మత్స్య మహా పురాణము

Table of Contents

64 - ఆర్ద్రానంద తృతీయావ్రతము

ఈశ్వరుడు గౌరి కిట్లు చేప్పెను: ఇట్టిదియే పాపనాశ నియగు మరియొక తృతీయా వ్రతమును చెప్పెదను. దీనికి లోక మున ఆర్ధానందకర తృతీయా వ్రతమని ప్రసిద్ది. శుక్ల పక్షమున తదియనాడు ఆషాఢ ద్వయము కానీ రోహిణీ మఘాహ సమూల నక్షత్రములలో నేదైన కాని ఉన్న దినమున యజమానుడు దర్భలతో పవిత్రమయిన సుగంధ జలము లతో స్నాన మాడవలెను. తెల్లని వస్త్రములను తెల్లని పుష్పములను తెల్లని సుగంధపు పూతలను తాల్చవలేను. భవానీ మహాదేవులను మహాసనమున నిలిపి సుగంధవంతములగు తెల్లని పూవులతో పూజించవలెను.

పూజా మంత్రము: 1. వామదేవ్యై నమః శంకరాయ నమః-హర స్య పాదౌ పూజయామి; 2. శోక వినాశిన్యై నమః ఆనందాయ నమః ప్రభోః - జంఘే పూజయామి; 3. రంభాయై నమః శివాయ నమః - పినాకినః ఊరూ పూజయామి; 4. ఆనందిన్యై నమః శూలపాణయే నమః- శూలినః దేవ్యాశ్చ కటిం పూజయామి; 5. మాధవ్యై నమః భవాయ నమః - శంభోః నాభిం పూజయామి; 6. ఆనందకారిణే నమః ఇందుమౌళ యే నమః -శంకరస్య స్తనౌ పూజయామి; 7. ఉత్కం రిన్యై నమః నీలకంఠాయ నమః హరస్య కంఠం పూజయామి; 8. ఉత్పలధారియ్యై నమః- భద్రాయ నమః -జగతాం పతేః కరౌ పూజయామీ; 9. పరిరంభిజ్యై నమః నృత శీలాయ నమః-హరస్య బాహూ పూజయామి;10. విలాసిన్యై నమః దృ షే శాయ నమః-విభోః దేవ్యాశ్చ ముఖం పూజయామి; 11. స్మర లీలాయై నమః విశ్వవకాయ నమః-విభోః స్మితం పూజ యామి; 12. మదనవాసిన్యై నమః విశ్వధామ్నే నమః శూలినః నేత్రే పూజయామి; 18. నృతప్రియాయై నమః తాండవే శాయ నమః - శూలినః భుజౌ పూజయామి; 14. ఇంద్రా జ్యై నమః హవ్యవాహాయ నమః-దేవ్యాః విభోశ్చ లలాటం పూజ యామి; 15. స్వాహాయై నమః గంగాధరాయ నమః - దేవ్యాః విభోః మకుటం(శిరః) పూజయామి.

విశ్వము తమ శరీర మై అన్ని వైపులకు తమ ముఖములును పాదములును కరములును కలిగి ప్రసన్న ములైన ముఖములు కలవారగు పార్వతీ పరమేశ్వరులను నమస్కరించుచున్నాను.

ఇట్లు పార్వతీ పరమేశ్వరులను యథావిధిగా పూజించి మరల వారిముందు ముగ్గు పొడితో పద్మములు కలువలు శంఖచక్రములు కడియములు శంఖచక్ర ములు చామరములు అంకుశములు ముగ్గులు వేయవలెను. అచ్చటి భూమి పై ఎన్ని ముగ్గు ధూళికణములు పడునో అన్ని వేల ఏండ్లు యజమానుడు శివలోకమున ఆదరపాత్రుడై యుండును. తడు వాత అచ్చట బ్రాహ్మణునకు యధాశక్తిగా నాలుగు నేతి పాత్రలను అన్న పానీయములను బంగారమును కరక (గరిగ అను మట్టి పాత్ర) పై నాలుగు సకు ( పేల పిండి) పాత్రలను నాల్లు తిల పాత్రలను కూడ ఉంచి అవియును దానమీయ వలెను. ఇట్లు నాలుగు మాసములు ప్రతి శుక్లపక్షమునందును చేయుచుండవలయును. మార్గశిరము మొదలు కార్తిక మాసము వరకు పం డెండు మాసములలో వరుసగా ఈ నుంచి గంధము వేసిన నీరు-పుష్పములు(గులాబీల వంటివి) వేసిన నీరు-చందనము కుంకుమపూవు వేసిన నీరు.పాలు. తేనే.నేయి.గో శృంగములో పోసిన నీరు-పుష్పజలము.నల్ల (నూవుల) పొడి కలిపిన నీరు.వట్టి వేళ్లు వేసిన నీరు.యవల పొడి వేసిన నీరు-నూపులు వేసిన నీరు ఆ వ్రత దినము లందు రెండు పక్షములలో దేనియందయినను ఆహారముగా ఉపవసింపవలెను. వ్రతమునకు శుక్లపక్షమే చాల మంచిది.

 దాన కాలమున “ఇపుడు గౌరి నాయందు ప్రీతురాలై మంగళ (శుభక రురాలు) పాపనాశమును లలిత సౌభాగ్య మును భవాని సర్వసిద్ధులను కలిగించుగాక !” అను అర్థ మిచ్చు మంత్రము చెప్పవలెను.

ఇట్లు సంవత్సరమయిన తరువాత లవణము కుంకుమపూవు చందనము నేత్రపటము (కండ్లపై ధరించు ముసుగు వస్త్రము) బంగారు తామరపూవు చేరకుగడ-పండ్లు - ఉమా మహేశ్వర ప్రతిమ.పరపులతోను ఇతర పరికరముల లతోను కూడిన మంచముబ్రాహ్మణ దంపతులకు “గౌరీ మే ప్రీయ తామ్” అను మంత్రముతో దానము చేయవలెను.

ఈ ఆర్దానందకర తృతీయా వ్రతము పాపనాశకము ; దీనియం దుపవాసముతో ప్రతము చేసినవారు ఇహలోక మున ధనసంపత్తి ఆయురారోగ్యసంతతి పరమానందములు పొంది శోకరహితులై వరమున శంభులోకమును పొందుదురు.

దీనిని వినినను చదివినను ఆచరించినను సువాసినియు కన్యయు విధవయు ఐనను దేవ్యనుగ్రహపాత్రమయి ఈ చెప్పిన ఫలమునందును. ప్రతిపక్షమునందును మంత్రార్చన విధానము ననుసరించి ఉపవసించి వ్రతము చేసినవారు పునరా వృత్తి రహితమగు రుద్రాణీలోకము పొందుదురు. ఇంద్రలోకమున ముప్పది వేల సంవత్సరములు గంధర్వులచే పూజించ బడుదురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆర్ద్రానందకర తృతీయా వ్రతమను అరువది నాలుగవ అధ్యాయము.