మత్స్య మహా పురాణము

Table of Contents

13 - పితృవంశానువర్ణనము - వైరాజపితరుల చరితము

మనువు మత్స్యనారాయణునితో ఇట్లు పలికెను : భగవన్! ఉత్త్రమమగు పితరుల వంశమును విన కుతూహల పడు చున్నాను, విశేషించి రవియు సోముడును శ్రాద్ధదేవులయిన వృత్తాంతమును వినగోరుచున్నాను.

మత్స్యనారాయణుడు ఇట్లు చెప్పనారంభించెను: అత్యంత ప్రధానమగు పితృవంశ వృత్తాంతమును నీకు తేలు పుదును. వినుము. స్వర్గలోకమునందు పితృదేవతాగణములు ఏడు కలవు. వీనిలో మూడు గణములు మూర్తి రూపము లేనివి. మరి మిగిలిన నాలుగును మూ ర్తి కలవి. ఈ ఏడు గణముల పితరులును ప్రాణులందరలో అమిత మగు ఓజస్సు (సామర్థ్యము) కలవారు.

చూర్తిలేని పితరులు వైరాజుడు అను ప్రజాపతికి (కుమారులు) సంబంధించిన వారు. వీరు ద్యులోకమునందు ఉందురు. (మూర్తి లేని పితరులు బుద్దిత త్వదశ లోనివారును ఆమూ ర్తములగు ఆకాశ వాయు భూతములతో రూపొందినవారును. మూర్తి కల.-పితరులు మూ ర్తములగు తేజో భూతముతో కూడ నిర్మితమయిన శరీరము కలవారు. జలపృథివీ భూతములు కూడ కలిసి వారి దేహమును నిర్మించినచో వారును భూలోకమునందలి మనవంటి ప్రాణులలోనివారే అగుదురు. కాని దేవతలు కారు. వీరినే ఎల్లవారును , ఆరాధించుచుందురు. వే రోజులు అని ప్రసిద్ధిపొందిన ఈ , ఆమూ ర్తములైన . పితృ గణములవారు శాశ్వతములగు లోకములను పొందగోరి ఒకప్పుడు యోగసాధనము చేసి యోగమునుండి శ్రష్టులైనవారు. వీరిట్లు చాలకాలము పితృ దేవతలుగా నుందురు. కల్పావసానమైన తరువాత మరల సృష్టి ఆరంభము కాగానే వేదత త్వ జులుగా జన్మింతురు. చారపుడు తమ పూర్వ స్మృతి కలిగియుండి యోగసాధనమునకై సంకల్పింతురు. సర్వో తమమగు . సాంఖ్యయోగమును ఆశ్రయించి పునరావృత్తి (మరల సంసారములోనికి వచ్చుట) లేని శాశ్వతగతిని పొందుదురు. ఇట్లు పితరులు యోగిరూపులు అని తెలియుచున్నది. కనుక లోకమునందు మానవులు కూడ శ్రాద్ధమునందు చేయు ఏదానము నై నను యోగము నేగి అనుష్ఠించువారి కే చేయవలెను.

ఈ పితరుల మానసీ (మనస్సంకల్పము చేతనే కలిగిన) కన్య మేన అనునా మె. ఆమె హిమవంతుని పత్ని యెనది. హిమవంతుని కుమారుడు మైనాకుడు. అతని కొడుకు క్రౌంచుడు. అతని పేరుతోనే ఘృత సముదముతో చుట్టబడిన క్రౌంచద్వీపము ఏర్పడినది. ఇది ద్వీపములలో నాలుగవది.

'మేన'కు ముగ్గురు కుమా రెలు కలిగిరి. వారు ఉమ-ఏకపర్ణ-అపర్త -అనువారు. వారు ముగ్గురును యోగసిద్ధి కలవారు. తీవవత పరాయణలు. తమ తపస్సుచే సర్వలోక జనులకంటే గొప్పవారు ఆగువీరిలో హిమవంతుడు ఉమను రుద్రునకును ఏక పర్లను భృగువునకును అపర్ణను జై గీషవ్యునకును ఇచ్చి వివాహము చే నేను.

శౌనకాది ఋషులు సూతుని ఇట్లడిగిరి: “పూర్వము దాక్షాయణి (దక్షుని కూతురు అగు సతి) తన దేహమును తానే ఏల కాల్చుకోనేను? ఆమె భూతలమున హిమవంతుని కూతురుగా ఎట్లు జన్మించేను? దక్షుడు బ్రహ్మమానస సుతుడై యుండియు శంకరుని ఎట్లు ఏల అవమానించెను? తన కూతురును లోక జననియు అగు సతి తెన దేహమును చాల్చుకొను నప్పుడు దక్షుడు ఏమనెను? మాకు విస్తరించి చెప్పుడు.”

