మత్స్య మహా పురాణము

Table of Contents

114 - భారతవర్ష వర్ణన విస్తరరూపమయిన పురూరవసుని పూర్వ జన్మ వృత్తాంతము 

 [ఆలోచింపగా ఇచట పురూరవసుని వృత్తాంతమును తెలుపుమని .ఋషులు సూతు నడుగవలసిన ప్రసక్తి లేదు. కాని దీనిని ఒక విధముగ సమర్థింపవచ్చును. ఇచట నవవర వర్ణనమున ఇలావృత వరము పేర్కొని వివరింపబడినది. దీని కి పేరు పురూరవసుని తల్లి యగు ఇలపుం స్వమున ఇలుడు)ను బట్టి వచ్చినదని లోగడ తెలుపబడి నది. కావున ఆ పేరు వినగానే ఋషులకు ఆలాపుత్రుడగు పురూరవసుని విషయము విన కుతూహలము కలిగియుండేననీ భావింపవచ్చును. మరియు దీని మూలమున భారతవర్షమందలి నదీపర్వతవనాది వర్ణన విస్తరమున కవకాశమును గలదు. పురాణములయందు ఇట్టివి సహజమే].

మనువు మత్స్య నారాయణు నిట్లడిగెను: జనార్ధనా! నేను బుధపుత్రుడగు - పురూరవసుని చరితమును మూడు విధములగు శ్రాద్ధముల విధానమును - సర్వపాప ప్రణాశక ములగు ఆశ్రాద్ధములన్నింటి అనుష్టానమున కలుగు సమున్నత ఫలములను కృష్ణాజిన ప్రదాన వృషోత్సర్గాది ప్రకారమును వింటిని. బుధపుత్రుడును నరేంద్రుడునగు పురూరవసుని రూప విషయమును వినినందున నాకు కుతూహలము కలిగి అడుగుచున్నాను. అది నాకు తెలుపుడు. ఏ కర్మఫలముగా ఆ పురూరవసుడను రోజు అటీ పర మా తమరూపమును పరమో త్తమగతిని పొందేను? త్రిభువన శేష్టులగు దేవతలతోను మనో రములగు గంధర్వులతోను కలయికను విడిచి ఊర్వశి ఏలసర్వ భావముతో ఆ నృపుని పొందెను? ఆసగా మత్స్య జనార్దనుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ పురూరవోరాజు ఏ కర్మ విపాక మున అట్టి ఉత్తమ రూప సుభగత్వములను (కామినులకు ప్రీతిపాతుడగుట సుభగత్వము) పొందేనో వినుము. ఈ పురూరవుడు అంతకు ముందటి జన్మమున బొక్షుష మన్వంతర మున మహా ధనుష్కడు సర్వ నృపలక్షణ యుక్తుడు శతుపుర (ధనరాశి) విజేత ధనవంతుడు అయియును రూపము మాత్రము లేని, మద్రదేశ రాజై యుండెను.. అనవినీ ఋషులు పురూరవుడు తత్పూర్వ జన్మమున మద్రపతిగా నుండి సపుడు అతడు అపుడు రాజగుటకును రూప రహితుడ గుటకును మరల రూపవంతుడ గుటకును హేతువులగు కర్మ ఏపాకము లేవియని సూతునడిగిరి.

సూతుడు ఋషులకిట్లు చెప్పసాగెను: ఈ బుధపు త పురూరవసునకు మధ్ర పతిగా నున్న పుడును పురూర వసుడనియే నామము. ఆతడంతకు ముందటి జన్మమున ఒకనదీ తీరమందలి ఒక బ్రాహ్మణ  గ్రామమున పురూర వసుడను పేరుగల ద్విజ శ్రేష్టుడయి యుండెను. ఆ జన్మమునందా వీపుడు రాజత్వమును కోరి నిరంతరము ద్వాదశుల యందుపవసించుచు జనార్దను నారాధించెడివాడు. కాని ఆ ఉపవాస దినములందు అభ్యంగ (తల యంటు) స్నానమాడెడి వాడు. ఆ వ్రత పుణ్యమున రెండవ జన్మ మున మద్రరా జై జన్మించెను. కాని ఉపవాస దినాభ్యంగ దోషమున రూపహీను డయ్యెను. కావున ఉపవాస దినమున అభ్యంగ స్నా సమాడరాదు. ఇది ఈ బుధపు తం పురూరవసుడు. మద్రపతియగు పురూరవసుడుగా నగుటకు పూర్వ జన్మమందలి విప్ర పురూరవసుని వృత్తాంతము. ఇక మద్రపతిగానున్న యతని వృత్తాంతము వినుడు. అతడు సర్వ రాజగుణ యుక్తుడే నను రూపహీనుడగుటచే నతని విషయమున రాజ్య జనులకు అనురాగము లేకుండెను. అందున ఆతడు రూపార్టీయే తపమాచరింపగోరి రాజ్యమును మంత్రుల కప్పగించి హిమా లయమునకు ఏగేను. ఉగ తపమాచరింపగోరి నిర్మల కీ ర్తియగు . ఆ రాజు తన దృఢ సంకల్ప మాత్రము తోడుగా పాదచారియై ఆ పర్వత శిఖరమునందు తపమున కనుకూలమగు తీర్థ స్థానము వెదుక గోరి పోగాపోగా సుమనోహర మై హిమవంత మున పుట్టిన ఇరావతి (ఐరావతి-రావినది) అనునది అతనికి కనబడెను. ఆనదీ మహోగ్ర వేగయు చంద్ర సమాన శీత లయు హిమ సమాన కాంతియు కయునై యుండెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూద్వీపాంతర్గత భారతవర్ష వర్ణసమున పురూరవః పూర్వచరితమను నూట పదునాలుగవ అధ్యాయము.