మత్స్య మహా పురాణము

Table of Contents

144 - దేవాసుర యక్ష గంధర్వ మనుష్య పశుపక్షి - వృక్షాదుల యుగానుగత పరిమాణాదికము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. ప్రతి కల్పమునందును వచ్చు పదునాలుగు మన్వంతరములందును ఆయా యుగములందు దేవాది జాతుల జన్మము వారి శరీర ప్రమాణము వారి జీవిత కాలము ఆనుపూర్వితో విస్తరముగ చెప్పెదను.

పదునాలుగు మన్వంతరములందును కృతాదియుగములందు ఆ యుగ ప్రమాణము-సంధ్యా సంధ్యాంశములు కాక.దివ్యమానమున ఎన్ని సంవత్సరములో ఆ యుగపు మానవులు మానవ మాసమున అన్ని సంవత్సరములు జీవింతురు. సంధ్యా సంధ్యాంశములు కాక కృతయుగ ప్రమాణము నాలుగు వేల దివ్య వరములు కావున ఆ యుగపు మాన వులు మానవ మానమున నాలుగు వేల ఏండ్లు జీవింతురు. అని ఇట్లు అన్ని యుగముల విషయము గ్రహించవలెను.) యుగధర్మము ననుసరించియే ఆయా యుగములందలి మానవ పశుపక్షి వృక్షాదుల ఆయుః పరిమాణాదికము ఏర్పడినది. వాటి శరీర పరిమాణము ఎత్తుసరి కూడ అంతే. కాని కలియుగమున మాత్రము ప్రాణుల దౌర్భల్యము అస్థిరత చూచి మానవుల పరమాయువు నూరు సంవత్సరములేయని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను. (ని చెప్పిన విధముగ నైనచో యుగానుసారము కలి మానవుల పరమాయువు ఒక వేయి ఏండ్లు ఉండవలయును.)

ఇక కృతాది యుగములలో దేవతాది ప్రాణుల శరీరపు ఎత్తుసరి మొదలగునవి: కృతయుగమున దేవాసుర మానవ యక్ష గంధర్వ రాక్షసులు దేహపు చుట్టు కొలతలో కాని ఎత్తుసరిలో కాని సమానులై యుందురు. విద్యాధరాదు లగు ఎనిమిది దేవజాతుల వారును మానవులును కూడ కృతయుగమున తొంబది యారుకృతయుగపు) అంగుళముల ఎత్తు కలిగియుందురు. ఆ యుగ సంధ్యాంశములయందు వీరి శరీరముల ఎత్తురి డెబ్బది రెండంగుళములే ఉండును. కలి యుగమున దేవతల ఎత్తుసరి నలువది తొమ్మిది-రాక్షసుల శరీరపు ఎత్తు ఎనుబది నాలుగు. కలియుగపు అంగుళములు ఉండును. కలియుగమున మానవుల శరీర పు ఎతు తొంబది యారంగుళములే-కాని ఇవి కలియుగపు మానవుల ప్రమాణము ననుసరించియని తెలియవలెను. ఇట్లన్ని యుగములందును మానవదేహ ప్రమాణము తొంబది యారంగు ళము లేయైనను యుగానుసారము దాని పరిమాణము తగ్గును. మానవుని కుడి చేతి బొటన వేలి నడిమి కణుపునొద్ద అర చేతివై పు తెల్లని వన్నె గల భాగపు కొలతను అంగుళముగా గ్రహించుట యొక పద్దతి. అడ్డముగా ఉంచిన ఎనిమిది యవలు ఆక్రమించు పొడవును అంగుళమనుట శాస్త్ర వ్యవహారము. కలియుగమున కాలి దిగువనుండి మస్తకాంతము వరకు తొమ్మిది తొలముల ఎత్తుకలిగి మోకాళ్ళవరకు బాహువులుగల మానవులను దేవతలును ప్రశంసింతురు-తాలము = కుడి చేతి బొటన వేలిని ఎడమకు. చూపుడు వేలిని కుడికి బాగుగా చాపగా ఈ రెంటినడుమ అగు పొడవు; దీనిని తెలుగులో ‘లుడితి' అందురు.)

ఈ చెప్పిన కొలతల ననుసరించియే ఆయా యుగములందలి గోవుల గజముల మహిషముల తదితర పశు మృగాదుల వృక్ష జాతుల పరిమాణము కూడ తగ్గుచు పేరుగుచు నుండునని ఎరుగవలెను. పశువు {బహుశ : వృషభము ) కాలి కొననుండి మూపురము పైవరకు డెబ్బది ఆరంగుళముల ఎత్తుండును. ఏనుగులు ఎనిమిదివందల అంగుళముల ఎత్తుండును. వృక్షముల ఎత్తు ఒక వేయి తొంబది రెండు అంగుళములుండును. ఆయా యుగములయందు మానవుల దేహపు ఎత్తుసరియే దేవతలకును ఉండును. బ్రాని బుద్ధి శక్తి విషయములో మానవులకంటే దేవతలు గొప్పవారు.

