మత్స్య మహా పురాణము

Table of Contents

30 - దేవయానీ వనవిహారము

శౌనకుడు శతానీకునితో ఇంక ను ఇట్లు చెప్పెను: ఇట్లు చాలకాలము గడ చెను. దేవయాని ఆ వృషపర్వుని పురమునందే నివసించుచుండెను. ఒకమారు ఆమహాసుందరి క్రీడార్దమయి తాను పూర్వము పోయిన వనమునకే వెళ్ళెను. తన దాసీ సహసముతో శర్మిష్టయు ఆమెవెంట నుం డెను. దేవయాని అప్పటి ప్రదేశమును చేరెను. ఆయా చెలిక తై లందరతో కూడి మిగుల సంతోషముతో తన ఇచ్చవచ్పినట్లు విహరించెను. వారు అందరును ఆ వసంత రువులో చాల ఆనందముగా క్రీడించుచు మద్యమును త్రాగిరి. వివిధ భక్ష్యములను భక్షించుచు 'వివిధ ఫలములను తినుచుండిరి.

ఇంతలో నహుష పుత్రుడగు యయాతి దైవసంకల్పమున వేట కే వచ్చి అలసి నీటికై ఆ ప్రదేశమున కే వచ్చెను. అచ్చట అతనికి దేవయానియు శర్మిష్టయు వేయిమంది శర్మిష్ణ దాసీజనమును కనబడిరి. వారందరు ను దివ్యాభర ణములతో అలంకరించుకొని మద్యము తావుచు విలాసము లనుభవించుచుండిరి. వారందర నడుమ దేవయాని కూర్చుండి యుండెను. ఆమే చిరునవ్వు నిర్మలము. ఆ మే రూపము సాటిలేనిది. ఆమె స్త్రీలలో ఉ తమురాలు. శర్మిష . ఆమెకు పాదములోతుట మొదలగు సేవలు చేయుచుండెను.

యయాతి ఇట్లు పలికెను: “ఇచ్చట ఇద్దరు కన్యలున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక క న్యాసహస్రము పరివారముగా ఉన్నది. కనుక నేను ఆ ఇద్దరి నామస్తోత్రములు తెలిసికొనగోరుచున్నాను. దేవయాని: “రాజా! చెప్పెదను. నామాటనే ప్రమాణముగా గ్రహింపుము. రాక్షస గురుడు శుక్రుడున్నా డే. అతని కూతురను నేను. ఇది నా పరిచయము. ఈమె నాకు చెలిగా ఉండు దాసి. నే నెచ్చటికి పోయిన అచ్చటికి వచ్చును. ఈమే దానవేంద్రుడగు వృషపర్వుని కూతురు." యయాతి: “ఈమే రాక్షసరాజు కూతురు. చక్కని కనుబొమలు (మొదలగు మహా సౌందర్య లక్షణములు కలిగిన ఉత్త్రమశ్రీ కదా ఈమె! ఈకన్య నీకు దాసి ఎట్లయినది? నాకు విన వేడుకగా ఉన్న ది.” దేవయాని: “రాజా! ప్రతి ఒకరును విధి విధించిన విధానమును అనుసరించి నడుచుకొనవలసినదే. అది ఎరిగినచో నీకు ఆశ్చర్యము కలుగదు. నీరూపమును వేషమును రాజునకువలె నున్న వి. బ్రాహ్మణుని వాక్కు కలిగి ఉన్నావు. నీ పేరు ఏమీ? ఎక్కడివాడపు? నీ తం! 'ఎవరు?'' యయాతి: “బ్రహ్మచర్య వ్రతమున నేను వేదము అంతయు అధ్యయనము చేసితిని. నేను రాజను. రాజవంశమున పుట్టిన పొడను. నా పేరు యయాతి.' దేవయాని: “ఏదో పని మీద నే నీవీ ప్రదేశమునకు వచ్చియుందువు. నీటినుండి లభించుదానీ నేదై న గ్రహింపగోరియా? వేట కోరియా?” యయాతి: “నేను వేటకై వచ్చి నీటికాను ఇక్కడకు వచ్చితిని. నీవడిగిన అన్ని ప్రశ్నలకును సమాధానము ఇచ్చితిని. నేను పోయివత్తును. అనుజ్ఞ ఇమ్ము." దేవ చని: "ఈ రెండు వేల దాసీ కన్యా జనముతోను దాసియగు శర్మిషతోను నీ అధీనురాల నగుచున్నాను. పూజ్యుడవగు నీవు నాకు మిత్రుడును భర్తవును కమ్ము, యయాతి: “అగుగాక ! నీవు శుక్రుని కూతురు పూజ్యురాలవు. కోపింపకుము. నేను నిన్ను వివాహ మాడ అర్హుడను కాను. నీ తండ్రి క్షత్రియులతో వివాహ సంబంధమును అంగీకరించడు.” దేవయాని: "బ్రహ్మము క్షత్రముతోను. క్షత్రము బ్రహ్మముతోను పరస్పరము కలిసియే యున్న వి. బ్రహ్మము-బ్రాహ్మణజాతి ప్రధాన లక్షణములు; క్ష త్త్రము క్షత్రియజాతి ప్రధాన లక్షణములు) నీవు ఋషివి.ఋషిపుత్త్రడవును. నహుష కుమారుడవు నీవు. ఇప్పు డయిన నీవు నన్ను పెండ్లాడుటకు అంగీక రించుము. యయాతి: "సుందరీ! నాలుగు వర్ణములును ఒక దేహమునుండి పుట్టినవే. కాని వాని ధర్మములును రూపములును వేరువేరు. ఈ నాలుగు వర్ణములవారిలో బ్రాహ్మణుడు శ్రేష్టుడు. (కనుక శేష్ట వర్ల స్త్రీని తక్కువ వర్ణపు పురుషుడు పెండ్లాడరాదు.) దేవయాని: “రాజా! ఈనా పాణిని ఇంతకుముందు ఏ పురుషుడును గ్రహించలేదు. మొట్టమొదట బావిలోనుండి తీసినప్పుడు నీవే ఆది పట్టుకొంటివి. అందు చేతనే నేను నిన్ను వరించుచున్నాను. ఋషి పుత్రుడవును స్వయముగా ఋషివి ఐన నీవు గ్రహించినది ఈ చేయి. నేను అభిమానవతిని. అట్టి నాయీకరమును మరెవరుగాని - ట్లు గ్రహింపదగుదురు? యయాతి: “కోరలనిండ విషము కలిగినదియు కోపించిన దియు అగు సర్పము కంటెను. అన్ని వైపులకును మంటలు రేగుచున్న అగ్నికంటెను విప్రుడు స్పృశించి కలత పరచరాని వాడు ఈ విషయము విజ్ఞులకు మాత్రమే తెలియును. దేవయాని: “పురుష! శ్రేష్టా! ఇది యెట్లో తెలియగోరుచున్నాను. యయాతి: “పాము ఒక్కనినే కరచును. శస్త్రము ఒక్కనిని మాత్రము చంపును. కానీ కోపించిన బ్రాహ్మణుడు రాష్ట్ర ములను (గ్రామాదిజన నివాసస్థానములను) పురములను (రాజధానీస్థానములను) కూడ నశింపజేయగలడు. భయపడకుము. ఈ కారణముతోనే బ్రాహ్మణుడు పైచెప్పినవాటి అన్నిటికంటెను దురాధర్షతరుడు (స్పృశించికలతపరచరానివాడు) అని నేనంటిని. అందువలననే పూజ్యురాలవగు నిన్ను నీ తండ్రియే స్వయముగా ఇచ్చిననేకాని వివాహమాడను. దేవయాని:

