మత్స్య మహా పురాణము

Table of Contents

18 - ద్విజాదులకు ఆ శౌచాదిక ము-ఏకోద్దిష్టాది శ్రాద్ధవిధి 

సూతుడు మహరులకుఇంకను ఈ విధముగా చెప్ప నారంభించెను: మత్స్యరూపుడగు నారాయణుడు మనువు నకు చెప్పినట్లు తండ్రి మరణించినపుడు పుత్తులు చేయవలసిన ఏకోద్దిష్ట శ్రాద్ధ విధానమును ఆశౌచము పాటించవలసిన నిర్ణయమును తెలిపేదను.

మృతాశౌచము బ్రాహ్మణులకు పది దినములు క్షత్రియులకు పం డేండు దినములు వేశ్యులకు పదునై దు దీన ములు శూద్రులకు ముప్పది దినములు ప్రాటించవలసియుండును. పదునొకండవ-పదుమూడవ-పదునారవముప్పదియొక టవ-దినములందు స్నానము చేసిన వీరి కందరకు కుద్ధి యగును.) చూడాకర్మ జరుగని (మూడేండ్లు నిండని) శిశువు మరణించినచో ఒక దినము మూడేండ్లు నిండినది మొదలు ద్విజులకు ఉపనయనమును ఇతరులకు వివాహమును కానంత వరకు మూడు దినములు మృతాశౌచము.

జాతాశౌచము (పురుడు) కూడ ఆయా వర్ణముల వారికి పైన చెప్పినట్లు పది-పండ్రెండు-పదునై దు.ముప్పది దినములే అని తెలియవలెను.

తండ్రి మొదలగువారు మరణించినపుడు దహనము జరిపి పిమ్మట అస్థి సంచయనము దహనము చేయగా ఏర్పడిన భస్మమునుండి ఎముకలను ప్రోగు చేయుట) జరిగిన తరువాతనే అంగస్పర్శము మరణించిన వాని పుత్రుడు మొదలగు శ్రాద్ధకర్తలను అతని సన్నిహిత జ్ఞాతులై నను తాకుట) జరుగవలెనని శాస్త్రము విధించుచున్నది.

తరువాత పండ్రెండు దినముల వరకు పేతమునకు పిండదానము చేయుచుండవలెను. ఏలయన పర లోకము నకు పోవు పేతమునకు ఆ పిండములు దారి పై తేముగా అయి చాల ప్రీతిని కలిగించును. ఈ పిండదానముచే సంతృప్తి చెందుచు పేతము పం డేండు దినములు ముగియుసరికి పేతములు చేరవలసిన లోకమునకు తీసికొనిపోబడును. (చేర్చ బడును.) మరణించిన ప్రాణి (పేతము) ఈ పండ్రెండు దినములును తాను మరణించక మునుపు తనవిగా నుండిన ఇల్లు పొలము పుత్తులు భార్య మొదలగునవి చూచుచునే ఉండును. వీరు తన కొరకై దారి బత్తెముగా ఏమయిన సుఖ సాధనమును సమకూర్తురా లేదా యను చింతతో ఉండును. అందుచేతనే పది దినములవరకు శూన్యమునందు వ్రేలాడు నట్లుగా పేతము నుద్దేశించి నీటితో (పాలతో నిండిన పాత్రము ఉంచెదరు. దీనివలన ఆ పేతమునకు తాపోపశాంతియు మార్గాయాసశాంతియు కలుగును.

పదునొకండవనాడు బ్రాహ్మణులు పదునొకండు మంది బ్రాహ్మణులను భోక్తలుగా ఉంచి శ్రాద్ధము జరుపవలేను. ఇట్లే క్షత్రియులును వైశ్యులును శూద్రులును వారి వారి ఆశౌచము ముగిసిననాడు బేసి సంఖ్యలో భోక్తలను భుజింపజేయ వలెను. (శూద్రులు ఆహార పదార్థ దానము మాత్రమే చేయవలెను.)

