మత్స్య మహా పురాణము
244 - వామన జననము-వామనుడు బలియజ్ఞవాటమునకు పోవుట.
శౌనకుడర్జునునకిట్లు చెప్పెను: అసురులందరును నిస్తేజస్కులగుట చూచి అసురేశ్వరుడగుబలి పితామహుడగు ప్రహ్లాదునిట్లడిగెను; తండ్రీ! దైత్యులందరును ఇట్లు ఆకస్మాత్తుగా వహ్ని తో దగ్గులయి రేమో బ్రహ్మండము చే దెబ్బతిని రేమో యనునట్లు నిస్తేజస్కులయి రేల? దైత్యులేమైన దుర్యజ్ఞములాచరించిరా? వైరులేదయిన కృత్యమ నిర్మించగా ఆది వీరి నాళమున కై సముద్భూతమయినదా? అని పౌత్తూడడుగ వీరుడగు దైత్యపతి ప్రహ్లాదుడు చాలతడవు ధ్యానించి ఇట్లు పలికెను: ఆకస్మికముగా గిరులు చలించుచున్నవి; భూమి నిబ్బరము కోల్పోవుచున్నది; సముద్రములు క్షోభిల్లు చున్నవి; దైత్యులు నిస్తేజస్కులుగా చేయబడిరి; సూర్యాదిగ్రహములు ఎప్పటివలె నడుచుటలేదు; ఈ హేతువులను బట్టి దేవతలకు పరమలక్ష్మి కలుగనున్న దని యూహించవచ్చును; మహాబాహూ! ఇది మహాకారణమే; సురవైరీ: ఇది అల్పకార్యమని తలచకుము; అని దానవ పతితో పలికి అసురోత్తముడును అత్యంతహరి భక్తుడును అగు ప్రహ్లభుడు మనసా హరిని ధ్యానించెను; ప్రహ్లాదుడును మనోహరమగు ధ్యానయోగమనుష్టించి దేవదేవుడగు జనార్ధనుని తనచిత్తమున విచారణచేసికొనెను; ఆప్రహ్లాదునకు అదితియుదరమునందు వామనరూపుడై తనయుదర మందు సప్తలోకములను ధరించిన ఆది ప్రజాపతియగు నారాయణుడు కనబడెను; అతని లోపల వస్తువులు రుద్రులు అశ్వినులు మరుత్తులు సాధ్యులు వి శ్వే దేవులు ఆదిత్యులు గంధర్వులు నాగులు రక్షస్సులు విరోచన తనయుడు అసుర నాయకుడునగు బలిజం భకుజంభనరక బాణాది మహాసురులు తానును (ప్రహ్లాదుడు) భూమి ఆకాశము వాయువు జలము అగ్ని సముద్ర వృక్ష పర్వత నదీ సరస్సులు పశువులు దేవ మానవ సరీసృపములు సర్వలోక సష్టియగు బ్రహ్మరుద్రుడు గ్రహనక్షత్ర విశేషములు దక్షాది ప్రజాపతులు కనబడిరి. ఇవియన్నియు చూచి విస్మయావిష్టుడయియు ప్రహ్లాదుడు క్షణములో మరల తేరుకొని దైత్యేంద్రు డును విరోచన పుత్రుడునగు బలితో ఇట్లనెను:
బలిం వ్రతి ప్రహ్లదోవదిష్టవిష్ణుమహిమా.
