మత్స్య మహా పురాణము

Table of Contents

55 - ఆదిత్యశయన వ్రతము 

నారదుడు ఈశ్వరు నిట్లు ప్రశ్నించేను:ఉపవాసములు చేయుటకు శ క్తిలేని వారై కాని వ్యాధి బాధవలనకాని అనాయాసముగా ఇదే పైన చెప్పిన ఫలమును కోరువారు చేయదగిన వ్రతము నుపదేశించుము. అనగా ఈశ్వరు డిట్లు చెప్పేను: ఉపవాసము చేయ శ క్తిలేనివారు న క్షము (పగలు ఉపవసించి రాత్రి భుజించుట) భుజించి చేయదగిన మహా వ్రతమును కలదు. చెప్పెదను; వినుము. ఈ వ్రతమునకు ఆదిత్య శయనమని పేరు. ఆయా నక్షత్రములు కల దినము లందు (సూర్యాభేద భావనతో) శంకరు నర్చించవలయును. న ప్రమీతిథి - ఆదిత్యవారము-హ స్తనక్షత్రము-సూర్యుడు ఏదేని రాశియందు ప్రవేశించుట - ఈ నాలుగు అంశములును కలిసిన దినమున ఈ వ్రతము చేసినచో అన్ని కోరికలును నేర వేరును. గృహమునందు సూర్యప్రతిమ శివలింగము ఈ రెంటిని పూజించరాదు. ఏదో ఒకటి మాత్ర ముండవలెను.) ఆదికాక రవి శివులకు భేదములేదు. కనుక రవి నామములతో శివమూ ర్తిని (కాని లింగమును కాని) పూజించవలెను.

1. సూర్యాయనమః_హ సనక్షత్ర పాదౌ పూజయామి; 2. అర్కాయనమః-చిత్రాసు-గుల్ఫౌ పూజయామి; 3. పురు షోత్తమాయ నమః-స్వాతీషు-జం ఘే పూజయామి; 4. ధాత్రేనమః విశాఖా సు-జానునీ పూజయామి; 5. సహస్రభానవేనమః అనురాధాసు-ఊరూ పూజయామి; 6. అనంగాయ ఇంద్రాయనమః - జ్యేషాసు- హ్యం పూజయామి; 7. సోమాయనమః మూలే కటిం పూజయామి; 8. త్వ ప్లే సప్తతురంగమాయనమః, పూర్వాషాడో తరాషాఢయోః నాభిం పూజయామి; 1. తీత్తాంశ వేనమః శ్రవణే. కుక్షిం పూజయామి; 10. వికర్తనాయనమః ధనిషాసు-పృష్టం పూజయామి; 11. ధ్వాంత వినాశ నాయనమఃశతభిషకు -వక్షఃస్థలం పూజయామి; 12. చండకరాయనమః పూర్వాభాద్రాసు ఉత్తరాభాద్రాసు. బాహూ పూజయామి; 16. సామ్నా మధీశాయ నమః- రేవతీషు-హసౌ పూజయామి; 14. సప్తాశ్వధురంధరాయ నమః అశ్వినీషు-నఖాని పూజయామి; 15. కరధామ్నే నమః -భరణీషు-కంఠం పూజయామి; 16. దివాకరాయనమః కృత్తి కాసు-గ్రీవాం పూజయామి; 17. ఆంబుజేశాయనమః.రోహిణీషు. అధరం పూజయామి; 18. రవయేనమః.మృగశీరే.దంతాన్ పూజయామి; 19. సవిత్రేనమః- ఆర్గాసు-నాసికాం పూజయామి; 20. అంభోరుహవల్లభాయనమః-పునర్వసాలలాటం పూజయామి; 21. వేదశ రీర ధారిణేనమః-పు ష్యే అలకాన్ పూజయామి; 22. ఏబుధప్రియాయనమః -ఆ శ్లేషాసు_శిరః పూజయామి; 28. గ్రహగణేశాయనమః మఖాసు కర్ణి పూజయామి; 24. గో బ్రాహ్మణనందనాయనమః-పూర్వఫల్గునీషు. నేత్రాణి పూజయామి; 25. విశ్వేశ్వరాయనమః -ఉత్తర ఫల్గునీషు భుజౌ పూజయామి; అను . ఈ మంత్రములతో ఆయా నక్షత్రములు గల దినములందు ఆయా అవయవములందు ప్రధాన భావనతో సర్వాంగ పూజను ప్రతిదినము న కవ్రత పూర్వకముగా జరుపుచుండవలెను. ప్రతి దినమునను శివుని ఉద్దేశించి ఈ చెప్పబోవు అర్థము కల మంత్రముతో స్తుతి చేయుచు శివుని శిరమున పూజ సేయవలెను: “పాశాంకుశ పద్మ శూలక పాల ఖడ బాణ ధనుర్ధారియు గజాసురుడు-మన్మ థుడు త్రిపురాసురులు. అంధక దానవుడు మొదలగువారి వినాశమునకు కారణమునగు శివునకు నమస్కారము.”.

