మత్స్య మహా పురాణము

Table of Contents

10 - పృథువు మొదలగు వారు భూమిని గోవుగా చేసి పిదుకుట  

ఋషులు సూతుని ఇట్లడిగిరి: పూర్వము రాజులెందరో భూమిని అనుభవించిరని వినుచున్నాము. పృథివిని పాలించిన వారు కావున పృథివీ శబ్దపు సంబంధముచే రాజులకు పార్థివులు అను పేరు ఏర్పడినది. పృథివి అనుశ బ్దము మరి ఏ శబ్ద సంబంధముచే ఏర్పడినది? భూమికి ఆ పేరు ఏ అర్థమును తెలుపుటకయి పరిభాషగా (సంకేతముగా) చేయ బడినది? అట్లే భూమికి గౌః గో) అను పేరును వచ్చినది కదా? ఇందులకు హేతువేమి? మాకు తాము తెలుపవేడెదము.  సూతుడు ఇట్లు చెప్పు నారంభించెను: స్వాయంభువమను వంశమున అంగుడను రాజు జన్మించెను. మృత్యుని కూతురు దుర్ముఖ అగు సునీథ ఆతని భార్య. వేనుడు అతని కుమారుడు. అతడు బలశాలి రాజై యుండియు ఎల్లప్పుడు అధర్మమునం దాస క్తి కలవాడు. కామపరుడు. లోకము నందును ఆధర్మమునే ఆచరించెడి వాడు. పర భార్యలను అప హరించెడువాడు. బ్రాహ్మణులు ఆతని దేహమును బలము కొలది మథించిరి. మథింపబడుచుండిన ఆతని దేహము నుండి మేచ్ఛజాతుల వారు ఉత్పన్నులయిరి. వారందరును తల్లి అగు సునీథ) అంశమును బట్టి కాటుకవలె నల్లని దేహచ్ఛాయ కలవారు. ఆ వేనుని కుడి చేతి నుండి తండ్రియగు అంగుని అంశమును బట్టి ధర్మము నెరిగినవాడును ధర్మము నాచరించు వాడును ఆచరింపజేయు వాడును అగు వాడొకడు జనించెను. అతడు కవచమును ధనుర్బాణములను ధరించి ఉండెను. దివ్య తేజోమయ శరీరమును మంచి రత్నములు తాపటము చేసిన బంగారు భుజకీర్తులును కలిగి ఉండెను. పృథు (లావగు) రోమములు కలవాడగుటచే అతడు పృథువన ప్రసిద్దుడు అయ్యెను. విప్రులు అతనిని చక్రవర్తిగా ఆభిషేకించిరి. అతడు దుష్కరమగు తపస్సాచరించెను. విష్ణు వరముచే ఆతడు సర్వ జగత్తునకును ప్రభువుగా నయ్యెను. భూతలమున స్వాధ్యాయముగాని వషట్కారము (యజ్ఞక్రియలు) గాని ధనముగానీ లేకుండుట చూచి కోపము కలిగి అమితమగు విక్రమము కల ఆ పృథుడు శరముతో భూమిని దహింప సంకల్పించెను. అంతట భూదేవి గోరూపమును ధరించి పారిపోసాగెను. ప్రజ్వలించుచున్న ధనువు ధరించి పృథుడు ఆమెను వెంట నం టెను.

