మత్స్య మహా పురాణము
134 - మయుడు దేవతల చేతిలో ఓడి త్రిపుర దుర్గమున ప్రవేశించుట
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగేను: మాయావియు దానవేశ్వరుడునగు మయుడు మహాయుద్దము చేసిన అనంతరము మేఘము నీలాకాశ మున ప్రవేశించినట్లు త్రిపురమున శీఘ్రముగా ప్రవేశించెను. అతడు దానవులనడుమ కూర్చుండి దీర్ఘముగ వేడి ఊర్పులు వదలుచు రెండవ ప్రళయకాల యముడువలె చింతింపసాగెను. సురల కగ్రగామి యగు ఇంద్రుడును యుద్ధమున ఎవని ఎదుట నిలువజాలక గడగడ లాడుచుండెడివాడో ఆట్టి మహా యశ శ్శాలియగు విద్యున్మాలియు మరణించెనుగదా! దేనికి సాటియగు మరియొక దుర్గము ఏదియు లేదో-ఆట్టిదానికి గూడ ఇదుగో! ఇపుడు నాశము ప్రాప్తించినట్లు కనబడుచున్నది; ఎక్కడను గెలుపు ఓటములకు దుర్గము హేతువుకాదు. దుర్గము. కాని మరియేదీ కాని ప్రతియొక టియు కాలమునకు వశమయి నడుచుచుండును. అందువలన కాలుడు క్రుద్దుడైనను కాలము రానపుడు ఇప్పుడే ప్రాణాంతము ఎట్లు జరుగును? మూడు లోకముల యందును ఇది నిర్బయమయినదనీ, చెప్పదగినదేదేది కలదో.అది ఎల్ల మొట్ట మొదలే కాలమునకు వశ గమయి యుండెను. అని బ్రహ్మ చెప్పిన వచనము. సంధారణము చేయుటకు సాధ్యము కానిదియు అమిత స్వరూపము కలదియు అగు కాలము విషయమున మహేశ్వరుడు దేవుడునగు శివుడు ఒక్కడు తప్ప మరి ఎవ్వడు తన సాధనముల అమరిక తో తన శ క్తి చూపగలడు? ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు - ఈ ఎవ్వరిని నేను లెక్క పెట్టను. దేవతలకు ప్రభువగు ఈ పర మేశ్వరుడు మాత్రమే యుద్ధమున ఎక్కడను దుర్జయుడు. ఐశ్వర్యమునకు ఫలము, ఏదో -ప్రభుత్వమునకు ఫలము ఏదో దానిని నా విధానముననుసరించినంత లో నేను చూ పెదను. దైత్యులకందరకును సంజీవనౌషధమువలే జీవనాధారమగు అమృత జలపూర్ణమగు వాపిని (దిగుడు బావిని) సృష్టింతును.
మయకృతమాయామృతవాపీనిర్మానం
మాయావులలో మొనగాడగు మయుడు తన మనస్సులో ఇట్లాలోచించి బ్రహ్మదేవుడు రంభను సృజించినట్లు తన మాయతో వాపిని సృష్టించెను. దాని పొడవు రెండు యోజనములు; వెడల్పు ఒక యోజనము; ఆది ‘కథ’ యను కావ్య విశేషమువలె మాధుర్య రసముతో నిండిన అలలతో నిండియుండెను; చందనపు బంకవలే నుండి నదియు పుష్టి కలిగించునదియు అమృతమువలే రుచి కలు గుటతోపాటు కమ్మని వాసనలు వెదజల్లు ఉత్తమ జలముతో నిండి సద్గుణపూర్ణ యగు యువలివలె కనబడుచుండెను. నల్లని తెల్లని కలువపూలతోను పద్మములతోను కాదంబములనేడు హంసలతోను చుట్టుకొనబడి చంద్ర సూర్యులతో క్రమ్మ బడినట్లు ఆ వాపీ కనబడుచుండెను. తుమ్మెదలనేడు ఆభరణములతో అలంక రించబడియుండెను. కమ్మని ధ్వనులు చేయుచు మనోహరమగు బంగారు కాంతులు గల హంసలతో కూడి అది మన్మథ బాణములతో వ్యా ప్రయైన రమణీవలే కనవచ్చుచుండెను. మ హేశ్వరుడు గంగనువలే మయుడు ఆ వాహిని సృష్టించి విద్యున్మాలిని ఆదరముతో దానిలో పడ వేయించెను. దేవ శత్రువును మహాబలుడుసగు ఆ విద్యున్మాలిని దాని యందు ముంచగానే క టైలతో చక్కగా వృద్ధి చేయబడి ప్రజ్వలించుచు ప్రకాశించు అగ్ని వలే అతడు ప్రకాశించుచు లేచి నిలువబడెను. మయుని నమస్కరించెను. తార కాముడు విద్యున్మాలికి నమస్కరించెను. అంతట విద్యున్మాలి మయునితో ఇట్లు పలికేను: ప్రమథులు అనేడు జంబుకములు తను కొలుచుచుండగా రుద్రుని వెంటనుండు నంది ఎక్కడ? నేను బాణములతో అతని దేహమును పీడించి మోహపరచితిని. మనము ఇప్పుడయినను రుద్రుని అనుగ్రహమువలననే సమ ర్థులము అయ్యే దము. అప్పుడు శత్రువులను గెలిచెదము. లేక వారే మనలను చంపిరా.