 ఆయా యుగములందలి దేవతలయు -మానవులయు పరిమాణాదికము ఇట్లుండునని తెలుపుటయైనది. పశు పక్షి వృక్షాదుల పరిమాణమును తెలిపితిని. గోపులు గొర్రెలు మేకలు గుర్రములు ఏనుగులు, పక్షులు మృగములు వృక్షాదికము ఆయా ప్రాణులకును మానవులకు ఆయా పనులయందును ఉపయుక్తములగుచున్నవి. దేవతలనుద్దేశించి చేయు యాగములందు వీనిలో కొన్ని యాగ పశువుల దేవత లకుపభోగ సాధనములగుచున్న వి. కాగా ఇవి ఇట్లు యాగాదులయందు దేవతల కై ఉపయోగపడిన పుణ్య విశేషమున అవి తమ దేహమును వదలిన తరువాత పర లోకమున స్వర్గము చేరి సుఖమును పొందును.

ఇక మీదట శిష్టులు. సాధులు.'సత్' శబ్దముతో చెప్పబడువారు ఎవరో తెలి పెదను. 'సత్' అనునది పర బ్రహ్మమునకు పేరు. బ్రాహ్మణులును వేద వచనములును యాగ పశువులును యజ్ఞాదుల కై దేవతలకుపయోగపడి తుదకు బ్రహ్మత్వమును పొందును. ఈ సామ్యముతో ఈ మూడిటిని 'సత్' అందురు.

ఆయా వర్ణముల వారియందును ఆయా బ్రహ్మచర్యాద్యాశ్రమములందును (ఉప) యుక్తము అయి స్వర్గమునకు పోయిన తరువాత అధిక సుఖము కలిగించు శ్రోతస్మార్త ధర్మమును జ్ఞాన ధర్మము అందురు. ఇవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులాచరించదగిన వారు. ఇవి సామాన్య ధర్మములు వి శేష ధర్మములు - ఆని రెండు విధములు; 'ఇవి ఆచరించవలెను.' అని ఈ తై వర్ణికులును (ని) యుక్తులు. నియోగింప-శాసింపబడినవారు. శాసింపబడుటచే వీరు శిష్టులు; (వాటిని ఆచరించువారు.)

బ్రహ్మచారి గృహస్థవానప్రస్థ సంన్యాసులు నలుగురును సాధువులని చెప్పబడుదురు. ఎట్లనగా బ్రహ్మచారి తన గురువునకు హితకరుడై విద్యలను సాధించుకొనును. గృహస్తుడు ప్రజాభివృద్ధికి సమాజపు సుఖవృద్ధికి కారణ భూతుడై తనకును లోకమునకును దేవతలకును సుఖమును సాధించును. అరణ్యమందు నివసించుచు వానప్రస్థుడు తపస్సును సాధించును. పరత త్వ పా పి కె యత్నించుచు(ప్రయత్నము చేయుచు తియగు సంన్యాసి యోగమును సాధించును. ఇట్లు సాధనము చేయు వీరందరును సాధువులగుచున్నారు.

ఇక ధర్మాధర్మ విషయము : ధర్మము అనునది ఒక వస్తువు అనుకొనరాదు. ధర్మగతినిధర్మపు నడకను. ధర్మమును ఆచరించుటను) ధర్మమనీ ఇచ్చట భగవానుడు చెప్పెను. కావున ఈ విధముగ ధర్మశ బము క్రియారూపము కానీ వస్తురూపము కాదు. సర్వలోకముల క్షేమమునకు ఉపయోగించు కర్మమును ధర్మమని స్వయంభూ బ్రహ్మ నిర్ణ

యించెను.

ఇక దేవతలును పితరులును ఋషులును మానవులును ఇది ధర్మము అని వ్యవహరించుచుందురు కదా! అట్లది నిర్ణయించుట మౌన మూ ర్తితో మాత్రమే.మునీయే తపోబలమున విషయ తత్వ విచారణము చేసినవారికి మాత్రమే శక్యమగును. 'ధర్మ' శబ్దమునకు మూలమగు 'ధృ(జ్"}' ధాతువునకు ధారణము తన యందు ఇతరములను నిలుపుకొనుట. తాను ఇతరములకు ఆశ్రయమగుట) అనియు గొప్పదనము అనియు అర్థములు. కావున ధర్మము అనగా లోక స్థితికి ఆధారము -అన్నిటికి మహ త్వమును కలిగించుచు తాను గొప్పదై యుండునది అని అర్థములు. ఇష్టములను పొందునట్లు చేయునది ధర్మము; కావున ఆది ఆచరించుడని ఆచార్యులు ఉపదేశింతురు. అనిష్ట ఫలప్రదము ఆధర్మము; కావుననే దాని నాచరించుడని ఆచార్యు లుపదేశించరు. మరి ఆచార్యులనగా ఎవరు ? అన్న విద్యావయో నుభవములందు వృద్ధులు ( పెరిగిన వారు). ధన సుఖాదులందు ఆసలేనివారు. హృదయదార్యము కలవారు-దంభము లేని వారు. పెద్దలవలన చాల తిన్న గా శిక్షణము నొందినవారు ఎవరో వారిని ఆచార్యులు అందురు.

ధర్మజ్ఞులగు ద్విజులు ధర్మమును శ్రాత ధర్మము స్మార్త ధర్మము అని రెండుగా విభజించిరి. దారలతో కూడినవారు (గృహస్థులు అనుష్ఠించు అగ్ని హోత్రాది కర్మలును యజ్ఞ ప్రభేదములును శ్రాతధర్మము. యమ నియమ సహితమగు వర్ణాశ్రమాచారము. స్మార్త ధర్మము; పూర్వులనుండి ఆమెరిగిన శ్రాతధర్మమును సప్తర్షులు లోకమున ప్రవచించిరి. గడచిన మన్వంతరము నందలి ఋగ్యజుః సామములను వేదాంగములను సాధు సముచితము యథాతథము నగు)రూపములతో స్మరించి తాము పూర్వమన్వంతరములలో ఏరిగి యున్నందున చిత్తమున నిలిచిన సంస్కార బలమున వానినే యథార్థ రూపములో ఇపుడు చిత్తమున గోచరింపజేసికొని) మనువు ప్రవచించినది కావున దీనికి స్మార(స్మృతిచే లభించిన) ధర్మమని వ్యవహారము. ఇది వర్ణాశ్రమ విభాగమున విభ క్షమై యున్నది.

