మత్స్య మహా పురాణము

Table of Contents

104 - ప్రయాగ మాహాత్మ్యము

యుధిష్ఠిరుడు మార్కండేయునితో ఇట్లనెను: భగవన్! తాము నాకు ప్రయాగ మాహాత్మ్యమును చెప్పుచున్న కొలదిని నేను సర్వపాపముక్రుడ నగుచున్నట్లు భావించుచున్నాను. ఆ క్షేత్రమున ధర్మ సంపాదనము చేయు విధానమును తెలుప వేడెదను. అనగా మార్కండేయు డతని కిట్లు చెప్పసాగెను: ఆర్ష పరంపర లో నేను వినినట్లును కనినట్లును ప్రయాగ తీర్థయాత్రా విధిక్రమమును తెలి పెదను.

ప్రయాగ తీర్థయాత్ర ఎద్దు పై చేసినచో గోవులకు కలుగు దారుణ క్రోధఫలముగా ఆతడు ఘోర నరకమున వసించును. అత డిచ్చిన సలిలమును కూడ పితరులు గ్రహింపరు. ఐశ్వర్యమద లోభ మోహాదులచే అట్లు పోయినను వాని యాత్ర నిష్ఫలము. కావున యానము పై తీర్థయాత్ర చేయనేరాదు. తన పత్నీ పుస్ను షాదులను తను కాపాడు కొనునంత శ్రద్ధతోనే తీర్థయాత్రను చేసి అచట స్నానమాడి విపులకు దానమును చేయవలెను. గంగా యమునా మధ్య మున (ప్రయాగయందు) ఆర్ష విధానమున తన విభవము కొలది కన్యాదాన మొనర్చువాడు తత్పుణ్యమున నరకమును చూడనైన చూడడు. (ముందు జన్మములలో) ఉత్తర కురువర్షము లందనంతకాలము సుఖించును. ధార్మికులు రూప వ"తులు నగు దారపుత్తు లతనికి లభింతురు. ప్రళయ కాలము వరకు స్వర్గమున వసించి సుఖించును. కావున అచట తన విభవ విస్తరానుసారము దానములు చేయవలెను. దానిచే అతని పుణ్యము వృద్ధి నందును.

అచటి వటమూలమున ప్రాణముల వదలినయాతడు సర్వలోకముల నతిక్రమించి శివలోకము చేరును. ఆ ట తపమాచరించిన పుణ్యమున ద్వాదశాదిత్యులును రుద్రుని చేరగలిగిరి. కావుననే (ప్రళయమునను) వారును సర్వజగమును దహింతురు కాని వటమూలమును దహించరు. చంద్రార్క పవనులును నశించి జగ మేకార్లవమయినపుడును ప్రతి కల్పాంతమందును పరమాత్ముడు విష్ణువచటనే నిదురించును. దేవదానవ గంధర్వ ఋషి సిద్దచార ణాదులు సదా ఆ తీర్థమును సేవించుచుందురు. కావున రాజేంద్రా! పవిత్రమగు ఆ తీర్థయాత్ర చేయవలెను.

 బ్రహ్మాది దేవతలు దిశలు దిగధిపతులు లోక పాలురు సాధ్యులు లోక పూజ్య పితరులు సనత్కుమారాది మహర్షులు అంగిరః ప్రముఖ బ్రహ్మరులు యక్షనాగ గరుడ సిద్ద చారణులు నదీ సాగర శైలములు విద్యాధరులు ప్రజా పతియు హరియు సదా అచటనుందురు.