యమునకు ఆసనముగా అయ్యెదము. ఇట్లు పలికిన విద్యున్మాలి మాటలు విని మహాసురుడును మిగుల బలశాలియునగు మయుడు ఇట్లు పలికెను: విద్యున్మాలీ: మహాబాహూ! నాకు ఈ రాజ్యముకూడ ఇష్టముకాదు. మహాసురా! నీకొరకే నేను మరణించిన దైత్యులకును దానవులకును జీవన వర్ధనము కలిగించు ఈ అమృతమయియగు వాపిని నా మాయాబలముతో సృష్టించితిని. దైత్యుడా! నేను అదృష్టవంతుడను గనుక తనంతట తాను వెలికివచ్చి నిర్ధనునకు కనబడిన మహానిధివలె నాకు నీవు కనబడు చున్నావు. మయుడు తన మాయతో నిర్మించిన ఆ మాయామయమగు అమృతవాపీని చూచీ చూచి దైత్యపుంగవులు హర్షము చెంది ఇట్లు పలుక నారంభించిరి:
దానవులారా ఇపుడు నిర్భయులై ప్రమథులతో తలపడి యుద్ధము చేయుడు. యుద్దమున రాక్షసులు మరణించినను వారిని మయుడు నిర్మించిన 'వాపి' బ్రతికించగలదు. అని దైత్యులు పరస్పరము అన నారంభించిరి. అంతట దానవులు మోగించు భయంకర భేరి క్షోభిల్లు సముద్రమువలే మాటిమాటికి బిగ్గరగా మోగనారంభించెను. మేఘ ధ్వనులబోలు భేరీనాదమును విని యుద్ధము చేయు కుతూహలముతో త్రిపుర దానవులు పురమునుండియు. దేవతలు తమతమ సేనాని వేశములనుండియు బయటకు వచ్చిరి. తె పురదానవులు ఇనుముతోను వెండి తోను బంగారుతోను చేసి మణులతో అలంకరించబడిన గుండనీ హారములును ఉతటములగు మకుటములును ధరించియుండిరి. దృఢ విక్రములగు ఆదానవులు కోట్లకొలదిగా అయుధములు ధరించి ఎడతెగక జ్వలించుచు నాలుకలు కోయు అగ్నులవలె పొగలు గ్రక్కుచుండిరి. వారు నృత్యము చేయు నటుల వలేను గర్జించు మేఘములవలెను తొండము పైకెత్తిన ఏనుగుల వలను నిర్ణయములగు సింహములవలేను కనబడు చుండిరి. గంభీరములగు హ్రదములవలేను అధిక ముగ, తపించు సూర్యులవలేను యములవలెను దైత్యేంద్రులు తమ దైత్య మహా సేనను త్వర పెట్టుచుండిరి.
ప్రమథులును ఉత్సాహవంతులయి గరుడుడు ఎగిరిపడునట్లు ఎగిరిపడు పాదములతో తాము దానవులకు శత్రువులు కావున దానవులతో యుద్ధము చేయగోరి దానవుల మీదకు పరుగెత్తుచుండిరి. నందీశ్వరునితో కూడి ప్రమధు లును తార కాక్షునితో కూడి దానవులును దైత్యులును తమతమ బలముల పేరణతో సంగ్రామము చేయనారంభించిరి. చంద్రులవంటి తో మరములతోను అగ్ను లవంటి శూలములతోను దృఢముగా విడువబడిన శరములతోను వారు పరస్పరము కొట్టుకొనసాగిరి. ప్రయోగించబడు శరములును విసరిపడవేయబడు ఖడ్గములును అంతరిక్షమునుండి రాలిపడు ఉల్కల వలె కానవచ్చుచుండెను. శక్తుల దేబ్బలతో హృదయములు చీలగా నిర్ణయముగా తగిలి దెబ్బలతో పడి పోవుచున్న - ప్రమథులును దేవతలును నరక కూపములలో మునిగిపోవుచున్న వారువలే కనబడుచుండిరి. బంగారు కుండలములు అలంకారములుగా గలిగి కిరీటములును మకుటములును ధరించియున్న ప్రమథుల. దేవతల శిరస్సులు పర్వతశృంగముల వలే అంతరిక్షమునుండి క్రింద పడుచుండెను.
