మత్స్య మహా పురాణము

Table of Contents

100 - స్నాన విధి

            మనో నిర్మలత్వమును మనఃశుద్ధియు స్నానము లేనిదే కలుగవు. కావుననే పెద్దలు స్నానమును మొదటి దానిగా విధించిరి. పైకి తీయని (నదుల) నీటితో గాని తీసిన (బావుల) నీటితోగాని స్నానము చేయవచ్చును. మొదట సంప్ర దాయము నెరిగి 'నమో నారాయణాయ' అను మూలమంత్రముతో తీర్థ కల్పనము చేసికొనవలెను. ఎట్లన నాలుగు మూరల కొలతతో చతురస్రముగ తన చుట్టును తీర్థప్రకల్పనము చేసికొని ఈ మంత్రములతో దానియందు గంగ నావాహనము చేయవలెను! “నీవు విష్ణుపాదమునుండి పుట్టితివి; విష్ణు సంబంధినివి; విష్ణువే నీ కధిష్టానదేవత; కాపున అట్టి నీవు ఆజన్మ మరణముగా మమ్ములను పాపములనుండి రక్షింపుము. వాయుదేవుడు పేర్కొన్న భూమ్యంతరీక్ష ద్యులోక ములందలి మూడున్నర కోట్ల తీర్థములును నీయం దున్న వి. భూలోకమున నందిని-దు లోకమున నళిని ఆని నీ పేరులు. ఇవి కాక దక్షా పృథ్వీ-విహగా-విశ్వకామా-శివప్రదా-విద్యాధరా సుప్రసన్నా -లోకప్రసాదినీ. క్షేమ్యా జాహ్న వీ.శాంతిప్రదాయినీ (ఆనం దము కలిగించునది.పద్మములు కలది- సమర్థురాలు..విశాలమయినది -ఆకాశమున సంచరించునది. అన్ని కోరికలు తీర్చునది శుభము ఇచ్చునది విద్యలను ధరించునది-మిగుల తేటయైనది-లోకములకు ప్రసన్న త.తేటదనము కలిగించునది - క్షేమము కలిగించునది -జహ్ను మునినుండి వెలికి వచ్చినది జహ్ను ముని కూతురు. శాంతి నిచ్చునది) స్నాన కాలమున ఈ పుణ్య నామములను కీర్తించుట చేత త్రిపథగా (తూర్పునకు-పడమరకు పాతాళమునకు-పోవు మూడు త్రోవలు కలది) ఆగు గంగ సన్ని హితయగును; ఇట్లు స్నానీయ జలమును ఏడుమా ర్థభిమంత్రించి దోసిట నింపుకొన్న ఆ నీటిని మూడు కాని నాలుగుకాని ఐదు కాని సారులు తలపై పోసికొనవలెను.

అట్లే మృత్తిక ను అభిమంత్రించి ఆది- రాచికొని కూడ స్నానము చేయవలెను. మంత్రార్థము : అశ్వములచే రథములచే విష్ణునిచే పాద ము లుంచబడినదియు ధనమును ధరించునదియు అగు మృత్తికా! నేను చేసిన దుష్కృత సిద్ద పాపములను పోగొట్టుము. వరాహరూపుడు నల్లనివాడు శతబాహుడు నగు విష్ణునిచే ఎత్తబడినావు; సర్వలోకముల నేడు అగ్ని పుట్టుకకు కారణమవు; నీకు నమస్కారము; ఇట్లు స్నానమాడి యథావిధానముగ ఆచమించి తెల్లని శుద్ద వస్త్రముల ధరించి త్రిలోక (స్థిత దేవతాదులతృప్తి కై తర్పణము (తృప్తి కలిగించునది) ఈయవలెను.

 (మంత్రార్థము): దేవ యక్ష నాగ గంధర్వాపరః సుర క్రూర సర్పసుపర్ణ(గరుడ) తరు (చెట్టు) జంగమ (సంచరించు ప్రాణులు) ఖగ (పక్షులు) విద్యాధర జలధరా (మేఘములు) కాశ గామి ప్రాణులు-ఇవి అన్నియును నిరాధార జీపు లును ధర్మరతులగువారును తృప్తి నొందుట కీ తర్పణ మిచ్చుచున్నాను. అనుచు ఉపవీతముగా (జందెము సవ్యముగా) దేవతర్పణముచే ఏ పిమ్మట నివీతము జందెము తావళమువలె వేసికొనుట)గా నుండి భక్తితో మనుష్యులకును సనక సనందన సనాతన కపిలాసురివోడు పంచశిఖు లనేడు బ్రహ్మపుత్రులగు ఋషులకు మరీచ్యత్యంగిరః పుల స్య పులహక్రతు ప్రచేతో వసిష్ఠ భృగునారదులను దేవర్షి బ్రహ్మర్షులకు అక్షతోదకములతో తర్పణము నీయవలెను. తరువాత అపసవ్యముతో ఎడమ మోకాలిని నేల పై తాకించి అగ్ని ష్వాత సౌమ్య హవిష్మత్ ఊష్మపసుకాలిన్ బర్హిషద్. ఆజ్యపులు అనేడు పితృ దేవతా వర్గములకు తన పితరులకు భక్తితో తిలచందనోదకములతో తర్పణ మీయవలెను. ప్రాణుల నియమించువాడు ధర్మ ముతో రంజింపజేయువాడు మృత్యురూపుడు అంతమొందించువాడు సూర్యపుత్రుడు నల్లనివాడు సర్వభూత నాశకుడు ఔదుంబరదఘ్న నీలపర మేష్టి వృకోదర చిత్ర చిత్రగుప్త నామములతో వ్యవహరింపబడు నీకు తర్పణమనుచు యమునకు ఆయా నామగోత్రములతో పితృ పితామహ మాతామహాదులకు తర్పణ మిచ్చి “ఈ జన్మ మందో పూర్వజన్మములందో నాకు బంధువులో బంధు బంధువులో అగు వారు నా నుండి తృప్తి కోరు పితరు లెవ్వరై నను తృప్తి చెందుదురు గాక!" యని దర్భపాణీయై అందరకు తర్పణ మీయవలెను.

తరువాత యథావిధిగా ఆచ మించి తన ముందు పద్మమును లిఖించి దానిపై సూర్యనామకీర్తన పూర్వకముగా పుష్పాక్షతర క్తచందన సహితముగా సూర్యునకు అర్ఘ్యము నీయవలెను. (నామార్థములు): విష్ణురూపుడు విష్ణుముఖుడు సహ సకిరణుడు సర్వతేజోరూపుడు శుభకరుడు సర్వేశుడు అందరయందు వాత్సల్యము కలవాడు . లోకప్రభువు దివ్య చందనభూషితుడు పద్మాసనుడు కుండలములతో భుజకీర్తులతో భూషితుడు సర్వలోకేశుడు సర్వజగముల మేల్కొలుపు వాడు సర్వసుకృతదుష్కృత సాక్షి సర్వవ్యాపి సత్యదేవుడు తేజోనిర్మాతయగు రవీ! నీకు నమస్సులు. అనుచు రవి కర్ఘ్యము ఇచ్చి మున్మూరు ప్రదక్షిణించి నమస్కరించి బ్రాహ్మణుని గోవును బంగారమును తాకి తరువాత విష్ణ్వాలయము నకు పోవలెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున స్నాన విధియను నూరవ అధ్యాయము