మత్స్య మహా పురాణము

Table of Contents

22 - శ్రాద్ధము జరుపదగిన తీర్థ క్షేత్రములును - కాలమును

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి : “ఏ సమయమునందు- అనగా పగటి ఏ అంశమునందు శ్రాద్ధకర్త శ్రాద్ధము జరిపినచో అనంతమగు ఫలము లభించును? ఏ తీర్థములందు కాని క్షేత్రములందుగాని శ్రాద్ధము జరిపిన యెడల బహుఫలము లభించును? తెలుప వేడుచున్నాము.”

సూతుడు ఇట్లు చెప్పనారంభించెను : అభిజిన్ముహూర్తము రౌహిణ ముహూర్తము ఉదయించు సమయము ఆగు అపరాష్ట్ర కాలమున జరిపిన శ్రాద్దము అనంతమగు ఫలమును ఇచ్చును.

పితృదేవతలకు ప్రీతికరములగు తీర్థములను క్షేత్రములను పేర్కొని వాటిని గూర్చి సం క్షేపముగా తెలుపు చున్నాను.

గయా తీర్థము పితృ తీర్థములన్నిటిలో మేలయినది. శుభకరమయినది. అక్కడ దేవదేవులకును ఈశుడు అగు బ్రహ్మస్వయముగా సన్నిహితుడై యుండును. తమ పితృథాగమగు కవ్యమును ఆసుభవింపగోరు పితృదేవతలు గానము చేసిన గాథ (యొక్క అర్థము) ఈ విధముగా నున్నది: “పితరులు అనేకులగు పుత్రులు కలుగవ లేనని కోరుకొనవలెను. ఏలయన వారిలో ఒకడైన గయకు పోయి పితృ  శ్రాద్ధము జరుపునేమో: అశ్వమేధ యాగము న జరుపునేమో! నీల వృషభమును విడుచునేమో!” వారాణసి సదా పితరులకు ప్రియమయినది. దానిని ఎన్నడును పార్వతీ పరమేశ్వరులు విడువనందున దానిని ఆవిముక్త క్షేత్రము అందురు. వారి నిరంతర సన్నిధి వలన అది భుక్తి ముక్తి ఫలములను శ్రాద్ధకర్తకు ఇచ్చును. విమలేశ్వరము ప్రయాగ కటీశ్వరము అను క్షేత్రములును పితరులకు ప్రియములై నవి పుణ్యకరములై నవి సర్వ కామము లను తీర్చునవి. వటేశ్వర క్షేత్రమునందు వటేశ్వరుడను శివుడు యోగనిద్రతో శయనించియుండు కేశవునితో కూడి నివసించును. దశాశ్వ మేధము -గంగా ద్వారము హరిద్వారము) నందా లలితాతీర్థములు మాయాపురము (జగన్నాధపురి) బ్రహ్మసరమను తీర్థము శతద్రు (సట్ లజ్) జలపుమడుగు గంగాగోమతీ సంగమ స్థానము నై మిశము పితృప్రీతికరములు. గంగాగోమతీ సంగమమున శాశ్వతుడగు యజ్ఞవరాహ విష్ణుడును శూలధారియగు శివుడును సన్నిహితులై యుందురు. అచట బంగారుద్వారము కలదు. అచటి శివుడు అష్టాదశ భుజుడు. విష్ణుచక్రపు నేమి (అంచు) శీర్ణము (శిథిలము) అయిన స్థలమే నై మిశము. ఈ క్షేత్రమునందు యజ్ఞ వరాహ మూర్తిని దర్శించినచో విష్ణులోకమును పొందును. కృతశాచ మను మహారణ్యము సర్వపాప నాశకము. అచట సాక్షాత్ నారాయణుడు నరసింహ రూపమున నున్నాడు. ఇక్షుమతీగంగా సంగమము పితృప్రియమగు తీర్థము. అచట పితృదేవతలు ఎల్లప్పుడును నివసించుచుందురు.

కురుక్షేత్రము మహాపుణ్యకరము. అచట సర్వతీర్థములు చేయుండును. సరయూ నది పుణ్యకరమయినది. సర్వదేవతలకును ఆది పూజ్యమయినది ఇరావతీ-యమునా-దేవికా- కాశీ-చంద్రభాగా-దృషద్వతీ-వేణుమతీ-పారా-వేత్రవతీ నదులును పితరులకు ఇష్టములైనవి. ఇచట శ్రాద్ధము జరుపుట చేత కోటి రెట్లు ఫలితము గలుగును.

