మత్స్య మహా పురాణము

Table of Contents

8 - బహ్మ పృథువు మొదలగు వారికి ఆయా ఆధిపత్యము లిచ్చుట

 శౌనకాది ఋషులు సూతు నిట్లడిగిరీ : అయ్యా ! మీరు మాకు పరమాత్మ చేసిన ఆదిసర్గమును (ప్రథమసృష్టిని తెలిపితిరి. దీని తరువాత చేసిన ప్రతీ సర్గమును ఆ సృష్టియందలి ఆయా భూతములకును పదార్థములకును ఆధిపతులను విశదీకరింపుడు.

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను : అమరాధిపుడగు బ్రహ్మ సకల ధరిత్రికి పృథువును ' అధిపతిగా చేసెను. అట్లే ఓషధులకు యజ్ఞ కర్మలకు తపస్సులకు సోముని-నక్షత్రములు తారలు పనులు వృక్షములు గుల్మము పొదలు లతలు మొదలగు వానికి హిరణ్య గర్బుని జలములకు వరుణుని ధనములకు రాజులకు కుబేరుని ఆదిత్యులకు విష్ణువను ఆదిత్యుని వస్తువులకు అగ్ని అను వసువును ప్రజాపతులకు దకుని దేవతలకు ఇంద్రుని దైత్యదానవులకు ప్రహ్లాదుని పితృ దేవతలకు యముని పిశాచములకు రక్ష స్పులకు పశువులకు యక్ష భూత భేతాళములకు శూలపాణిని పర్వతములకు హిమవంతుని సరిత్తులకు (జల ప్రవాహములకు) నదులకు సముద్రుని గంధర్వులకు విద్యా ధరులకు కింనరులకు చిత్ర రథుని నాగులకు వాసుకిని సర్పములకు తక్షకుని దిగ్గజములకు ఐరావతమును పక్షులకు గరుడుని అశ్వములకు ఉచ్చైః శ్రవమును మృగములకు సింహమును వనస్పతు (పూయక యే కాయలు కాచేడు చెట్టు)లకు జువ్వి చెట్టును అధిపతులనుగా చేసెను. సుధర్ముని తూర్పునకు శంఖుని దక్షిణమునకు సు కేతుమంతుని పశ్చిమమునకు హిరణ్యరోముని ఉత్త్రరమునకు దిగధిపతులనుగా బ్రహ్మ అభి షేకించెను. వారు ఇప్పుడును (మత్స్య నారాయణుడు మనువునకు ఈ వృత్తాంతము చెప్పు నాటికి) ఈ నలుగురు దిక్పాలురును పృథుని మొదటి భూలోకాధిపతినిగా అభి షేకించిరి. ఆ మన్వంతరము గడచిన తరువాత సూర్య వంశజుడగు వైవస్వతుని భూలోకాధిపతినిగా చేసిరి. అనగా చాక్షుష మన్వంతరము గడువగా వైవ స్వత మన్వంతరము ప్రారంభము కాగా సూర్య వంశమునకు పతాక వంటి వాడగు వైవస్వతుడు భూలోక చక్రవర్తిగా ప్రజా పతిగా అభిషిక్తుడయ్యె.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున బ్రహ్మ పృథుపు మొదలగు వారిని ఆయా అధిపతులసుగా అభి షేకించుట యను అష్టమాధ్యాయము.