మత్స్య మహా పురాణము
48 - తుర్వసుడు మొదలగువారి వంశము
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను. యయాతి పుత్రుడగు తుర్వసునకు గర్గుడు అతనికి గోభానుడు అతనికి ధీరుడు అపరాజితుడునగు త్రిశరి అతనికి అనంతుడు అతనికి పూరు వంశీయుడగు అకల్మషుడైన దుష్యన్లుడును కుమారులయిరి. (అనంతుడు పూరు వంశీయుడగు దుష్యంతునే తన కుమారునిగా స్వీకరించేను.) ఇట్లు జరా సంక్రమణము హేతువుగా యయాతి శాపము పాలైన తుర్వసు వంశము పూరు వంశములో కలిసిపోయెను.
ఈ దుష్యంతునకు వరూథుడు అతనికి ఆంగీరుడు అతనికి నలుగురు పాండ్యుడు కేరళుడు చోళుడు ఫల్గుడు అనువారును కుమారులయిరి. వీరి పాలిత జనపదములు పాండ్య కేరళ చోళములు చాల సమృద్ధితో నుండినవి.
యయాతికి ఇంకొక కుమారుడగు ద్రుహ్యునకు శూరుడు బభువు నేతువు ఆనువారు కుమారులు. సేతునకు భద్రుడు అతనికి గాంధారుడు కుమారులు. ఈ గాంధారుని పేరనే గాంధార దేశము ప్రసిద్దమయినది. ఆదేశపు గుర్రములు చాల మేలయినవి. అతనికి ధర్ముడు అతనికి మృతుడు అతనికి విద్రుముడు ఆతనికి ప్రచేతుడు కుమారులయిరి. ప్రచేతునకు నూరుమంది కుమారులు కలిగిరి. వారందరును ఉత్తర దిశ యందలి రాజ్యములకు పాలకులయిరి.
యయాతికి మరియొక కుమారుడగు ఆనువునకు పరమ కీ ర్తిమంతులు వీరులునగు సభానరుడు చాక్షుషుడు పర మేష్టి ఆను ముగ్గురు కుమారులు. సభానరునకు విద్వాంసుడగు కోలాహలుడు అతనికి ధర్మాత్ముడగు సంజయుడు అతనికి వీరుడగు పురంజయుడు అతనికి మహారాజగు జనమేజయుడు ఆరాజర్షికి మహాశాలుడు కుమారులయిరి. అతడు మహాకీర్తిశాలియు ఇంద్రునితో సమానుడును. అతనికి ధార్మికుడగు మహామనస్కుడు కుమారుడు. అతడు సప్తద్వీపాధి పతియగు చక్రవర్తి. అతనికి ధర్మజులగు ఉశీనరుడు తితిక్షుడు అనువారు పుత్రులు.
రాజర్షి సుతలగు భృశ-నరకృశి-దర్శ-దృషద్వతి.అను ఐదుమంది ఉశీ నరుని భార్యలు. అతడు చాలకాలము చేసిన మహా తపఃఫలముగా అతనికి వార్ధకమున ఆ ఐదుగురియందు వరుసగా భృశుడు నరుడు కృశిసువ్రతుడు - శిబి అను ఐదుమంది కుమారులు కలిగిరి.