ఈ రెండు విధములగు ధర్మమునకును శిష్టాచారమని వ్యవహారము. శిషి'ధాతువు(శాను. అనుశిప్టోనుండి వర మయి' క' అను'నిష్ణా' ప్రత్యయము చేరగా శిష్టశ బము (ఏర్పడును) సిద్ధించును.ఆయా మన్వంతరములయందు ఈ రెండు విధములగు ధర్మములను ఎరిగి ఆచరించుటచే శిష్టులనబడు ధర్మానుష్టాతలును లోక సంతానకారులగు లోక వ్యవస్థాప్రవృ తులను నిరంతరముగా కొనసాగించుటయే పరమ ప్రయోజనమని భావించు) మనుస పరి ప్రభృతులును ఇహలోకమంది ప్పుడు ధర్మానుష్టానము పరమ ప్రయోజనముగా నెంచి దానినెరిగి అనుష్టించు ధార్మికులును శిష్టులు అనబడుదురు.

ఇట్టి శిష్టులు ప్రజలయందు వర్ణాశ్రమ ధర్మములను నిలుపగోరి తాము శ్రాతస్మార్త ధర్మములను అనుష్టించి యుగయుగమునందును వార జీవన మార్గములు) దండనీతి మొదలగువానిని లోకమునందు నిలుపుదురు. పునఃపునః మనువుల తరు వాత మనువులుగా నడచు మన్వంతరములందు శిష్టులచే ఆచరింపబడుట చేతను అంతకంటె పూర్వులును పూర్వతరులునునగు శిష్టులకు సమ్మతమగుటచేతను ఈవిధమగు ఆచరణీయ ధర్మమునకు శిష్టాచారమని పేరు. ఇది శాశ్వతము (సార్వకాలికము సర్వదై శికము అయినది.

దానము సత్యము తపస్సు లోకము (లోక వ్యవస్థాక ర్తలగు పెద్దల నడువడి) విద్య ఇజ్యా (యాగాది దేవతా. లోకోపకారక-కర్మలు) పూజనము దమము ( ఇంద్రియనిగ్రహము) అను ఈ ఎనిమిది విధములగు చరితములు (నడు వడులు) శిష్టాచార సమగ్ర స్వరూపము. సర్వ మన్వంతరములందును మను సప్తర్షి ప్రభృతులగు శిష్టులు ఆచరించునది కావున దీనికి శిష్టాచారమని వ్యవహారము. శ్రవణమువలన (వేద శాస్త్రములనుండి గ్రహించగా) సిద్దించినది శ్రాతము; స్మృతివలన సిద్ధించినది స్మార్తము. యజనము వేదములు. అను రూపముతో నున్నది. శ్రాతము వర్ణాశ్రమాత్మకమయినది స్మార్తము.అని వినిస్వరూపకథనము. ఆ హేతు లక్షణమగు ( హేతువాదము చేయక శ్రద్ధతో ఆ సీక్య భావముతో గ్రహించవలసిన ధర్మ ప్రత్యంగములను ధర్మమునకు పుష్టి కలిగించు ప్రవృత్తులను , తెలి పెదను వినుడు. . మీరు చూచియు అనుభవించియు ఎరిగిన విషయమును మాకు తెలుపుడని ఎవరై నఅడిగినపుడు అనిష్టము చూపక దాచుకొనక యథార్థ వస్తు తత్త్వమును తెలుపుట సత్యము.

