మత్స్య మహా పురాణము

Table of Contents

65 - అక్షయ తృతీయా వ్రతము

ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను: సర్వకామప్రదమగు మరియొక తృతీయా వ్రతమును చేప్పెదను. ఈ తృతీయా దినమున చేసిన దానము హోమము జపము ఏదియైనను అక్షయ ఫలప్రద మగును.

వైశాఖ శుక్ల తృతీయాతిథి బ్రహ్మదేవునితో చేరియుండునది. అందుచే విశేషించి పూజ్యమయినది. కనుక ఈనాడు ఉపవసించి ఏ పుణ్యకర్మ మాచరించినను అక్షయఫలము లభించును. ఈ తిథినాడు క్షయము లేని శాశ్వతోపాస కులచే విష్ణువు పూజింపబడును. కావుననే దీనికి అక్షయ తృతీయ యని పేరు. ఈనాడు లక్షతోదకముతో స్నానము చేసి వాటిని విష్ణుని పై ఉంచి అర్చించి వాటిని చక్కగా సంస్కరించి బ్రాహ్మణులకు దానము చేసి వాటి అన్న మునే తినినచో ఈ చెప్పిన ఫలము తప్పక లభించును.

ఇట్లు ఒక వైశాఖ శుక్ల తృతీయనాడే నను మానవుడు యథావిధిగా ఈ చెప్పినట్లు చేసి దాని తరువాత వచ్చు ప్రతి శుక్ల తృతీయయందును పం డ్రెండు మాసముల శుక్ల తృతీయలందును ఉపవసించి విష్ణుని అర్చించినచో రాజసూయ యాగము చేసినంత ఫలమునంది ముక్తి నందును. [అక్షతలు ఆనగా ఏ మాత్రమును విరుగక శ క్తి తరుగక నిలిచి యున్న బియ్యము. అవి వరి ధాన్యమునుండి కాని యవలనుండి కాని గోధుమలనుండి కాని తీసినవి కావచ్చును. ఇట్టి వరి బియ్యముతో కానీ యవల గోధుమల పిండితో కాని సిద్దపరచిన ఆహారము అక్షతాన్న ము. ]

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అక్షయ తృతీయా వ్రత కథనమను ఆరువది ఐదవ అధ్యాయము.