మత్స్య మహా పురాణము
243 - శ్రీవామన చరిత్రము - కథారంభము. అదితికి విష్ణువర ప్రాప్తి-అదితి గర్భమున విష్ణుప్రవేశము.
వామనావతారవిషయక శౌనకార్జునసంవాదం.
ఋషులు సూతునితో నిట్లనిరి: సూతా! నీవు మాకు రాజధర్మమును అద్బుత (ఉత్పాత) యాత్రా-స్వప్న శకున విషయములను విస్తరించి తెలిపితివి. ఇపుడిక మరల విష్ణు మాహాత్మ్యమును తెలుపవేడుచున్నాము; అత డేట్లు వామనుడయి బలిదానవుని బంధించెను; హరి లోకత్రయమాక్రమించునపుడతని రూపము ఎట్లుండేను? అన సూతుడిట్లనెను: పూర్వము అర్జునుడు ద్రౌపదీ విషయమన సమయ భంగమొనరించి తీర్థయాత్ర కై వేడ లేను. ఆ ప్రసంగమందతడు కురు క్షేత్రమునందలి వామనాయతనమందలి వామనుని చూచి ఆటనున్న తపోధనుని శౌనకుని ఇదే ప్రశ్న మడిగెను: ఏ హేతువుచే ఈ దేవుడు వామనాకృతి యయ్యెను? ఈ పూజ్య భగవానుడు పూర్వము వరాహ రూపుదేలయయ్యెను? ఇది. వామనునకు ఇష్ట క్షేత్రమెటులయ్యెను? అనగా శౌనకుడిట్లు చెప్పెను: కురునందనా! ధీమంతులయిన వామన వారాహుల మాహా త్మ్య మనతివి స్తరముగ చెప్పెదను; పూర్వము ఇంద్రుడు ఆసురులచే నిర్వాసితుడై దేవతలు వారిచే విజితులు కాగా దేవ జనని యగు అదితి పర మదుఃఖిత యై తన కుమారులెట్లు మరల ఆభ్యుదయమందుదురాయని చింత చేయుచు వేయి దివ్య సంవత్సరములు కృష్ణుని మెప్పించుటకై మౌనము దాల్చి వాయు భోజనమై తపమాచరించెను; కురునందనా! దైత్యులచే నిరాకృతులయిన తన తనయులను చూచి నేను వ్యర్థ పుత్తనయితినే యని నిర్వేదముతో ప్రణతురాలయి పరమార్థ ప్రకా శక బుద్ధితో అర్థవంతములగు వాక్కు లతో దేవదేవుడును సర్వగతుడునగు హరిని నమస్కరించి ఇట్లు స్తుతించేను:
అదితికృత వాసుదేవ స్తుతిః.
స్మరించినవారి ఆర్తి నశింపజేయువాడును పద్మమాలియు పరమ కల్యాణ కల్యాణుడును ఆది బ్రహ్మరూపుడును పంక జనేత్రుడును పంక జనాభుడును పద్మనంభవుని జన్మ కారణుడును ఆత్మయోనియు మనోహర రూపుడును ఇంద్రియ నిగ్రహము కలవాడును దృశ్య జగద్రూపుడు పరమార్థ రూపుడు చక్రియు శంఖ ఖడ్గహస్తుడు హిరణ్య రేతస్కుడు ఆత్మ జ్ఞానముగల యోగులచే చింతింపబడువాడు న్వయం యోగియు నిర్గుణుడు విశేష రూపుడు హరియు పరబ్రహ్మరూపుడు నగు హరికి నమస్కారము, ఎవనియందు జగము ప్రతిష్టితమో జగమునకు ఎవడు కనబడడో అట్టి అతి సూక్ష్మునకు అతి స్థూలునకు శంఖికి నమస్కారము; అఖిల జగమును చూచుచుండియు బహిర్ముఖులగు జనులేవనిని చూడజాతి రో ఇందుండియు ఈ జగమును బహిర్ముఖ దృష్టితో చూడని యోగులు ఎవనిని తమ హృదయములందేయున్న వానిగా చూతురో ఎవనియందన్న ము జలము నదులు సమస్త జగము ఉన్నదో అట్టి జగదాధారునకు నమస్కారము; ఆద్య ప్రజా పతియు పితరులకును పరమపతి(పిత)యు దేవతాపతియునగు కృష్ణునకు వేధో (చతుర్ముఖ బ్రహ్మ) రూపునకు నమస్కా రము. ఎవడు ప్రవృత్తి మార్గములందాయా కర్మములచే ఆరాధింపబడునో అట్టి స్వర్గాపవర్గ ఫలదుడగు గదా ధారికి నమ స్కారము; మనస్సుతో చింతించినంతనే పాపము హరించు విశుద్దుడు పరుడునగు హరీకి వేధకు (సృష్టికర్తకు) నమస్సు; నర్వభూతములును దేవదేవేశుడు నవ్యయుడునగు ఎవని నెరిగినంతనే జన్మ మరణరహితులగుదురో(నో) ఆ హరిని నమస్క రింతును; యజ్ఞ పరాయణులు యజ్ఞమందు ఎవనిని యజ్ఞుడను పేర ఆరాధింతురో అట్టి యజ్ఞపురుషుని విష్ణుని ప్రభుని ఈశ్వరుని నమస్కరింతును.
సర్వజ్ఞుడగు ఎవడు వేదవేత్తలచే సర్వ వేదములందును గానము చేయబడునో వేదవేద్యుడగు అట్టి విష్ణునకు జిష్ణునకు నమస్కారము; ఎవనినుండి విశ్వముత్పన్న మయి ఎవనియందు లయమందునో విశ్వపురాకకు నిలుకడకు కారణ భూతుడగు ఆట్టి మహాత్మునకు నమస్కారము; బ్రహ్మాది స్తంబ పర్యంతమగు ఈ విశ్వమేవనిచే వ్యా ప్రమో ఆట్టి యు పేంద్రుని నేను ఈ మాయాజాలము తరించుటకై నమస్కరింతును; తోయ న్వరూపుడై యుండి ఆఖిలమును పోషించు విశ్వుని విశ్వపతిని ప్రజాపతిని విష్ణునీ నమస్కరింతును; ఎవనిని విశుద్ధ మనో వాక్కాయ కర్మలతో ఆరాధించి అఖిలమగు అవిద్యను తరింతురో ఆ యు సేంద్రుని నమస్కరింతును; సుఖదుఃఖములకు హేతువులగు విషాద సంతోష రోషాదులకు అజేయుడును అఖిల భూతాంతర్యామియయి వర్తించువాడు నగు ఉపేంద్రునకు వంద నము; రాత్రులందేర్పడు చీకటిని రవివలె ఆసురమయమగు రూపొందిన చీకటిని వధించి నశింపచేయు ఉపేంద్రుని నమస్కరింతును; కపిలాది యోగి స్వరూ పముననుండి అజ్ఞానమయతమమును జ్ఞాన ప్రకాశ ప్రదానమున నశింప జేయు హరిని నమస్కరింతును; ఎవని నేత్రములగు చంద్రసూర్యులు సర్వలోక శుభకరమగు కర్మమును సతతము చూచుచున్నారో అట్టి యు సేంద్రుని నమస్కరింతును; సర్వేశ్వరుడును సర్వుడునునగు ఎవనియందు నేను చెప్పిన ఇది యంతయు నత్యమో అసత్యము కాదో ఆట్టి అజుని విష్ణుని ప్రభుని ఆవ్యయుని నమస్కరింతును;నేను చెప్పిన ఇదియంతయు సత్యము కావునను జనార్దనుడింతకంటెను అధికుడు కావునను ఈ సత్యముచే నా మనోరథములన్ని యు సఫలములయి పూరింపపడుగాక!
అదిత్యై విష్ణుదత్త వరలాభః.