బ్రహ్మచర్యము తపస్సు (శరీరమును కఠిన నియమములకు పాలుపరచి శ్రమ పెట్టుట) మౌనము (విషయ తత్వ విచారణ చేయుట) నిరాహారత్వము అను ఇవి తపస్స్వరూపములు. ఇది ఘోరమును సామాన్యులకు చేర రానిదియు . యజ్జీయములగు పశువులు ద్రవ్యములు హవిస్సులు ఋక్సామ యజుర్మంత్రములు ఋత్విజులు . ప్రతి కల్పమందును ప్రవర్తిల్లు ధర్మాదుల స్వరూపము. ఆ దక్షిణలు. వీని కూడిక యే యజ్ఞము (ఇజ్యా) అనబడును. . ఏ చిత్తవృత్తి విశేషము ఉండుట చేత సర్వ భూతముల విషయమునను పురుషుడు తన విషయమునందువలెనే చూపుకలిగి హృష్ణుడే వానికి శుభమును హితమును కలిగింప గోరునో.అది దయ యనబడును. . ఇతరులు తిట్టినను తిట్టక కొట్టినను కొట్టక మనోవాక్కాయములందు ప్రతీకార దోషము లేక ఓర్పుతో నుండుట క్షమయనబడును. . ధనపు సొంతదారుడు కాపాడుకొనుచున్న దానినేకాని తొందర లలో పిడిచిన దానినే కాని పర ధనమును తీసికొన దలచకుండుట ఆలోభమనబడును. . శారీరకముగా మైథునము చేయకుండుట నోటితో ఆ మాటలాడుకుండుట మనస్సుతో అది తలచకుండుట అచ్చిద్ర (ఏదోష మును లేని) బ్రహ్మ చర్యమనబడును. . తన కై కాని ఇతరుల కై కాని విషయానుభవములందు ఇంద్రియములు ప్రవర్తిల్లకుండుట దమమనబడును. బహిరింద్రియ నిగ్రహము) . ఐదు విధములగు (శబ్ద స్పర్శరూప రస గంధములను) విషయముల విషయమునను ధనకనక వస్తు వాహనాది సుఖ) కారణ సాధనములేని మీదింటి విషయమునను ఎవరైన తన కడ్డము వచ్చినను కోపించకుండుట జితాత్మత్వము శమము) అనబడును. . తాను న్యాయము ఆర్జించినదియు తనకు మిగుల ఇష్టమును అగు వస్తువును కూడ గుణవంతులగువారికి ఇష్టముతో) ఇచ్చుట దానమనబడును. శ్రుతి స్మృతులు విధించిన వర్ణాశ్రమాత్మక ధర్మమును శిష్టాచార బలముచే వృద్ధిపొందిన ధర్మమును. సాధుజనులగు పెద్దలకు సమ్మతమగు ధర్మము. . ఇష్టములగు వానిని మెచ్చక.అనిష్టములగు వాని పై అధిక ద్వేషము చూపక ప్రీతి తాప విషాదములను పొందకుండుటయే వైరాగ్యమనబడును. . ఇదివరకు చేసిన.ఇక ముందు చేయనున్న కర్మల ఫల సంగమును విడుచుట సంన్యాసమనబడును. ి, తనకు ఇహముననే స క్షేమము కలిగించు కర్మములను కీడు కలి గించు కర్మములను సమ భావముతో విడుచుట న్యాసమనబడును. . ఆవ్య క (నామ రూప విభాగము లేని జగ నాది స్థితి) దశ మొదలుగా ఆయా.సకల సామరూప విశేషములవరకుగల వికారజాతమునుండి బుద్ధిని మరలించి చేతనమునకును అచేతన తత్వమునకునుగల భేదమును తెలిసికొని అటి జ్ఞానమందే యుండువాడు జ్ఞాని యనబడును. పూర్వపు స్వాయంభువ మన్వంతరమునందు ధర్మతత్వజులగు ఋషులు ధర్మ ప్రత్యంగముల స్వరూపము ఇదియని తెలిపియుండిరి.

ఇక ఇక్కడ మీకు ప్రతి మన్వంతరమునందును సమానరూపములో నడుచు ధర్మపు నడకను చాతురోత (బ్రహ్మ అధ్వర్యుడు కాక హోతతో కూడ నలుగురు ఋత్విక్కులతో నిర్వర్తించు యాగమును దాని విధానమును చాతు ర్వర్ణ్య ధర్మవ్యవస్థను వర్ణింతును.

ప్రతి మన్వంతరమునందును శ్రుతి వేరువేరుగా నుండును. (ఏ మన్వంతరమునకు ఆ మన్వంతరమునందు శ్రుతి మారును.) అప్పుడును ఋగ్ యజుః సామవేదము యుండును. ప్రతి దేవతను ఉద్దేశించిన మంత్రములు నుండును. విధి స్తోత్రము హోత్ర స్తోత్రము ద్రవ్యస్తోత్రము గుణస్తోత్రము కర్మస్తోత్రము అభిజనస్తోత్రము అనునవియును ఉండును. కాని అవి యును ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా నుండును. బ్రహ్మ ఆయా వేదములకు సంబంధించిన స్తోత్రములను ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా మరల మరల ప్రవర్తిల్ల చేయు చుండును. ఇది ఒక వేదమున కే కాదు; ఋగ్ యజుః సామాథర్వణ వేదములకు నాలుగిటికి సంబంధించిన స్తోత్రముల విషయమునందును మన్వంతర భేదమును బట్టి భేదము ఏర్పడును.

ఆయా మన్వంతరములందు మిగుల దుశ్చరమగు తపస్సాచరించిన ఋషులకు అతః పూర్వపు మన్వంతరము నందు వలెనే వేదమంత్రములు ప్రాదుర్భవించును. (వేదములును తదంశములును వెనుకటి మన్వంతరములందు వలెనే యున్నను వాటి రూపములందు భేదముండునని దీనిని బట్టి ఎరుగవలెను. )

ఆయా ఋషులకు ఆయా వేద-వేదాంశ ('వేదాంగ' అనికాదు.) మంత్రములు ప్రాదుర్భవించుటకు వారికి తమ యుగపు ప్రాపంచిక స్థితుల విషయమున కలిగిన అసంతోషము (వాటివలన కలిగిన) భయము దుఃఖము ( ఈ పరిస్థితుల నుండి జనుల కెట్లు విడుదల కలిగించవలెనో తెలియని స్థితి అనేడు) మోహము (ప్రజల క్లేశములు చూచి కలిగిన) శోకము అను ఈ ఐదు స్థితులును హేతువులగును.

ఋషులకు ఈ వేదవేదాంశములు సాక్షాత్కరించుట యాదృచ్చికముగ (అదృష్టవి శేషమున)ను తారకము అను (యోగ) లక్షణము చేతను సిద్ధించును.