నాయనా! నేనంతయు నేరిగితిని; మీకందరకును తేజోహాని కలిగిన హేతువు యాథార్థ్యముతో తెలి పెదను; వినుము; దేవదేవుడును జగత్కారణుడును తనజన్మకు కారణమగునది లేని వాడును జగదాది కర్తయు అనాదియు విశ్వమున కాదియు వరేణ్యుడు (శ్రేష్ఠుడు - ప్రార్థనీయుడును వరదుడును హరియు (పాపములను హరించువాడును) గొప్పవాని యన్నింటిలో గొప్పవాడును గొప్పవారికిని గొప్పవాడును ప్రమాణములకును ప్రమాణభూతుడును సప్తలోకగురుడు(తండ్రి) అగు బ్రహ్మ కును తండ్రియు ప్రభులకును పరమ ప్రభువును మహాత్ముడును ఆదిమధ్యాంతరహితుడును భగవానుడును ఆగు మహాత్ముడి విష్ణువు త్రైలోక్యమును సనాధము (రక్షణక లది)గా చేయుట కై అంశముతో అదితి గర్భమునందవతరించినాడు; రుద్ర_ హ్మేంద్ర రవీందులకును మరీచ్యాది ప్రజాపతులకును - ఆతని స్వరూపమెరుగరానిది; తన కలాంశముతో నృసింహ రూపుడై మునుపు మా తండ్రిని చంపిన ఈ శుడు సర్వయోగీశ మనోనివాసుడునగు వాసుదేవుడీతడు; వేదతత్వవిదు లీయక్షరునెరిగి జ్ఞానబలమున తమ పాపముల పోద్రోలి ఆతనియందే లయమందుదురు; వారు మరల జన్మించరు; అట్టి వాసుదేవుని నమస్కరింతును; సముద్రమునుండి ఆలలువలే అతని నుండియే సమస్త భూతములునతని నుండి జనించి ప్రళయమున నతనియందే లయమందును; రుద్ర బ్రహ్మాదులును ఆ పరమపురుషుని రూప బల ప్రభావ భావముల నెరుగజాలరు; రూపస్పర్శ రన శబ్ద గండ గ్రాహులగు చక్షు స్వక్ జిహ్వా శ్రోత్రఘాణములును అతనిని గ్రహింపజాలవు;
అట్టి స్తవనీయుడును మనోమాత గ్రాహ్యుడును ఈశ్వరుడునునగు హరిని వాసుదేవుని నమస్కరింతును; తన ఏకదంష్ట్రాగ్రముతో నతడు భూమిని ధరించినందుననే ఆ దేవియు ఈ సర్వభూతములను ధరించగలుచున్నది; ఈ సకల జగము నాతనియందే శయనించియున్నది; అట్టహరి అంశావతారమెత్తి దైత్యతేజములకు హానిక లిగించినాడు; సంసార వృక్షకుఠారుడగు ఆ దేవుని నేను ఆజ సమును నమస్కరించుచుందును. మహాత్ముడగు ఆదేవుడు జగత్కారణుడు. మహా సురేంద్రా! ఆతడు తన పదునారవ అంశముతో దేవమాతృగర్భమున ప్రవేశించినందున నతని బలముచే దైత్య శరీర తేజస్సులు హరింపబడినవి.
బలికృత విష్ణ్వాక్షేన
ఇది విని బలి ప్రహ్లాదునిట్లు ప్రశ్నించెను: తండ్రి ఏహరివలన మనకు భయమేర్పడినదనుచున్నావో - అతడు ఎంతటివాడు? బలమున ఈ వాసుదేవునికంటె ఆధికులగు దైత్యులు వందల కొలదిగా నాకడనున్నారు; విప్రచిత్తి శిబి శంకువు అశ్వశీరుడు ఆయశ్శిరుడు ఖర శిరుడు మహాసురుడగు భంగకారుడు ప్రతాపుడు ప్రమసుడు శంభుడు సమరజయు డగు కుకురుడు వీరును మరికొందరును దై తేయులును దానవులునునాకున్నారు; వీరందరును మహాబలులు మహాభుజులు భూభారమును ధరింప సమర్థులు; కృష్ణుడు వీరిలో ఏ ఒక్కరి బలములో సగము కంటెను తక్కువ బలముకలవాడు; ఆని వైకుంఠునధి క్షేపించుచు మాటలాడు పౌత్రునిమాట విని దైత్యపుంగవుడగు ప్రహ్లాదుడు బలిని ఉద్దేశించి వీధీయనెను.
