మత్స్య మహా పురాణము
70 - అనంగ శయన వ్రతము
బ్రహ్మదేవుడు ఈశ్వరు నిట్లడిగేను. భగవన్! (వేదిక) పురాణము లయందు చెప్పబడియున్న వర్ణాశ్రమముల ఉత్పత్తిని ధర్మశాస్త్రములయందలి ఆచార నిర్ణయములను సదాచారములను కూడ వింటిని. పుణ్య స్త్రీలు పాటించవలసిన సదాచారమును పతివ్రతల సదాచారమును వినగోరుచున్నాను. నా కవి తెలుపుము.
ఈశ్వరు డతనికి ఇట్లు చేప్పెను: ముందు రాబోవు యుగమున శ్రీకృష్ణునకు పదునారువేల మంది భార్య లగు దురు. ఆ కాలమున ఒకానొక వసంతర్తువునందు కోయిలల తుమ్మెదల గుంపులు దట్టమయి ధ్వనులు చేయుచుండ పూగిన ఉదానముల నడుమ వికసించిన ఎర్ర కలువలతో నిండిన నస్సు నోడ్డున ఉన్న శ్రీకృష్ణ భార్యల పదు నారు వేల మందికి సమీపముగా కృష్ణ కుమారుడు సాంబుడు. పోవుట జరుగును. అతడు లేడి కన్ను లవంటి చంచలములు మనోహరములు నగు కన్నులు కలవాడు; మాలతీ పుష్పములతో కేశపాశము నలంకరించుకొనిన వాడు, మద్యపానగోష్ఠులయందు దట్ట ముగా మునిగియున్న స్త్రీలు ఆతని చుట్టు పరివేష్టించి యుండి ఆతని నలంకరించి యుందురు. అతడును సర్వాభరణము లతో అలంకరించబడి - సాక్షాత్ మన్మథునివలె నుండును. అతనిని. శ్రీకృష్ణపత్నులందరును మన్మథ బాణ తాపము చే వాంఛాపూర్వకముగా చూతురు.. వారి మనస్సులందు కామ మధికమగుటను భగవానుడు. జ్ఞాననేత్రముతో చూచి నేను లేని చోట మీరు కామముచే ఇట్లు ఆచరించితివీ - కాపున మిమ్ము, దోపిడిగాండ్రు హరింతురు. అని శపించును.
శాపముచే అభితాపము చేంది వారందరును సర్వభూతముల, సృజించి పోషించువాడు. శారధారియగు కృష్ణ భగవానుని వేడికొని అనుగ్రహింపజేసికొందురు. మీరు ఈ శాపమునుండి తరించుటకు మీకు దాసీత్వము. ప్రాప్తించును. నేను రాబోవు పనులు ఏవి ఎట్లు జరుగనున్న వో అట్లు చేయువాడను. ఇక ముందు దాల్ఫ్యుడు ఆను బ్రాహ్మణుడు మీకు ప్రీతికరమగు వ్రతమును దేని నుపదేశించునో దాని నాచరించుడు. ఆది మిమ్ములను మీ దాసీత్వమునుండి తరింప జేయగలుగును.” అని ప్రీతితో భగవానుడు వారికి ఉపదేశించి వారిని విడిచి అంతర్థానము నందును.