వీరిలో శిబికి శిబులు అను పేరున లోక విశ్రుతులగు పృథుదర్భుడు సౌవీరుడు కేకయుడు భద్రకుడు అను నలుగురు కుమారులు. వీరి పాలిత జనపదములు సర్వసమృద్ధములగు. కేకయ-భద్రక . సౌవీర -పౌర-జనపదములు. వీరిలో భృతుని కుమారులు కేకయులని ప్రసిద్ధులయిరి. సౌవీరుని కుమారుడు అంబష్ణుడు. కృశికుమారులు కృశశులు. నరుని కుమారుడు నరరాష్ట్రుడు. తితికుడు తూరుపున రాజయ్యెను. అతనికి పృషద్రధుడు అతనికి ఫేనుడు అతనికి సుతపుడు అతనికి బలియనువారు కుమారులయిరి. (సుతపుడు దైత్యుడగు బలిని తన కుమారునిగా స్వీకరించెను.) ఇతడు మహాయోగి. పూర్వము విష్ణునిచే బంధింపబడిన బలియే ఇతడు. మనుష్యుడుగా అయిన బలి మానవ జాతియందలి తన వంశము నశించునట్లున్న సమయమున క్షేత్రజులనుగా మానుషియగు తన భార్యయందు ఐదుమంది క్షత్రియ కుమారుల నుత్పాదించెను. వారు అంగుడు వంగుడు సుహ్ముడు పుండుడు కళింగుడు అనువారు. వీరు బలి సంతతిలోని క్షత్రియులు. వీరు కాక బలి సంతతివారు కొందరు బ్రాహ్మణులుగానై విప్ర వంశములను నిలిపి వృద్ధి చేసిరి. ఈ అంగుడు మొదలగు ఐదుమంది వంశములందు జన్మించి వారి వంశముల నిలిపిన వారికి అంగులు వంగులు సుహ్ములు పుండ్రులు కళింగులు అని పేరు. (వీరి జనపదములకును ఇదియే - పేరు.) -
పూర్వము బలి విషయమున బ్రహ్మ ప్రీతుడై అతనికి వరముల నొసగేను. వానిచే అతడు మహాయోగిత్వమున కల్పపరిమాణపు ఆయువును యుద్ధమున ఓటమి లేకుండుటయు ధర్మమునందు అత్యుత్తమ స్థిర బుద్ధియు త్రిలోకము లందలి సర్వవిషయముల చూచుట తన జాతి వారిలో ప్రధానుడగుట యుద్ధమున సాటిలేని గెలుపు ధర్మతత్త్వార్థమును దర్శించుట నాలుగు వర్ణముల వారిని వారివారి నియమములందు నిలుపుట అను యోగ్యతలను సంపాదించెను.
దీర్ఘతమస ఉత్పత్త్యాదికథనమ్.
ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి: “మహాత్ముడగు బలికి మానుషి అగు భార్యయందు ఐదుగురు కుమారులు ఎట్లు కలిగిరి? అతని భార్య (ఆగు మనుష్యశ్రీ) ఎవరు? వారిని ఆమెయందు కనిన ముని ఎవరు? ఎట్లు వారిని అతడు జన్మింపజే నెను? ఆ ముని మాహాత్మ్య ప్రభావములు ఎట్టివి? ఇది అంతయు మాకు తెలుపుము.”
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: పూర్వము అంగిరోముని కుమారుడు ఉచ. (త) భ్యుడను ప్రసిద్దుడగు ఋషి ఉండెను. ఈ మహాత్ముని భార్య పేరు మమత. ఇతని తమ్ముడును . దేవగురువును బ్రహ్మ తేజస్సంపన్నుడును అగు బృహస్పతి ఒకమారు తన వదినెను. ఈ మమతను-కామించెను. ఆమె ఇట్లనెను: “నేను నీకు వదినేను. గర్భవతిని. నా గర్భమునందున్న నీయన్న కుమారుడు షడంగ వేదవేత్త. ఇట్టి ఈ మహాగర్భము నీ పై కోపించును. నీవును అమోఘ వీర్యుడవు. కనుక నీవు నన్ను కూడుట మంచిపనికాదు. కనుక తగని ఈ ప్రయత్నము మానుకొనుట మంచిది. . ఈ సమయమునకు తగిన విషయము ఇది. నీవు ఏమనుకొనినను సరియే.”
బృహస్పతి బ్రహ్మతేజస్సంపన్నుడే మహాత్ముడే కాని అతడు తన కామమును . నిగ్రహించుకొనలేక పోయేను. అందుచే అతడు ధర్మాత్ముడై యుండియు కామము లేని తన వదినెను కూడెను. సంయోగక్రమములో బృహస్పతి తన శుక్రమును మమతా గర్భమునందు విడుచు సమయమున ఆమె గర్భమునందున్న శిశువు ఇట్లు పలికెను: “ “తండ్రీ! నీవు చేయుచున్న ఈ పనీ చాల నీచమయినది. ఇచ్చటనో ఇద్దరు ఉండుటకు అవకాశములేదు. నీ రేతస్సును వ్యర్థముకానిది, (అదియు సఫలమై శిశువు ఆగును.) కాని నేను ముందుగా ఇచటకు వచ్చి ఉన్నాను.” ఈ శిశువు - ఇట్లనగా, బృహస్పతి క్రుద్దుడయి అతనిని శపించెను. ఆ. శిశువు తన అన్న గారి కుమారుడు. గర్భమునందున్న పసికందు. బృహస్పతి తానును - ఋషి. ఐనను కాముకుడు. “ఇటువంటి సమయమున నన్ను వారించితివి కావున నీవు దీర్ఘ మగు తమస్సును (అంధత్వమును) ప్రవేశింతువు.'' అని అతడు ఆతనిని శపించెను.
