమతో జనులకు ఉపయోగించు పరిచర్యలు (కృత్యములు) F సేవ అని అర్థము కాదు. ) చేయుటయే శూద్రుల కును యజ్ఞములు; బ్రాహ్మణులకు జపమే జనులకు క్షేమము కూర్చవలేనను దృష్టి చేయు వేదాధ్యయనమే అని అర్థము; మంత్రజపమని అర్థము కాదు; } వాస్తవమగు యజ్ఞము. దీనిని ఇప్లే అందరును ఆచరించేడు వారు కావునను నాటి జనులు స్వధర్మాచరణశాలురు కావునను వారు కార్యపరులు నత్సంతానవంతులు సమృద్ధి కలిగి సుఖించువారునై యుండిరి. బ్రాహ్మణులు ఉపదేశించినట్లు క్షత్రియులు క్షత్రీయు లుపదేశించినట్లు వైశ్యులు వైశ్యు లుపదేశించినట్లు శూద్రులు ఆచరించుచు అనుగ్రహము (జసానుకూల ప్రవర్తనము)తో నడ చెడివారు. నాటి జనుల ప్రకృతులు (స్వభావ ములు) శుభకరములయి వర్ణాశ మానుకూల ధర్మరూపములయి యుండెడివి.

త్రేతాయుగమున ధర్మము సమగ్రముగా నడుచుచుండ మనస్సుతో చేయు సంకల్పము నోటితో చెప్పెడి మాట చేతితో చేయు పనీ ఈ మనోవాక్కాయిక కర్మములు మూడును ఏక రూపములు కాగా జనుల కర్మాచరణములు సఫల ములయి యుండెను. జనుల ఆయువు రూపము బలము మేధా ఆరోగ్యము ధర్మశీలము _ఇవి జనులలో తేతా యుగమున సర్వ సాధారణమయి యుండెను. బ్రహ్మ ఆనాటి వారికి వర్ణాశ్రమ వ్యవస్థను అట్లే చేసేను. వేద సంహితలను వేద మంత్రములను బ్రహ్మమానస పుత్తులగు ఋషులు అంత బాగుగా ప్రవర్తిల్లజేసిరి. వారు యజ్ఞముల నంత తిన్నగా ఆనాడు ప్రవర్తిల్ల జేసిరి. స్వాయంభువ మన్వంతరమునందు యాములు శుక్లులు జయులు అను దేవ వర్గములును విశ్వ నష్టయగు స్వయంభూబ్రహ్మయును సర్వ సంభారములతో సమృద్ధిగా నుండు యజ్ఞములను ప్రవర్తిల్లజేసిరి. సత్య జప తపో దానములు పూర్వ యుగములందలి ధర్మములయి యుండెను. కానీ క్రమముగ ధర్మశాఖ తగిన కొలది అధర్మ మధికము కాసాగెను. ఆ యుగములందు జనులు శూరులు ఆయుష్మంతులు మహాబలులు క్షమావంతులు (ఎవరిని దండిం చనివారు) న్య స్తదండులు మహాయోగులు యజ్ఞానుష్టాతలు వేదాధ్యయన తత్వజ్ఞానపరులు పద్మపత్రనేత్రులు విశాల ముఖులు చక్కని దేహపు అమరిక కలవారు సింహవక్ష ముకంటే దృఢ విశాలవక్షము కలవారు మహాసత్వులు మదపు పేనుగువలే నడుచువారు మహాధనుషులు న్యగ్రోధ పరిమండలులు సర్వ లక్షణ సంపూర్ణులు నై నొటి చక్రవర్తు లుండెడి పాడు. న్యగ్రోధము అనగా ' బార' అని అర్థము; బార కొలతకు వచ్చుటచే బాహువులకును న్యగ్రోధములు అని నామము; నిలువునగాని అడ్డమునగాని, బారలతో కొలువదగినంత పొడవు లావు(చుట్టు కొలత కల వారీని న్యగ్రోధ పరిమండలులు అందురు. ఆ స్వాయంభువ మన్వంతరమున చక్రవర్తులు విష్ణు నంశమున చక్రము రథము మణులు భార్య నిధి ధనరాశి) అశ్వములు గజములు అనేడు సప్త రత్నములు కలిగియుం డేడు పోరు. గడిచిన గడచుచున్న గడువనున్న త్రేతాయుగ ములందెల్ల చక్రవర్తులు ఇట్టివారే; ఈ చెప్పిన సప్త రత్న ములును ముందు చెప్ప బోవు లక్షణములును వారికి శుభకర లక్ష ణములుగా నుండును.