ఆశౌచము ముగిసిన రెండవనాడు (పదునొకండవ-పదుమూడవ.పదు నారవ. ముప్పది యొక టవ దినములలో పేతము నుద్దేశించి ఏకోద్దిష్టమును జరుపవలెను. (ఏక ఉద్దిష్ట = పేతమును మాత్రమే ఉద్దేశించి-వారి పై వారినిగానీ వి శ్వే దేవులను గాని ఉద్దేశించక -చేయు శ్రాద్దము అని అర్థము. దీనియందు ఆవాహనము అగ్నౌ కరణము యథావిధానముగా ఉండును. విశ్వేదేవులకు అర్చన యుండదు. ఒకే పవిత్రము ధరించుట ఒకే అర్ఘ్యము వదలుట ఒకే పిండము వేయుట దీనియందు విధింపబడును. దీనిలో ' ఇదం ఉపతిష్టలు.' ఇది ఈ పేతమునకే సన్ని హితమై ఉvడుగాక !" అని మాత్రమే చెప్పవలెను. (స్వధా అని చెప్పకూడదు. పిండదానము తరువాత తిలోదక ము ఈయవలెను. వికిరపిండము ఇచ్చు సమ యమున ‘స్వదితం' 'చక్కగా తినబడినది' అనియు -బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పునపుడు 'అభిరమ్యతామ్' “సుఖము ఆనందమును పొందుగాక !' అనియు చెప్పవలెను. ఇవి కాక మిగిలిన ప్రక్రియలన్ని యు లోగడ ఆయా శ్రాద్ధముల విషయ మున చెప్పినట్లే ఈ ఏకోద్దిష్టమునను చేయవలెను.

ఈ విధముగా ఏకోద్దిష్టమును ప్రతి మాసమునందును జరుపుచుండవలెను. (వా సవమున సపిండికరణము సంవ త్సరాంతమున జరుగవలేను. అంతవరకును మరణించిన జీవునకు ' పేతము' అను వ్యవహార మే యుండును. కాని పితృ దేవత్వము రాదు. అంతవరకును చేయు పితృకార్యము అతనిని ఒక్కనికే ఉద్దేశించి చేయుదురు. కావున ఇది ఏకోదిష్టము.)

ఆశౌచము తీరిన తరువాత రెండవ దిన మున (విప్రులు 11వ-క్షత్రియులు 18వ.వైశ్యులు 16వ-శూద్రులు 31వ దినములందు ] సంప్రదాయము నెరిగి శ్రాద్ధకర్త పేత నుద్దేశించి అతని సుఖమునకై శయ్యను బంగారు ప్రతిమను ఫలములను వస్త్రములను బ్రాహ్మణ దంపతులకు-వారిని నానాభరణ భూషణములతో ఆలంకరించి పూజించి-దానము ఈయవలెను. వృషోత్సర్జనము -ఆబోతును విడుచుట-చేయవలెను. కపిలగోవును దాన మీయవలెను. భక్ష్యభోజ్యములను ఉదకుంభమును దానము చేయవలెను. ఇట్లు సంవత్సరము నిండువరకు ఆయా దానములును శ్రాద్ధములును తిలోదక పూర్వకముగా ఆయా సమయములందు జరుపుచుండవలయును. సంవత్సరము నిండిన తరువాత సపిండీకరణము జరుప వలెను. సపిండీకరణము జరిగిన తరువాతనే మరణించిన వ్యక్తికి పేతత్వము తీరి పార్వణమునకు (పార్వణశ్రాద్ధము నందు చేయు ఆయా పిండదానాదికమును గ్రహించుటకు అర్హుడగును. తల్లిదండ్రులు మరణించినపుడు పదునొకండవ దినమున కుమారుడు వారి సుఖము నుద్దేశించి వృషోత్సర్గము చేయవలెను. లేదా ఏదై న పుణ్య సమయమునందై నను ఇది చేయవచ్చును.