ఋషులకు మంత్రద్రష్టలకు) ఋషిత్వమును కలిగించు లక్షణము తెలి పెదను. ఇదివరకు గడచిన మన్వంత రములందు కానీ రాబోవు వానియందు కాని ఆరకము (ఋషిత్వమునందలి ప్రభేదములు} ఐదు విధములుగా నుండును. ఋషులకు ఈ ఋషిత్వము ఏర్పడు విధముతోపాటు ఆ ఐదు ఋషిత్వ ప్రభేదములను మీకు తెలి పెదను.

ప్రళయకాలమునందు సర్వత్రిగుణములును సమతావస్థతో నుండును. వేదములును శబ్దార్ధ ప్రవీభాగములేక వాని ఆవాంతర ప్రవిభాగములును లేక ఏకై కా ఖండ శబ్దరూపము కూడ అవ్యక్త తత్వమున లయమంది యుండును. సర్వమును తమోమయమయి యుండును (ఈ దృశ్య ప్రపంచపు స్థూల రూపాంశములే కాదు సరియే కదా దీనికి మూలములగు సూక్ష్మత త్వములును అవ్యక దశయందుండును.) ఇది మూలప్రకృతి జడ తావస్థ. అది కొంత కాలము నకు తరువాత మరల అబుద్ధి పూర్వకముగానే తన సంకల్పము లేకయే - తాను జడము కావున తనకు సంకల్పించు శక్తియే లేదు.పరమాత్ముని చితి రూపశక్తి పేరణచే తనయందు చైతన్యమును వ్యాప్త మొనరించుకోనుటకును తాను చేత న్యమునకు ఆశ్రయమగుటకును ఉన్ముఖమయి) ప్రవర్తిల్లును.

ఇదియే ఆర్హతాస్థితి. అందుచేతనే ఆరత్వము అనునది చిదాత్మక (విశుద్ధ జ్ఞానాత్మక) త త్వపు శ క్తిచే పేరి తము కావున బుద్ధిపూర్వకము అనియు చేతనతత్వము చేత ఆధిష్టించబడినది (అనగా ఈ ఆర్తత్వమునందు చిదాత్మక లక్ష ణము వ్యాపించియున్న ది) అనియు చెప్పబడు చున్నది. ఇట్లు చేతనాచేతనములు.చిదాత్మక పరమాత్ముడును మూలప్రకృ తీయు - మత్స్యమును ఉదకమునువలె పరస్పరము విడదీయరాక ప్రవృత్తి నందు చుండును. ఇట్లే ప్రకృతి (జడ) పురుష చేతన)తత్వములు రెండును పరస్పరము కార్యకారణ భావమును పొంది చేతనవ్యా ప్తితో తనయందు చేతనత త్వము వ్యాపించగా) త్రిగుణమయ జడ ప్రకృతి సృష్టికి ప్రవర్తిల్లును.

ఈ విధముగ ప్రవర్తిల్లు సృష్టిలో శబ్దార్థ సృష్టియు వ్యక్తరూపము నందసాగును. అందు అర్థము విషయము. పదము (శబ్దము) విషయి. యగును. శబ్దమును వినగా తతభావమ న చిత్తమున ఆ శబ్దముచే ఉద్దేశించబడిన అర్థము (వస్తువుల సన్ని వేశము) గోచరమగును. ఇదియే శబ్దార్థముల విషయి విషయభావసుబంధము.

ఇట్లు అస్పష్ట రూపమున నైన శబ్దార్థవ్యక్తి స్పష్టీ భావము ప్రవ రిల్లుట) ఆరంభము కాగా కాలక్రమమున ప్రపంచ సృష్టికి మూల కారణత త్త్వములగు మహదాది తత్వములు. అవ్యక్త తత్వమునుండి వికాస క్రమమున వ్య క్తము కానారంభించును. మహ తత్వమునుండి అహంకారతత్వము దానినుండి సూక్ష్మభూతములు ఇంద్రియ తత్వములు వ్యక్తము లగును.

['నేను' అను సామాన్య కారపు 'అహం' తత్వ స్ఫురణచే ఈశ్వరుని యందు కలుగు బుద్ద్యాత్మక దశ ' మహత్త త్వము ' అనబడును. 'నేను ఇటీవాడను ఈ పేరుగల వాని కుమారుడను.” ఈ మొదలగు విశేష జ్ఞానముతో కూడిన 'అహం' స్ఫురణను అహంకారము అందురు. ఈశ్వరుని యందు జగత్సృష్టి ప్రవృత్తి కాలమున కలుగు ఇట్టి బుద్ధిదశ అహంకారతత్వ్తము. ]

భూతతన్మాత్రలు అనేడు సూక్ష్మభూతములనుండి భూత భేదములు స్థూల భూతములు) మొదలగునవి ఒకదాని నుండి మరియొకటి అనుక్రమమున ఉత్పన్నము లగును. స్వాభావికముగా స్వయంసిద్ధమగు కారణతత్త్వమగు దాని నుండి ఏర్పడిన కార్యత త్వము మరియొక దానికి కారణమగుచు ఈ క్రమమున వెంట వెంటనే సృష్టి క్రమములో పరమాత్ముడు ఈ ప్రపంచ రూపమున రూపొందును. ఒక కొరవినుండి ఒకే సమయమున అనేకములగు చిన్న చిన్న నిప్పురవ్వలు చేదరి బయటికి వచ్చినట్లు ఒకే చైతన్యమునుండి ఒకే క్షణమున జీవు లనేకులు పరమాత్మనుండి వివృత మైన భూతము లతో ఏర్పడిన దేహము లందు సోనో దేహధారులు గా కనబడుదురు. ఇండరు క్షేత్రజ్ఞులకును జీవులకును) కారణమగు చేతనముల తత్వము ఒక్కటియే.