బలము ధర్మము సుఖము ధనము ఇవి అత్యద్బుతములగు లక్షణములు; వీటిని పరస్పర విరోధము లేకుండ ఆ త్రేతాయుగ రాజులు సమముగా నిర్వహింతురు. ధర్మార్థ కామ యశో విజయైశ్వర్యాణిమాది ప్రభుశ క్తి శాస్త్ర తపో లక్షణములందు వారు (నాటి చక్రవర్తులు) ఋషులను మానవులను దానవులనుకూడ తిరస్కరించగలిగియుందురు. మానవ సహజ శరీర లక్షణములు కూడ వారికున్న తములుగా నుండును. ఎట్లన వారి జుట్టు నుదుటి వైశాల్యమును కమ్మివేయునంతగా మీదికివచ్చి పడుచుండును. నాలుక నోటినంతటిని ఒరయునంతగా పొడవుగా నుండును. బొమన చాయ. నాలుగు కోర దంతములు కలిగి ఉన్నత వంశమున పుట్టి జితేంద్రియులు ఆజాను బాహువులు తాటికాండమువంటి చేతులు వృషభములవంటి తీవికల ఆకృతితో వృషభములకువలె దేహనిర్మాణము పెద్ద కొలత కలిగి సింహపు చూపు వంటి మూపులతో మేధావంతులయియుందురు. వారి పాదములందు శంఖచక్ర రేఖలు హ సములందు శంఖపద్మ రేఖలు కలిగి ఎనుబది ఐదువేల సంవత్సరములు ఏరోగమును పార్లక మును లేక జీవింతురు. ఆ చక్రవర్తులు అంత రిక్షమున సముద్రములందు పాతాళమున పర్వతములందు ఈ నాలుగు చోట్లకూడ వీరు ఆడ్డు లేక సంచరింతురు.

మీ తముమీద లేతాయుగమున యజ్ఞదాన తపస్సత్యములు ప్రధాన ధర్మములు; వర్ణాశ్రమ ధర్మములు సరిగా నడచును; ఐనను ఎవరి మేరలో వారిని నిలుపుటకై దండనీతియు నామమాత్రముగా ప్రవర్తిల్లును. జనులు ఎల్లరు హర ముతో పుష్టితో మానస శారీరారోగ్యములతో నుందురు. త్రివిధ వేదములును కర్మవరములు ఉపాసనాపరములు జ్ఞానపరములు) ఋగ్యజుఃసామాథర్వణములను నాలుగు పాదములతో ఏకవస్తువుగా అఖండ రూపమున నుండును. ప్రజలు మూడు వేలేండ్లు జీవింతురు. వారు పుత్ర పౌత్రాది పరివారము నడుమ క్రమముగా నెప్పుడో మర ణింతురు. ఇది తేతాయుగ ధర్మము; త్రేతా సంధ్యాకాలములో ఈ ధర్మములన్ని యు ఇందు. నాల్గవవంతున నడుచును. సంధ్యాంశ కాలమునందు సంధ్యా కాల ధర్మములో నాల్గవవంతు మాత్రము నడుచును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మన్వంతరాను కీర్తన కాల పరిమాణ కథన

తేతాయుగధర్మ ప్రతిపాదనమను నూట సలువది యొకటవ అధ్యాయము.