మత్స్య మహా పురాణము

Table of Contents

106 - ప్రయాగ మాహాత్మ్యము 

యుధిష్ఠిరుడు మార్కండేయు నిట్లడిగెను: అయ్యా! తాము కీర్తించిన ప్రయాగ మాహాత్మ్యమును విని నా హృద యము విశుద్దమయినది. భగవన్! ఆచట నెట్టి యాచరణమున ఆనాశక (ఎన్నటికిని నశించని) ఫలము కలుగునది తెలు పుము. దానిచే నరుడు సర్వపాపముక్తుడై యే లోకములనందును? అన మార్కండేయు డతని కిట్లు వచించెను: రాజా! ప్రయాగ తీర్థయాత్రచే అనాశక ఫలమునందు విధము వినుము. వివేకవంతుడును శ్రద్ధాళువును జితేంద్రియుడు నగు పురు. షుడు ఆ యాత్రచే అనాశకఫలమునంది అంగవికలుడును రోగియు కాక పంచేంద్రియ సుఖము లనుభవించును; అడుగడు గున అశ్వమేధఫలము నందును; తనకు ముందు వెనుకల పది తరముల వారిని తరింపజేయును; సర్వపాప వినిర్ముక్తుడై పరమపద మందును.

అనిన మార్కండేయుని పలుకులు వినిన యుధిష్ఠిరు డిట్లనెను: ప్రభూ! తాము చెప్పుదానిని బట్టి నరుడు అల్ప ప్రయత్నముతోనే బహు ధర్మాచరణఫలములనందు మహాభాగ్యము కలుగునని తెలియుచున్నది. కాని ప్రాకృత జనులును ఇంత సుక రముగ అనేకాశ్వమేధ ఫల మేట్లంద కలుగుదురని సంశయించుచున్నాను. ఇది తీర్ప వేడుచున్న నా కుతూ హలము తీర్పు డనెను. ఆతనికి మార్కండేయు డిట్లు తెలి పేను: రాజా! మహాపాప ప్రణాశ కమును మహాగుహ్యము నగు . విషయము చెప్పెదను. ఇది పూర్వము ఋషుల సన్నిధియందు చతుర్ముఖుడు చెప్పెను. ప్రయాగ మండలము ఐదు యోజనముల విసృతి కలది. ఆట ప్రవేశించి (పై జెప్పిన గుణములతో కూడి యాత్ర సేవించి)న యాతని కడుగడుగున నశ్వమేధ ఫల మబ్బును. గడచిన-గడువనున్న -ఏడేసి తరములవారి నతడు తరింపజేయును. అట ప్రాణత్యాగము చే కూడ ఈ ఫల మబ్బును. ఇది యెరిగి రాజేంద్రా! సదా శ్రద్ధాపరుడవు గమ్ము. పాపోపహతచిత్తులును అశ్రద్దధానులు నగు వారు దేవర క్షితమగు ఆ ప్రయాగ స్థానమును చేరి దాని సేవింపజాలరు.

ఆన విని యుధిష్ఠిరు డిట్లనెను: ద్రవ్యమునందు ప్రీతి లోభములకు వశులై కామవశులై ఈ యాత్ర చేసిన వారికి కలుగు తీర్థయాత్రఫలము ఎట్టిది? వారి కే గతి కలుగును? ఇది చేయదగు నిది చేయరాదనునది లేక యచట ధనాశ తో కామబుద్ధితో సర్వ ద్రవ్యముల నమ్ముకొను వ్యాపారి కే ఫలము కలుగునో తెలుపుము. అన మార్కండేయు డతని కిట్లు చెప్పెను: రాజా! మహాగుహ్యమును వినినంతనే పాపనాశకమునగు నది చెప్పెద వినుము. ప్రయాగయందు నరుడు నియ తేంద్రియుడై మాసకాలము స్నాన మాడినచో సర్వపాపముక్తు డగునని స్వయంభూ బ్రహ్మ చెప్పెను.

