మత్స్య మహా పురాణము
136 - తారకాక్షవధము
(*ఆహుశ్చాభయ మాభై షీః క్షయోస్య నిభృతేహ్యసి.)
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఆ అసురులను చంపుటకై శివుని ఆదేశమున అమరేశ్వరుడగు ఇంద్రుడును లోకపాలురును ప్రమథ గణాధిపతులును బయలుదేరి వెళ్ళిరి. ఈశ్వరాజ్ఞానుసారముగా వారందరును ఆకాశమునకు ఎగిరి అచట సంచరించుచు యెక్కలుగల పర్వతముల వలె ప్రకాశించుచుండిరి. శరీరమును నశింపజేయ, బోవుచున్న వ్యాధులవలె త్రిపుర దుర్గమును నశింపజేయదలచిపోవుచు వారు శంఖములను పటహము (తప్పెట)లను మృదంగములను పణవములను మోగించసాగిరి. ఇట్లు వాద్యములు మోగించుచు దుర్గమున కనబడిన ఆ దేవ సేనను చూచి త్రిపుర వాసులు బలశాలురగు మయాది మహాసురులతో హరుడే దుర్గ మునకు వచ్చెనని తోచుచున్నదని చెప్పిరి. దానవులు తామెంత భీమ విక్రములయ్యును దేవతల వాద్య ధ్వనులను విని ప్రళయ కాలమునందలి మహా సాగరములవలే కలవరమందసాగిరి. పోరును సోనో వాద్యములను అనేక విధములయిన పోటీని మోగింపసాగిరి. ఇరుపక్షముల వారును తమతమ వాద్యములను మోయించుటతోపాటు తమతమ వీర్యములను ప్రశంసించుకోనుచు ఒకరికి మరియొకరు శస్త్రాస్త్ర ప్రయోగములతో ఆపకారములు చేసి కొనసాగిరి. దేవదానవులు వీరిని పోరును వారిని వీరును చంపుకొనుచుండిరి. సమతలమయి ప్రకాశించుచు నిరాలంబమగు ఆకాశమునందును వారి పరస్పర ప్రహారముల ధ్వనులతో పరస్పర దేహావయవ. దేహ ఖండనములతో సాటిలేని యుద్ధము సాగుచుండెను. ఇరుపక్ష ములవారును యుద్ధ విజృంభణావేశ వశమున మిగుల వేడిమితో వెలుగు సూర్యులవలె ప్రజ్వరిల్లు అగ్నులవలె బుసకొట్టు నాగములవలె ఆకాశమున భ్రమించు పక్షులవలె విజృంభించు వ్యాఘములవలే ఉరిమెడి మేఘములవలే కంపిల్లు గిరీంద్రములవలే క్షణక్షణమును వృద్ధినందు చున్న తరంగ శ్రేణులతో కూడి క్షోభిల్లు సాగరములవలె మహాబల (దార్థ్య) సంపన్న ములగు వజములవలే నిశ్చలు లగుచు మహాశూరులగు ప్రమథులను మహాబలులగు దానవులును నిశ్చలులయి యుద్ధము చేయసాగిరి. గాఢముగా వారాక రించుచుండిన ధనువుల టంకారములు ప్రళయ కాలానుసారి మేఘములు ప్రళయ వాయు పేరితములగుచు చేయు దారుణ రవములను పోలియుండెను. ఓ వీడు నన్ను శరణు జొచ్చినాడు.' 'నా పై నీవు కోపించువాడవా?’ 'ఇదిగో! చచ్చితివిరా! 'స్థిరముగా నిలువుము.''సన్ను కొట్టగలిగినచో శీఘ్రముగా కొట్టుము’ ‘రమ్ము; నీ పౌరుషమును చూపుము.' 'పట్టుకోనుము.' 'నరకుము’ ‘చీల్చుము.’ ‘తినుము.' చంపుము.' 'బ్రద్దలు చేయుము.' ఇట్లు పరస్పరము బిగ్గరగా అనుకొనుచు పోరుచు యమలోకమునకు పోవుచుండిరి.
