మత్స్య మహా పురాణము

Table of Contents

208 - సత్యవంతుడు సావిత్రికి వన సౌందర్యము వర్ణించి చెప్పుట.

            సత్యవంతుడు ఇట్లు పలికెను: ఈ వనమునందు పక్షులతో వ్యాప్తమును నయనములకును  ముక్కులకును సుఖకరమును వసంత ఋతువునందు ఆ నంద వర్గ కమునునగు మనోహరమయినతీయమామిడి చెట్టును చూడుము; విశాల లోచనా! ఇందు (చిగురాకులచే) ఎర్రదనము కలదియు చక్కగ పూచినదియు అగు ఈ అశోక వృక్షమును చూడగా వసంతుడు నన్ను చూచి నవ్వు చున్నా డేమో అన్నట్లున్న ది; దక్షిణ (ఆనురాగ) భావము కలదానా! ఈ దక్షిణ దిశ యందు ప్రజ్వలించు అగ్ని తో సమానకాంతిగల పూచిన మోదుగలతో రమ్యమగు ఈ వనస్థలినీ చూడుము; సువాసనకల పూలవాసనతో నిండినదియు వన్య శ్రేణి నుండి వెలువడినదియు అగు పోయువు. మన పై దాక్షిణ్యము చూపుచు శ్రమ పోగొట్టు చున్నది; విశాలనేత్రా! ఈ పడమటి దిశ లో చక్కగా పూచిన కర్ణికార వృక్షములతో మనోహర మగు ఈ వన శ్రేణి బంగారుతో అలంకరించబడినట్లు ప్రకాశించుచున్నది; అతిము క్తలతో సమూహముతో ఆక్రమించబడిన మార్గము కలదయి ఈ వనస్థలి మనోహర సర్వాంగి! కుసుమ సమూహముతో అలంకరించబడినదో యనునట్లు కనబడు చున్నది; తేనె తావి మత్తెక్కిన తుమ్మెదల ఝుంకారమను మిషతో కాముడు హింసాదృష్టితో ఈ దగ్గరలోనుండి బొపమును ఎక్కు పెట్టి లాగుచున్నాడో యనునట్లున్నది; పండ్ల రసము ను ఆస్వాదించుటచే ప్రకాశించు నోరుగల గండు కోయిలల నాదముతో నిండిన ఈ వనస్థలి ఆంద మైనతీలక వృక్షములు కలదగుటచే అందమగు తిలకముతో అలంకృతవగు నిన్ను పోలియున్నది. మామిడి కొమ్మకోసమే ఈ కోకిల పుష్పమంజరుల పరాగముతో పింజర  తెలుపు ఎరుపు కలిసిన వర్లముకలదై ఉండియు ఉ తమ వంశమున పుట్టినవాడు తన కార్యములతోవలే ఇది తన కూతలతో తాను ఇదియని స్పష్టముగా తెలియుచున్నది; తుమ్మెద పుష్ప రేణువులు ఒడలినిండ పులిమీ కొని తన ప్రియురాలిని వెంటనంటుచు ఝుంకారము చేయుచు పూవుపూవునకు తిరుగుచున్నది; మామిడి చెట్టున పూవులు చాల ఉన్న ను పడుచు గండుకోయిల తన ప్రియురాలు ముక్కుతో పొడిచిన మామిడి పూగు తినే ఆస్వాదించుచున్నది.

ఆచెట్టు కొన పై మగకాకి ప్రసవించి తన శిశువును రెక్కలతో కప్పి పెట్టుకొని యున్న తన ప్రియురాలిని తన ముక్కుకొనతో స్పృశించి ఆదరించుచున్నది. కామ వర వశమగు పడుచుక పింజల పక్షి తన ప్రియురాలితో కూడి భూభాగమును చేరి ఆహారమును కూడ తినకున్నది; కలవింక పక్షి ప్రియురాలి ఒడిలో చేరి ఆమెను మాటి మాటికి ఆనంద పెట్టుచు కాముకులను రెచ్చగొట్టుచున్నది. ఈ చిలుక తన ప్రియతో కూడి రెమ్మ పై కూర్చుండి తన బరువుతో ఆ రెమ్మ వంగుచుండ అవ్య క్తమును మధురమును అగు పలుకులు పలుకుచున్నది.

