మత్స్య మహా పురాణము

Table of Contents

231 -  రాజధర్మము-వృక్షోత్పాతశాంతి.

 ఏ పట్టణములయందు వృక్షములు దేవ పేరణచే ఏడ్చుచు నవ్వుచు కనబడునో మాటిమాటికి రసమును వీడు చునో రోగమును గాలియు లేక యే కొమ్మలు పడునో ఆ కాలమందును మూడు సంవత్సరముల వయస్సు కలవియు పూలు పూయునో పండ్లు పండునో కొమ్మల నడుమనే పూయునో కాయునో పాలను నూనేను మద్యమును ర క్షమును కార్చునో రోగములు లేక యే ఎండునో ఎండినవి మరల చిగుర్చునో మొలకెత్తునో పడినవి లేచునో లేచినవి పడునో అచట కలుగు పరిణామమును ఫలమును తెలి పెద వినుము; చెట్లు ఏడ్చుటచే వ్యాధులు ప్రబలును; నవ్వినచో దేశమున కలవరములు కలుగును; కొమ్మలు పడుటచే యోధులు పడెదరు; చిన్న వయసు చెట్లు వూచినచో బాలురు మరణింతురు; కొమ్మల నడుమ పూయుటచే రాష్ట్రమున జనులలో కలహములు చీలికలు కలుగును; పొలు కాని నూనె కాని కార్చినచో కరవులేర్పడును; మద్యము కార్చినచో వాహనముల నాశము రక్తము కార్చినచో యుద్ధము సంభవించును; తేనే కార్చినచో వ్యాధులు నీరుకార్చి నచో అనావృష్టి కలుగును; రోగములు లేకయే చేబైండినచో దుర్భిక్షమును ఎండినవి చిగిర్చినచో అన్న మును వీర్యమును తగ్గుటయు జరుగును; పడినవి లేచినచో రాష్ట్రపు చీలిక లతో భయమేర్పడును; ఉన్న చోటినుండి కదలిపోయినచో దేశ భంగమగును; వృక్షములు మండినను ఏడ్చినను ధనక్షయమగును; ఇట్టి వృక్షములను శత్రువులు పూజించినచో ఈ వృక్షములున్న రాజ్యపు రాజునకు సర్వస్వనాశమగును; పుష్ప ఫలములందు వైకృతము (అస్వాభావిక లక్షణములు) కల్గినచో రాజు మరణించును; ఇట్టివే మరేవయిన వృకోత్పాతములు సంభవించినను ఎచ్చరిక తో గమనించి ఆ వృక్షమును మరుగుపరచి గంధమాల్యములతో అలంకరించవలయును; పాపశాంతి కే చేట్లు పే గొడుగు నిలుపవలెను; శివునర్చించ వలెను; శివునకు పశువు సర్పించవలెను; 'రుదేభ్యః' అనుచు ఆరు హోమములను జరిపి రుద్ర మంత్రముల జపించవల యును; తేనెతో నేతితో కూడిన పాయసముతో విప్రుల పూజించి వారికి బంగారు దానమీయవలెను; హరునీ గీత నృత్యము లతో అర్చించవలయును; ఇట్లు పాపనాశమగును.

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున వృక్షవైకృత శాంతీయను రెండువందల ముప్పది యొకటవ అధ్యాయము.