తరువాత మమతకు శిశువు జనించెను. అతడు రెండవ బృహస్పతి వంటివాడు. మహాకీర్తి సంపన్నుడగు ఋషి -అయ్యెను. కాని ఈ శాపముచే అతడు దీర్ఘతముడు అనబడెను. అతడు ఊర్ధ్వరేతస్కుడు (బ్రహ్మచర్య ధర్మమున ఇంద్రియమును నిగ్రహించుకొనిన వాడు.)
అతడు తన తండ్రి) సోదరుని ఆశ్రమమునందు నివసించుచు ఒకమారు - సురభి (కామధేనువు) వంశము వారికి సంబంధించిన గోధర్మములను ఒకానొక ఋషభము వలన వినెను. ఎట్లనగా--
ఈ దీర్ఘతముడు తన తండ్రికి సోదరుని పోషణలో అతని ఆశ్రమమున నివసించుచుండెను. ఒకనాడు దాని లోనికి దైవవశమున ఒక వృషభము వచ్చెను. యజ్ఞమున కై తెచ్చి ఉంచిన దర్భలను ఆది తినెను. దీర్ఘతముడు దాని కొమ్ములు బిగించి పట్టుకొనెను. అది కదలలేక పోయెను. “తండ్రీ! నన్ను విడువుము. నీవు బలశాలుర లో గట్టివాడవు. ఈ వనమున నీవంటి బలశాలి నాకు మరెవ్వరును కనబడలేదు. నా అక్షయ బలమును . నీ బలముతో సమానముకాదు. నీ బలమునకు నేను ప్రీతుడనై తిని. నన్ను విడువుము. నీకు వరముల నిత్తును.” అనీ అది మునితోననెను. “నీవు ప్రాణము లతో నన్ను తప్పించుకొని పోలేవు. నేను నిన్ను విడువను. (నీవు మాదర్భలను తీంటివి.)” అని ముని వృషభముతో ననేను. అంత వృషభము “నాయనా! మాకు ఇది దొంగతనము. ఇది చేయుట పాతకము. అనునది లేదు. ఇది భక్ష్యము - ఇది అభక్ష్యము. ఇది పేయము.ఇది ' ఆ పేయము (త్రాగదగినది త్రాగరానిది) అను నియమము మాకు లేదు. ఇవి అన్నియు మానవులకు మాత్రమే. ఇది చేయతగినది. ఇది చేయతగనిది. వీరిని కూడవచ్చును. వీరిని కూడరాదు. అను వ్యవస్థ కూడ మానవుల కే కాని మాకు లేదు.” అనెను.
దీర్ఘతముడు ఈ గోధర్మములను విని తడబాటు చెంది ఆ వృషభమును విడిచెను. దానికి భ క్తి పూర్వకముగా ఆన్న పానములనిచ్చి దానిని ఆనుగ్రహింపజేసికొనెను.
అట్లు వృషభము అనుగ్రహముతో వెళ్ళిన తరువాత దీర్ఘతముడు - తాను గోవృషభమునుండి భక్తితో వినిన గోథర్మములను తనకు పరమార్థముగా ముఖ్యాశ్రయముగా భావించి వానినే ధ్యానింపసాగెను. అతని తమ్ముని పేరు గౌతముడు. అతని భార్యను ఈ దీర్ఘతముడు కలియగోరెను. ఆమే తనకు కోడలివంటిది. ఐనను అతడు గోధర్మములను జేష్టములనుగా తలచి ఆట్లు సంకల్పింనేను-(ఆమె అంగీకరించలేదు.) అది ఆమె గర్వము అని తలచెను. అతడది సహించ లేక పోయెను. అతడామెను బెదరించేను. ఆమె తలను తన బాహువులతో అదిమిపట్టెను. అతడు మహాత్ముడయ్యు జరుగవలసినది ఇట్లు ఉన్నదని నిశ్చయించి తన కోరిక ఆమెతో పలికెను: అతడు మహాత్ముడని ఆమెకు తెలియును. కాని అతడు విపర్యయమునకు సిద్ధపడినాడు. (మానవుడయియుండి పశు ధర్మమునకు పాల్పడుట - విపర్యయము-విరుద్ద ధర్మము.) ఆది చూచి ఆమె ఆతనితో ఇట్లు పలికెను: “నీవు విపర్యయమునకు పూనితివి. ఎద్దువలె ప్రవర్తించుచున్నావు. ఎవరిని కలియవచ్చునో ఎవరిని కలియరాదో ఎరుగకున్నావు. వృషభ ధర్మము నవలంబించి కోడలిని పొందగోరు చున్నావు. నీ నడువడి మంచిదికాదు. నీవు గ్రుడ్డివాడవు. వృద్దుడవు. నిన్ను మేము పోషించుచు కాపాడవలసిన మాట నిజమే. ఐనను నీ ప్రవర్తనము మంచిదికాదు. కావున నిన్ను విడుచుచున్నాము. ఇది నీ . ఈ కర్మమునకు ఫలితము; పొమ్ము." అని పలికి ఆమె అతనిని కొయ్య పెట్టెలో ఉంచి కట్టివేసి గంగా జలములో విడిచెను.