ఇటువంటి దుర్బుద్ధియు అవివేకియునగు నీవు రాజుగానున్న ఈ దే తేయదానవులు వినాశ మందుదురని నాకు తోచుచున్నది; దేవదేవుడు మహాభాగుడు అజుడు విభుడు అగువాసుదేవుని పాపసంకల్పుడవగు నీవుతప్ప ఇతరుడెవ్వడు ఇట్లు అనును? నీవు పేర్కొన్న ఈ సమస్త దైత్యదానవులును బ్రహ్మాది దేవతలును స్థావర పదార్థము లన్నియు ఆనంత రూపములగు సకల తత్వములును నీవును నేనును పర్వత వృక్ష నదీనద సముద్రద్వీప సహిత సకల జగమును కేశవునకు సరిపోలవు; అతివంద్యులకును వంద్యుడును వ్యాపియును పరమాత్ముడునునగు ఎవని ఏకాంశములో సర్వజగము రూపొందినదో అట్టి హరిని అవివేకివి వినాశాభిముఖుడవు ఆగు నీపుతప్ప మరెవ్వరిట్లనగలరు? నీవు దుర్బుద్ధివి; సంస్కోరరహిత చిత్తుడవు; పెద్దల ఆదుపుమీరి నడుచువాడవు; దురాత్ముడు కృష్ణనిందకుడునగు నిన్ను కనిన ఆధము డగు నీతండ్రి నా ఇంట జన్మించినందున నేను శోచనీయుడనైతిని; కృష్ణునియందు నిలిపిన భ క్తి సంసారమందంతటను నర్వపాపనాశ నియై యున్నది; నీవు నన్నైన గమనించవలదా? మహాత్ముడగు కృష్ణునికంటె మించి నాకు నా దేహము కూడ ప్రియతరముకాదని లోకము ఎరుగును; నాకు ప్రాణములకంటెను హరిప్రియ కత)రుడని నీవేరుగకున్నా వే? నీవు నన్ను కూడ గౌరవింపక ఆతని నిందించుచున్నా వే: జలీ! నీగురుడగు విరోచనునకును గురుడనగు నొకును శ్రీహరి గురుడు; ఇట్లు గురు గురు గురుడగు కృష్ణుని నిందించుచున్నందున అచిర కాలముననే నీవు ఐశ్వర్య భ్రంశమందుదువు; బలీ! జనార్దనుడు అగు జగన్నాధుడు నాకు దేవుడు గదా! నీకు నేను అనాదరణీయుడను ఉపేక్షణీయుడను ఐనను నాగురుడగు అతడు నీయందు ప్రీతికలవాడు కావలయును కదా! నీవింత మాత్రముకూడ ఆలోచింపక జగద్గురునీ నింద చేసితివి కావున నిన్ను శపించుచున్నాను; నీవు నాతో అచ్యుతుని నిందించి పలుకుట నా శిర శ్చేదముకంటె బాధాకరముగావున నీవు రాజ్యభ్రష్టుడవు అయి పతనమందుము; ఈ సంసార సముద్రమునందు రక్షకుడు హరితప్ప మరిలేడు కావున అట్టి హరిని నిందించిన నీవు త్వరలోనే రాజ్యభ్రష్టుడవగుట చూతును.
దైత్యవతియగు బలి ఆప్రీతికరమగు తన గురు (పితామహు)ని వచనమును విని ఆతనిని మరల మరల నమస్కరించుచు అతనిని ప్రసన్ను నొనర్చి కొనుట కై బ్రతిమాలసాగెను; తండ్రీ! ప్రసన్నుడవుకమ్ము; అజ్ఞానహతుడనగు నా పై కోపింపకుము; బలగర్వ మత్తుడనయి నేనీమాట ఆంటిని; దైత్యోత్తమా! నేను మోహముచే నా విజ్ఞానమును కోల్పోయితిని; పాపుడను; దురాచారుడనగు నన్ను శపించి నీవు మంచిపనియే చేసితివి; తండీ! నీపమున నాకు రాజ్యధనములు పోవునని నను నీవిషయమున ఆవినయము చూపితినన్నందులకు కలిగినంత దుఃఖము కలుగుటలేదు; త్రైలోక్య రాజ్యము కానీ ఐశ్వర్యము కాని ఇట్టి మరేది కాని లోకమున దుర్లభము కాదు; ఈ సంసారమున నీవంటి గురువులే దుర్లభులు; కావున దైత్య పతీ! అనుగ్రహించుము; కోపింపకుము; తండ్రి! నేను నీకోప దృష్టికి పరితాపపడుచున్నాను కాని శాపమునకు కాదు; ఆన ప్రహ్లాదుడిట్లనెను: నాయనా! కోపముచే నాకు మోహము జనించినది; దానిచే వివేక మపహరింపబడినందున శపించితిని; అంతే కానిచో సర్వగుడగు హరి నేరిగిన నేనెట్లు శపించియుందును? అసురపుంగవా! నేను నీకిచ్చిన శాపమవశ్యము జరుగ వలసియేయున్నది; కావున నీవు దుఃఖింపకుము; ఇది మొదలుకొని దేవేశుడు భగవానుడు అచ్యుతుడు ఈశుడునగు హరి యందు భక్తి కలిగియుండుము; అతడే నిన్ను రక్షించును; శాపఫలము కలిగిన తరువాతను కూడ నాయనా! నన్ను స్మరించుచుండుము; దానిచే నేనును నీకు ! శేయము కలిగించయత్నింతును; అని పలికి మహాద్యుతియగు బలి విరమించేను.
బ్రహ్మకృత వామనమూర్తి స్తుతిః.
శ్రీ వామన మూర్త్యవతార ఘట్టము.
