మత్స్య మహా పురాణము

Table of Contents

205 - కృష్ణాజిన దానము.

[కృష్ణాజినమనగా నల్లని మచ్చలుగల ఇజ్జీ అను మృగపు చర్మము.]

కృష్ణాజినమును ఎట్టి బ్రాహ్మణునకు ఏకాలమున ఏ విధానమున దానమీయవలయునో తెలుపుమని మనువడుగ మత్సుడిట్లు తెలి పెను: వైశాఖ పూర్ణిమ చంద్ర సూర్యగ్రహణములు మాఘ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ కార్తిక పూర్ణిమ ఉత్త రాయనము ద్వాదశి తిథి. ఈ కాలములందు ఇది దానమిచ్చుట మహాఫలదము; ఆహితాగ్ని యగు విపుడు దానయోగ్యుడు; విధానమిక తెలి పెదను; వినుము! నరాధిపా! గోమయముతో అలికిన శుచి ప్రదేశమున మొదట ప్రశ స్తము శోభనమునగు కంబళము (తివాచీ) పరచవలేను; కొమ్ములు గిట్టలుకల కృష్ణాజినమును దాని పై పరచి దానికి బంగరు కొమ్ములు వెండి దంతములు ముత్తెములతో నూవులతో తోక కుచ్చు అమర్చి నూవులతో ఆచర్మము కప్పి దాని పై నూతన వస్త్రమును ఉంచి దాని నడుమ బంగరునుంచి రత్న గంధాదులతో యథాశ క్తిగ అలంకరించవలయును; వీటియందు నాలుగు దిక్కు లందు నాలుగు కాంస్యపాత్ర లుంచవలెను. అట్లే నాలుగు మట్టి పాత్రలందు వరుసగా తూర్పు మొదలుగనే నేయిపాలు పెరుగు తేనె పోయవలెను. సం పెంగ కొమ్మ ను రంధ్రములేని కడవను వీనికి బయటగా శుభచిత్తముతో ఉంచవలెను:

ఈ చర్మపు అన్ని అంగములందు వేరువేరుగ కోత్త పసుపు పచ్చని వస్త్రములను పాదములకడ మృణ్మయ పాత్రములను ఉంచవలేను. నేను లోభము చే చేసిన కాయిక పాపములన్నియు నేచేయు, ఈలోహ పాత్రాది దానముచే శీఘమే నశించుగాక! అను మంత్రముతో లోహపోతమును దాని ఎడమ పాదముకడ నూవులతో నింపి ఉంచవలెను; నేను కామవశమున చేసిన పాపములు నేచేయు ఈ కాంస్య పాత దానముతో నశించుగాకయనుచు తేనెతో నింపిన కంచు పొత్రను చర్మపు కుడి పాదముకడ ఉంచవలెను; పరుల నిందించుట వారి పై కొండెములు చెప్పుట పృష్టమాంస భక్ష ణము. వీనిచే కలిగిన పాపము తామ్ర పాత్ర దానముచే నశించుగాక! కన్య విషయమున ఆనృతము పలుకుటవలన గోవులను పర దారలను అవమానించుట వలన కలిగిన పాపము నేచేయు ఈరాగి వెండి పాత్రల దానమున నశించుగాక! అనుచు ఈ రాగి వెండి పాత్రలను చర్మపు పై (ముందరి) ఎడమ, కుడి, పాదములకడ ఉంచవలెను; జన్మి నర సహ సములందు దుర్బుద్ధితో నే జేసిన పాపమంతయు నేజేయు ఈ స్వర్ణపాత్ర దానమున నశించుగాక; జనార్ధనా! యనుచు బంగరు పాత్ర నుంచవలెను; బంగారు ముత్తెములు పగడములు దానిమ్మపండ్లు మాదీఫలములు ప్రశస్త పాత్రమందుంచి చెవులయందు గిట్టలయందు కొమ్ముల నడిమిచోటునందు ఇంకను సర్వశాక ఫలములతో కూడ ఉంచవలయును.

ఈ దానము గ్రహించు ఆహితాగ్ని యగు బ్రాహ్మణుడును స్నానము చేసి దోవతి ధరించి ఉత్తరీయము వేసికొని యథాశ క్తిగా అలంకరించుకొనవలయును; అతడు దీనిని తోక వై పున ప్రతిగ్రహించవలయును; దానమంత్ర మిది: “నల్లని కృష్ణాజినమా! నల్లని కంఠము కల వాడు కృష్ణాజినము దాల్చినవాడునగు వృషభధ్వజుడు నీదానముచే ప్రీతినందు గాక! నా పాపములు తొలగుగాక!” ఇట్లు కృష్ణాజిన దానమయిన తరువాత దాత ఆ విప్రుని తాకరాదు; ఏలయన ఆత డపుడు చితియందలి యూపకాష్టముతో సమానుడు; ఆతనిని దానకాల కొద్దకాలములందు దూరముగ విడువదగును; (తాక రాదు.) అంతట ఆ విప్రుని అతని ఇంటికి పంపి దాత మంగళస్నానము చేయవలయును; చంపక శాఖతో కూడిన కుంభ మందలి జలముతో ఆచార్యుడు ఆ కుంభమును దాత శిరము పైగానుంచి అతని తల పై “ఆప్యాయస్వ” “సముద్ర జ్యేష్ఠాః” ఆను ఈ మొదలగు పదునారు ఋక్కులతో జలము ప్రోక్షించపలెను; తరువాత దాత క్రొత్త వస్త్రములను (జతనుండి చించని వానిని) ఒకటి దోవతిగా మరియొకటి ఉత్తరీయముగా ధరించి ఆచమించినచో శుచియగును; ఆ కుంభమును మిగిలిన పదార శేషమును నాలుగు తోవలు కలిసిన చోట పారవేయవలెను; దీని చే కలుగు భగవత్పీతి ఇంతయని చెప్పుట దేవత లకును శక్యముకాదు; ఐనను ఉద్దేశ (నామగ్రహణ) మాత్రమున చేప్పేద వినుము; నమగ భూదాన ఫలమబ్బును; ఇందు సంశయమే లేదు; కామచారియై వక్షవలే సర్వలోక సంచారియగును; ఆ ప్రళయాంతముగా స్వర్గ ప్రాపుడె సుఖించును; వానికి పితృ పుత భార్యాదులతోడి వియోగము సంభవించదు; ధనత్యాగ దేశ త్యాగములు కలుగవు; కృష్ణునకును ఇష్టమగు కృష్ణ మృగ చర్మమును సమాహితచిత్తుడై విప్రునకు దానమిచ్చినచో ఈ యథోక్త దానఫలమున శోక రాహిత్యమును మనో భీష్టఫలసిద్ధియు కలుగును.

[గమనిక : ఇందు చెప్పినవనీలో “ఆప్యాయ స్వ” అనునది (ఋగ్వేద-1 మం-91 సూ క్షము) మొదలుగ ఎనిమిది ఋక్కులున్న వి; “సముద్ర జ్యేష్ఠాః” (ఋగ్వేద.7 మం. 4) సూక్తము మొదలుగ నాలుగు ఋక్కులున్న వి. ఇవి మొత్తము పండ్రెం డే; మూలమునందు షోడశ (పదునారు) అని యున్న ది; అదీ “ద్వాదశ” (వం డ్రేండు) అని యుండవలెనేమో; సంప్రదాయమున తెలియ వలెను.]

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మను మత్స్య సంవాదమున కృష్ణాజీన ప్రధాన విధానమను రెండు వందల ఐదవ యధ్యాయము.