బలిభార్యాయాం దీర్ఘతమస స్సంతానోత్పత్తికి.
దీర్ఘతముడట్లు గంగా ప్రవాహమున కొట్టుకొనిపోవుచుండెను. ఆ. సమీపమునకు వచ్చియుండిన విరోచన పుత్రుడు ధర్మాత్ముడుగు బలి అది చూచి అతనిని తీసికొనెను. అతడతనిని భక్ష్య భోజ్యములతో తృప్తినందించుచు తన అంతఃపురమునందు దాచెను. దీర్ఘతముడు ప్రీతుడై బలిని వరము కోరుకొమ్మనెను. ఆ అసురోత్తముడు పుత్రులు కావలెనని కోరెను. పూజ్యమునీ! నావంశము (మానవులలో) కొనసాగునట్లు నాభార్యయందు ధర్మార్థ త త్వజ్ఞులగు కుమారు లను మీరు జన్మింపజేయవలయునని వేడెను. ఆ దేవర్షి సరేయనెను. తన భార్యలలో సుదేష్ణ యనునా మెను మునికడకు పొమ్మ నేను. ఆరాణి అతడు అంధుడును వృద్దుడును అనీ ఎరిగి ఆతనికడకు పోవక తన దాది కూతురగు శూద్రస్త్రీని పం పెను. చిత్త నిగ్రహముకల ధర్మాత్ముడు ఆ దీర్ఘతముడు ఆమెయందు క షీ వాన్ మొదలగు శూద్రులను జనింపజేసెను. వారందరును జాతిచే శూద్రులు. ఐనను వారందరును అధ్యయనము చేసినవారు. ఋషిత్వము నందినవారు. ఈశ్వరత్వము కలవారు. బ్రహ్మ వాదులు (వేద వేదాంగ వేదాంత తత్త్వము , నెరిగినవారు.) (శారీరకముగను. చిత్తమునను). శుద్దులు. ధర్మమును సాక్షాత్కరించుకొనినవారు. శుచియగు బుద్ధికలవారు. ఇట్టి వీరిని చూచి బలి ‘వీరు నా కుమారులే అగుదురా?” అని దీర్ఘతము నడుగగా ‘కాదు. నా కుమారులు.’ అని అతడనెను. ‘వీరు నావలన శూద్రయోనియందు జనించినారు. నీ భార్యయందు కలిగినవారు కారు.’ అని జరిగినదంతయు రాజునకు ముని చెప్పెను.