కొందరు ఖడ్గములతో ముక్కలయిరి. మరికొందరు గండ్ర గోడండ్రతో తెగిరి. కొందరు ముద్దరములతో ఖండితులయిరి. మరికొందరు భుజ ప్రహారములతోనే నలిగిచచ్చిరి. కొందరు పట్టసములతో నొచ్చిరి. కొందరు శూలములతో చీలికలయిరి. దానవులు శరములనేడు పూల తో ప్రకాశించుచు బోణములు గుచ్చు కొనిన కొండలవలే నయి భయంకరములగు నక్రములతో తిమింగిలములతో నిండిన సముద్ర జలమున పడుచుండిరి. బాణముల దెబ్బలుతిని ప్రాణములుపోయి పడుచుండిన రాక్షసులతో సముద్రమునుండి సజల మేఘముల ఉరుములవంటి ధ్వనులు ఉప్పతిల్లెను. నక్రములు (ఒక విధమగు సముద్ర జంతువులు)ను తిమింగిలములును ఆ ధ్వనులకు భయపడియు ఆ రాక్షసుల ర కపు వాసనకు మత్తెక్కియు సముద్రజలమును క్షోభింపజేయు చుండెను. అవి భయంకర రూపములయి పరస్పరము కల హించుచు రాక్షస ర క్తమును భక్షించు(త్రాపు)చు క్రక్కు.చునుండెను. సముద్రమునందలి తిమింగలములు సముద్రమున పడిన దానవులను వారి రథములను ఆయుధములను ఆశ్వములను ఆభరణములను వస్త్రములను కూడ మింగివేయుచు తమకు ఆపనిలో అడ్డము తగిలిన వేరు తిమీ తిమింగిలములను తరిమివేయుచుండెను. అంబరము (ఆకాశము) నందు ప్రమథులును దానవులును పోరుచున్నట్లే అంబరము (జలము)నందు జలచర జంతువులును పోరుచుండెను. యుద్ద క్రమమున ప్రమథులును దైత్యులును గిరగిర తిరుగుచున్న జై సముద్రమున జలచరములును తిరుగుచుండెను. అట్లే పరస్పరము నరకుకొనుచుండెను. అట్లే దేహము లు నరకుకొని చీల్చుకొని అర చుచుండెను. తమ గాయపు నోళ్ళ నుండి రక్తమును స్రవించుచుండిన నక్ర తిమింగలాది మహాజల జంతువులతోను సురాసురులతోను ఒక ముహూర్త కాలములోనే రక్తము కలిసిన నీటితో సముద్రమంతయు వృద్ధి పొందినదయ్యెను.
ఇది ఇట్లుండ సురేశ్వరుడగు శకుడు (ఇంద్రుడు) మహా సైన్యమును తీసికొనిపోయి తెల్లనిదై మహామేఘము వలెను మహాపర్వతమువలెను ఉన్న తమయి కాంతివంతమయిన త్రిపుర దుర్గ మహాద్వారమును మహావేగముతో ముట్టడి చేసి అడ్డగించి నిలువబడెను. ఆ సమయమునందే బాల సూర్యునివలేను కాచిన బంగారువలేను ప్రకాశించు హర పుత్తడగు స్కందుడు (కుమారస్వామి) బాలుడయ్యును మహాతేజశ్శాలియగు సూర్యుడు ఆ స్తపర్వత శిఖరమును ముట్టడించినట్లు మరియొక వైపునుండి ముట్టడించెను. యముడును కుబేరుడును పాశ శ్రేష్ఠము ఆయుధముగా, ధరించిన వరుణుడును దేవ శ్రేష్టులననేకులను వెంటగొని త్రిపుర దుర్గపు పశ్చిమ ద్వారమును ముట్టడించిరి. భగవానుడు త్రినేత్రుడు.