తరువాత చాలకాలమునకు శ్రీకృష్ణ భగవానుడు భూభారావతారణము చేసి మౌసల (ఇనుపరోకలి పొడినుండి ఉత్పన్న మైన తుంగదుబ్బులతో యాదవులు పరస్పరము చేసికొనిన యుద్ధమునకు తరువాత తానును వైకుంఠము చేరును. యదుకులమున వీరులు లేక పోగా ఆర్జునుని జయించి దోపిడి గాండ్రు కృష్ణపత్నుల నపహరించి దాసీత్వమునకు పాలుపర తురు. వారు దుఃఖముచేతను దురదృష్టముచేతను నం తాపము చెంది సముద్ర తీరమున నుండగా యోగాత్ముడగు దాల్బుక డను మహాతపస్వి అచ్చటకు వచ్చును. వా రతనిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి పునః పునర్నమస్కారము లర్పింతురు. బాష్ప వ్యా ప్రములయిన కన్నులతో వా రనేక విధములుగా ఏడ్చుచు (తా మదివరకు అనుభవించిన) దివ్య భోగములను దివ్య మాల్యసుగంధానులేపనములను లోకేశుడు ఆనంతుడు పరాజయము నేరుగనివాడు నగు, తమ పతిని దీవ: లక్ష్మణ ములుగల తమ ద్వార కాపురిని ఆచటి నానా రత్న గృహములను దేవ సదృశులై యుండి అప్పుడు దేవత్వమును పొందిన ద్వారకావాసులగు కుమారకులను తలచుచు దుఃఖించుచు ఆ మునీ కెదురుగా నిలిచి ఇట్లు ప్రశ్నింతురు. "
“భగవన్: మేమందరమును దస్యులచే బలాత్కారమున అనుభవించబడితిమి. మాకు కలిగిన ఈ ధర్మ భ్రంశములో మీరే మాకు దిక్కు అగుదురని పూర్వమే శ్రీకృష్ణభగవానుడు మాకు ఆదేశించియున్నాడు. భగవానునకు పత్నులమగు మేము వేశ్యాత్వమును పొందుట కేమి హేతువు? తపోధనా! వేశ్యలకు ఆచరణీయమగు ధర్మమేదియో మాకు తెలుపుము.” అని అడుగగా ఆశ్చర్యచకితమయిన ముఖముతో దాల్యుడు వారితో నిట్లనును: “పూర్వము మీరందరును అగ్ని పుత్రికలగు అప్సరసలుగా ఉండిరి. ఒకప్పుడు మీరు మానస సరస్సున జలక్రీడా విహారములందుండగా నారదుడు మీకడకు వచ్చెను. మీరు గర్వముచే అతనిని నమస్కరించక యే మాకు నారాయణుడు పతియగు ఉపాయము ఏమ'ని అడిగితిరి. మధు (చైత్ర మాధవ (వైశాఖ) మాసములందు బంగారు అలంకరణములతో సర్వ పరికరములతో మంచము లను పడకలను (ఒక్కొక్క మాసమునందొక్కొక్కటిగా) ఉపవాస సహితమగు వ్రతాచరణముతో దానము చేసినచో నారాయణుడు పతియగునని ఉపదేశించి ఆముని రూప సౌభాగ్య గర్వముచే నన్ను నమస్కరింపక యే ఈ విషయము అడిగితిరి కావున మీకు నారాయణునితో వియోగము శీఘకాలములోనే కలుగును. చోరులచే అపహరింపబడి మీరు వేశ్యాత్వమును పొందుదురు. అని శపించును. ఇట్లు నారద శ్రీకృష్ణుల శాపముచే మీరు కామ మోహితులయి వేశ్యాత్యమును పొందితిరి. ఉత్తమ స్త్రీలారా! నేనిపుడు చెప్పునది వినుడు.
పూర్వము దేవాసుర యుద్ధములందు దేవతల చేతులలో వందలకొలదిగా దానవులు అసు 2 లు దైత్యులు రాక్షసులు మరణించిరి. వారి స్త్రీలు వేలకొలదిమంది వీరిచే హరించబడి బలాత్కారమున పెండ్లాడబడుటయో అనుభ వించబడుటయో జరిగెను. వారితో పురుషోత్తముడగు దేవేంద్రుడిట్లనెను . మీరిక మీదట భూలోకమున) రాజమందిరము లందును దేవమందిరములందును భ క్రిమతులై వేశ్యా ధర్మముతో నుండుడు. (అచటి రాజులే మీకు యజమానులగుదురు. వారికి వచ్చిన ఆశౌచములు మొదలగునవి మీకును వర్తించును. మీకందరకును యోగ్యతానుసారము సౌభాగ్యము (ఐదువతనము) ఉండును. కపటి కానీ ఎవడు శుల్కము వెల) తీసికొని మీకడకు వచ్చినను అతనికి మీరు కపటము లేకుండ - ఉపచారము చేయవలయును. పుణ్య దినములందు దేవతలకును బ్రాహ్మణులకును గో భూ-హిరణ్య-దానములు చేయవలయును. బ్రాహ్మణులకు మీచేతనైన కార్యములు (నృత్యము-సంగీతము మొదలగునవి) చేయవలయును. ఇది కాక నేను మీకొక వ్రతము నుపదేశింతును. దానిని మీరు ఏమాత్రమును వెనుక ముందులు విచారించక అనుష్టించవలయును. దానిచే మీరు సంసారమును తరింతురు. ఆదిత్యపార మున హస్త పుష్య పునర్వసులలో నేదైన నక్షత్రముండగా (మీజాతి వారు) సర్వోషధులతో స్నానమాడి మన్మథుని నన్ని ధానము (ప్రతిమా ప్రతిష్టాపనము) ఏర్పరచుకొని మన్మథ నామములతో విష్ణు నర్చించవలయును.
