మత్స్య మహా పురాణము

Table of Contents

52 - కర్మయోగము 

ఋషులు సూతు నిట్లడిగిరి: “మనువు ప్రశ్నించగా మత్స్యరూప విష్ణువు అతనికి తెలిపిన పర మో త్తమమగు ధర్మాధర్మ విస్తరమును తెలుపుము. ఈ చెప్పిన విధమున ఏకార్ణవమయిన జలమునం దుండిన మత్స్యరూప జనార్దనుడు. సూర్యపుత్రుడగు మనువునకు మొదట ఆదిపర్తము ప్రతిసర్గము మొదలగునదంతయు -అనగా వంశ మన్వంతర-వంశాను. చరితములను కూడ తెలిపియుండెను. అతడు వాటితోపాటు కర్మయోగమును సొంఖ్య యోగ) మును ఉన్న దియున్నట్లు సవి నర ముగ చెప్పియుండెను. అని విందుము. (వానిలో సర్త ప్రతిసర్గ వంశమన్వంతర వంశాను చరితములను నీవలన వింటిమి.), ఇక ఇప్పుడు కర్మయోగ లక్షణమును వినగోరెదము. ఏలయన నీవు సువతుడవు. (యథావిధిగ గురు శుశ్రూష చేసి అన్ని విషయముల నెరిగినవాడవు.) లోకమునందు. నీకు తెలియనిది ఏ కొంచెమును లేదు.”

 సూతు డిట్లు చెప్పనారంభించెను: శ్రుతులయందు చెప్పబడిన విధమున మీకు కర్మయోగమును తెలిపేదను. (అది తెలిసికొనవలసినదే.). ఏలయన వేయి - జ్ఞానయోగములకంటెను కర్మయోగము మేలయినది. కర్మయోగము. ననుష్ఠించుట వలననే జ్ఞానము కలుగును. జ్ఞానమువలన పరమపదము -పరమాత్మ తత్వము లభించును. కనుక కర్మము వలనను జ్ఞానము వలనను బ్రహ్మము లభించును. కర్మాచరణము లేనివానికి జ్ఞానము లభించదు. కావున కర్మయోగము,నాశ్రయించినవాడు శాశ్వత తత్వమును పొందును. వేదము అంతయును దాని తత్వమును ఎరిగినవారి ఆచరణమును ధర్మమునకు (ధర్మ కర్మల ననుష్ఠించుటకు) మూలము. ఆ ఆచారమునందును ఎనిమిది ఆత్మగుణములు ప్రధానములు. సర్వ భూతములయందు దయ.ఎన్ని బాధలయందును ఓర్పు లోకము విషయమున అసూయ (దోషారోపబుద్ది) లేకుండుట-దేహమునను చిత్తమునను పవిత్రత -అక్కరలేని శ్రమ పడకుండుట శ రీరమున శుభలక్షణమును వేషమును కలిగియుండుట లేని ద్రవ్యముల విషయమున కాని సంపాదించిన ద్రవ్యముల విషయమున కానీ పిసిని గోట్టుతనము లేకుండుట. పర ద్రవ్యములందును పర స్త్రీల విషయమునందును కోరిక లేకుండుట (దయ -శాంతి-అనసూయ-శౌచము అనాయాసము-మంగళ్యాచార సేవనము -అకార్పణ్యము. అస్పృహ) అనునవి ఈ ఎనిమిది గుణములు. ఇట్టి నడువడియే క్రియా యోగము - ఇది జ్ఞాన సాధకము . ఇది లేనిచో అది లేదు. ప్రయత్న పూర్వకముగా ప్రతియొక రును శ్రుతి స్మృతి ప్రోక్తమగు కర్మల నాచరించుచుండవలయును.

(*కుర్యాదహరహర్యజ్ఞైర్భూతర్షి)

(*లోకపాలా గ్రహశ్చెవ)

గృహస్థునకు ఇంటి పనులలో ప్రాణి హింసకు కారణములై పాపము కలిగించునవి ఐదు; అవి: కత్తిపీట తిరుగలి పొయ్యి-నీటికడవ-చీపురు అనునవి; వీనిని పోగొట్టుకొనుటకై అతడు హోమములచే దేవ యజ్ఞము శ్రాద్ధములచే పితృయజ్ఞము వేదాధ్యయనము చే ఋషియజ్ఞము అన్న దానముచే మనుష్యయజ్ఞము భూతములకు బలి (నూకలు మొద లగునవి) వేసి భూత యజ్ఞము అను పంచయజ్ఞములను దేవర్షి పితృ తర్పణములను చేయవలెను. ముప్పది సంస్కారములు పొందినవాని కై నను ఈ చెప్పిన ఆత్మ గుణములు లేనిచో మోక్షమురాదు. తనకున్న ధనముతో గో బ్రాహ్మణులకు శుభము కలిగించవలెను. గోవులు భూమీ ఊరణ్యము వస్త్రములు గంధమాల్యములు మొదలగుపోనితో బ్రాహ్మణులను పూజిం: వలెను. బ్రహ్మ విష్ణు భాస్కరరుద్ర వసురూపుడగు శివుని పరమాత్మను యథావిధిగా శ్రద్దాపూర్వకముగా మత్సరము లేకుండ మరియొకరితో పోటీపడక) వ్రతములు ఉపవాసములు మొదలగునవి ఆచరించుచు అర్చించుచు ఉండవలెను. అతీంద్రియుడు శాంతుడు సూక్ష్ముడు అవ్యక్తుడు సనాతనుడు జగజ్జన్మకారణుడు నగు వాసుదేవుని నుండి రూపొందిన తత్వములే బ్రహ్మవిష్ణు శివ రవి వసుగణ రుద్ర గణాదిత్య గణములు సప్త పితృ గణములు సప్త మాతృక లును చరాచరములగు సర్వ భూతములును, అవ్యక్త తత్వమగు పర మేశ్వరుడు అధిపతిగాగల ఈ విశ్వమునకు బ్రహ్మ విష్ణు శివ సూర్యులు వేళ్ళవంటివారు. కనుక వారిని పరస్పరము అభిన్ను లనుగాను వారిని పరమేశ్వరునితో అభిన్నులను గాను ఆరాధించినచో చరాచర విశ్వమును ఆరాధించుట' యగును. బ్రహ్మాది మూ ర్తిత్రయమును రవియందు రూపొంది యున్నోరు. కనుక ప్రయత్నముతో విధి విధానమున రవి నుపాసించవలయును. అగ్ని ముఖ ద్విజముఖములు చేసి (అగ్నియందు ఔపాసనము కాని దేవ సన్నీ ధిలో దీపము వెలిగించుటకాని చేసి బ్రాహ్మణుని పూజించి ఆతని నోటితో వేదమంతములు చెప్పించుచు) దాన వతోపాసన జప హోమాదులతో వీరి నారాధించవలెమ.

ఇట్లు క్రియాయోగ పరాయణు డై వేదాంత శాస్త్రమునందును స్మృతి విధానములందును ఆసక్తి కలిగియుండు వానికి ఇహపర లోకములందు పొంద రాని దేదియు" లేదు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున కర్మయోగమను ఏబది రెండవ యధ్యాయము.