నేటికిని మహామార్గము కనబడు జంబూ మార్గము నీలకుండము భద్రసరము మానస సరస్సు అచ్చోదానది-మందాకిని-విపాశా (బియాస్)-సరస్వతీ - మిత్రపదము- వైద్యనాధము శిప్రా క్షిప్రా నది (ఉజ్జయినిదగ్గర) మహాకాల క్షేత్రము కాలంజరము (పర్వతము) వంశోద్భేదము ఫలోద్భేదము -గంగోద్భేదము- భద్రాస్పదము విష్ణుపదము నర్మదాద్వారము (నర్మదా సాగర సంగమము) ఈ ప్రదేశములందు పితరులకు పిండదానము చేసినచో గయలో పిండదానము చేసినట్లగును. ఈ పితృతీర్థములు స్మరణమాత్రముననే జనుల సర్వపాపముల హరించును. శ్రాద్దమువలన కలుగు ఫల మింతయని చెప్ప నేల? ఓంకారము పితృతీర్థము కావేరీ-కపిలా-చండ వేగా నచే సాగర సంగమము - అమరకంటకము- వీటియందు స్నానము కురుక్షేత్ర తీర్థములందు స్నానము కంటెను నూరు రెట్లు ఎక్కువ ఫలము నిచ్చును. శుక్ల తీర్థ సోమేశ్వర తీర్థములందు శ్రాద్ధము జరిపినను స్వాధ్యాయము చేసినను సర్వవ్యాధులును నశించును. ఇతర క్షేత్రములందు కంటే నూరుకోట్ల రెట్లు ఎక్కువ పుణ్యము కలుగును.

కాయావరోహణ క్షేత్రము చర్మణ్వతీ గోమతి అరుణ- ఔశనస తీర్థము బైరవము భృగుతుంగము గౌరీతీర్థము వై నాయక తీర్థము వస్తేశ్వర తీర్థము పాపహరమను తీర్థము తపతీనది-భూతిదా-పయోషీ-పయోషీ సంగమము మహాంభోధి తీర్థము పాటలాతీర్థము నాగ తీర్థము అవంతికా-వేణునదీ-మహాశాలము-మహారుద్రము-మహాలింగము దశార్ణానది -శతరు దాశ తాహ్వానదులు-విశ్వపదము - అంగార వాహికానది-శోణ-ఘర్ఘరము లను నదములు- కాళికా వితస్తానదులు- ఈ పితృ తీర్థములు స్నా నదానములందు ప్రశస్తములు. ఈ తీర్థ క్షేత్రములందు శ్రాద్ధము జరిపినచో అనంత పుణ్యము లభించును.

ద్రోణీనది.వటనది-ధారానది-వీరనది - గోకర్ణము-గజకర్ణము-పురుషో త్త్రమ క్షేత్రము  (జగన్నాధము)-ద్వారము-కర్ణద్వారము-కృష్ణతీర్థము-సరస్వతీ-మణిమతీ గిరికర్ణికానదులు ధూతపాప తీర్థము-దక్షిణ సముద్రము -ఈ పితృతీర్థము లందు చేసిన శ్రాద్దము అనంతమగును.  మేఖలక మను తీర్థమునందు సర్వాంతర్యామియు శార్జధరుడునగు జనార్దనుడు స్వయముగా ఎల్లప్పుడు మేఖలయందు సంసాహితుడై యుండును. ( మేఖల = పర్వతపు నిలువు పెత్తులో నడుమ భాగము) మండోదరీ తీర్థము వంశ నదీ తీర్థము అమర నాధము మహీశాలనది.చిత్రకూటము మరోటము జన్మేశ్వరము అర్జునము త్రిపురము సిద్దేశ్వరము శ్రీ శైలము శాంకర తీర్థము నార సింహతీర్థము మ హేంద్రము. శ్రీశంకు క్షేత్రము. వీటిని దర్శించినను వెంటనే పాపములన్నియు నశించును. వీటియందు జరుపబడిన శ్రాద్దము అనంత ఫలమును ఇచ్చును.

తుంగభద్రానది-త్రిసుధ్యాతీరము-భీమనదీ-భీమేశ్వరక్షేత్రము-కృష్ణవేణ- కావేరి- వంజులానది గోదావరి త్ర్యంబక తీర్థము ఇవి ప్రశస్తములగు పితృప్రీతికర తీర్థములు. త్ర్యంబక తీర్థమునందు ఎల్లప్పుడును త్ర్యంబక శివుడు సంనిహితుడై  యుండును. వీటిని స్మరించినను పాపములు వెంటనే నశించు. ఇచట చేసిన, శ్రాద్ధము కోటి రెట్లు ఫలమును ఇచ్చును.