చీకటిలో అకస్మాత్తుగా మెరపు తళుక్కున మెరసినట్లు ఆవ్య క త త్వమునుండి వివృత్తమయిన జీవ సమూ హము కూడ దేహధారులయి ప్రకాశించుచు కనబడును. పరమాత్మ తత్వముకూడ అంతర్యామియై ప్రతి శరీరమునందు నుండును. మహాతమస్సునకు ఆవల పరమాత్ముడు ఈ సమ స్తసృష్టికి అతీతమయి త్రిపాతత్వముగా అంతర్యామి కంటే విలక్షణమయి ప్రకాశించుచుండును.

ఇట్లా పరమాత్ముడు అక్కడ నే. ఆయా దేహధారుల దేహములనెడు క్షేత్రములందే...ఉండును. అదే సమయమున తమస్సునకు ఆవలనుండును.ఆని శుతుల యందు వినబడు చున్నది. ఇట్లతడు ప్రకృతికి అధిష్టాతయై వివ ర్తము పొందు చుండ రూపవంతుడై భాసించుచున్న - కొలదీని అతని బుద్దిలో . జ్ఞానము - . వై రాగ్యము. . ఐశ్వర్యము . ధర్మము అనునవి కలిగెను. . ఇది మనవంటి వారి విరక్తి వంటిదికాదు; నేను పొందవలసిన దేదియు లేదు; నేను ఆవా ప్ల సకల కాముడను; నా వారు అనదగు వా రేవ్వరును లేరు; మమకారముతో నాకు పని లేదు.అను బుద్ది; . నేను సర్వేశ్వరు డను; నేనే ఎల్ల జగములకును దిక్కు; అనుబుద్ధి; . లోక ప్రవృత్తికి మూలమగు సత్కర్మానుష్టానము నేనే అను భావన.)_ఇవి అతనికి స్వతస్సిద్ధములే కాని కావ లేనని సంపాదించుకొన్న వి కావు. ఆ మహాత్మునికి మాయా శ కి కృత మగు శ రీరప్రాప్తివలన ఇవి సిద్ధించినవి.

ఇతడు 'పూర్ 'ఆనబడు ఆయాప్రాణుల శరీరముల యందు సాక్షి రూపుడై యుండును; “పురిశ>పురుష' అని వ్యవహరింపబడును. ఆయా దేహములందు ( క్షేత్రములందు) ఉండి వాని తత్వమును ఎరుగును కావున క్షేత్రజ్ఞుడు. జ్ఞుడు. అనబడును. ధర్మమును అవలంబించి లోకములను సృజించి పాలించును కావున అతడు ధార్మికుడనబడును.

ఇట్లు తనకు అనపాయిని అగు ఎన్నడును విడిపోని మాయాశ క్తిచే సిద్ధించిన దై స్వాభావికముగ లభించిన శ రీరము సందు ఈ చెప్పిన బుద్ధి లక్షణము చే చేతనుడయి పరమాత్ముడు మూల ప్రకృతికి కలిగిన సృష్ట్యభిముఖ ప్రజృత్తిని సఫ లము చేయును.

ఇట్లు పరమాత్మ క్షేత్రజ్ఞుడుగా వివర్తము పొందియు క్షేత్రము విషయమునను ఆందలి జీవుని ప్రవృత్తుల విషయ మునను వాటివలన కలుగు ఫలముల విషయమునను ఎట్టి అభిసంధియు (అహంకార మమకారములు) లు లేకుండును.

ఈ పరమాత్ముడిట్లు వివర్తము పొందుటకు సమకాలముననే పురాణము (అనాది) అగు ఆ అచేతన(జడ) ప్రకృతి షేత్రరూపమునను భోగ్యవస్తు జాత రూపమునను రూపొంది ఆ క్షేత్రజ్ఞుని చేత 'ఇది నాకు ఆశ్రయము' అనియు 'ఇదినాకు భోగ్యము' అనియు ఎంచబడుచున్నది.