తరువాత బలి మరల ఆఋషి సత్తముని అనుగ్రహింపజేసికొని తన భార్యను చీవాట్లు వేసెను. ఆమెను అలంకరింపజేసి ఋషికి అప్పగించేను. నీవు నా శరీరమునందంతటను పెరుగు ఉప్పు ఇప్పతేనె పూసి అసహ్యపడక శరీరమంతయు నాకవలయును. అపుడు నీకు మనస్సునకు ఇష్టులగు కుమారులు కలుగుదురు. అని ముని సుదేష్ణతో పలికెను. ఆమె అంతయు ఆట్టే చేసెను. కాని అపానప్రదేశమును నాకక విడిచెను. ఇందువలన నీకు. జ్యేష్టుడు అపానము, లేని కుమారుడు కలుగునని మునియనేను. “మహాభాగా! నిన్ను వేడుచున్నాను. నాకట్టి కుమారు నీయవలదు. నాయథాశక్తి నీమన సృప్తి కలిగించితిని. అనుగ్రహించుము.” అని రాణి వేడగా నీవు మంచిదానవే. కాని ఈ అపచారము వలన ఇది ఇట్లే జరుగును. అపానము లేనివాడయినను ఆ కలిగెడి, పుత్తుడు యోగ్యుడే అగును.” అని ముని , ఆమె కుక్షిని తన చేతితో స్పృశించి మరల ఇట్లు పలికెను: “శుచియగు చిరునవ్వు కలదానా! నీవు మొదట నా ఆంగమంచలి పెరుగు తింటివి. కావున నీ గర్భము నందు అది పూర్ణిమాతిథియందలి చంద్రుడువలె నిండి నది. దాని ఫలితముగా నీకు దేవ కుమారులవంటి కుమారు లై డుగురు జనింతురు. వారు తేజోవంతులు.పరాక్రమవంతులు యజ్ఞములు చేయు వారు ధార్మికులు నగుదురు.”
పిమ్మట సుదేష్ణ అంగము (గర్భము)నుండి జ్యేష్ఠుడుగా అంగుడును వంగ కలింగ పుండ్ర సుహ్ములను మరి నలుగురును ఐదుగురు బలి దైత్యునకు మానవియగు *భార్యకు క్షేత్రజులుగా కుమారులు కలిగిరి. దీర్ఘతముడు బలికి ఇచ్చిన వీరందరును అతని బ్రాహ్మణ్య ప్రభావమున లోకమున ప్రతిష్ఠ నార్జించి గొప్పవారయిరి. ఇట్లు బలి తాను దైత్యుడయ్యు మానవ స్త్రీయందు సంతానమును కనెను.
(*భర్త ఉండగా ఆతని అనుమతితో. కాని భర్త మరణించిన తరువాత నై నను అతని కుటుంబపు, పెద్దల అనుమతితో కాని అతని భార్యయందు పరునివలన జనించిన కుమారులు క్షేత్రజులు.)
తరువాత సురభి (కామధేనువు) దీర్ఘతమునితో ఇట్లు పలికెను: “ప్రభూ! నీవు గోధర్మమును ఉత్తమముగా భావించి దానిని ప్రమాణముగా తీసికొంటివి. నీవు మాయందు ప్రప త్తి పూర్వకమగు భక్తి చూపితివి. అందుచే నేను నీయందు ప్రీతి చెందితిని. నేను నీన్ను ఆఘ్రాణించి నీయందు బృహస్పతి శాపము చేతను అతని రేతఃసంసర్గ పాపము చేతను సంక్రమించిన దోషమును జరామృత్యువులను దీర్ఘమగు తమస్సును దృష్టియందలి దోషమును). తోలగింతును.” ఇట్లు పలికి సురభి దీర్ఘతముని ఆఘ్రాణించి ముక్కుతో పీల్చి వేసి అతని యందలి ఈ దోషములన్నియు లాగి వే నెను. దానితో అతడు ఆయుష్మంతుడు వపుష్మంతుడు (సుందర శరీరుడు) చక్షుష్మంతుడు - (చూడగలవాడు) అయ్యెను. గోవుచే ఆతని 'తమస్సు' హరింపబడినందున అతనికి "గో-తముడు” అను ప్రసిద్ది వచ్చెను.
తరువాత ‘కక్షీవాన్' తన తండ్రి (దీర్ఘతముని)తో కూడ గిరివ్రజమునకు పోయి అచ్చటనేయుండి చిరకాలము తపము నొనరించెను. అనంతరము అతిదీర్ఘకాలమునకు ఆతడు తపస్సుచే భావితుడై (సంస్కారమునంది). శూద్ర (సంస్కారముకల) శరీరమును విడిచి బ్రాహ్మణ్యమును పొందెను. అంతట తండ్రి దీర్ఘతము డతనితో “నాయనా! నేను నీచే పుత్రవంతుడనై తిని. నీవు సత్పుత్తడవు. ధర్మజ్ఞుడవు. కీర్తిమంతుడవు. నీచే నేను కృతార్థుడనయితిని, నీవు ఈనీవుగా (ఈ దేహము కలవాడుగా) ఉండియే దేహమును (దేహమందలి సంస్కారములను విడిచి బ్రహ్మయొక్క స్థానమును (బ్రాహ్మణ స్థానమును బ్రాహ్మణత్వమును) పొందితివి.” అనెను.