కుమారుడు ఇది తల్లి విషయములో ఆమె మరణించిన తరువాత పదునొకండవ దినమునగాని మరేదైన పుణ్యదిన మున గాని చేయవలెను. తండ్రి విషయమున అతని పుణ్యమున కై అతడు జీవించియుండగా కూడ వృషోత్సర్గము చేయ వచ్చును. ఇవి ఈ విధముగా జరుపుట వలన గృహస్థుడు మరణించిన వారి కుమారులు మొదలగువారు వృద్ధిపూర్వక ములగు కృత్యములను (నాందిశ్రాద్దమును జరిపి చేయవలసిన వివాహాది శుష కార్యములను జరుపుటకు యోగ్యుడగును.  సపిండీకరణ శ్రాద్ధమున మొదట విశ్వేదేవులకును తరువాత పితరులకును ఆవాహనము ఆర్చనము భోజనము మొదలగునవి జరుపవలేను. అందునను పితరులు అనగా అప్పటికి పితృత్వమును పొందియున్న వారిని మాత్రమే గ్రహించ వలేను. పేతను వేరుగా పేర్కొనవలెను. పితృస్థానమునందు నాలుగు పాత్రలను (అర్ఘ్యమునకు ఉంచి గంధములు తిలలు ఉదకము మొదలగువానితో వేరు వేరుగా అప్పటికీ పితృత్వము పొందియున్న మూడు తరముల వారికి మూడు పేతకు ఒకటి. మొ త్త్రము నాలుగు నింపవలెను. తరువాత పేతపాత్రయందలి గంధతిలలతో కూడిన ఉదకమును మూడు భాగములుగా మిగిలిన మూడు పాత్రలయందు కలిపి వేయవలెను. అదే విధముగా పితరులకు ముగ్గురకు మూడును. పేతకు ఒక టియు మొత్త్రము నాలుగు పిండములను చేయవలెను. 'యే సమానా' అని ఆరంభమగు రెండు ఋక్కులతో నాలుగవ పిండమును మూడుగా విభజించవలెను. ఆ ఖండములను పితరులకు ఉద్దేశించిన పిండములతో కలుపవలెను. ఇంతేకాని నాలుగవ పిండమునకు అంతకంటే వేరు వినియోగము లేదు. ఈ సపిండికరణము జరుపుటతో ఈ మరణించిన జీవుడు పేతత్వము వదలి పితృత్వమును పొందును. అన్ని విధముల పుష్టిని (శుభమును పొందును,

శ్రీమత్స్యమహాపురాణము. అగ్ని ష్వాత్రాది పితృదేవతల దగ్గర ఉత్త్రమము అమృతము (శాశ్వతము ఆగు స్థానమును పొందును. ఆందుచేతనే సపిండీకరణము జరిగిన తరువాత ఈ మరణించిన వ్యక్తికి వర్షత్రయములోని వాడుగానే కాని ఆతనికి వేరుగా పారలౌకిక పితృకార్యములు జరుపబడవు. ఏలయన అతని పిండము తన పై పెద్దల పిండములోనికి చేరినది. కనుక ఇతడును వారిలో ఒకడుగా ఐనాడు.

ఆది మొదలుకొని సంక్రాంతి చంద్రగ్రహణము మొదలగు విశిష్ట పర్వములందును అతడు మరణించిన దినమున ప్రతి సంవత్సరమును పిండత్రయముతో శ్రాద్ధము జరుపవలెను. మరణించిన పెద్దలకు ఇదే విధముగ మ తదినమునను ఆశౌచదినములందును ఏకోద్దిష్ట శ్రాద్దమునే పేత నుద్దేశించి చేయవలెను. కాని అంతకుమించి అతనికి పితృత్వమును భావనచేసి పార్వణ శ్రాద్దము మొదలగునవి చేయరాదు. అట్లు చేసినవాడు తల్లిదండ్రులను సోదరులను చంపినందువలన కలుగు పాపమును పొందును. పేతలుగా నున్న వారు తనకు పితరులతో (గాని ఇతరులతోగాని సంపర్కము కలిగినచో కల వరము చెందుదురు. కనుక వారికి ఏకోద్దిషమునే వారిని ఒక్కరిని మాత్రమే ఉద్దేశించి చేయు శారిద్దమునే) జరుపవల యును. కాని ఇతరులతో కలిపి జరుపరాదు. మృతదినములందు పార్వణ శాద్దమును బరిపిన మానవుడు కిందికి కిందికి పతితుడగును. కనుక సంవత్సరము నిండు వరకు ఏకోదిష్టమునే జరుపవలయును. ( ఇచట మూలమున ‘పతి సంవత్సరం' అని యున్నది. దీనికి సంవత్సరే సంవత్సరే-=పతి సంవత్సరం' అని వీప్సార్థమునకాక ‘సంవత్సరే ప్రతి సంవత్సరం' అని స షమ్యర్థమున మాత్రమే అవ్యయీ భావమును చెప్పవలెను. లేనిచో సంప్రదాయవిరుద్ధమగును, )