జగత్సృష్టి పరమాత్మచైతన్య ఋషిత్వముల సంబంధము

ఋషీ - *హింసాగత్యోః; అను ధాతువునుండి ఋషి అను శబ్దము సిద్ధించును. బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ యును పరబ్రహ్మయును) విద్యా సత్యతపః శాస్త్ర జ్ఞానముల రాశి స్వరూపుడు కావున అతనికి ఋషి అని వ్యవహారము పరమాత్ముడు తాను నివృత్తి (సృష్టిగా రూపొందుట) పొందిన సమయమునందే బుద్ధి రూపమున వ్యక్తుడై (స్పష్ట రూపము నందినవాడై) నందున అతడు ఋషి; పర మము (సర్వోత్తమము) ఆగుదానిని 'ఋషతే' తెలిసికొనెను; కావున అతడు పరమఋషి; ఇట్లే 'గతి' 'గమనము - జ్ఞానము ' అను అర్థమును ఇచ్చు 'ఋష' ధాతువునుండి ఈ ఋషి శబ్దము ఏర్పడినది కావుననే - స్వయముగా తానే జ్ఞానము పరమాత్మగా స్వయం సముద్భూతమయినది కావున జ్ఞానమునకును ఋషి అని వ్యవహారము; ఇట్లే . బ్రహ్మ మానసపుత్రులగు మరీచి మొదలగువారు మైథున ప్రవృత్తితో పనిలేక స్వయముగా ఉత్పన్ను లయిరి. వారును ఋషులు; వీరును వివ ర్తను పొందుచునే న్యాయముగా బుద్ధి (జ్ఞానము) తో వ్యాపింపబడిరి కావున వీరు ఈశ్వర ఋషులు; జ్ఞానమునకు అధీశ్వరులు); . ఈ ఈశ్వర ఋషులకు మానస పుత్తులుగాను.ఔర (మైథునముతో జనించిన పుత్తులు గాను కలిగినవారు కొందరు తాము పుట్టుచునే మహాజ్ఞానముతో (ఋషితో) వ్యాక లయిరి; కావున వీరు మహర్షులు;  భూతాది సృష్టి కాలమున ఔరస సంతానముగా (మైథునముతో) జనించినవారు కేవః ఋషులు; . ఇట్లే మైథునముతో ఋషుల గర్బమునుండి జనించినవారు ఋషికులు; వీరు ఉత్కృష్టమగు విధమున భూతా సృష్టి విషయములను తెలిసినవారు. . ఋషికుల ఔరస పుత్తులు ఋషి పుత్రులు; వీరు తమ పూర్వులనుండి శ్రుతులన శ్రుతము (వినబడినవిగా చేసికొని లోకమున ప్రచారము చేయువారు; శ్రుతి తత్వము నెరిగినవారు; కావున వీరు శ్రుతరుల ఆనబడుదురు.

ఇక సృష్టి క్రమ దశల ననుసరించి పరతత్వము - . ఆవ్యక్తాత్మా . మహాన్హాత్మా . ఆహంకారాత్మా . సూక్ష్మ భూతాత్మా  ఇంద్రియాత్మా అని ఐదు విధములగును; ఈ చెప్పినవారిలో . ఈశ్వర ఋషుల అవ్యక్తాత్మను . మహర్షులు మహానాత్మను . ఋషులు అహంకారాత్మను . ఋషికులు భూతాత్మను . ఋషిపుత్తు ఇంద్రియాత్మను స్వయముగా జ్ఞాన విజ్ఞానములతో ఎరిగినవారు. ఇట్లు ఈ ఐదు తెగల ఋషులును పరతత్వము ఏదో రూపమున తాము ఎరిగియుండి ప్రజలకును ఎరుక పరచ గలిగినవారు.

(* పాణినీయ ధాతు పాఠమున “ఋషీ-గతా' అని మాత్రమున్నది. కాని ఇచట ఇచ్చిన హింసార్హము పాణినీయవ కాని.ఇతర వైయాకరణుల ధాతు పాఠమున నుండి యుండును. ఋషిత్వములో తపస్సు కూడ చే యున్న ది. ఇది శరీర హింసా రూపమయినది. అందుల కె ఈ ధాతువునకు ఈ యరము తగుననీతోచును.)

(*కృతవాచ స్తథా గర్గః కృతిస్సంకృతి రేవచ. (పాఠాం.)

మంత్రద్రష్టలగు ఋషులు; త్రైవర్ణ కులందును ఋషులు కలరు

 భృగువు మరీచి అత్రి అంగిరుడు పులహుడు క్రతువు మనువు దక్షుడు వసిష్ఠుడు పులస్త్యుడు అను పదిమందియు బహ్మకు మానసపుత్రులు. వీరు ఈశ్వరులు; సర్వసమర్థులు; తమకు స్వయంభూ బ్రహ్మ అప్పగించిన ఆయా

స్పష్యంశము ల పై సంపూర్ణాధికారము కలవారు. పైన తెలిపిన ఐదు విధములగు ఆత్మల తత్వమును ఎరిగినవారు అగుటచే వీరు ఋషులనబడుదురు; ఋషులలో ఆందరలో మొట్ట మొదటివారును గొప్పవారును అగుటతో వారు మహరులు ఆనబడిరి. (పర -పరస్ = మహత్.)

ఇట్టి ఈశ్వరులగు మహర్షుల కుమారులు ఋషులు; వీరిని తెలి పేదను వినుడు; కావ్యుడు బృహస్పతి కశ్యపుడు చ్యవనుడు ఉతథ్యుడు వామదేవుడు అగస్త్యుడు కౌశికుడు కర్దముడు వాలఖిల్యులు విశ్రవసుడు శ క్తివర్తనుడు అనువారు ఋషులు. ఈ చెప్పబడిన ఋషులందరును తమ తపశ్శక్తిచే ఋషిత్వమును పొందిరి. వారి గర్భములనుండి ఉత్పన్ను లయిన ఋషికు'లనబడు 'ఋషులు' మైథునము చే జనించినవారు. ( వీరు “ఋషు' లను తెగకు చెందిన ఋషుల ఔరస పుత్రులు. వీరి పేరులు: వత్సరుడు (వత్సారుడు) నగ్నహూ భరద్వాజుడు వీర్యవాన్ దీర్ఘతమసుడు బృహ ద్వక్షసుడు శరద్వాన్ వాజశ్రవస్ సుచింతుడు పరాశరుడు శృంగిన్ శంఖపాత్ వైశ్రవణుడు వీరందరును ఋషికులు అనబడు ఋషులు; వీరెల్లరును సత్యమునందు సిద్ధినొంది ఋషిత్వమును పొందిరి.