సూతుడు ఋషులతో ఇట్లు పలి కెను: అధిక సంఖ్యగల శ్రేష్ఠములగు ద.క్షిణలతో, దక్షుడు యజ్ఞమును వితతము (శ్రాతకల్పమున చెప్పిన విధమున జరుపబడునది) చేయుచుండెను. (శివుడు . తప్ప మిగిలిన దేవతలు అందరును యజ్ఞమునకు వచ్చియుండిరి. అపుడు సతీదేవి తన తండ్రిని “నాయనా! ఈ యజ్ఞమునకు నాభర్తను ఏల పిలువలేదు?” అని అడిగెను. శూలధారి యగు రుద్రుడు నీభర్త యజ్ఞములందు . వచ్చుటకు యోగ్యుడు కాడు. అతడు సృష్టిని ఉపసంహరించు నశింపజేయు) వాడు. అందుచేత అతడు అశుభములను ఆశ్రయించి యున్న వాడై నాడు. (శుభములకు పనికిరాడు. ) అనీ దక్షుడు పలికెను. అంతట సతి కోపించేను. నీవలన ఉత్పన్నమైనందున నా ఈ దేహ మును విడిచెదను. అని ఆమె పలి కెను. నీవు పదిమంది తండ్రులకు ఒక్కడవే కుమారుడవు అయ్యేదవు. నీవు చేసిన ఈ దోషమునకు ఫలముగా నీ ఈ అశ్వమేధము రు దుని చేతిలో నాశమునందును. అని పలికీ సతీదేవి యోగమును పూనీ తన దేహమునుండి ఉత్పన్నమయిన అగ్ని తోనే తన శరీరమును దహింపజేసికోనుచుండెను. అది చూచి దేవతలు అసురులు గుహ్యకులు కిన్నరులు గంధర్వులును దక్షునితో ఇది ఏమి? ( ఇట్లు జరుగనిచ్చితివి?) అనిరి. అంతట దక్షుడు ఆమె దగ్గరకు వచ్చి దుఃఖించుచు నమస్కరించి ఇట్లు పలికేను: “నీవు ఈ జగత్తునకు మాతవు. జగత్తులకు సౌభాగ్య దేవతవు. నన్ను అనుగ్రహించు తలంపుతోనే నీవు నాకు పుత్రికవయితివి. నీవు లేనిది నీవు కానిది ఈ బ్రహ్మాండము నందు చరము కాని అచరము కా ') (కదలునది కదలనిది) అగు ఏపదార్తమును లేదు. నీవు ధర్మము నెరిగినదానవు. నన్ను అనుగ్రహించుము. సన్ను విడువవలదని వేడుచున్నాను.”

దేవి దక్షునితో ఇట్లు పలికెను: “నేను ఏమి చేయ సంకల్పించి ఆరంభించితివో అది నేను చేసియే తీరుదును. అందు సందేహము లేదు. దేవి వస్తు స్థితిలో ఇచ్చా దిశ క్తి త్రయ స్వరూపురాలు. ఇచ్చ అనగా సంకల్పము. ఆమే తాను సంకల్పించిన దానిని తన జ్ఞానశ క్తితో ఆలోచించి క్రియా శక్తితో నిర్మాణము చేయును. అని తత్వమున అర్థము. ) (నీవు నన్ను భక్తితో ప్రార్థించుచున్నావు.) కాని నా సంకల్పానుసారము శివుని చేతిలో నీ యజ్ఞము నాశము కాక తప్పదు. నన్ననుగ్రహింప జేసికొని నా దయచే లోక సృష్టిని సాధించుట కై నీవు నా సన్నిధిలో ఉండి తపస్సు ఆచ రించుము. పదిమంది ప్రజాపతులలోను నీవు శుభకరుడవు అయ్యెదవు. సో ఆంశ ముతో నీకు ఆరువదిమంది కూతుండ్రు కలిగెదరు. నా సన్నిధిలో తపమాచరించినచో నీవు ఉత్త్రమమగు యోగసిద్ధిని పొందేదవు.” 

దేవి - మాటలు విని దక్షు డామెతో “ఏయే తీర్థములందు నీవున్నట్లు భావించి నిన్ను దర్శించవలెను? ఏ నామములతో నిన్ను స్తుతి చేయవలెను?" అనెను.