శ్రీపర్ణానది-వంశ నడి శివానది - భావతీర్థము-పంచతీర్థము రామేశ్వరము- ఏలాపురము అలంపుర ము అంగభూతి క్షేత్రము ఆపాణురము. అలంబుకము అనో కేశ్వరము ఏకామ క్షేత్రము గోవర్ధనము హరిశ్చంద్రము.పృథూదక సరస్సు. సహస్రాక్షము హిరణ్యాక్షము కదశీనది.రామచిత్ర.అజితానది సౌమిత్రిసంగమము.ఇంద్రకీలము మహానాదము ప్రియ మాలము ఇవి శ్రాద్ధము జరుపుటకు ప్రశస్తములు. అధిక ఫలప్రదములు. వీటియందు దేవతలు ఎల్లప్పుడు సంనిహితులయి యుందురు. వీటియందు గానము చేసినచో కోరిన కోరికలు కోటి రెట్లుగా ఫలించును.

గోదావరి నది సమీపమునందలి పితృతీర్థమను తీర్థము చాల ప్రశస్తమయినది. ఇచ్చట గోదావరి నది అన్ని చోటులందు కంటే చాల లోతుగా ప్రవహించుచు వేయి శివలింగములతో కూడి ఉన్నది. ఈ తీర్థమున కే జామదగ్న్య తీర్థము అని నామాంతరము. ఇది శ్రాద్ధ కర్తలకు సర్వోత్త్రమమగు దీర్ఘాయువును ఇచ్చును. ఇచ్చటనే గోదావరీ నది ప్రతీకుడను ఋషివలన భయముచే చీలినది. ఇది దేవతలనుద్దేశించి హవ్యములను ఇచ్చుటకును పితృ దేవతల నుద్దేశించి కవ్యములను ఇచ్చుటకును కూడ ప్రశస్తమయినది. అందుచే దీనికి అప్సరోయుగ తీర్థము అని పేరు. ఇచట శ్రాద్దములు కాని అగ్ని కార్యములు కాని (యజ్ఞ హోమాదికము కాని) దానములు కాని చేసినచో నూరు కోట్ల రెట్ల పుణ్యము లభించును.

సహస్ర లింగ క్షేత్రమును రాఘవేశ్వర క్షేత్రమును పితృ కార్యములకు ప్రశస్తములు. ఇంద్ర సేనా నదీ పితృ కౌద్దము విషయమున పుణ్యకరము. పూర్వము నముచి దానవుని చంపినందున పతితు డైన ఇంద్రుడు ఇచట తపస్సాచరించి పుణ్యము సపాదించి స్వర్గమును పొంద గలిగెను. ఇచ్చట మానవులు శ్రాద్ధము జరిపినచో అనంత ఫలము కలుగును.

పుష్కర తీర్థము సాల గ్రామ తీర్థము శోణ పాదము వైశ్వానరుడను పేరుగల అగ్ని విశేషమునకు స్థానమగు వైశ్వానరాలయ తీర్థమును దాని సమీపమందలి సారస్వత తీర్థము స్వామి తీర్థము మలందరానదీ కౌశికీ నది చంద్రికానది విదర్భానది వై రానది పూర్వము ప్రాజ్ముఖ ప్రవాహముతో నుండిన పయోషీనది ఉత్త్రర వాహినిగా నున్న కావేరి జాలంధర పర్వతము - ఈ ప్రదేశము లందు జరిపిన పితృ శ్రాద్ధము అనంత ఫలము నిచ్చును. లోహదండ తీర్థము చిత్రకూటము వింధ్య-యోగేశ్వరము గంగానదీ తటము కుబామకము ఊర్వశీ పులినము సంసార మోచన తీర్థము ఋణమోచన తీర్థము  అద్రుహాసము గౌత మేశ్వరము వసిష్ణ తీర్థము హారీతము బ్రహ్మావర్తము కుశావర్తము హయతీర్థము పిండారకము శంఖాధారము ఘటేశ్వరము బిల్వకము నీల పర్వతము సుగ్రీవము ధరణీతీర్థము రామతీర్థము అశ్వతీర్థము వేదశిర సీర్థము ఉద్యవతీనది వసుద తీర్థము ఛాగలాండము బద రీతీర్థము గణతీర్థము జయంతము విజయము శుక్ర తీర్థము శ్రీపతితీర్థము రైవతక తీర్థము శారదాతీర్థము భద్రకా శేశ్వరము వైకుంఠ తీర్థము భీమేశ్వరము మాతృగృహతీర్థము కరవీర తీర్థము జలేశ్వరము గౌరీ శిఖరము లకుటీశము కర్తమాలము దండిముండికరము పుండరీక పురము సప్తగోదావరము - ఇవన్నియు పితృ శ్రాద్దమునకు ప్రశ స్తములగు తీర్థరాజములు. పేరులు మాత్రమే గ్రహించి (వాటి మహిమములను విస్తరింపక) కొన్ని కొన్ని పితృ తీర్థములను మీకు తెలిపితిని. అన్నిటిని సంపూర్ణముగా తెలుపుట బ్రహ్మకు కూడ సాధ్యము కాదు.