సహజముగనే భయంకర నేత్రుడును దానవేశ్వరుడునగు తార కాకుడు రోషముతో మరింతగా మొగమును కన్నులును ఎర్రగానయి రుద్రుడు చూచుచుండగా అతని సమీపమందే ప్రమథ కుల పరమానందకరుడగు నందీశ్వరుని వడ్లంగివాడు సరసమగు (మెత్తని) చందనపు కొయ్యను చెక్కినట్లు తీక్ష మగు గండ్ర గొడ్డలితో చెక్కెను. శిలాదపుత్తు డగు నంది తన్నట్లు తార కానుడు గండ్ర గొడ్డలితో గాయపరచగా తన ఖడ్గమును ఒరనుండి పెరికి ఆ తార కాక్షుని చంపదలచి శరభమృగమువలె వాని పెకి దుమికెను. ప్రమథ గణాధిపతియగు నందీ వాడియగు పాదరగల ఆ ఖడముతో యజ్ఞోప వీతము ఉండు క్రమములో ఎడమ భుజము పై నుండి కుడి డొక్క క్రిందీవరకు ఏటవాలుగా) తారకాకుని, నరకి వేసి సింహనాదము చేసెను. తార కార్డు డిట్లు నంది చేతిలో మరణించగా ప్రమథగణ సైనికులు మహా భయంకర శంఖధ్వనులు చేసిరి. ప్రమథుల శంఖధ్వనులను దేవతల వాద్యధ్వనులను విని విద్యున్మాలితో మయుడు విద్యున్మాలీ! ఈ ధ్వని ఏమి? అనేక కంఠములనుండి ఒకేమారు వచ్చిన ధ్వనియా ఇదీ ఒక లత చెందుచున్న సముద్రముల ధ్వనియా.గజపాలురు అడ్డ గించగా కోపించి ఘీంకరించుచున్న ఏనుగుల ఘీంకార ధ్వనియా? అని అడిగేను. మయుని ఈ మాట విద్యున్మాలికి అంకుశపు పోటువలే బాధాకరమయ్యెను. యమ వరుణ మ హేంద్ర రుద్రులతో సమానుడగు వీరుడును' నీకు శయనమున దాచుకోన్న నిధివంటి వాడును సకల యుద్ధములందు అగ్రగామియు వజ్రాయుధము వంటివాడు నగు తారకాక్షుడు ప్రమథ గణము చేతిలో చంపబడి రణరంగమున పడినాడు. ఆ ఉత్సాహమున ఒక చోట చేరి నినాదములు చేయుచున్న దేవతల కోలాహల మిది. ప్రజ్వలించు అగ్నివలే భయంకర నేత్రు డా తార కాకుడు రణమున మర్ధితు డ్యునని వినగానే దేవత లును ప్రమథులును ఎల్లరును ఇందులకై సంతోషించిన సకల లోక జనుల సంతోషమునకు ప్రోత్సాహకముగా చేయుచున్న నాదములు ఇవి. అని పలి కెను. ఆ మాటలు విని మయుడు. 'విద్యున్మాలీ! ఇపుడేమి చేయవలెనో ఆది చేయుదును. మన త్రిపుర దుర్గమునకు పర బల భయము లేకుండ చేయుదును.' అని పలికెను. తరువాత మయుడును విద్యు న్మాలియు క్రుద్దులయి తమ ఆదేశానుసారము తమకు సహాయులై యున్న అసురులతో కూడి ప్రమథులను చావగొట్ట నారంభించిరి. వారు ఇద్దరును ఏ ఏ త్రోవలో పోయిరో ఆ చోట నెల్ల ప్రమథులు వారి నడ్డగించి అచట రాక్షసు లేవ్వరును లేకుండునట్లు చంపివేయుచుండిరి. ఇది చూచి సంతోషముతో యమ వరుణాదులు మృదంగ పటహడిండిమాది వాద్యములు మోగించుచుండిరి. భుజాస్పాలనములతోను సింహనాదములతోను తమ సంతోష ప్రకటనము చేయుచుండిరి. సూర్య సమాన తేజుడగు మయుని మహాత్ములు దైత్యు లందరును - సత్త్వగుణాభిరతులగు తపోధనులు ఆకాశాన్నత భాగము నలంకరించిన మధ్యాహ్న సూర్యుని అభిష్టవము చేసినట్లు స్తుతించుచుండిరి.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున తార కాక్ష వధమను నూట ముప్పది యారవ అధ్యాయము.