(ఇంతవరకును పకుల విహరణపు వర్ణనమయినది. ఇక మీట మృగముల విహరణపు వర్ణనము) ఇదుగో! అడవిలో ఇటు చూడుము. సింహము మాంసమును ఆస్వాదించి తృప్తినంది నిదురించుచున్నది; దా నీ ప్రియురాలు తన ప్రియుని కాళ్ళనడుమ పండుకొని యున్నది; పర్వత కందరపు నడుమ చూడుము; పులి దంపతులు ఉన్న వి; ఐని కనుల వెలుగులో గుహ చీలేనో అనునట్లు కనబడుచున్నది; ఇదిగో: ఈ చిరుతపులి మాటి మాటికి నాలుక కొనతో తన ప్రియను నాకుచున్నది; తన ప్రియురాలుకూడ తను నాకుచుండ చాల ఆనందపడుచున్నది; ఈ ఆడుకోతి తన తొడ పై తల పెట్టుకొని మైమరచి నిద్రించుచున్న మగ కోతి పేలు తీసివేయుచు తన ప్రియునకు హాయిగొలుపుచున్నది. నేల పై వేల కిల పండుకొని యున్న ఆడుపిల్లికి నొప్పికలుగకుండగనే దానిని తన గోళ్ళతో దంతములతో నొక్కుచు హాయి. గొలుపుచున్నది. ఈ ఆడు మగ చెవుల పిల్లులు తమ కాళ్ళనడుమ ఒడలుముడిచికొని నిద్రించుచుండ అవి కనబడ కున్న ను వాటి చేవులను బట్టి మాత్రము అవి ఇవి అని తెలియుచున్న దీ; కామాతురమగు ఈ మగ ఏనుగు తామర పూలతో నిండిన సరస్సునందు తన ప్రియురాలికి తామరతూడులతునుకలు తినుట కందించుచు ఆదరించుచున్నది; ఆడు అడవి పంది తన పిల్లలు తన వెంట వచ్చుచుండ తన ప్రియుని ఆనుసరించుచు అందమగు ముట్టెతో త్రవ్వి ఎత్తిన ము స్తెలను తినుచున్నది. దృఢదేహసంధులు కల అడవిదున్న ఇదిగో! ఈ అడవిలో బురద నిండిన ఒడలితో నుండినదై ఎంతో ఆసక్తితోను పొగరుగాను తన ప్రియురాలు పరుగెత్తి పోవుచున్నను దాని వెంటనంటి పోవుచున్నది.

మనోహరాంగి! కుతూహలముతో తన వైపు చూచు నన్ను ను నా భార్యనగు నిన్ను ను ఈ సారంగము. చూచు చున్నది;నీవుకూడగట్టిగ చూచినచో బెదరునేమో! నీవు దానిని నీకడగంట చూడుము; ఇటుచూడుము; ఆడు రోహి మృగము వెనుక కాలితో తన మొగమును గోకి కొనుచున్నది; ఆదే సమయములో అదీ తన హృదయమందలి స్నేహార భావముతో తనకొమ్ము కొనతో తన భర్తను దగ్గరకు లాగికొను చున్నది. నడువక కదలక కూర్చున్న చమరీ (ఆడు చమర) మృగ మును త్వరగ చూడుము; దానితోక కుచ్చు కానీ రోమ సమూహముకాని ఎంత తెల్లగ నున్న దో! మగ చమర ము కాముక మయి తన ప్రియురాలి నంటి పెట్టుకొని యుండి ఠీవిగా నన్ను చూచుచున్నది. ఎండ లో ఆగవయమును చూడుము; నెమరు వేయుచు తన మూపురము పైనున్న కాకిని తోలుకొనుచు తన భార్యతో కూడి సంతోషముగా నున్నది; రేగు ఆకులు తినదలచి ఆ చెట్టు పెనుగొమ్మ పై ముందరి రెండు కాళ్లుంచిన ఆడవి గోరే పొట్టేలును దాని భార్యను చూడుము; (జల పక్షుల వర్ల నము): చక్కని ము తైములతో ఆలంకృతమయిన చంద్రబింబపు శోభతో నుండి అతి నిర్మలమగు సరస్సునందు సంచ రించుచున్న ఆహంస దంపతులను చూడుము: సుందరీ! అటు చూడుము; తన భార్యతో కూడి సరో మధ్యమందుండిన చక్ర వాక పక్షిని చూడుము; అది ఈ వద్మ సర స్సునకు చక్కని పూలతో అలంకరించుకొనిన సుందరికి ఉండు అందమును సంతరించుచున్న ది; సరియేకాని.నుందరీ! ఇంతవరకు నేను పండ్లు ప్రోవుచేయగా నీవు పూలు సేకరించితివి; కానీ కాష్ట ములు పోవు చేయుట కాలేదు; ఇపుడిక ఆ పని చేయుదును; భామినీ! నీవు అంతలో ఒక క్షణ కాలము , ఈ సర సట మందలి చెట్టు నీడను ఆశ్రయించివి శ్రాంతి తీసికొనుచు నాకొరకుక్షోఎదురుచూచుచు ఉండుము; అంతలో నేను వత్తును; అనిన సత్యవంతుని మాటలు విని సావిత్రి.సరే; నీవు చెప్పినట్లే చేయుదును; కానిమ్ము; ప్రియా! నీవు మాత్రము నా దృష్టి పథమునుండి దూరముగా పోవలదు; ఈ కారడవిలో నాకు భయమగును;” అనేను; అంతట సత్యవంతుడును ఆ రాజ పుత్తికి దూరము కాకుండగానే ఆ సరస్సునకు దగ్గరలోనే అడవిలో క టైలు సేకరించ సాగేను. కాని ఆమె మాత్రము తన పతి మరణించినట్లే తలచేను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మనుమత్స్య సంవాదమున సావిత్ర్యుపాఖ్యానమున సత్యవంతుడు సావిత్రికి వన సౌందర్యమును వర్ణించి చెప్పుట అను రెండు వందల ఎనిమిదవ అధ్యాయము.