మత్స్య మహా పురాణము
119 - మద్రరాజ పురూరవ స్తపశ్చర్య-గంధర్వాప్సరసల నానావిధ విహారముల వర్ణనము
రమ్యమగు ఆ ఆశ్రమమున మద్రరాజు పురూరవసుడు ఏ పరివారమును ఏ సాధనములును లేక ఒంటరియై ఆహారమును కూడ విడిచి తపమాచరించుచుండ ఆ తావులందే అప్సరసలు గంధర్వులతో క్రీడించుచుండెడివారు. అతడది. చూచుచునే ఉండియు వాటియందాస క్తి లేక పూవుల సేకరించి పెద్ద మాలను కూర్చి దానియందలి మొదటి అంశమును దేవదేవునక ర్పించి మిగిలిన అల్ప ఖండమును గంధర్వులకు (దేవజాతి వారు కదా అను ఆదరముతో) ఇచ్చే డీవాడు.
దేవవేశ్యలు (అప్సరసలు) కూడ పుష్పోచ్చయము చేయుచు యథా సుఖముగా వివిధములుగ క్రీడించుచుండ అతడు ఆది చూచుచుండియు చూడనివాడుగనే ఉండెను.
క్రీడా వర్ణనము
ఒకతె పూవులు కోయుచు ఏరుచునుండ ఆమెను తీగలు చుట్టుకొనెను. ఆమేను పాపము! సఖులును ప్రియు డును విడిచిపోయిరి. ఒక తే ముఖము కమల గంధము కలదగుటచే శ్వాసవాయువులచే ఆకర్షింపబడిన తుమ్మెదలు మొగము పై గుంపుగా క్ర మ్మి కలవరపరచగా ప్రియుడును ఆమెను విడిచి దూరముగా పోయెను. ఒక తే కంటిలో మక రందము పడెను. ! ప్రియుడు. తన శ్వాసవాయువులతో కంటియందలి ధూళిని పోగొట్టి బాధ పోగొ పెను. ఒకతె పూవులు కోసి ఏరి తెచ్చి ప్రియునకీయ ఆతడు దానితో కూర్చిన మాల తన శిరమున నలంకరించుకొని ప్రకాశించేను. ఒక తే తానై పూపులు కోసి ఏరి వానిని మాలగా కూర్చి పియుని శిరమున సలంక రించగా నాతడు తను ధన్యునిగాను మన్మథో దీపనము చేయగల సుభగునిగాను భావించెను. ఒక తే తన ప్రియుడు తనతో ఏకాంతమున విహరింపగోరి అదిగో! ఆ దట్టమైన పూబోదయందు ఎక్కువ పూలుగల తీగలున్న వని అటకుపోయి పూలు సేకరించసాగెను. అపుడు ప్రియు డామెను విలాసముగా తీగలతో కట్టివేయగా ఆమే తాను మిగిలిన తన చేలులందరకంటే సర్వాధిక గుణములుగల సౌభాగ్య వతియని భావించి తృప్తియయ్యెను.
