మత్స్య మహా పురాణము

Table of Contents

275 - బ్రహ్మాండ దాన విధానము

శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను; ఇపుడిక ఉత్తమమగు బ్రహ్మాండ దానమును తెలిపెదను; ఏనుము; ఇది సర్వదానములలో శ్రేష్టమును మహాపాతక నాశనమును; పుణ్యకరమగు శుభదినమున తులాపురుష దానమందువలేనే ఋత్విజులను మండపమును సం దారములను వస్త్ర భూషణాదికమును ఏర్పరచుకొనవలెను; అట్లే లోక పొలావాహనమును దేవతాధిహాసనమును జరుపవలయును; ఇరువది పలములకు తక్కువ కాకుండ వేయి పలముల వరకుగల తూకముగల బంగారుతో రెండు కలశములను బ్రహ్మాండమును చేయించవలయును; అందు అష్టదిగ్గజములు చతుర్వేద ష డ్వేదాంగ లోక పాలాష్టక చతుర్ముఖ శివ విష్ణు రవి ప్రముఖులును పార్వతీ లక్ష్మీ దేవులును అష్ట వసువులును ద్వాదశాదిత్యులును సప్తమరుత్తులును మహారత్నములును ఉండవలయును; పండ్రెండు మొదలుగా నూరు వరకు అంగుళముల పొడవు వెడల్పులు గల పట్టు వస్త్రమును పరచి దాని పై తిలద్రోణమునుంచి దాని పై ఈ బ్రహ్మాండాదుల నుంచవలయును; దాని చుట్టును పదునెనిమిది ధాన్యములుంచవలెను; తూర్పున అనంత శయనుడగు నారాయణుని ఆగ్నేయమున ప్రద్యుమ్నుని దక్షిణమున ప్రకృతి దేవిని నైరృతమున సంకర్షణుని పశ్చిమమున నాల్గు వేదములను వాయవ్యమున అనిరుద్ధుని ఉత్తరమున అగ్నిని ఈశాన్యము నందు వాసుదేవుని బంగారు ప్రతిమలు గా గుడ పీఠములయందు నిలిపి పూజించవలేను. నూతన వస్త్రము చుట్టిన పూర్ణకుంభములు పది ఆటనుంచవలెను.

ఈ పది పాడియావులను బంగరు సరిగ వస్త్రములను పొలు పిదుకు పాత్రలను పాదుకలను పాదరక్షలను ఛత్త చామరాసన దర్పణములను భవ్య భోజ్యాన్నదీ పేక్షు ఫలపుష్ప సుగంధానులేపనములను ఈయవలయును; హోమమును దేవతాధివాసనమును ముగిసిన తరువాత వేద విదులగు విప్ర పుంగవుల మంత్రములతో వారిచే స్నానము చేయించబడి యజమానుడు వారిని దేవతలను ముమ్మారు ప్రదక్షిణించి ఈ మంత్రముచ్చరించవలయును; “విశ్వేశ్వరా! (విశ్వము స్థానముగా గలవాడా!) విశ్వధామన్! విశ్వేశ్వరులకు ఆధారమా! జగత్సృష్టికర్తా! సప్తర్షులకును లోకములకును ఆమరులకును ఈశా! ఈ హిరణ్మయ గర్బముతో కూడిన నీవు మాకు అభి (సర్వ విధములగు) రక్షను దయ చేయుము. దుఃఖితులందరును సుఖితులగుదురుగాక ! చరాచర ప్రాణుల పాపములు తొలగిపోవును గాక! నీ దానమనేడు శస్త్రములతో మా పొతకములు దెబ్బలుతిని బ్రహ్మాండమందలి దోషములన్నియు నాళమందుగాక !”

ఇట్లు ఆమర విశ్వగర్భుడగు బ్రహ్మాండాధిపతిని నమస్కరించి ఈ ద్రవ్యమంతయు పది భాగములుగా విభజించి బ్రాహ్మణులకీయవలయును; అందు రెండు భాగములు గురునకును మిగిలిన ఎనిమిది భాగములును ఋత్విజులకు సమానము గాను అనుక్రమముగా పంచవలయును; హోమమును అల్పముగానే ఏకాగ్ని విధానమున జరిపినపుడు గురుడొక్కడే యుండునుగాన అతనినే పూజ్యతమునిగా గ్రహించి యథోక్త వస్త్రాభరణాదిక ముతో అతని నర్చించవలయును.

ఈ విధమగు విధాన ప్రక్రియతో బ్రహ్మాండ దానమును చేసిన పురుషుడు మహా విమానమునా శ్రయముగా చేసికొని పాపములు కడిగి వేయబడగా నిర్మలతనుమానసుడే అప్సరసలతో కూడి ఆనందకరమగు మురారి లోకమునంది యందు సుఖములందును; అతడు పితృ పితామహ పుత్ర పౌత్త బంధుప్రియాతిథి కళత్రాదులగు నూట ఎనిమిది మందిని కూడ సంసారమునుండియు నరకము నుండియు తరింపజేయును; తన తల్లి మాత్రమే కాదు.తన ఆ శేషకులము కూడ ఈ బ్రహ్మాండ దానముచే తన పొతకములు నశించగా తరించి ఆనందమునందును; దీనిని పఠించినను వినినను సురభవ నములందు సుఖించును; ధార్మికుల గృహములయందు జనించి ధర్మపరుడై జీవించును; జనులకు ఉత్తమమతి నందించి తాను అప్సరలతో కూడి ఆమరేంద్ర భవనమున ఆనందమందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మహాదానాను కీర్తనమున బ్రహ్మాండ దానాను కీర్తనమను రెండు వందల డెబ్బదియైదవ యధ్యాయము.