సంవత్సరము నిండువరకు మరణించిన వారి ( పేతల) నుద్దేశించి ఉదకుంభమును ఆన్న మును దానము చేయు వారికి అశ్వమేధయాగము చేసినచో కలుగునంత ఫలము కలుగును.

శాస్త్ర విధానానుసారము కర్మములను ఆచరించుట ఎరిగిన శాద్దకర్త అన్న శాద్ధమును కాక ఆమశాద్ధమును జరుపునప్పుడు అగ్నౌ కరణము కాని పిండదానముగాని ఆమ పదార్థములతోనే చేయవలెను కాని పక్వదవ్యములతో చేయ రాదు. పేతకు తనకు పై వారితో సపిండీకరణము జరుపగానే ఆతడును పితృవర్గతిత యములో ఒక డగు స్థితిని పొందును. అప్పటినుండి అతడు పేతత్వ బంధనమునుండి ముక్తి పొందును.

ఇట్లు ముకుడే నవాడు కూడ తన వంశమువారిలో తన కుమారుడు కాక మిగిలిన వారినుండి లేపమును (పిండ ములు పెట్టినప్పుడు మిగిలిన అంటును ఆహారముగా పొందదగినవాడు ఆగును. ఈ లేపము కుశ మార్జన పూర్వకముగా ఆందును.

దీనికి కారణము ఏమన మూడు తరములు దాటి నాలుగవ తర మునుండి పై వారు లేపభాక్కులు. పితృపితా మహపంపితామహులు పిండ భాగులు. ఏడు తరములవరకు ఎవరై నను తమ పూర్వులకు పిండములు వేయవచ్చును. ఏల

యన సపిండత్వము ఏడు తరములవరకు నిలుచును.

ఈ పై వాక్యములకు చాల వివరణము కావలెను. ఎట్లన రామశర్మ ఆనువాడు తన తండ్రికి ఆబ్దికము జరుపు చున్నాడు. ఇతనికి పితృపితామహ ప్రపితామహులు పిండ భాగులు. ప్రపితామహుని తండ్రియు పైవరును తన వంశము లోనే వీరి సరితరమునకు చెందిన వారును ఈ రామశర్మ చేయు శ్రాద్ధమున - లేపభాక్కులు. కాని ఈ లేపథాగులు ఈ రామ శర్మకు పైతరము వారు కొందరు జీవించియుండి వారు తమ తండ్రికి జరుపు శ్రాద్దమున పిండ బ్లాగులుగా ఉండవచ్చును. వంశ మూల పురుషునికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులుండినచో వారిలో జ్యేష్టుని మనుమలును కనిష్టుని కుమారులును ఒక వయస్సు వారు అగుట సంభవించును. ఇట్లే తర ములు గడచిన కొలది. ఒక వ్య- క్రియే ఒకరు జరుపు శ్రాద్ధమున పిండ భాగి అగుటయు మరియొకరు శ్రాద్ధమున లేపభాగి అగుటయు జరుగును. అట్లే ఒక మృతునికి కుమారులుగాని న్నీ హిత జ్ఞాతులు కానీ లేనపుడు అతని మూల పురుషుని నుండి ఏడు తరములకులోగా పై చెప్పిన పద్దతిలో అగువారు వరైనను ఇతనికి కర్మలు జరిపి పేతత్వము నుండి ముక్తి కలిగించవచ్చును.)

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున ఏకోద్దిష్ట శ్రాద్ధాది విధానము అను పదునెనిమిదవ అధ్యాయము.