మత్స్య మహా పురాణము

Table of Contents

229 -  దేవతార్చా వికారోపశాంతి.

 గర్గుడు ఆత్రితో ఇట్లు చెప్పెను: దేవాలయములందలి ఆర్చామూర్తులు (దేవతా విగ్రహములు) విశేషముగా నృత్యము చేయును; వణమును; ప్రజ్వలించును; గట్టిగా అర చును; ఏడుచును; చెమర్చును; నవ్వును; లేచును; దుఃఖించును; పరుగేత్తును; ఊదును; విరుగును; కదలును; ఆయుధముతో కొట్టును; తలలు వంచుకొని నిలుచును; ఒక చోటినుండి మరియొక చోటికి కదలును; ఆగ్ని ని పొగను నూనేను (జిడ్డును) రకమును వనను కక్కును; ఈ విధములగు వికారములు దేవాలయములందో బ్రాహ్మణుల ఇండ్లయందో కనబడును; ఆట్టి చోటులందు నివాసము విడువవలయును; వీనిచే రాజునకయినను వ్యసనము (ఆపద) కలుగును.దేశమునకై న నాశము కలుగును; ఇట్టి ఉత్పాతములు దేవతల జాతర అందు కనబడుచో దేశ మునకు భయము కలుగును; ఆభయములు హర్మ్యములందు బ్రహ్మవలనను పశువులకు రుద్రుని వలనను నృపులకు లోక పాలుర వలనను సేనాపతులకు స్కందునివలనను విశాఖుని వలనను ( ఈ ఇద్దరును కుమార స్వామి రూపభేదములే) లోక (రాజ్య) జనులకు విశ్వకర్మ విష్ణువుల వలనను గణ నాయకులకు వినాయకుని వలనను రాజ సేవకులకు దేవ సేవకుల వలనను నృపస్త్రీలకు దేవతా స్త్రీల వలనను ఆ పదలు ఈ ఉత్పాతముల ఫలముగా కలుగును; గ్రహాదులయందు కలుగు ఉత్పాత దర్శనములు వాసుదేవుని వలన కలుగును; దేవతార్చామూర్తులందు ఈ వికారములు కన బడినపుడు వేదవేత్తయగు పురోహితుడు ఆ మూర్తిని స్నానమాడించి వస్త్ర గంధ భూషణాదులతో కప్పివేయవలెను; అలంకరించవలెను; గంధమాల్యాన్నాది సంపదలతో ఆర్చన చేయవలెను; తరువాత మధుపర్కముతో (తేనెతో కలిపిన గోక్షీరముతో) మూర్తిని సేవించవలెను; ఆ దేవతా సంబంధి మంత్రములతో యథావిధిగ స్థాలీపాకము జరిపి ఆచరువుతో ఏడహోరాత్రములు హెచ్చరిక తో హోమము చేయవలెను; ఈ ఏడు దినములును విప్రులను. తేనె అన్న పానములు దక్షి ణలు-వీనితో పూజించవలెను; ఎనిమిదవ దినమున విప్రులకు గోభూదానములు జరుపవలయును; దీనిచే ఉపద్రవములు శాంతించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ఆర్చావికారోప శమనమను రెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము.