మత్స్య మహా పురాణము

Table of Contents

209 - యముడు సత్యవంతుని సూక్ష్మ దేహము కొనిపోవుట - సావిత్రీయమ-సంవాదము.

మత్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: కట్టెలు కొట్టు చుండగా సత్యవంతునకు తలనొప్పి వేయసాగెను; వేద నతో బాధపడుచువచ్చి అతడు భార్యతో ఇట్లు పలి కెను; ఈ (కట్టెలు కొట్టిన ) శ్రమతో నాకు తలనొప్పి కలిగినది; చీక టిలో ప్రవేశించు చున్నానేమో అనిపించుచున్నది; నాకేమియు తెలియుట లేదు; నీ తొడ పై తలనుంచి నిద్రించవలెననిపించు చున్నది; అని రాజ పుత్తితో చెప్పి నిద్రతో కండ్లు కూరుకొని పోవుచు ఆ రాజు కుమారుడు ఆమె ఒడిలో తల పెట్టుకొని నిదురించెను; పతి వ్రతయు మహా భాగయు ఆగు ఆ రాజ పుత్తికి స్వయముగా తానొక్కడు మాత్రమే అచటికి వచ్చిన యముడు కనబడెను; అతడు నల్ల కలువపూరేకువలె నల్లనివాడు; పచ్చని వస్త్రము ధరించిన ప్రభువు; అతడు తన చుట్టును మెరపు తీగలు చుట్టుకొనినదియగు నీటితో నిండిన మేఘమువలె నుండెను. రవి నమాన కాంతిగల కిరీటముతోను కుండలములతోను ప్రకాశించుచుండెను; ఆతని పక్షః స్థలమున బరువగు అనేక హారములును భుజములందు పలువన్నెల భుజకీర్తులునుం డేను. ఆతని వెంట గొప్ప పరివారమును కాలుడును మృత్యువును కూడ నుండిరి.

ఇట్టి ధర్మరాజు ఆ ప్రదేశమునకు వచ్చెను; సత్యవంతుని దేహమునుండి బొటనవ్రేలియంత పరిమాణముగల (సూక్ష్మ దేహాత్మక) పురుషుని తీసి అతనిని (కర్మఫల రూప) పాశముతో బంధించి త్వరితముగ దక్షిణ దిక్కునకు పోయెను; ఉత్తమశ్రియగు సావిత్రియును తన పతి గత జీవితుడగుట చూచి ఏమియు తడవు చేయక సోమరితనము చూపక ఆ ధర్మరాజుననుసరిచి పోవసాగెను; అంతట ఆట్లు పోవుచు దోసిలి పట్టి వణ కుచున్న హృదయముతో ఆమె ఇట్లు పలికెను:

సావిత్రీయమ సంవాదః.

మాతృభ క్తిచే ఈ (భూ)లోక సుఖములను పితృభక్తి చేత మధ్యమ (అంతరిక్ష) లోక సుఖములను గురు శుశ్రూష చేత బ్రహ్మలోక సుఖములను (జీవుడు) పొందును; ఈ మూడు భక్తి (సేవా) నియమములను ఎవరు ఆదరింతు పాటింతురో వారు అన్ని ధర్మములను ఆదరించినవారే; ఎవరు ఇవి పాటించరో ఐరాచరించు సర్వక్రియలును నిష్పలములగును; వీరు మువ్వురును జీవించియున్నంత వరకును ఇతర ధర్మ సేవనమేమియు చేయ పనిలేదు; వారికి ప్రీతిని తనకు హితమును కలిగించుట యందాసక్తుడే ఎడతెగక వారి శుశ్రూష చేయుచుండవలెను; వీరి సేవాదికమునకు ఆటంకము లేకుండునట్లు ఇతర కార్యములేవయిన తాను చేసినను అవి వీరికి తెలుపుచు చేయుచుండవలెను. ఇట్లు పురుషుడు (జీవుడు) చేయు పనులన్నియు ఈ మువ్వురియందే ఇముడుచున్నవి.

అన పని యముడు (ధర్మరాజు) ఇట్లనెను; సావిత్రీ! నీకోరిక నెరవేరినదికదా! (నీవు అనినట్లు పుట్టినింట నీ తలిదండ్రులను ప్రతి ఇంట మగని తల్లిదండ్రులను మగనిని గురువులను సేవించితివి;) ఇపుడిక మరణించినవారికి వెంట వచ్చి వారికి చేయవలసిన సేవ పరలోకమందేదియు లేదు; అనియు ఇటనే ఉండి వారికి పార లౌకిక కర్మలు చేయవలె ననియు శాస్త్రములందు చెప్పబడియున్నది; కనుక మరలుము; నీవిట్లు నావెంట వచ్చుటచే నీకు శ్రమము; నాకు ఆటంకము; అందుచే నీకు ఈమాట చెప్పుచున్నాను; గురువుల (పెద్దల) పూజలందు భక్తి కలదానవు; అదీ కాక నీవు సరళ ప్రవర్తనము కల పతివ్రతవు; ధర్మమెరిగిన దానవుగదా నీవు! మరలుము; నీవిపుడు ఇంకను ముందుకు వచ్చినకొలదిని ఇంకను శ్రమమగుచుండును; అన సావిత్రి అతనితో ఇట్లనెను: స్త్రీలకు పతియే దైవతము; పతియే పరమగతి (కి సాధనము); సాధ్వియగు శ్రీ పతి ననుసరించుటయే ధర్మము; పతియే స్త్రీకి తన ప్రాణమునకును ధనమునకును ఈశ్వరుడు (సొంత దారుడు; ) స్త్రీకి పిత యు సోదరుడును సుతుడును ఇగ్చునది కొంచెము మాత్ర మే; ఆమిత మగు (పుణ్య ధర్మ ఫలములను) ఈయగలిగినది పతియొక్క డే; అట్టి పతినీ ఏస్త్రీ, పూజించకుండును? సుగో త్తమా! నాపతి పరులచే ఎచటికి తీసికొని పోబడునో తాము స్వయముగానై న ఎచటికి పోవునో అచటికి నేనును యథాశ కి (చేతనే నంతవరకు) పోవలసినదే! దేవా! నాపతిని తీసికొనిపోవుచున్న నీవెంట నేను రాలేనపుడు నేను ప్రాణములనే వదలుదును; మనస్విని (అభిమానవతి)యగు ఏ శ్రీయైనను వైధవ్యమను పాపపు అక్షరములకు పాత్రమయి అలంకారములతో సౌభాగ్య లక్షణములతో ఉండవలసిన తాను ఆ అలంకారములకు దూరమై ముహూర్త కాలమయినను జీవించగలదా? అనగా ఆమెతో యముడిట్లనెను: పతివ్రతా! మహాభాగా! శుభరూపా! నీ విషయమున పంతుష్టుడనయితిని; సత్యవంతుని ప్రాణములుకాక మరేదై న కోరుము; శీఘ్రమే ఇత్తును; అనగా సావిత్రి “మహాత్ముడు ధర్మజ్ఞుడు అగు నా మామగారు రాజ్యమును కన్నులును పోయియున్నారు; వారికా రెండును వచ్చునట్లు వరమునిండు;” అన యముడు. “శుభ రూపా! నీవు చాల దూరము వచ్చితివి! వెనుకకు మరలుము; నీవడిగిన ఇదంతయు జరుగును; (ఇంకను వచ్చినచో) నాకు ఆటంక మును నీకు శ్రమమును అగును; అందుచే ఇపుడిట్లు చెప్పుచున్నాను; (నామాట వినుము).” అనెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున యముడు (ధర్మరాజు) సత్యవంతుని సూక్ష్మ దేహమును కొనిపోవుటయు సావిత్రీ యమసంవాదము సావిత్రికి ప్రథమవరప్రాప్తియుఅను రెండు వందల తొమ్మిదవ అధ్యాయము.