బాణములతో పట్టిసములతో ఖడ్గములతో గండ్ర గొడ్డండ్రతో నరుక బడిన ప్రమథుల భుజములు ఏనుగు తొండములవలె క్రింద పడుచుండెను. చక్కగా అలంకరించుకొని యుద్ధము చేయుచున్న ప్రమథులు కొందరు భయంకరముగా గర్జించుచుండిరి. ఇది అంతయు చూచుచు అంత రిక్షమున సిద్ధులు కొందరు అద్భుతమగు యుద్ధ సంగీ తమును సాధన చేయుచు ఆనందించుచుండిరి. (ఈ యుద్దమును వర్ణించుచు గేయములు రచించి పాడుచుండిరి.) రణభూమికి తిన్న గా అంతరిక్షమున నిలిచిన చారణుల నేడు దేవ జాతులవారు 'ప్రమథుడా నీవు దానవునికంటె బల వంతుడవుగా కానిపించుచున్నావు. దానవా నీవే ప్రమథునికంటె దర్పితుడవుగా భాసించుచున్నావు.' అని ఇట్లు యుద్ధములో పైచేయిగా నున్న వారిని పొగడుచుండిరి.
ప్రమథులు కొందరు దానవుల పరిఘల దెబ్బలు తిని నోట నెత్తురు క్ర కుచు స్వర్ణ ధాతువుల క్రక్కు కొండల వలె నుండిరి. ప్రమధులును దేవతలును చీల్చివేయగా వృక్షములతో పర్వత శిఖరములతో కొట్టగా దానవులు చచ్చు చుండిరి. అట్టివారిని మయుడు తన వారి చేత వాపియందు పడ వేయించుచుండెను. వారు మరల బ్రదికి ప్రకాశించు దేహములతో స్వర్గము నుండి వచ్చు దేవతలవలె వచ్చుచుండిరి: వారి ఆభరణములును వస్త్రములును దేవతలకువలే నుండుటచే పొగడలందుకొనుచుండిరి. అటు తిరిగి బ్రదికిన కొందరు దానవులు భుజములు చరచి సింహనాదము చేయగా భయపడి ప్రమథులును దేవతలును పారిపోవుచుండిరి. దానవులు కొందరు ప్రమధులను దేవతలను చూచి 'ఇంకను పారిపోక నిలిచెద రేల? మీరు మమ్ము చంపినను 'వాసి' మమ్ము మరల బ్రదికించును.' అనుచుండిరి. అది విని వజ్ర సమానుడగు శంకుకర్ణుడనునాతడు శివునికడకు పోలఎ ఇట్లనెను: దేవా! ఈ దానవులను మన ప్రమథులు చంపివేసినను నీటితో తడిపిన పైరులవలె లేచి భయంకరులై వచ్చుచున్నారు. ఈ త్రిపుర దుర్గమునందు అమృత రసముతో నిండిన ‘అమృతరసా' అను 'వాడి' (దిగుడు బావి) కలదట. చచ్చిన దానవులను దానియందు వేయగా వారందరు మరల బ్రదికి వచ్చు చున్నారు.
అంతలో దానవులు దారుణమగు కోపోద్రేకము చెందిరి. తారకొవుడు భయంకర నేత్రములతో తారకాక్షమను మేఘమువలే మహా క్రోధముతో మహాదేవుని రథము వైపునకు పరుగెత్తుకొని వచ్చేను. దేవదేవుని రథము వైపునకు దానవులుద్దతులయి పోవుట తెలిసి త్రిపుర దుర్గ వాసులు అధిక భయంకరముగా భేరీ శంఖధ్వనులు చేసిరి.
(*అన్యతనమాసాద్య.)
(*అభ్యద్రవ త్తదాదేవం బ్రహ్మాణం ప్రభుమీశ్వరమ్.)