కక్షీవాన్ ఇట్లు బ్రాహ్మణత్వమును పొందిన తరువాత అతనికి వేయిమంది కుమారులు కలిగిరి. వారికి కూశ్మాండులు గౌతములు అని నామము.
ఇట్లు మీకు దీర్ఘతమునికిని విరోచన సుతుడగు బలికిని సమాగమము కలుగుటయు ఇరువురి సంతానమును తెలిపితిని.
అనంతరము బలి అకల్మషులగు అంగుడు మొదలగు ఐదుమంది కుమారులను అభివాదము చేసి కృతార్ధుడయ్యెను. ఆ ధర్మాత్ముడు తాను యోగమాయచే కప్పువడి ఏ భూతములకును కనబడనివాడయి రానున్న కాలమును ఎదురు చూచుచు ఉండెను.
వీరిలో అంగునకు దధివాహనుడు అతనికి దధిరథుడు అతనికి విద్వాంసుడగు ధర్మరథుడు కుమారులయిరి. ఇతడు చాల పూజ్యుడు. విష్ణుపదమను పర్వతమున ఇతడు దేవరాజగు ఇంద్రునితో కూడి సోమపానము చేసెను. అతనికి తండ్రితో సముడగు చిత్రరథుడు అతనికి చైత్రరథుడు అతనికి రోమపాదుడని ప్రసిద్ధుడును శాంతకు తండ్రియు అగు దశరథుడు (ఇతడు శ్రీరాముని తండ్రియగు దశరథునకు సనాము డేమో!) అతనికి ఋశ్యశృంగుని అనుగ్రహమున వంశ వర్ధనుడగు చతురంగుడు అతనికి పృథులాముడు అతనికి పూర్వపు మాలినీ నగరమును చంపానగరి యని ప్రసిద్ధికి తెచ్చిన చంపుడు అతనికి. పూర్ణ భద్రముని అనుగ్రహమున హర్యంగుడు విభాండకుని దయవలన వారణుడు. కుమారు లయిరి. ఈ సారణుడు శత్రువులను నిరోధించగల వీరుడు. మంత్రబలము తో ఉత్తమ వాహనమును (ఉచ్చైశ్రవమును) భూమికి దిగి వచ్చునట్లు చేసేను. హర్యంగునకు-భద్రరథుడు అతనికి బృహత్కర్మ - ఆతనికి బృహద్భానుడు అతనికి బృహన్మనసుడు అతనికి జయద్రథుడు అతనికి జనమేజయుడు అతనికి అంగుడు. అతనికి కర్ణుడు - (కుంతికి కానీన సుతుడు) అతనికి వృష సేనుడు. అతనికి వృష సేని, కుమారులయిరి. - ఇది అంగ వంశీయులగు - రాజుల పరంపర. ఇక పూరు వంశమును వివరింతును.
అనగా ఋషులు సూతు నిట్లడిగిరి: “కర్ణుడు సూతుని కుమారుడని విందుము. ఇతడు అంగుని కుమారు డేట్లయ్యెను? నీవు ఇవి బాగుగ ఎరిగినవాడవు. చెప్పగలవాడవు. కావున నీనుండి వినగోరుచున్నాము.”
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: లోగడ చెప్పిన బృహద్భానునకు బృహన్మనసుడు కుమారుడంటినీక దా! అతనికి చైద్యుని కూతురు యశోదాదేవి.సత్య-అనువారు ఇద్దరు భార్యలు. యశోదాదేవికి జయద్రథుడును సత్యకు విజయుడును కుమారులయిరి. విజయునకు బృహత్ అనునతడు అతనికి బృహద్రథుడు అతనికి సత్యకర్మన్ అతనికి అతి(ధి)రథ సూతుడు కుమారులయిరి. ఈతడు కర్ణుని తన కుమారునిగా గ్రహించెను. అందుచే కర్ణునకు సూతపుత్తడను ప్రసిద్ది వచ్చెను.
మీరు కర్ణుని విషయమున ప్రశ్నించినదంతయు మీకు ఇట్లు తెలిపితిని.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున తుర్వసుడు మొదలగు వారి వంశముల వృత్తాంతములనెడు నలువది ఎనిమిదవ అధ్యాయము.