పూజామంత్రములు: 1. కామాయనమః-పాదౌ పూజయామి; 2. మోహ కారిణేనమః-జం మే . పూజయామీ; 3. కందర్ప నిధయేనమః. మేడ్రం పూజయామి; 4. ప్రీతిమ తేనమః కటిం పూజయామి; 6. సౌఖ్య సముదాయనమః నాభిం పూజయామి; 6. పాసపోయనమః ఉదరం పూజయామి; 7. హృదయేశాయనమః హృదయం పూజయామి 8. ఆనంద కారిణేనమః- స్తనౌ పూజయామి; 9. ఉత్కంతాయనమః-కంఠం పూజయామి; 10. ఆహ్లాద కారిణేనమః -ఆన్యం పూజయామి; 11. పుష్పచాపాయనమః వామాంగం పూజయామి; 12. పుష్పబాణాయ నమః-దక్షిణాంగం పూజయామి, 18. అనంగాయనమః - మౌళిం పూజయామి; 14. విలోలాయనమః - కేశాన్ పూజయామీ; 15. సర్వాత్మనేనమః శిరః పూజయామి; (ఇది అంగపూజ).
గదాధరుడు-పీతవస్తుడు.శంఖచక ధరుడు - మన్మథాత్ముడునగు నారాయణునకు నమస్కారము. శాంతి. ప్రీతి-రతి-పుష్టి-తుష్టి-సర్వార్థ సంపది రూపయగు లక్ష్మికి నమస్కారము .
ఇట్లు మన్మథాత్మకుడు ఈశ్వరుడగు గోవిందుని గంధమాల్య ధూపదీప నైవేద్యములతో ఈ స్త్రీలు పూజించ వలేను. తరువాత ఆమే ధర్మజ్ఞుడు వేద పారంగతుడు అంగ వైకల్యములేని వాడు నగు బ్రాహ్మణుని పిలిపించి గంధ దీపాద్యర్చనలతో ఆతనిని పూజించి కుంచేడు మంచి రాజనాల వరి బియ్యమును నేతితోడి పాత్రను 'మన్మథః ప్రీయతామ్' అనేడు మంత్రముతో దానము చేసి ఈ పదార్థములు మీయశ్రేష్ట భోజనమునకు సరిపోవుగాక! యని భక్తితో పలుకవలెను. రతీదేవికి ఆనందము కలిగించు మన్మథుడే ఈ బ్రాహ్మణుడని భావన చేయుచు. ఈ విలాసిని ఆ విప్రుని మనస్సునకు ప్రీతికరముగా అతడు కోరినట్లు సర్వభావము తో ఆత్మార్పణముచే నృత్య గీతాది విలాసములతో ఆతనిని సంతోష పెట్ట వలయును. ఇట్లు ప్రతి ఆదివారము నాడును పదుమూడు మాసములు విడువక, వ్రతము చేయవలయును.
పదుమూడవ మాసమున బ్రాహ్మణ దంపతులను బంగారు గొలుసులు యజ్ఞోపవీతము ఉంగరములు కడి యములు మురుగులు సన్నని వస్త్రములు గంధమాల్యాను లేపనములు-ఇట్టివానితో అలంకరించి వారికి శయన దానము చేయవలెను. వారికి అన్ని పరికరములతో కూడిన మంచము-దిండ..పరపు.పరపుపై కప్పు దుప్పటి.ఆనుకొనుదిండు. ప్రదీపము - చెప్పులు-గొడుగు-పాదుకలు పీట. ఇట్టి వన్నియు చేర్చిన విలక్షణమయిన శయ్యను దానము చేయవలెను. ఒక కడవలో బెల్లము నింపి దాని పై తామ్ర పాత్ర నిలుపవలేను. దాని పై ఆసనము నమర్చి దాని పై రతీ మన్మథుల (బంగారు) ప్రతిమలను బంగారు సరిగగల వస్త్రములు కట్టిన వానిని ఉంచవలెను. కంచు పాత్రను చెరకు గడను కూడ వాటితో పాటు చేర్చి పాడియావును ఇవన్నియు కూడ ఆ విప్ర దంపతులకు దానమీయవలెను.