ఆంతట భగవానుడగు గోవిందుడు వామనాకృతియై జనించెను; సర్వామరేశ్వరుడగు ఆ జగన్నాథుడవతరించ గనే దేవతలును తన్మాతయగు అదితియు దుఃఖముక్తులయిరి; సుఖస్పర్శ వాయువులు వీచెను; గగనము నిర్మలమయ్యెను? సర్వభూతములకు ధర్మమందాసక్తి కలిగేను; అసురులకును భూమ్యంతరిక్ష ద్యులోక వాసులకును తదాదిగా ఉద్వేగము తగ్గేను; అతడు జనించినంతనే లోక పితామహుడగు బ్రహ్మ ఆతనికి జాతకర్మాధికము జుపి అతనిని దర్శించి ఋషులు వినుచుండ ఆ దేవదేవేశునిట్లు స్తుతించేను: జయజయ ఆద్యా! ఈశా! అజేయాః సర్వాత్మకాత్మకా! జన్మజరారహితా! అనంతా! అచ్యుతా! అజితా! అమేయా! ఆవ్య కస్థితీ! పరమార్థవ స్తురూపా: సర్వజ్ఞా! జ్ఞాతృజ్ఞానప్లేయరూపా! స్వయంభూరూపా! అశేష జగత్సాక్షిన్! జగత్కర్తా! జగద్గురూ! జగల్గితిలయక రా! జగత్పాలక! శేషా! ఆ శేషా! ఆఖిల హృదయావాసా! ఆదిమధ్యాంత రూపా! సర్వజ్ఞానవిధీ! ముముక్షువులును ఇట్టివాడవని నిర్దేశింపనలవికాని దేవా! ఆత్మతృప్తి? జనేశ్వరా! యోగిముక్తి ఫల ప్రదా! దమాది గుణవిభూషణా! అతిసూక్ష్మా! దుర్జయా! స్థూలజగన్మయా? అతీంద్రియా! సేంద్రియా! మాయాయోగస్థితా శేషభోగశయనా! ఆక్షరా? ఒక కోర కొనతోనే వసుంధరను పైకెత్తినవాడా! నృసింహా; శత్రువక్షఃస్థల విదారణా! విశ్వాత్మన్! వామనాః కేశ వాః స్వనయా వస్తాచ్చాదితజగన్మూ క్లీ! జనార్ధనాః అనేక రూపా! ఏక రూపొ! ప్రభూ! వర్థిల్లుము; వర్దితా శేష వికారయుత ప్రకృతీ! హరీ! జగదీశుడవగు నీయందే ధర్మ మార్గము నిలిచియున్నది; నేను కాని రుద్రుడు కాని ఇంద్రాది దేవతలు కాని మునులును సనకాది యోగులునుకాని నిన్నే రుగజాలరు. జగత్పతీ! నీమాయయను వస్త్రముతో కవువడిన ఈ జగమందు సర్వే: నీ యనుగ్రహమందక ఎవడు నిన్నే రుగును? నిన్నా రాధించి ప్రసాద సుముఖునిగా చేసి కొనినవారు మాత్రమే కాక ఇతరులు నిన్నె రుగజాలరు; నందీశ్వరేశ్వరా! ఈశానా! ప్రభూ! వామనా! విశ్వాత్మన్! విశాల లోచనా! ఈ జగద భ్యుదయమునకై వర్దిల్లుము.
ఇట్లు స్తుతింపబడి వామనాకృతియగు హృషీ కేశుడు నవ్వి వద్మభవునితో భావ గంభీరముగ ఇట్లనెను: పూర్వము నేను నీచే ఇంద్రాదులచే కశ్యపునిచే స్తుతింపబడి ఇంద్రునకు భువనత్రయ రాజ్యమిత్రునంటిని; మరల ఆదితి చేతను స్తుతింపబడి ఇంద్రునకు నిష్కంటకమగు త్రైలోక్య రాజ్యము నిత్తునంటిని; నేనట్లే చేయుదును; సహస్రాక్షుడగు ఇంద్రుడు మహేంద్రుడై జగత్పతియగును; ఇది సత్యము; అని నంతట హృషీ కేశునకు బ్రహ్మ కృష్ణాజినమును బృహస్పతి యజ్ఞోపవీతమును బ్రహ్మసుతుడగు మరీచి ఆషాఢ దండమును వసిష్టుడు కమండలువును ఆంగీరుడు కుశపవిత్రమును పులహుడవసూత్రమును పులస్త్యుడు తెల్లని వస్త్రములను ఇచ్చిరి; ప్రణవోచ్చరణాలంకృతములగు వేదములును అనేక శాస్త్రములును సాంఖ్యము యోగము ఆతనిని స్వయముగ వచ్చి ఆశ్రయించి సేవించెను; ఆ వామనుడును జటా దండ చ్ఛత్త కమండలు ధారియై సర్వదేవ మయు డై బలి యజ్ఞమునకు పోయెను; ఆతడడుగిడిన ప్రతి భూమ్యంశమును ఆతి పీడితమయి వివరము నిచ్చుచుండెను; వామనుడును మంద మృదుగతియై పోవుచున్నను సముద్ర ద్వీపాదయుతయగు మేదిని చలించుచుండెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వామన చరిత్రమున వామన మూర్త్యవతారమను రెండు వందల నలువది నాల్గవ అధ్యాయము.