దేవి ఇట్లు పలికెను: సర్వకాలములందును భూమియందలి (భూమి పై) సర్వ ప్రదేశములందు సర్వభూతము లందును నేనున్నట్లు దర్శించవలయును. ఏలయన స పలోకములందును ఏయే వస్తువులు కలవో పొనిలో ఏయొక్కటియు నేను లేనిదియు నేను కానిదియు లేదు. ఐనను తాము కోరిన ఫలములు సిద్ధింపగోరినవారు కాని అభ్యుదయమునో నిః శ్రేయసమునో కోరినవారు (ఇహపర సుఖముల కోరినవారు) కాని ఏయే స్థానములందు నన్ను (ఏరూపమున) స్మరింప వలెనో వాటిని వాస్తవ స్థితిలో చెప్పుచున్నాను.

1. వారాణసియందు విశాలాక్షి -2. నె మిశమున లింగధారిణి-8. ప్రయాగయందు శ్రీలలితాదేవి.4. గంధ మాదన పర్వతమున కాముక.5. మానససరః క్షేత్రమున కుముద-6. విశ్వేశ్వరమున విశ్వ.7. విశ్వకయందు మా లక్ష్మీ)-8. ఇచ్ఛా క్షేత్రమున మడ నోత్కట 9. గోమంతమున గోమతి-10. మందార మున కామచారిణి-11. చిత్రరథమున మదోత్కట-12. హస్తినాపురమున జయంతి. 13. కాన్యకుబ్జమున గౌరి.14. మలయపర్వతమున రంభ- 1 6. హిమ వత్పర్వత సానువునందు నంద-16. గోకర్ణమున భద్రకర్ణిక-17. స్థాణ్వీశ్వరమున భవాని.18. బిల్వకమున బిల్వపత్రిక - 19. శ్రీ శైలమున మాధవి.20. భద్రేశ్వర మున భద్ర-21. వరాహ శ్రీ లమున జయ-22. కమలాలయమున కంబళ . 28. పుష్కర క్షేత్రమున పురుహూత.24. కేదార క్షేత్రమున మార్గదాయిని 25. రుద్రకోటియందు రుద్రాణి-26. కాలంజర పర్వతమున కాళి-27. మహాలింగ క్షేత్రమున కపిల.28. మకుట క్షేతమున మకుట-29. సాలగ్రామ క్షేత్రమున మహాదేవి. 80. శివలింగ క్షేత్రమున శివప్రియ-81. మాయాపురి (జగన్నాధ క్షేత్రము) యందు కుమారి-2. లలితమునందు సంతత. 8. ఉత్పలాక్షమున సహస్రాక్ష -34. మహోత్పలమున హిరణ్యాక్ష85. గయయందు మంగళ_36. పురుషో త్త్రమమున విపుల.37. విపాశా నదీ క్షేతమున ఆ మోఘాక్షి -28. పుండ్రవర్తనమున పాటల.89. సుపార్శ్వమున నారాయణి - 40. త్రికూట పర్వతమున భద్రసుందరి-41. వివుల క్షేతమున విపుల.42. మలయాచలమున కల్యాణి-48. కోటి తీరమున కోట్య క్షి - 14. మాగధవనమున సుగంధ -4). కుబ్జమక క్షేత్రమున త్రిసంధ్య-46. గంగాద్వారము (హరిద్వార మున రతిప్రియ.47. శివకుండ తీరమున సునంద-48. దేవికానదీతటమున నందిని-4:). దో రకయందు రుక్మిణి_50. బృందా వనమున రాధ. 51. మథుర యందు దేవకి -52. పాతాళమున పరమేశ్వరి. 58. చిత్రకూటమున సీత -54. వింధ్యమున వింధ్యవాసిని.55. సహ్యపర్వతమున పడ మటి కనుమలు) ఏక వీర -56. హరిశ్చంద్రమున చంద్రిక - 57. రామతీర్థమున రమణ- 58. యమునాతీరమున మృగావతి 59. కరవీర మున మహాలక్ష్మి-60. వినాయకమున ఉమ.61. వైద్యనాథమున ఆరోగ్య.62. మహాకాళ మున మహేశ్వరి-63. శుక్ల తీర్థమున అభయ-64. వింధ్య కందరమున స్మృతి 65 మాండవ్యమున మాండకి-66. మ హేశ్వరపురమున సాహా_f7. ఛాగలాండమున ప్రచండ-68. అమరకంటక మున చండిక -69. సోమే శ్వరమున వరారోహ70. ప్రభాసమున పుష్కరావతి-71. సము, దతీరమునందు సరస్వతీతీరమున దేవమాత-72 మహా లయమున మహాభాగ-73. పయోషమున పింగళావతి. 74. కృతశాచ క్షేత్రమున సింహిక, 16. కార్తికేయ క్షేత్రమున యశస్కరి-76. ఉత్పలావ రకమున లోల-77. సాగర సంగమమున సుభద్ర-78. సిద్దవనమున లక్ష్మీమాత-79. భరతా శ్రమమున అనంగ.80. జాలంధరమున విశ్వముఖి-81. కిష్కింధ పర్వతమున తార -82. దేవదారువనమున పుష్టి 83. కాశ్మీరమండలమున మేధ-84. హిమాద్రియందు ఉమాదేవి.86. షష్ణ క్షేత్రమున వస్తేశ్వరి-86. కపాల మోచనమున శుద్ది-87. కాయావరోహణమున మాత .88. శంఖద్వారమున ధ్వని-89. పిండారకమున భృతి-90. చంద్రభాగాతీరమున కల_91. ఆచ్చోదమున శూలధారిణి -82. వేణా క్షేత్రమున అమృత.98. బదరీ క్షేత్రమున ఊర్వశి-94. ఉ త్త్రకురువు లందు ఓషధి-95. కుశ ద్వీపమునందు కుశోదకి_96. హేమకూటమున మన్మథ_97. కుముదమున సత్యవాదిని-98. అశ్వత్త్ర మున వందనీయ-99. వైశ్రవణాలయమున ని)విధి-100. వేదవదనమున గాయత్రి.101. శివ సంనిధియందు పార్వతి. 102. దేవలోకమునందు ఇంద్రాణి 108. బ్రహ్మశ రీర మున, సరస్వతి-104. సూర్యబింబమునందు ప్రభ-106. సప్త మాతృకలయందు వైష్టవి. 106. పతివ్రతలయందు ఆరుంధతి.107. సుందరులగు స్త్రీలయందు తిలోత్త్రమ.108. సర్వ ప్రాణుల చిత్త్రములందును బ్రహ్మక లయను శ క్తి.