అంతట భూదేవి ఒకానొక చోట నిలువబడి నేను నీకై ఏమి చేయవలయును? అని అడిగేను. సువ్రతా! (సత్కార్య ములను చేయుదానా!) చరాచర రూపమయిన సర్వ జగత్తునకును శీఘముగా కోరికలను తీర్చుము. అని పృథువు అనెను. భూదేవి సరే అనెను. పృథు చకవ రి స్వాయంభువ నునువును దూడగా చేసి గోరూప యగు భూమిని తన చేతియందే పిది కెను. ఆ వచ్చిన క్షీరము ప్రజలు జీవించుటకు సాధనము అగు అన్నముగా ఆయ్యెను. బృహస్పతి దోగ పిదుకు వాడు కాగా ఋషులు సోముని దూడనుగా చేసి వేదములనెడి పాత్రయందు పాలు పిరికిరి. ఆ పాలు తపస్సుగా అయ్యేను. దేవతలు భూమిని పిరికిరి. దోగ్ధ మై! తుడను దేవుడు. ఇంద్రుడు దూడ. బంగారు పాత్ర : 1. సామర్థ్యము నిచ్చు బలము క్షీరము పితరులు వెండి పాత్రలో భూమిని పిదికిరి. అ నకుడు (ప్రాణులను అంతమొందించు వాడగు పితృరాజు) దోగ్ధ. యముడు (ప్రాణుల పుణ్యపాపముల నిర్ణయించి తదనుగుణముగా ఫలముల నిచ్చుదేవుడు) దూడ. స్వధా (కారముతో ఇచ్చు ద్రవ్యము) క్షీరము. నాగులు పగడపు పాత్రలో తక్షకుని దూడనుగా ధృతరాష్ట్రుడను నాగుని దోగ్గనుగా చేసి విషము అను క్షీరమును భూదేవి నుండి పిసికిరి. అసురులును గోరూపయగు భూమిని పిసికిరి. వారిది ఇనుప పాత, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు దూడ. మాయలను ప్రవర్తిల్ల జేయువాడగు విమూఢుడను వాడు దేగ్గ. శత్రువులను పీడించుట శత్రువుల పై మాయ ప్రయోగించుట అనునవి పాలు. కుబేరుని దూడనుగా చేసి యక్షులు ఆ ను (కాలని మట్టి పాత్రలోనికి అంతర్ధానము అను పాలను పిదికిరి. రౌప్యనాభుడు దొగ్గగా సుమాలి దూడగా పేతలును రక్షస్సులును భయంకరమగు రక్తమును పాలనుగా పిసికిరి.

గంధర్వులును అప్సరోగణమును గాన వేద (సంగీత తత్వము నెరిగిన వసురుచి దోగ్ధగా చిత్ర రథుడు దూడగా తామర పూ రేకునందు సుగంధములనెడి పాలు పిరికిరి. పర్వతములును శైలమయమైన పాత్రలో హిమవంతుడు దూడగా మేరువు డోగ్గగా రత్నములనెడి పాలను పిరికిరి, పూవులతో తీగలతో వ్యాప్తమైయున్న ఏపి చెట్టు దోగ్టగా అన్ని చెట్టులకు వనములకు అధిపతియగు జువ్వి చెట్టు దూడ గా మోదుగ ఆకుల పాత్రయందు ఛిన్న ప్రరోహణము (నర కినను మరల మొలచుట) అను క్షీరమును వృక్షములు ఏది కెను.

ఈ విధముగనే ఇతరులును ఇతర ప్రాణులును తమ కోరికల కొలది భూమిని పిదికి. పృథుడు రాజ్యమును ఏలుచుండగా ప్రజలకు ధనము ఆయువు సౌఖ్యము కొరత లేకుండెను. దరిద్రుడు. కానీ పాపములు చేయు వాడు కాని ఎవడును లేకుండెను. ఉపదవములుకాని వేరపు మాటలు కాని లేకుం డేను. ప్రాణులన్నియును దుఃఖ శోక ములు లేక మిగుల సంతోషముతో ఉండెను. ఆ మహాబలుడు లోకముల హితమును కోరి తన వింటికొసతో పర్వతములను (గ్రామము లను నగరములను దుర్గములను నిర్మించుటలో పంటలను పండించుటలో అడ్డము వచ్చినచో) దూరముగా నెట్టి వేసి భూమండలమును నగరములను. గ్రామములను దుర్గములను సమములనుగా సమతలము సందున్న వి) చే నెను. కొడుకులు మొదలగు చిన్న లవలన పెద్దలకు దుఃఖముగాని సాధ్యయనము లేని వానికి ఆదరము కాని లేకుండెను. పురుషులలో ఎవరును నీతి లేని వారు లేకుండిరి.

ఎవరికి ఎవరికి సంబంధించినవి ఏ.పాత్రములో ఏ క్షీరములో నీకు తెలిపితిని. దానములు పూజలు చేయునపుడు ఆయా పాత్రలలో ఎవరికి ఏది ఇష మో ఎరిగి వారికి ప్రీతిగా వాటిని దానము చేయుటయో పూజోదులలో ఉపయోగించుటయే చేయవలెను. యజ్ఞములును శ్రాద్ధములును చేయునపుడు వీనిని పాటించవలెను. 

 ఈ చెప్పిన విధమున భూమి పృథువున . కూతురుగా ఆయి ఆయన వాత్సల్యమును పొందినది - కావున ఆమెకు వృథివ్ అను నామము - ప్రసిద్దము య్యెను. 

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మరమను సంచారమున పృథువు మొదలగు వారు భూమినిపిదు:ట యను. దశ మాధ్యాయము.