(*రథచరణకరోఒప్యవాద యుద్దే వృషభవపుర్వృషభేన్హపత్రపూతః ।
దీతీతనయబలం విమథ్య సర్వం త్రిపురపురం ప్రవివేశ కేశవః సజల జలజరాజితాం సమస్తాం కుముదవరోత్పలపుల్లపజ్క జాడ్యామ్।
సుర గురు రపి తత్పపౌ జలాన్హా మఖిలమివార్ణవ (మగ్నిరివో) (మౌ)ర్వసమ్భవః॥)
ఆ సమయమున తారకాక్షునితో జరుగనున్న ఆయుద్దమునకై దేవతలును వెలుపలికి వచ్చి రంగమున నిలిచిరి. ఇది తెలిసి రుద్రుడును స్వయంభూబ్రహ్మయు కలత చెందిరి. ఆ దేవశ్రేష్ఠులిద్దరు నారోహించియున్న రథో తమము అనాథుడు వచ్చి తనా శ్రయించగా వానినేట్లు రక్షింతునయని దిగులు చెందు గుణవంతుడగు వీరుడువ లేను ధాతు క్షయ వ్యాధి గ్రస్తమయిన దేహమువలెను గ్రీష్మ నదీజలము వలెను తిరస్కరింపబడిన స్నేహమువలెను (తాను చూపిన స్నేహమును అవతలివారు తిరస్కరించినచోవలె) శిథిలము కాసాగెను. ఆరథము సామాన్యమయినది కాదు. త్రే లోక్యరూపమయినది. ఆట్టి శంకర రథమును (తై లోక్యమును) తాను శరీరమునందు ఉండి యేమ (ముఖ్య) ప్రాణత త్వరూపుడుగా ఆ బాణమునందున్న విష్ణువు పైకి లేవనే త్రేను. ఐనను ఆది నిలువబడుటలేదు. అందుచే పీతాంబరుడగు జనార్దనుడు వెంటనే శరమునుండియు ఎగిరి దుమికి మహావృషభ (ధర్మ రూపమును ధరించి పచ్చి మరెవ్వరికి ధరించుటకు (పడకుండ నిలిపి పట్టుటకు) సాధ్యముకాని ఆ రథమును తన కొమ్ములతో ఎత్తి పట్టి నిలిపెను. అది కేవల రథముకాదు. త్రైలోక్యరూపము అయినది. దేవో త్తముడగు ఆ విష్ణువు దానినట్లు నిలిపి పట్టుట ఒక కులమందలి మహాపురుషుడు తన కులమును ఉన్నతికి తెచ్చుటవలే కనబడుచుండెను.
దై త్యేంద్రుడగు తారకాక్షుడు టెక్కలుగల గిరివలే ఎగిగివచ్చి పరిఘతో అశ్వములను సారథిని చావమో దేను. బ్రహ్మ యు తారకాక్షుని చేతి దెబ్బతిని ప్రతోదము (కళా కోరడా)ను కూబరమున పడ వేసి మాటిమాటికి శ్వాస వదలుచు ఉష్ణమును కక్కుచు కూలబడెను. అది చూచి దైత్య దానవులు మాటిమాటికిని భయంకరమగు నాదము చేయసాగిరి.
అంతట విష్ణువు పృషభరూపమున తిపుర దుర్గమును ప్రవేశించెను. అచ్చట ఆదేవుడు ' అమృతరస'యను ‘వాసి'ని చూ చెను. దానియందు సాధారణ జాతి పద్మములును నూరు దళముల పద్మములు నుండేను. కర్పూరపు పొడి వాసన దానినుండి వచ్చుచుండెను. వృషరూపధారియగు హరి దానవులను సమ్మోహపరచి వారికి తెలియకుండ ఆ వాపీ యందలి నీటిని)ని తాగితే నెను. పీతాంబరుడగు జనార్దనుడు ఆసు రేంద్రుల ఆవాసిని తావి ఆ మహా బాహుడు గర్జన సేయుచు మరల శరమును ప్రవేశించెను. తరువాత అసురులను భయంకరులగు వమథులు బాణపు దెబ్బలతో బాధించిరి. ఆ శరప్రహారములతో రక్తనదులు అధికమయ్యెను. ఇట్లు వారు సింహములు మృగములను తరిమినట్లు దానవులను రణమునుండి పరాజ్ముఖులనుగా చేసి తరిమిరి. తారకాకుడును విద్యున్మాలియు మయుడును పారిపోయిరి. శరీరమునుండి ప్రాణవాయువులు మొదలగు జీవా శిత ధర్మములు వెడలిపోయినట్లు వారెల్లరును రణ రంగమునుండి త్రిపుర దుర్గమునకు వెడలిపోయిరి.
మహేంద్ర నందీశ్వర షణ్ముఖులును చంద్రుడును దిక్పాలురును ప్రమథ గణాధిపతులును అత్యధిక గర్వ శాలు రై యుద్ధమున మనము జయించెదమను విశ్వాసముతో దుర్మదులయి గర్జించిరి; బిగ్గరగా నవ్విరి.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయాదులు పరాజితులయి త్రిపుర మున ప్రవేశించుటయను నూట ముప్పది నాలుగవ అధ్యాయము.