ఇట్లు ఇచ్చట శ్రీదేవి నామములను నూట ఎనిమిదింటిని పేర్కొనుట మా తము { వాటి ఆర్థములతో శ్రీదేవీ తత్త్వమును వివరించక యే) ఐనది. ఈ పేర్కొన్న నూట ఎనిమిది తీర క్షేత్రములను విన్న ను స్మరించినను సర్వ పాపములను 'డి ముక్తి లభించును ఈ తీర్థములయందు స్నానము చేసి నన్ను దర్శించినవారు సర్వపాపముక్తులై కల్ప మంత కాలమును శివపురమున వసింతురు. నాయందు తత్పరత కలిగి ఈ క్షేత్రములందు నివసించువారు బ్రహ్మలోకము ను గూడ దాటి ఈ లోకమును చేరుదురు శుక్ల పక్షమున తృతీయయందుగాని అష్టమినాడుగాని శివ సన్నిధియందు నో ఈ అష్టోత్త్రర శ : నామములను వినిపించినవారు బహుపుత్రవంతులగుదురు. గోదాస కేశాది దాన కాలములందుగాని అటు దినముననుగాని దేవతార్చనా సమయము • గాని దీనిని పఠించు వివేకులు బ్రహ్మపదమును పొందుదురు.

ఇట్లు పలుకుచునే శ్రీ సతీదేవి తన దేహమును స్వయముగా దహించుకొనెను. (చిత్స్వరూపగా అయ్యెను.)

మొదట స్వయం భూ బ్రహ్మయొక్క దక్షిణాంగుష్ట మునుండి జనించి స్వాయంభువుడనబడిన ఈ దముడే ( తన కుమార్తెయగు సతీదేవి శాపము చే) ప్రచేతసులనబడు పది మందికి కుమారుడుగా దక్షుడి మరల) పుటేను. సతీ దేవియు పార్వతియై పుట్టి శివుని అర్ధాంగమునకు " మినీయ య్యెను. ఈ రెండవ జన్మమున ఆమే మేన గర్భమున దు జనించి భు కి ముక్తి ఫలప్రదయైనది. అరుంధతి ఈ విషయమును ( ఈ అష్ణోత్త్రర శత : మములను) జపించుచు ఉత్త్రమ యోగసిద్ధి పొందెను. రాజ యగు పురూరవుడును ఇష్టములును ఉత్త్రమములును అగు లోకములు పొందెను. భార్గవు (ని అలు)డు అగు యయాతియు పుత్రలాభమును ధనలాభమును పొందెను. ఇట్లే ఇతరులగు దేవతలును దైత్యులును బ్రాహ్మణ క్ష తియ వైశ్య శూద్రులును ఈ నామాష్టోత్త్రర శతకమును స్మరించి తమ ఇష్టముల సిద్దింపజేసికొనిరి. ఇది వ్రాయబడియున్న చోటును దేవ సన్నిధిలో ఇది పఠింప-పూజింపబడు చోటునను శోక ముగాని దారిద్ర్యముగాని ఎన్నడును కలుగదు

ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున శ్రీ గౌరీనామాష్టోత్త్రర శత కథనమను త్రయోదశాధ్యాయము.