మత్స్య మహా పురాణము

Table of Contents

232 - అతివృష్ట్యాఽఽద్యుత్పాతములు-తచ్ఛాంతి.

 గర్గుడిట్లు చెప్పేను; అతివృష్టియు అనావృష్టియు ఈ రెండును కరవునకు నిమి త్తములు; అనృతువునందు మూడు దినములకు మించి ఎగ తెగని వాన కురియుట భయ హేతువు; మేఘములు లేక యే మెరయుట ఉరుముట పిడుగులు పడుటవంటి వైకృతములు జరిగినచో రాజు మరణించును; శీతోష్ణ వ్యత్యాసమయినచో రాజులకు శత్రుభయము; రక్తపు వాన కురిసినచో శస్త్రభయమేర్పడును; బొగ్గులు నిప్పుకణికలు ధూళి వర్షించినచో నగర నాశమగును; మడ్డ ఎముకలు నూనె మాంసము వర్షించినచో జనమృత్యు భయము; ఫలపుష్ప ధాన్యములు కురిసినచో శత్రుభయము; ధూళి ప్రాణులు పండు వరించినచో రోగభయము; అన్న వర్ష మయినచో దేశమున ఛిద్రములును సస్యములకు భీతియు కలుగును; ఆక సమున ధూళి లేక యు మేఘములు లేకయు రవి ప్రకాశించుచున్న ను నీడ కనబడక పోయినను ఎదురు రూపుతో (తలక్రిందుగా) కనబడినను దేశ భయమగును; ఆకసమున మేఘములు లేనపుడు కాని రాత్రివేళ కాని దక్షిణపు కొనలో గాని ఉత్తరపు కొనయందుగాని తెల్లని ఇంధ్రధనుస్సు కనబడినను ఉల్కాపాతమును దీర్ణాహమును పరివేషమును ఏర్పడి నను గంధర్వ నగరము కనబడినను పరచక్ర (శత్రు సేనవలన) భయమును దేశోపద్రవమును కలుగును; ఈ నిమి త్తముల శాంతి కై సూర్యచంద్ర వర్జన్య దేవతలనుద్దేశించి ద్విజ శేష్ఠులచే యథావిధి యాగము జరిపించవలెను; ధనము గోవులు సువర్ణము దక్షిణలుగా బ్రాహ్మణులకీయవలెను; దోష శాంతి యగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున అతివృష్ట్యాద్యుత్పాతములును  తచ్చాంతియునను రెండు వందల ముప్పది రెండవ అధ్యాయము.