“రాజా! నేనై స్వయముగా కోరినందునను మాతండ్రి స్వయముగా నన్ను నీకు ఇచ్చిన మీదటను నన్ను నీవు పెండ్లాడ బోవుచున్నావు. అంతే కాని నీవు కోరుటలేదు. అడుగక యే ఇచ్చిన దానిని ప్రతిగ్రహించుట దోషము కాదు.

పిమ్మట వెంటనే దేవయాని తన దారిని తన తండ్రి ఆశ్రమమునకు పం పెను. ఆమె శుక్రునితో తాను వినిన విషయము విన్నట్లు చెప్పెను. వినిన వెంటనే శుక్రుడును వచ్చి రాజునకు దర్శన మిచ్చెను. ఇట్లు తన దగ్గరకు వచ్చిన విప్రుడు. వేదములందు మహాపండితుడు ఒక విమహాముని కుమారుడు అగు శుక్రుని యయాతిరాజు నమస్కరించి దోసిలిపట్టి వినయముతో వంగి ఎదుట నిలువబడెను. శుకుడు అతనిని ఏల ఇం పై టలతో పలుకరించి మాట లాడెను.

దేవయాని: "ఈ రోజు నహుష పుత్రుడు. ఇతడు ఒకప్పుడు దుర్గ ప్రదేశము (తప్పించుకొని బయటపడ అలవి కాని ప్రదేశము)నందున్న నా చేతిని పట్టుకోనెను. పాణిని గ్రహించెను.) నీకు వందనము. నన్ను ఇతని కమ్ము. ' లోక మున నేను మరెవ్వరిని పతిగా వరించను." శుక్రుడు: “ఓ వీరా! నిన్ను ఈ నా కుమార్తె తానే వరించినది. అది నేను ఇష్టపడుచున్నాను. ఈ మేను నేనే నీకు ఇచ్చుచున్నాను. నీ వీమెను గ్రహించి రాణిగా చేసికొనుము.” యయాతి: “పూజ్య బ్రాహ్మణుడవగు భార్గవా! ఇట్లు చేయుట వలన నాకు అధర్మదోషము కాని వర్ల సంకరము చేసిన పాపము కాని నా కంట కుండునట్లు నాకు వరమీయ ప్రార్ధించుచున్నాను.” శుక్రుడు: “ఇదే కాదు. నీ విం కేదయిన ఈపి తవరమును కూడ కోరు కొమ్ము . ఇత్తును. నిన్ను అధర్మమునుండి విడిపించుచున్నాను. ఈ పెండ్లి వలన నీకు ఎట్టి హానియు కలుగదు. నీ పాపములను నేను ఖండించు/తెగనర కుచున్నాను. ఈ శుచిస్మితయగు దేవయానిని ధర్మపత్నిగా గ్రహింపుము. ఇది ధర్మమే కాని అధర్మము కాదు. . ఈమెతో కూడి నీవు సాటిలేని సుఖ మనుభవింపుము. . వృషపర్వుని కూతురగు ఈ కుమారి శర్మిష్టయు నీకు సతతము ఆదరణీయురాలే. కాని నీవు ఈమెను శయనమున గ్రహించరాదు.

- ఇట్లు పలికిన శుక్రునకు ప్రదక్షిణము చేసి ఆ మహాత్ముని అనుమతి పొంది యయాతి హర్షముతో తన రాజ ధానికి వెడలెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున. యయాతి దేవయానిని గ్రహించుట యను ముప్పదవ అధ్యాయము.