ఈ పూజా వ్రత దీనములందు తైలము మాంసాహారులు కూడ) మాంసము ఉప్పు (కారము-పులుపు) లేని భోజనము చేయవలెను. ఇది పదునాలుగు సంవత్సరములు చేయవలసిన వ్రతము - ప్రతి సంవత్సరమును వ్రతము కడపటి (ఇరువది ఐదవ దినమున కుంచెడు మంచి వరిబియ్యమును మేడి పాత్రలో నేతిని బంగారమును బ్రాహ్మణునకు దాన మీయవలెను. ఏడవ సంవత్సరపు వ్రతములో వస్త్రముల జతనుకూడ ఈయవలెను. పదునాల్గవ సంవత్సరపు వ్రతములో భ క్తితో బ్రాహ్మణులకు గుడ క్షీర ఘృతాదికముతో భోజనములు పెట్టవలేను. ఎనిమిది అంగుళముల వ్యాసముకల బంగారు పద్మమును ఎనిమిది రేకులు నడుమ దుద్దు కల దానిని చేయించవలయును. రేకుల యందు పద్మరాగములు తాప టము చేయవలెను. ముడులు కాని ఎదురు నాలుకలు కాని లేని కొయ్యతో మంచము చేయించవలేను. దిండ్లు. చాందనీలు. పరపు విసనకర్రలు-పాదుకలు-చేప్పులు-గొడుగు చామరములు కాలిపీటలు. అద్దములు.అలంకారములు -ఫలములు-వస్త్ర ములు-గంధ ద్రవ్యములు అమర్చవలేను. ఆ మంచము పై ఆ పద్మమును అన్ని అమరికలతో ఉంచవలేను. పొడువని కపిల గోవును పొలిచ్చు దానిని దూడ కలదానిని వస్త్రములతో బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అలంకరించవలెను. పాలు పిదుకు కంచు పాత్రతో కూడ ఈ యావును. పై సామగ్రిని బ్రాహ్మణునకు మధ్యాహ్నము గడువకుండ దానమీయ వలెను. దానము ఇచ్చునపుడు ఈ యర్థము కల మంత్రము చెప్పవలెను: “ఆదిత్యా: నీ పడక ఎల్లప్పుడును కాంతితో నిబ్బరముతో శోభతో ఆనందముతో నిండియుండునట్లే నాకును ఈ అన్ని వృద్ధులును కలుగుగాక ! దేవతలు కూడ నీకంటె మరెవ్వరిని పూజ్యునిగా తలచరు కావున (నీ వందర దేవతల కంటే గొప్పవాడవు కావున) నన్ను అశేష దుఃఖ సంసార సాగరమునుండి ఉద్ధరింపుము.” పిమ్మట (బ్రాహ్మణునకు ప్రదక్షిణము చేసి అతనిని పంపవలయును. ఈ దాన ద్రవ్యములను ఆ విప్రుని ఇంటికి చేర్చవలెను.

 ఈ వ్రతమును నా స్త్రీకుడు కుతర్క దుష్టుడు నిందకుడు అగువానికి చెప్పరాదు. ఇది విని వాడింకను అధిక నింద చేయును. ఇంద్రియ నిగ్రహము కల భక్తునకు చెప్పవలెను. ఇది శివునకానందకరము; పొతకహరము; అక్షయ పుణ్యప్రదము. దీని నాచరించిన స్త్రీని పురుషునకును బంధుపుత పరివారములు దేవతా ప్రీతి లభించును. రోగ శోక దుఃఖములు కలుగవు. దీనిని పూర్వము వసిష్ణుడు అర్జునుడు కుబేరుడు ఇంద్రుడు చేసిరి. దీనిని కీర్తించినను పాపములు నశించును. దీనిని చదివినను వినినను ఇంద్రుడు ప్రీతి చెందును. ఆచరించినచో వాని పితరులు నరకము లందున్న ను స్వర్గమునకు పోయి సుఖింతురు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున ఆదిత్యశయన వ్రతమను ఏబదియైదవ అధ్యాయము .