ఈ చెప్పిన వారిలో ఈశ్వరులు మహర్షులు) ఋషులు ఋషికులు వీరెల్లరును మంత్రకృత్లు (మంత్రములను దర్శించినవారు. వారి పేరులన్నియు తెలి పెదను; తెలిసికొనుడు.

భృగువు కాశ్యపుడు ప్రచేతస్ దధీచుడు ఆత్మవాన్ ఊర్వుడు జమదగ్ని వేదుడు సారస్వతుడు ఆర్షి షేణుడు చ్యవనుడు వీతహవ్యుడు వేధసుడు వైన్యుడు పృథువు దివోదాసుడు బ్రహ్మస్వాన్ గృతుడు శౌనకుడు ఈ పందొమ్మిది మందియు భృగువంశము నందు జన్మించిన మంత్రకృత్మంత్రక ర-మంత్రద్రష్టలగు ఉత్తములు.

అంగీరస్ వేధసుడు భరద్వాజుడు లక్ష్మణుడు భవాత్మకుడు) కృతవాచుడు గర్గుడు స్మృతి సంకృతి (మృగ ధరుడు గర్గుడు శితిభా-కృతి) తుర వీతుడు మాంధాత అంబరీషుడు యువనాశ్వుడు పురుకుత్సుడు స్వశ్రవుడు సదస్యవాన్ (తమస్యవాన్) అజ మీఢుడు అస్వహార్యుడు ఉత్క లుడు కవి పృషద శ్వుడు విరూపుడు కావ్యుడు ముద్దలుడు ఉతచధ్యుడు శరద్వాన్ వాజిశ్రవస్ అవస్యోషుడు సుచిత్తి వామదేవుడు ఋషి జుడు బృహచ్ఛుక్లుడు (ఉబిల్లుడు బృహసిక్యుడు) దీరత మస్ క షీవాన్ - ఈ ముప్పది ముగ్గురును అంగిరో వంశమునందు జన్మించిన మంత్రద్రష్టలు.

ఇక మీదట కశ్యప వంశమునందలి మంత్రద్రష్టలు; వీరిని విని తెలిసికొనుడు; కాశ్యపుడు వత్సారుడు. నైధ్రువుడు నిత్యుడు అసితుడు దేవలుడు అనువారు వీ రారుగురు.

అత్రి అర్ధ స్యనుడు శ్యావాశ్వుడు గవిష్ఠిరుడు కనికుడు తపస్సిద్దుడగు పూర్వాతిథి ఈ ఆరుగురును అత్రివంశము నందలి మంత్రద్రష్టలు.

వసిష్టుడు శ క్తి పరాశరుడు ఇంద్రప్రమితి భరద్వసువు మిత్రావరుణుడు కుండినుడు ఈ ఏడుగురు వసిష్ట వంశ మందలి మంత్రద్రష్టలు. వీరందరు బ్రహ్మవాదులు (వేదతత్వము నెరిగినవారు.)

గాధిపుత్తుడగు విశ్వామిత్రుడు దేవరాతుడు బలుడు విద్వాంసుడగు మధుచ్ఛందుడు అఘమర్షణుడు అష్ట కుడు లోహితుడు భృతకీలుడు మాంబుధి దేవశ్రవస్ -ధసంజయుడు శిశిరుడు శాలంకాయనుడు - ఈ "పదు ముగ్గురును

బ్రహ్మిష్ఠులుబ్రహ్మతత్వవేత్తలలో ఉత్తములు)ను కౌశిక వంశోత్పన్ను లును అగు మంత్రద్రష్టలు.

అగస్త్యుడు దృఢద్యుమ్నుడు ఇంద్రబాహువు - ఈ ముగ్గురును బ్రహ్మిష్ఠులును అగస్త్య గోత్రజాతులునగు మంత్ర ద్రష్టలు; వీరు ఉత్తమ కీర్తిశాలురు.

వైవస్వత మనువు-ఇలాపుత్రుడును రాజు నగు పురూరవుడు క్షత్రియులలో శ్రేష్టులై మంత్రవాదులగు మంత్ర ద్రష్టలు. (మంత్రవాదులు = మంత్రత త్వవేత్తలు)

భలందకుడు వాసాశ్వుడు సంకీలుడు ఈ ముగ్గురును వైశ్యులలో ప్రవరు (శ్రేష్ఠులగు మంత్రద్రష్టలు.

(ఇచట చెప్పిన భృగ్వంగిరః కశ్యపాత్రి వసిష్ణ విశ్వామిత్రాగస్యుల గోత్ర ప్రవరములే ముందటి (.) అధ్యాయములందు వివరింపబడును.)

ఇట్లు మంత్రములను దర్శించి బయల్పరచిన మంత్రద్రష్టలలో తొంబది రెండు మంది నామములు ఇచట చెప్పబడినవి. వీరిలో బ్రాహ్మణులును క్షత్రియులును వైశ్యులును అను మూడు వర్ణములవారును కలరు. వీరిని ఋషి పుతు లందురు. 'ఋషికు'ల కుమారులకు ఋషిపుత్తులనియు శ్రుత సుత ఋషులనియు కూడ వ్యవహారము కలదు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మన్వంత రాను వర్ల నమున- దేవాది పరిమాణం కథనము. శిష్ట సాధు ధర్మ తపోదా నాది లక్షణ –ఋష్యాది లక్షణ. మంత్రద్రష్టృ ఋషి పరిగణన మను నూట నలువది నాలుగవ అధ్యాయము.