గంగా యమునా మధ్యము (ప్రయాగ) వృథివీ జఘన స్థానము. అని లోకత్రయ ప్రసిద్ధము. లోకత్రయమునను అంతకంటే పుణ్యకర ప్రదేశము మరిలేదు. ఆ తీర్థపు నామమును వినినను కీర్తి సచినను మృత్తికను సంపాదించినను తాకినను నరుడు పాపముక్తుడగును. గవి మకర సంక్రాంతిఁసందచట స్నానము చేసినచో రాజసూయాశ్వమేధ తుల్య ఫలము లభించును. వేదవచన లోకవచములబట్టి ఇట్లు చెప్పుట మాత్రముకాదు; (ఇది ప్రత్యక్ష సిద్దము.) ప్రాణో త్ర్కమణ సమయమందై న ప్రయాగకు పోవలెనని సంకల్పము కలుగుట మేలు. వేయికోట్ల తీర్థములును మరి అరువది కోట్ల తీర్థములును సతతమచటనేయుండును. కావున సత్త్వగుణ ప్రధానుడై యోగమనుష్టించినవానికి కలుగు సుగతి ప్రయాగలో మరణించినంత మాత్రమున కలుగును. త్రిలోక ప్రసిద్దమగు ప్రయాగతీర్థ మునకు పోవని వారేచ్చ ఔచ్చట జీవించి నను జీవించినట్లే. యమునా దక్షిణ తీరమున కంబళుడు అశ్వతరుడు ననునాగులుందురు. అచటి నీరు స్నానమాడినను తావినను సర్వపాపము క్రియగును. అచటనే శివ క్షేత్రమొకటి కలదు. అచటి కేగికను అతని వెనుక ముందు పదితరముల వారు తరింతురు. అచట స్నానమాడినచో అశ్వమేధ ఫలము కలిగి ప్రళయకాలము వరకు స్వర్గమున సుఖిం చును.

ఆచటనే గంగకు తూర్పున సాముద్ర కూపము అనియు ప్రతిష్టాన నగరమున నొక ప్రదేశము కలదు. జితక్రోధుడై బ్రహ్మచర్యమున త్రిరాత్రమట గడపినచో సర్వపాప విశుద్దాత్ముడై ఆశ్వమేధ ఫలమందును. భాగీరథీ గంగకు తూర్పున ప్రతిష్టానమునకు ఉత్తరమున *హంసప్రపతనమను తైలోక్య విశ్రుత మగు తీర్థము కలదు. అచట స్నాన మాత్రమున అశ్వమేధ ఫలము లభించును. ఆ చంద్ర సూర్యముగ స్వర్గమున సుఖించును. మనోహర మై విశాల మై హంసవలె తెల్లనిదగు ఊర్వశీపులినము (పులినము-ఇసుక తిన్నె) ఆనుచోట ప్రాణత్యాగమున ఆరువది ఆరు వేల సంవత్సరములు తన పితరులతో కూడ సదా ఊర్వశీ దర్శనముతో రవి లోకమున వసించును. (ఊర్వశి-అగ్ని తత్త్వాత్మిక యగు శ క్తి) అచట ఋషి గంధర్వ, కిన్నరుల సతత పూజలందుకొనుచు పుణ్యాంతమున స్వర్గ పరిభ్రష్టుడైనను ఊర్వశిని పోలు నూరుర కన్యలను కనును: ఆనముద్ర పర్యంత పృథివికి పతియగును. ధనధాన్యయుతుడు బహు సహస్ర గవాశ్వాధిపతియునగును. బహు సహస్ర నారీపతియు దశ సహస్ర గ్రామాధిపుడు నగును. అందే ! యొ డ్డాణముల సవ్వడి వినుచు నిద్ర మేల్కాంచువాడగును. ఇట్లు భోగములన్ని యనుభవించియు మరల ఈ తీర్థమున కే వచ్చును.

 ఈ తీర్థమున శుక్లాంబరధరుడు నియతేంద్రియుడునై ఏక భుక్తము చేయుచుఁ డునతడు శివ సాంనిధ్యమందును. మరల భూమిపై జన్మించియు స్వర్గ భూషణాలంకృతలగు నారీశతమునకు పతియగును. విపుల భోగముల ననుభవించి మరల ఆ తీర్థమున కేగి దాని సేవించును. అచటి సంధ్యావటమను రమ్య ప్రదేశమున శుచియు బ్రహ్మచారియు జితేంద్రియుడునై సంధ్యోపాసన చేయువాడు బ్రహ్మలోక ప్రాప్తుడగును.