అచట, శరీరమున చిత్తమున శుచియు ప్రయతుడును అహింసకుడును శ్రద్ధావంతుడునగు వానికే పాపము క్తియు పరమపదప్రాప్తియు నగును; (పైకి పుణ్యము చేయువారుగా కనబడుచు); రహస్యముగ పాపములే యచట చేయువారికి కలుగు ఫలము దీనితోనే నీవు తెలిసికొనుము, 'ఆట్టివారు ఆచట మూడు పూటల స్నానము చేయుచు భిక్షాటనముచే జీవిం చుచు మూడు మాసములు గడపినచో ఆజ్ఞానకృతమగు పాపము నశించును. తీర్థయాత్రిఫల మబ్బును. సర్వకామపూర్తి నందును. స్వర్గ సుఖముల నందును, పిదప ధనధాన్య సమృద్ధి కలవారి యింట జనించును. లోభవంతుడే యగుగాక! అత డినీ ఎరిగి జ్ఞానవంతుడై ప్రయాగతీర్థ సేవ చేసినచో అతని పితృ పితామహాదులును నరకమునుండి తరింతురు. ధర్మానుసారినగు నన్ను ధర్మము నేరుగ గోరి నీవు మరి మరి యడిగినది గుహ్యము సనాతనమునగు విషయము నీ ప్రీతి కై చేప్పితిని.

అన యుధిష్ఠిరు డిట్లనేను: ఇపుడు నా జన్మము సఫలమైనది. నా వంశ పూర్వులు తరించిరి, మునీ! నీ దర్శన మున ప్రీతి చెందితిని. అనుగ్రహము నందితిని. సర్వపాపముక్తుడ నయితిని, ఆన మార్కండేయు డిట్లనెను: నీ జన్మము సఫలమగుటయు నీ వంశము తరించుటయు నీ యదృష్టమే.. ప్రయాగ క్షేత్రమును గూర్చి వినుటచే దానిని కీర్తించుటచే పాపనాశ పుణ్యవృద్దులు కలుగును. అన యుధిష్ఠిరు డిట్లనెను. మహామునీ! యమునా స్నాన ఫలమును నీవు కనివిని ఎరిగినంత తేలుపుము. ఆన ముని యిట్లనెను: రవిసుతయని త్రిలోక విశుతయగు యమున యను నామె మహాపుణ్యద యగు నదిగా ప్రసిద్ధయయి అట ప్రవహించుచున్నది. ఏ హేతువున గంగ ఉత్పన్న యైనదో ఆ హేతువుననే యమునయు ఆమెతో కలిసినది. అనగా ఆ రెండు నదులు నట ప్రయాగ తీరమున సంగమించుట ప్రాణుల పాపనాశమున కేయని యర్థము. వేల యోజనములయందుండి యా మేను కీర్తించినను పాపనాశకమగు యమునయం దచట స్నాన మాడినను జలము ఆచమించినను సమీపమందుండి ఆమెను కొనియాడినను భక్తితో దర్శించినను శుభములు కలుగుటలో సందేహమే లేదు. అట యమునా స్నానముచే జలపానముచే తానును తన ఏడు తరముల వారును పరమగతి నందుదురు. యమునా దక్షిణతటమున అగ్ని తీర్థమును దానికి పశ్చిమమున నరకమను ధర్మరాజ తీర్థమును కలవు. ఆట స్నానము చే పునరా వృత్తి రహిత లోకప్రాప్తు డగును. యమునోత్తర తటమున ఆదిత్య దేవతాక మగు నిరంజనతీర్థ మున్నది. ఇంద్రాది దేవ తలును తదితర విద్వాంసులును సంధ్యాదేవి నట ఉపాసింతురు. నీ వచట సదా తీర్థ స్నాన మాడుచు దానము చేయు చుండుము. అచట యమునా తీరమున పాపహరములు మరి యెన్నియో తీర్థములు కలవు. వానియందు స్నానముచే పునరావృత్తి రహితలోకప్రాప్తి యగును. గంగకు పెద్దరిక మిచ్చి పూజింతురే కాని వా స్తవమున గంగా యమునలు రెండును తుల్యఫలప్రదములే. కావున కౌంతేయా ! నీవు నే జెప్పిన తీరున సర్వ తీర్థ స్నాన మచట చేసినచో తత్ క్షణమే యావజ్జీవము నీవు చేసిన పాపము లన్నియు నశించును. వేకువనే లేచి ఇది చదివినను వినినను సర్వపాపముక్తుడై స్వర్గప్రాప్తు డగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఆరవ అధ్యాయము.