ముఖ్యముగా-సత్యము దయ ఇంద్రియ నిగ్రహము - ఇవి అత్యుత్త్రమములగు తీర్థ ములు. ఇవి కలిగి తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి నడచుకొను వారికి ఇంటియందే పితృ తీర్థస్థానము ఉండును.

ఏమయినను ఈ చెప్పిన తీర్థములందు శ్రాద్ధము చేసినచో కోటి రెట్లు పుణ్యము కలుగును. కనుక సర్వ విధముల ప్రయత్నించి తీర్థ శ్రాద్దమును జరుపవలయును.

పగటి కాలము మొత్త్రము పదునైదు ముహూర్తము లగును. వరుసగా ప్రాతఃకాలము పూర్వాహ్లాము మధ్యాహ్న ము అపరాహ్లాము సాయాహ్నము . ఇవి ఒక్కొక్కటి మూడేసి ముహూర్తములు. సాయాహ్న మునకు రాక్షసీ హోరా అనియు పేరున్నది. ఆ సాయాహ్న కాలమునందు శ్రాద్ధము జరుపరాదు. ఏలయన రాక్ష సీహోరా ఏ కర్మములకును పనికిరాదు. వీనిలో ఎనిమిదవ ముహూర్తమునకు కుతప కాలమని శాస్త్రమున పేరు. మధ్యాహ్న కాలమున ఏ సమయము నుండి రవి చల్లదనము పొందునో అప్పటినుండి సాయాహ్న మారంభమగు లోపల శ్రాద్ధము జరిపిన వారికి రవి అనంత ఫలము ఇచ్చును.

ఇదియును కాక - మధ్యాహ్న కాలము ఖడ్గము నుంచు పాతము (ఒర) నేపాళ దేశమున నేసిన కంబళము దీపము దర్భలు తిలలు గోవులు దౌహిత్రుడు - ఈ ఎనిమిదింటికిని కుతపము అని పేరు. కుతపము ఆను శబ్దము నందలి కు. . అనగా కుత్సితము . పాపము అని అర్థము. తపము అనగా దాని  తపింప చేయునది.

ఇదియును కాక పగటి ముహూర్తములలో ఎనిమిదవది అగు కుతప ముహూర్తమును దాని తరువాత వచ్చు నాలుగు ముహూర్తములును- మొత్త్రము ఈ అయిదు ముహూర్తములకు స్వధా భవనములు అని వ్యవహారము.

దర్భలును నల్లని నువ్వులును విష్ణు శ రీరము నుండి ఉత్పన్నమయినవి. శ్రాద్ధము శుభ ఫలమును ఈయవలె ననినచో శ్రాద్ధమున దీనిని వినియోగించవలయును. ఆని ద్యులోక నివాసులగు పితృ దేవతలు స్వయముగా చెప్పిరి. కనుక శ్రాద్దము లందును చేతియందు (ఒక చేతిలోనే) దర్భలు ధరిచి తిలోదకమును పితరుల నుద్దేశించి ఈయవ లేను.

పూర్వము మత్స్య రూపుడగు నారాయణుడు మనువునకు చెప్పిన శ్రాద్దాసు కీర్తనము పుణ్యకరము - పవిత్రము- ఆయుః ప్రదము - సర్వ పాపములను నశింపజేయునది. దీనిని చదివినను వినినను నరుడు శ్రీ మంతుడగును. తీర్థ శాద్ధ సమయమున దీనిని తప్పక చదువుటయో వినుటయో చేయవలెను. దాని వలన అశుభము - నశించును. ఇది పవిత్ర మయినది. కీర్తికలుగుటకు మూల కారణ మయినది. మహా పాప హరము. ఈ శ్రాద్ధ మాహాత్మ్యము బ్రహ్మార్కరుదులు కూడ ఆదరించునది. అని దాని తత్వము నెరిగిన వారు చెప్పుచున్నారు.

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్ధ యోగ్య దేశ కాలాను కీర్తసము అను ఇరువది రెండవ అధ్యాయము