(*హంసలు పొలేడిచోటు అని అర్థము. హంసలు కొంచములు మొదలగు వలన జాతి జలవకులు వర్షాకాలమున మన దేశమును విడిచి ఉత్తరమందలి ఇతర దేశములకు పోవునపుడును అచటినుండి మరల శరత్కాలమున మన దేశములోనికి వచ్చునపుడును నడుమ అవి ఈ ప్రదేశమున వాలి కొలదికాలము గడపి పోవుచుండును. అనగా ఇది ఉభయ ప్రకృతులకు అనుకూల ప్రదేశ మయి పవిత్రమయి యుండునది. అందుచేతనే దీనికా పేరు వచ్చెను.)

 అచటి కోటి తీర్థమున ప్రాణత్యాగముచే సహస్రకోటి సంవత్సరములు స్వర్గ సుఖమబ్బును. పుణ్యావసానమున స్వర్గభ్రష్టుడయ్యు సువర్ణ మణిముక్తి సంపన్న మగువంశమున రూపవంతుడై జనించును. వాసుకి ప్రదేశమునకు ఉ త్తరమునగల దశాశ్వమేధిక తీర్థమున స్నానమాడినచో అశ్వమేధ ఫలమందును. స్వర్గ వాసానంతరము ధనాఢ్యుడు రూపవంతుడు సమర్థుడు దాతయు ధార్మికుడునై జన్మించును. చతుర్వేదాధ్యయనము సత్యవచనము అహింస పాటించుటచే గలుగు ఫలమంతయు ఆ తీర్థగమనముచే గలుగును. గంగయందేచ్చట స్నానమాడినను కురు క్షేత్ర వాస సమాన పుణ్యము లభించును. ఆనది యమునతో కలిసిన ఈ ప్రయాగ మంతకంటే పది మడుగులు పుణ్యప్రదము. బహు తీర్థములు తపోధనులు నిండియున్న ఈ గంగా యమునా సంగమ స్థానము సిద్ద క్షేత్రమే; ఇందు సంశయమే లేదు. గంగ మూడు తొవల ప్రవహించి పాతాళమున నాగులను భూలోకమున నరులను స్వర్గమున దేవతలను తరింప జేయునది కావుననే ఆమెకు త్రిపథగయను నామము కలిగినది. ఏ ప్రాణికిగల ఎన్ని అస్థి ఖండములు గంగయందు నిలుచునో ఆతడన్నీ వేలయేండ్లు స్వర్గ సుఖమందును. గంగ తీర్థములలో ఉత్తమతీర్థ ము; నదులలో ఉ తమనది; . మహాపాతకులగు ప్రాణులకును మోక్ష మొసగునది; గంగ సర్వత సులభముగ లభించును; మూడు స్థానముందు ఆమె దుర్లభ; (చాల పుణ్యప్రదాయిని); అవి ఏవనిన గంగా ద్వారము (హరిద్వారము) ప్రయాగ గంగా సాగర సంగమము: ఈ మూడు తావులయందును స్నానమాడువారు పునరావృత్తిలేని రోక ములందుదురు; పాప కలుషిత చిత్తులై గడపి పుణ్య గతి కోరు ఆర్తులకు గంగవంటి శరణ్యము.మరిలేదు. ఆమే పవిత్రమగు వానిలో నెల్ల పవిత్ర యైనది; శుభమగు వానిలో కెల్ల శుభకరి; మహేశ్వర శిరమునుండి జారిపడి సర్వుల సర్వపాపముల పోగొట్టు శుభరూపురాలు గంగ.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను  నూట నాలుగవ అధ్యాయము.