మత్స్య మహా పురాణము

Table of Contents

239 -  రాజ యాత్రా విధానము.

సర్వధర్మజ్ఞాః! సర్వశాస్త్ర విశారదా! నాకిపుడు మహీపతులు యాత్రాకాలమందాచరించవలసిన విధానమును తెలుపుమని యడిగిన మనువుతో మత్సుడిట్లనెను: సా శత్రువు ఇప్పుడు నా సహాయుల చేతిలోనే కోంత దెబ్బతిని యున్నాడు; నా యోధులు ధృష్టులు (చాల నేర్పరులు); నాభృత్యులను చక్కగా పోషించి నా ఆధీనమునందుంచు కొన్నాను; నాబలమును (సేనయును) ప్రభూతముగా చాల అధికముగానున్నది; నాదుర్గాదిమూలస్థానమునుకూడ నేనిపుడు రక్షించుకొనగలను:ఇపుడు నేనుబలీయమగు యుద్ధము జరిపినచో శత్రుపు తప్పక ఓడిపోవును; అని తనకు తోచినపుడు రాజు యుద్ధయాత్ర చేయవలెను; పార్షిశుద్ది తన ఇరుగు పొరుగు శత్రువులను ఆదుపులో వుంచుకొనుట) జరుగ నిదే రాజు యుద్దయాత్ర ఆరంభించరాదు; పార్షిగ్రాహుల (పొరుగు శత్రువుల) నేనకంటె ద్విగుణాధిక సేనను తన మూలస్థానమందు (దుర్గమందు) ఉంచియైన యాత్రకు బయలుదేరవలయును; యాత్రకు చైత్రపూరిమకాని మార్గశిర పూర్ణిమకాని తగినది; చైత్రపూర్ణిమయందు బయలు దేరినచో యుద్ధయాత్రా కాలమున రవితాపమును ఎదుర్కొనవలసి యుండును; ఆదియుగాక దీనిచే శరదృతువునందు లభించు సస్యాది పుష్టి ఈ కాలమునలభ్యము కాదు; మార్గశీర్ష పూర్ణిమయందై నచో ఇది వ్యతిరిక్త ముగనుండును: (తాపమునెదుర్కొన నక్కరలేదు; శరత్తులో పండిన పంటలు మొదలగు వాని ఉపయోగము లభించును; శత్రువు వ్యసన పీడితుడై యుండగా యాత్ర చేయుట మంచిది; ఆబ్దికాలము చిక్కుట దుర్లభము; శత్రువు దివ్యాంతరిక్ష భౌమోల్పోతములతోను ఆరు ఈతిబాధలతోను గ్రహములతోను పీడితుడై యుండగాను శత్రుని దేసకు ప్రజ్వలించు ఉల్క పోయినచో భూకంపములు ఉల్కాపాతములు ఆ రాజ్యమున జరుగుచో ధూమకేతువు కబనడుచో పిడుగులు పడుచో అట్టి శత్రురాజ్యము మీదకు రాజు యుద్దయాత్రకు పోవలెను; శత్రురాజు స్వబలము వ్యసన పీడితమయి రాజ్యము దుర్భిక్ష పీడితమయి ఆంతరకోపము (రాజ్యము లోపలి ఆప్తులు ద్వేషించుట.కలతలు) అధిక మయి నల్లులు పేలు దోమలు ఈగలు అధికమయి రాజ్యము బురదతో మలినమయి రాజు నాస్తికుడయి పెద్దలును శాస్త్రములును చెప్పు మర్యాదలు మీరి అధికారులు ప్రజలు తనయందనురక్తులుకాక ధనాదిసార హీనుడై ఆతని సేనానాయకులను సైనికులు ద్వేషించుచు వారిలో వారు కలహించుకొనుచు వ్యసనాసక్తుడై యున్న రాజు మీదకు దండయాత్ర చేయవలెను; సైనికులకు శస్త్రములు లేక వారి అవయవములు శుభసూచకముగా స్పందించక వారు చేడుకలలు కనుచున్న తరి యుద్ధ యాత్రామంచిది; ఇట్టి తరి రాజు చతురంగ బలసంపన్నుడై హృష్టపుష్ట సైన్యముతో శత్రువులనేదిరించ పోవలెను.

దుఃస్వప్నములు కలుగని సమయమున శ రీరములు శుభ సూచక ములై అదరుచుండ ధన్యములగు శుభ శకునము. లగునపుడు దైవబల పురుష కార బలయుతుడై దేశ కాలానుకూలత గమనించి యుద్ధ యాత్ర చేయవలయును. స్థల మందు మొసలి ఏనుగునకును. నీటిలో ఏనుగు మొసలికిని రాత్రివేళ కాకి గ్రుడ్లగూబకును పగటివేళ కాకికి గ్రుడ్లగూబయును లోబడును; దేశ - కాలజ్ఞానమనగా ఇట్టిదే; వర్షాకాలమందు గజ సేనా పదాతి సేనలును హేమంత శిశిరములందు అశ్వరథ సేనలును గ్రీష్మమందు ఖరోష్ట్రయుత సేనలును అధికముగ నుండుట జయప్రదము. వసంత శరదృతువులందు చతు రంగ బలో పేత సేనతో యుద్ధ యాత్ర చేయవచ్చును; మిట్ట పల్లములధికముగా గల దేశమందుండు రాజును జయించుటకు పదాతి సేన ఆధికముగా నుండవలెను; సులభముగా చొరుటకు వీలగు చెట్లతో ఆవరింపబడినదియే కొలదిగ మాత్రము బురద కల దేశమందుండు శత్రునెదుర్కొనుటకు గజ సేన ఆధికముగా నుండవలయును; రథ సేనయు అశ్వ సేనయు ఆధి కముగా గల చతురంగ సేనగల రాజు తాను విషమ భూభాగమునందుండియు సమతలమందుండు శత్రురాజును జయించ గలుగును; శత్రురాజు ఇతరులతో ఒడంబడిక చేసికోన్న చో దానిచే ఆతనిని ఆశ్రయించిన వారిని కూడ ఈరోజు ఎదిరించి ఓడించవలేను; కంచెలు మొదలగునవి రక్షణగా చేసికొనియున్న శత్రు రాజును జయించుటకు కంచర గాడిదలును ఒంటే లును అధికముగాగల సేనయుండవలెను; ఇట్టి ఆవరణమందున్న రాజును వర్షాకాలమందెదిరించవలెను; హిమపాతముతో నిండిన దేశమునందున్న శత్రుని గ్రీష్మమందెదిరించవలెను; ఎండు గడ్డియు క బైలును బాగుగా కల శత్రురాజును హేమంత ఋతువునందెదిరించవలెను; శరద్వసంత ఋతువులు మాత్రము యుద్ధయాత్రకు అనుకూలములగు సాధారణ కాలములు; రాజు దేశ కాల స్థితులనెరిగి దైవజ్ఞుల సాయమున భూత భవిష్యద్వర్తమానగతుల నెరిగి - వారి అభిప్రాయానుసారముగా ఆలోచించి బ్రాహ్మణులతోను మంత్రాలోచన వేత్తలతోను సంప్రతించివారితో కూడి యుద్ధయాత్రకు బయలు దేరవలెను.

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున యుద్ధ యాత్రా విధానమను రెండు వందల తొమ్మిదవ అధ్యాయము.