ఇట్లు స్తుతింపబడి వాసుదేవ భగవానుడు సర్వభూతముల క దృశ్యుడయియు అదితికి దర్శనమిచ్చుచు ఆమెతో ఇట్లు పలికెను: ధర్మజ్ఞా? ఆదితీ! నీ మనోరథములన్నియు నాయనుగ్రహమున నిస్సంశయముగ సిద్ధించును; మహాభాగా! నామాట వినుము; నీ యభివాంఛితమగు వరము ఏదియే కోరుము; నీకత్యంత ! శేయము కలుగును; నెదర్శనమెన్నడును విఫలము కాదు; అన ఆదీతి ఇట్లనెను: దేవా! భక్తవత్సలా! నీవు నా భక్తితో ప్రసన్నుడవయినచో నాపుత్తడగు ఇంద్రుడు త్రైలోక్యాధిపతియగుగాక! మహాసురులతని రాజ్యమును యజ్ఞభాగములను హరించినారు; వరదుడవగు నీపు ప్రసన్నుడ వయినచో నొకుమారుడు మరల నవి పోందుగాక ! కేశవా! పోనీకి రాజ్యము పోవుట దుఃఖకరముగాదు; సొసవతి కొడుకు మావానీ దాయభాగమును హరించెననుట మాహృదయమునకు బాధ కలిగించుచున్నది; అన భగవానుడిట్లనెను: దేవీ? నీయభీప్సితము ననుగ్రహించితిని; నా యంశమున కశ్యపుని వలన నీగర్భమున జన్మింతును; తరువాత దేవశత్రువులను సంహరింతును; ఆనంద కరురాలా! సంతోషమందుము; అనగా అదితి ఇట్లనెను; దేవదేవేశా! అనుగ్రహించుము; (ప్రసన్నుడ వగుము;) విశ్వభావనా! నీకు వందనము; దేవా! కేశ వా! నేను నిన్ను నా గర్భమున మోయజాలనే మో! ఎవనియందు విశ్వము నెలకొన్నదో ఎవరు తాను స్వయముగా విశ్వరూపుడో అట్టి ఈశ్వరుడు అగు దుర్ధరుని నిన్ను నేను ఉదరమున మోయజాలను.
అనగా భగవానుడిట్లనెను: మహాభాగా సత్యమంటివి; నాయందే జగమంతయు ప్రతిష్ఠితము; నన్ను ఇంద్రాది దేవతలెవ్వరును మోయజాలరు; కాని నేను సర్వలోకములను అందలి స్థావర జంగమములతో దేవాసుర మనుషులతో నిన్ను ను కశ్యపునికూడ మోయగలను; భద్రరూపొ! కావున నీవు భయపడకుము; నేను నీగర్భమందుండగా నీకు శ్రమముకాదు, చెమటయు పట్టదు; దక్షపు తీ: నేను అన్యసుదుర్లభమగు అనుగ్రహమును నీయందు చూపుచున్నాను; నేను నీగర్భమందున్న కాలమున నీపుత్తుల కేవరయిన హాని కలిగించినచో వారికి తేజోహాని కలిగింతును; వ్యథ నందకుము; అని పలికి వెంటనే ఈశ్వరుడంత రైతుడయ్యెను. ఆ అదితియు కాలమున పురుషోత్తముని గర్భముగా పొందెను; కృష్ణుడు గర్భస్థుడై యున్న కాలమున సకల భూమియు చలించేను, మహా శైలములు వణ కెను; సముద్రములు షోభిల్లెను; అదితి లలితముగా నెచట అడుగుంచినను అచటనెల్ల భూమి భేదముచే వంగెను; ఆ కాలమున పరమేష్ఠియగు విష్ణువు చెప్పినటులే సర్వదైత్యులకును తేజోహానియయ్యెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వామన చరితమున అదితి గర్భమందు హరిప్రవేశ మను రెండు వందల నలువది మూడవ అధ్యాయము.