సాటిలేని కాముకియగు ఒకతే గంధర్వులతో తాను క్రీడించుచుండియు ఆ సరస్సులయందు వేరువేరుగ ప్రతి ఫలించుచున్న ఆరాజును చూచుచుండెను. నిర్మలమయిన చిరునవ్వు నిర్మల హృదయము కల ఒకతే నీటితో ప్రియుని కొట్టి మరల నాతడు తను నీటితో కొట్టగా సంతోషించెను. ఒకతే ప్రియుడు తను కొట్టుచుండ పోనిమ్మని ఊర కుల డేను. అందుచే ఆమెకు ఒడలు చెమట పట్టుటయు నిట్టూర్పు వాయువులచే ఆమె వక్షోజములు నృత్యము చేయుటయు కానవచ్చెను. ప్రియుడు తను వెంటాడి కొట్టుటచే ఒక తేకు కొప్పు శిథిలమైనందున మొగమంతయు వెంట్రుకలు క్రమ్మగా తుమ్మెదలు క్రమ్మిన పద్మలతవలే కానవచ్చెను. ఒక తే తన కన్ను లను పోలు తామరలు కొలనినిండ ఉండుటచే తన ప్రియుడు వెదకి వేదకి చాల సేపటికా మేను గుర్తించి దగ్గరకు వచ్చెను. ఒకానొక ప్రొడాంగన సుఖానుభవములో నేర్పు మీరిన శ్రీ) స్నానము చేయుటచే చలి వేయు చున్నదను నేపమున తనకు చిరాభిలషితమగు తన ప్రియుని ఆలింగనమును పొందగలిగేను. స్నానమాడినందున తాను ధరించిన నన్న ని వలువ తన ఒడలికంటుకొనిపోయిన ఒక తే చూపణకు కామభావమును ఉద్దీపింప జేసెను. ఒక తెను ప్రియుడు ఆమె కంఠమందలి హారములు పట్టిలాగెను. లా గుచుండగా ఆ దారమును తెగినందున ఆ ! ప్రియుడు ముందునకు మొగ్గిపడగా అమే సవ్వేను. ఒక తే మోకాళ్ళపై ఆమెకు చేరువగానున్న చేలి తన గోళ్ళతో క్షతము చేయగా ఆమె తడబాటుతో పోయి తన ప్రియుని పై పడి అతనితో చాల సేపు మాటలాడుచు కనబడెను. ఒకతె సూర్యునికి ఎదురుగా నిలిచి వెంట్రుక లార బెట్టుకొనుచుండియు కామార్తములగు నేత్రములతో తన ప్రియుని చూచుచు శిలాతలము పై కూర్చుండియుండుట కానవచ్చెను. ఇట్లా సరస్సు నీరంతయు మాల్యములతో నిండేను. కెలికి వేయబడెను. స్తన కుంకుమముతో కలిసెను. ఇట్లది రత్నములు పొదిగిన బంగారు సొమ్ములవలె సయ్యేను.
ఇట్టి స్థితియందు కూడ చక్కగా స్నానమాడిన దేవస్త్రీలును దేవగంధర్వ స్త్రీలును దేవదేవుడగు జనార్దనుని పూజించుచుండుటను ఆరోజు చూచెను.
ఒకానొక చోట కొందరు (దేవ) స్త్రీలు తమ ప్రియులయందు తమ మనస్సులు లెస్సగా నిలిపి లతాగృహ గతలయి తమ గాత్రముల నలంకరించుకొనుచుండుట రాజు కాంచేను. ఒకతే చేత ఆద్దముంచుకొని చూచుకొనుచు తన దూతి వచించు తన ప్రియుని వచనములు వినుచు మీగుల అందముతో ఒప్పెను. గ్రామ భావ పరవశ యగు ఒక తె తను దూతి త్వర పెట్టుచుండ అందుచే జరుపుచున్న తన అలంకరణములో భూషణముల తారుమారును గురుతింపక పోయేను. ఒకానొక చోట వాయు పేరణచే కదలు అతి సుగంధి పుష్పయుతమగు నల్లని పచ్చికబయట ఆయా పానీ యముల తావు శ్రీలాతనిని కనవచ్చిరి. ఒక ఉత్తమాంగన తన ప్రియునిచే పాలు త్రావించుచుండెను. మరియొక తన ప్రియుడందించు పాలు తాపుచుండెను. ఒకతే తన కన్ను లవలే చంచలములగు నల్ల కలువ రెక్కలతో కూడి ఉన్న పాలు త్రావి నా ఆ కలువపూలెక్కడకు పోయెనని యడిగెను. నీవే అవి త్రావియుండవచ్చునని ప్రియు డనగా అపుడది గుర్తించి తానంతటి అమాయికురాలయినందులకు చాల సేపు సిగ్గుపడియుండెను. విశిష్టములగు రుచులు గల రసములతో మీ శితమగు కామవర్ధక పానీయమును తన ప్రియుడు వి పిదప తనకందీయగా ఒకతె తానది త్రివెను. ఇట్లే జరుగుచుండిన ఆపానగోష్టులందు తంత్రీవాద్యముల స్వరముతో ఏమి శితమగు వివిధ గీతముల నాదేవస్త్రీలు పాడుచుండ రాజది వినెను. వారు అనుదినమును ప్రదోష సమయములందు అట్లే దేవదేవుడగు జనార్దనుని సన్నిధియందు నొ నొవాద్య సహితముగా నృత్యము చేయుచుందురు. జామురాత్రి గడచిన తరువాత గుహా ముఖము నుండి వెలికివచ్చి తమకు తమకు ఏర్పరచబడిన ఆయా గుహలను తమ ప్రియులతో కూడి ఆవాసముగా చేసికొందురు. ఆ గుహలు నానాగంధాన్వితతలములయి సుగంధముల నీనుచుండును. నానావిధములగు పడకలు కుసుమాలంకర ణములు వానియందుండును. ఈ విధముగ ఆ పర్వతమున ఆప్సరసలు చేయు ఆయా విహరణములను చూచుచుండి (యు వానియందాసక్తుడు కాక) మహారాజు కేశ వార్పితమానసుడై తపమాచరించెను.
