మత్స్య మహా పురాణము

Table of Contents

212 - సావిత్రీయమ సంవాదము - సావిత్రికి యమునివలన చతుర్థవర లాభము

సావిత్రి యమునితో ఇట్లనెను: ధర్మాధర్మ విధానమును ధర్మముఇటువంటిది ఆధర్మము ఇట్టిది అని ఎరిగిన వాడా! సర్వ ధర్మములను ప్రవర్తిల్లజేయువాడా! జగములకు నాథుడపు (రక్షకుడవు) ప్రజా సంయమనుడవు (ఈమాటకు అర్థము వెంటనే వివరించబడును.) అగుటచే యముడవు నీవే; వారివారి కర్మములకు తగినట్లుగా ప్రజలను యమింతువు (అదుపులో ఉంతువు) కావున దేవా! యముడు అను నామముతో వ్యవహరించబడుచున్నావు; విభూ! ఈ ప్రజలనందరను ధర్మముచే రంజిల్ల (ఆనందింప జేయుదువు కావున 'ధర్మరాజు' అని నిన్ను సజ్జనులందురు; మృతు లయిన జనులు తమ సుకృతమునో దుష్కృతమునో తమముందుంచుకొని నీ సమీపమును చేరుదురు కావున నీకు మృత్యువు అను పేరు వచ్చినది; (మృతాః-యాంతి-ఏనం- ఇతి మృత్యుః అని వ్యుత్పత్తి; వీనిలో-మృత-య =మృత-యు = మృత్యు) కల (540 రెప్ప పాటులు) దాని అంశములు మొదలగు కోలావయవ పరిమాణములతో ప్రాణి జీవితములను గణనచేయుచు కాలవ్యవస్థ నేర్పరతువు కావున నీకు కొలుడు అని పేరు. సర్వభూతములకు ఆంతమును కలిగించు మహా త త్వమవు కావున నీకు అంతకుడు అని వ్యవహారము; వివస్వంతుని (సూర్యుని) మొదటి కుమారుడవు గావున నీవు వైవ స్వతుడవు; ఆయువును ఈ జన్మపు ప్రారబ్ద కర్మమును ముగియగనే ప్రాణులను నీ దగ్గరకు తీసికొనెదవు కావున నీవు సర్వప్రాణహరుడవు.

            దేవేశా! నీ యనుగ్రహముననే వేదత్రయ ధర్మము నశించకున్న దీ; ప్రాణులు ధర్మమందు నిలిచి యుందురు; ధర్మములు పరస్పరము సంకీర్ణము కాకయున్న వి; సజ్జనులకు ఎల్లప్పుడును గతినీవే; ఈ జగత్తున మర్యాదను (న్యాయ ధర్మముల హద్దును) రక్షించు జగన్నాధుడవు నీవే; దుఃఖితను శరణాగతను ఆగు నన్ను రక్షించుము; దేవ శేష్టా! ఈ రాజపుత్తుని తల్లిదండ్రులును నా వలెనే దుఃఖితులయియున్నారు; అనగా యముడిట్లనెను: ధర్మజ్ఞవగు అబలా! నీ భ క్తితోను స్తవముతోను సంతుష్టుడనగు నేను నీ భర్తయగు సత్యవంతుని వదలితిని; నీ కోరిక నెరవేరినది కదా! నీవు వెడలి పొమ్ము; అతడు నీతోకూడి నాలుగు వందల ఏండ్లు రాజ్యమేలును; అనంతరము స్వర్గమును ఆరోహించి నీతో కూడి సుఖించును; ఇతడు నీయందు నూరుమంది పుత్రులను. కనును; వారు వీర్యవంతులగు రోజులుగా దేవసమానులుగా నగుదురు; వారు రాజులలో ముఖ్యులును నీ పేరుతో (సావిత్రులు అని) ప్రసిద్దులును శాశ్వతులును నగుదురు; నీ తండ్రికి నీ తల్లియ గుమాళ వియందు మాళవులను ప్రసిద్ధ నామముగల వారు (కీర్తిచే)శాశ్వతులు పుత్ర పౌత్తవంతులునగు నూరుగురు కుమారులు కలుగుదురు; ఆ నీతమ్ములందరును దేవసములగు క్షత్రియులగుదురు; ధర్మజ్ఞా ప్రభాతమున మేలుకోంచి ఈ స్తోత్రముతో నన్ను ఎవరు స్తుతింతురో వారు కూడ దీర్ఘాయుష్మంతులగుదురు.

అని ఇట్లు చెప్పి మహాత్ముడగు యమ భగవానుడు రాజ సుతుడగు సత్యవంతుని వదలి కాలునితోను మృత్యువు తోను అదృశ్యుడయ్యెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున సావిత్ర్యు పాఖ్యానమున సావిత్రీయమ సంవాదము- యముడు సావిత్రికి సత్యవంతుని జీవితమును వరముగా నిచ్చుట యను రెండు వందల పండ్రెండవ యధ్యాయము.