మత్స్య మహా పురాణము

Table of Contents

96 - ఆదిత్యవార నక్తవతము

నందీశ్వరా! మానవులకు ఆరోగ్య ప్రదమును అనంత ఫలప్రదమును శాంతి ప్రదమును నగు - వ్రతమును తెలుపుమనిన నారదున కతడిట్లు వచించెను: విశ్వాత్మక మును సనాతనము నునగు పరబ్రహ్మ తత్వపు తేజము జగ మున సూర్య చంద్రాగ్నులను మూడు రూపములతో ప్రకాశించుచున్నది. దాని నా రాధించినవారు సదా క్షేమమునందుదురు. అందులకయి ఆదిత్య హారములందు నియతముగ పగలుపవసించి నక్తమున (రాతియందు) భుజించవలెను. ఎట్లన ఆదిత్య వారములో హస్త నక్షత్రము వచ్చినప్పుడు దానికి ముందటినాడు. శనివారమున పగటి మాత్రపు భోజనముతో ఏక భుక్తము చేసి విమత్సరు డై యుండి ఆదిత్యహరమునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తానును భుజించవలెను.

(దానికి ముందు) రక్తచంద సముతో ద్వాదశ దళ పద్మము వ్రాసి దానియందు తూర్పున 'సూర్యాయనమః' ఆగ్నేయమున 'దివాకరాయనమః' దక్షిణమున 'వివస్వతే నమః' నైరృతమున 'భగాయనమః' పడమర 'వరుణాయనమః' వాయవ్యమున “మ పేంద్రాయనమః' ఉత్తరమున “ఆదిత్యాయనమః' ఈశాన్యమున 'శాంతాయనమః' అని వ్రాయవలెను. అట్లే కర్ణిక లో తూర్పున 'రవితుర గేభ్యోనమః' దక్షిణమున 'యమాయనమః' పశ్చిమమున మార్తాండాయనమః' ఉత్తరమున 'రవయేనమః' కర్ణిక నడుమ 'భాస్కరాయనమః' అని వ్రాయవలెను.

పిమ్మట ఆ పద్మమున నూవులును రక్తచందనమును కలిసిన రక్త పుష్పోదకముతో రవికి అర్ఘ్య మీయవలెను. మంత్రార్థము): దివాకరా! నీవు కాలాత్ముడవు; సర్వభూతాత్ముడవు; వేదాత్ముడవు; సర్వతోముఖుడవు; అగ్నీ ద్ర రూపుడవు; ఇట్టి నీకు తూర్పుదిశయందు నమస్కారము. 'అగ్ని మీశే' ఇత్యాది ఋక్కుతో నీకు నమస్కారము. 'ఇషే త్వోర్ణేత్వా' ఇత్యాది మంత్రముతోను 'అగ్న ఆయాహి' ఇత్యాది మం! తముతోను భాస్కరా! వరదా! జ్యోతిషాంపతీ! నీకునమస్సు. అనుచు రవి కర్యము ఇచ్చి అతనికి ఉద్వాసనము చెప్పవలెను. ఆ రాత్రి తైలము లేకుండ భుజించవలెను. ఇట్లు సంవత్సరము గడచిన తరువాత అనేక ప్రతములను దానములను ఆచరించినవాడు అంగ వైకల్యము లేనివాడు జితేంద్రియుడు కుటుంబి పొగరులేనివాడు అగు బ్రాహ్మణుని ఎర్రనివికాని ఎరుపు పసుపు కలిసిన రంగువికాని అగు వస్త్ర మాల్య ధూపములతో అర్చించి అతనికి యథాశ క్తిగ బంగారుతో చేసిన పద్మమును ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అలంకరించినదియు దూడ కలదియు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలదియు ఆగు పొడి యావును దానమీయవలెను. (దానమంత్రము): “పాపనాశనుడు విశ్వాత్ముడు సప్తాశ్వుడు ఋగ్యజుస్సామవేదములకు తేజస్సులకు నిధియు విధాతృడును సంసార సాగర నౌకయు జగత్పవిత్రుడునగు రవికి నమస్కారము."

ఈ విధానమున సంవత్సరకాలమాచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతలు తను సేవింప సూర్య పదమునందును. అతడు కర్మ నాశమును పొంది భూనాధుడై దుఃఖభయ రోగ రహితుడై ధర్మమూర్తియు: అమి తాయువునై ఊర్ధ్వ సప్తలోకములను చేరి సుఖించును.

 శ్రీయైనను థర్తృ గురుదేవభక్తి కలిగి ఆదిత్య వార నకవత మును ఇట్లాచరించినచో అమెయు దేవ గణ పూజితమగు ఉత్తమలోకమునందును. సందియము లేదు.

ఈ విధానమును వినినను చదివినను ఇతరులు చదువుట విని అను మాదిరి ప్రశంసించినను అట్టివాడును నూర్ల కోట్ల సంవత్సరములపాటు దేవపూజితుడై ఇంద్రభవనమున సుఖించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆదిత్యవార నక్త వ్రత మాహాత్మ్య కథనమను తొంబది ఆరవ అధ్యాయము.