ఒకప్పుడు ఆ గంధర్వాప్సరోగణములు రాజుకడకు పోయి ‘ఆరిందమా! నీవు వచ్చిన ఇది స్వర్గతుల్య దేశ ము. మేము నీకు మనఃకాంక్షిత వరముల నిత్తుము. అది గ్రహించిన తరువాత నీవిటనే యున్ననుసరే. ఇంటికి వేడ లీననుసరే; ఆనిరి. మద్రరాజు పురూరవసుడును “అమితమగు ఓజస్సుగల మీ దర్శనము వ్యర్థముకాదు. మధు సూదనుడు నన్న నుగ్రహించునట్లు వరమిండు.” అనగా వారు 'తథాస్తు' అనిరి. ఆతడును ఒక మాసము కాలము జనార్ధనుని పూజించుచు అటనే యుండెను. ఆతనికి లోలత్వము లేనందులకు ఆ గంధర్వాప్సరసలు సంతసించిరి. వారికతడు ప్రీతిపాత్రుడయ్యెను. రత్న సహస్ర చిత్రమగు ఆయాశ్రమమును ఆరాజు మాఘమాస మధ్యమున ప్రవే శించెను. ఫాల్గున మానవు శీతోష్ణ భేదములతో ప్రీతిననుభవించుచు ఒక మాసము గడ పెను. ఫొల్లున కృష్ణ పక్షాంతమున రాజగు పురూరవునకు స్వప్న మున దేవదేవుని శుభవచనము "రాజా! ఈరాత్రి గడువగనే నీకు అతిమునితో సమాగమమగుమ. అందుచే నీవు కృతకృత్యుడవగుదువు," అనుచు వినబడెను. ఇంద్ర విక్రముడగు ఆ రాజర్షి ఇట్లు స్వప్నము కాంచి పిదప ప్రత్యూష కాలమున స్నానము చేసి నియతేంద్రియు డై కృతకృత్యుడనై తినను భావముతో జనార్దను నర్చించియుండెను. అంత లోనే కాంతితో జ్వలించుచు అత్రిముని అటకు వచ్చెను. ధార్మికుడగు ఆరాజు తన స్వప్న దర్శనము నామునికి తెలి పెను. రాజా! ఇది ఇప్లేయగును. ఇందు సంశయింపవలసిన పనిలేదు. అని అత్రియు దేవతలును పలికిన పలుకులు అత - కి వినవచ్చెను. ఇట్లు దేవదేవుడగు జనార్ధనుని వలన అనుగ్రహమంది రాజు దేవతార్చనమును అగ్ని హోత్రమును జరిపి సర్వకామ పూ ర్తినొందెను.
(ఉత్తర భారతమున కృష్ణపక్షముతో మాసారంభము లెక్కింతురు. రాజు మామ మధ్యమున అనగా కృష్ణ పక్షము ముగియగానే శుక్లపక్షారంభమున ఆత్యాశ్రమమునకు పోయెను. ఆ పక్షమంతయును ఫాలున కృష్ణపక్ష మంతయును కలిసి సమగ్రమగు ఒక మాసమగును.)
ఇది శ్రీమత్స్య మహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భరత వర్షాంతర్గత భరతఖండ వర్ణనమున మద్రరాజ పురూరవసుని వరప్రాప్తియను నూట పందొమ్మిదవ యధ్యాయము.