దాన మంత్రమునకి అర్ధము: మన్మథ విష్ణువుల నడుమ నేను అభేదము భావించుచు నారాయణుని సేవించు చున్నాను. కావున నారాయణా! నాకు అన్ని కోరికలు నెర వేరుగాక! కేశ వా! నీ దేహమునుండి నీకామిని లక్ష్మి) వేరు కానట్లే నాకును అన్ని కోరికలును (కామములు) తీరుగాక ! ఈ దానమును ప్రతిగ్రహించు వాడును దానఫలమును ఇచ్చు వాడును మన్మథుడే. విప్రాః దానము గ్రహించు నిన్ను ను ఇచ్చు నన్ను ను తరింపజేయువాడును మన్మథుడే. అట్టి మన్మథు నకు నమస్కారము. (ఇచట కామో దాతా-ఇత్యాది వేదమంత్రమును చెప్పవలెను.)
తరువాత ఆ విప్రదంపతులను ప్రదక్షిణించి వారిని వారి గృహమునకు పంపిపిమ్మట ఈ దానమిచ్చిన వన్ని యు వారి ఇంటికి చేర్చవలెను.
అది మొదలు తమ ఆనందమునకై తమ ఇంటికి ఎవరు వత్తురో వారిని ఉపచారములతో ఆనందపరచవలెను.
లోగడ చెప్పిన పదుచూడు మాసముల క్రమములోను ఒక బ్రాహ్మణుని మాత్రమే అర్చించవలెను. ఒక వేళ అతడు ఆ నడుమ దేశాంతరము పోయినచో ఆతని అనుమతితో మరియొక బ్రాహ్మణుని అర్చించవచ్చును.
తాను గర్భవతి యగుట.తనకు పురుడువచ్చుట-తన రాజునకు ఆశాచమువచ్చుట. ఇతరములగు దైవిక హేతు వులు-మానుషము లైన హేతువులు గ్రహణములు-వ్యతీపాతము మొదలగు దోషములు - వీనిచే వ్రతమున విఘ్నము సంభ వించినను ఎనిమిది. ఐదు.ఎనిమిది. ఈ క్రమమున(8-5=13) మొత్తము పదుమూడు మాసములగునట్లు కొన్ని సంవత్సరములపాటు ఈ వ్రతమును ఆమె చేయుచుండవలెను. ఏ విఘ్నము వచ్చినను బ్రాహ్మణుని (మన్మథ) దేవుని యథా శ క్తిగా అర్చించుచునే యుండలేను.
(దాల్భ్య వచనము) కృష్ణ పత్ను లారా! పూర్వము దేవేంద్రుడు రాక్షస స్త్రీలను భూలోకమున వేశ్యలుగా బుట్టు డని వారికి చెప్పిన స్వధర్మము ఇది; ప్రకృతమున మీరును ఈ వ్రతమునే అనుష్టించ వలయును. ఇది సర్వపాప ప్రశ మనము; అనన ఫలదాయకము; 'కల్యాణినులు' ఆను. వేశ్యా స్త్రీలకు విధించబడిన వ్రతము ఇది; దీనిని మీరును ఆచరించుడు. దీనిని అఖండ ముగా ఎడతెగక ఆచరించిన 'కల్యాణిని' విష్ణు లోకమున వసించును. అచట ఆమే ఆ శేష దేవ గణముల పూజల నందుకొనును.
మత్యుడు చివరకు ఇట్లు చెప్పెను.ఆ దాల్బ్యముని కృష్ణ పత్నులకు పదునారు వేల మందికిని ఇట్లు ఈ ఆనంద శయన దాన వ్రతమును ఉపదేశించి తన స్థానమునకు మరలి పోవును. వారును ఈవ్రతమును అట్లే ఆచరింతురు.
ఇది శ్రీ మత్స్య మహా పురాణమున అనుగశయన వ్రతము అను డెబ్బదవ అధ్యాయము.
