మత్స్య మహా పురాణము
6 - కశ్యప సంతతి
సూతుడు ఋషులతో ఇంకను ఇట్లు చెప్పెను. మరీచి పుత్రుడగు కశ్యపునిపత్ను లనుండి కలిగిన పుత్ర పౌత్రాది సంతతిని ప్రవచింతును. అదితి.దితి-అరిష్ట-సురస-దనుపు-సురభి.వినత. తామ-క్రోధవశ - ఇళకద్రువ-విశ్వ-ముని అను పదుముగ్గురును కశ్యపుని పత్నులు. వీరి సంతతిని తెలి పెదను. చాతుష మన్వంతరమున తుషితులు అను దేవతలు వైవస్వతమన్వంతరమున అదితికి కుమారులై ఆదిత్యు లనబడుదురు. ఇంద్రుడు ధాత.త్వష్ట -మిత్రుడు-వరుణుడు-యముడు. వివస్వాన్-సవిత-పూష-అంశుమాన్-విష్ణువు-అను పండ్రెండు మంది సూర్యులే వీరు.
కృశాశ్వుడను ఋషికి పుత్రులు దేవగణములు దేవ విప్రులు. వీరు ప్రతి మన్వంతరారంభములందును జన్మించుచు కల్ప కల్పమునందును పుట్టుచు లయించుచుందురు.
కశ్యపునకు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులను ఇద్దరు కుమారులు కలిగిరి. హిరణ్యకశిపునకు ప్రహ్లాదా నుహ్లాద సుహ్లాద హోదులను నలుగురు కుమారులు. ప్రహ్లాదుని కొడుకులు ఆయుష్మాన్ శిబి బాహులుడు విరోచనుడు అను వారు. విరోచనుని కుమారుడు బలి. బలి కుమారులు నూరుమంది. వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మంచిగుణములు కలవాడు. వేయి భుజములు కలవాడు. ధృతరాష్ట్రుడు సూర్యుడు, చంద్రుడు దుర్యోధనుడు నికుంభుడు నాభుడు గుర్వక్షుడు కుంభి షీ బుడు విభీషణుడు మొదలగువారు అనేకులు అతని తమ్ములు. అతడు అన్ని అస్త్రములను ఎరిగిన వాడు. తపస్సు చే శివుని మెప్పించి అతడు తన పురమునందు వసించునట్లు వరము పొందెను. బాణుడు మహాకాలత్వమును పొంది శివునితో సము డయ్యెను.
హిరణ్యాక్షునకు దుర్దరుడు శకుని భూత సంతాపనుడు మహానాభుడు అను వారు కుమారులు. వీరి పుత్ర పౌత్రాది సంతతి డెబ్బది ఏడు కోట్లమంది. వీరందరు మహాకాయులు మహాబలులు నానా రూపములు ధరించగలవారు. మహా శక్తి సంపన్నులు.
దనుపు అను కశ్యపుని పత్ని యందు బలదర్పితులగు నూరుమంది కుమారులు కలిగిరి. మహాబల సంపన్నుడగు విప్రచి త్తి వీరిలో ముఖ్యుడు. ఇంకను ద్విమూర్ధ శకుని శంబరుడు మరీచి-మథనుడు ఇరుడు గర్గత రుడు విద్రావణుడు ఫేనుడు కేతువీర్యుడు శత ప్రదుడు ఇంద్రజిత్ సత్యజిత్ వజ్రనాభుడు మయుడు ఏకవకుడు మహాబాహుడు అజాముడు తారకుడు అసిలోముడు విలోముడు రిపుడు బాణుడు స్వర్భానుడు వృషపర్వుడు మొదలగు వారు దనుపుత్తులు. స్వర్భాను నకు సుప్రజా-పులో మునకు శచీ-మయునకు ఉపధా-మండోదరీ.కుహూ అనువారు. వృషపర్వునకు శర్మిష్ణ-సుందరి-చంద్ర అనువారు. పులోమ. కాలక అను ఇద్దరును వైశ్వానరునికి కుమార్తెలు. వీరు ఇరువురును హితకరులు గొప్ప బలము కల వారు బహు సంతానము కలవారును; వీరు మారీచుడు అను మునికి పత్నులైరి వీరివలన మారీచునకు పౌలోములు కాల కేయులు అను రాక్షసగణము జనించెను. వీరు నరుల చేత చావకుండ బ్రహ్మవలన వరము పొందిరి. హిరణ్యపురము వారి నివాసము. వారు అర్జునుని చేతిలో మరణించిరి. ఏ పచి త్తికి సింహిక యందు సైంహికేయుడు కోడు కయ్యెను. హిరణ్యకశిపునకు మేనల్లుండగు వత్సుడు శల్యుడు రాజేంద్రుడు బలుడు వాతాపి ఇల్వలుడు నముచి ససర్టుడు అశ్వాంజనుడు నరకుడు కాలనాభుడు పరమాభుడు అల్పవీర్యుడు అను పదుముగ్గురును దనువంశములోనివారే. వీరు దేవ గంధర్వోరగ రాక్షసులకు లొంగనివారు. వీరును బలశాలియగు అర్జునుని చేతిలో రణరంగమున మరణించిరి.
తామ్ర అనునామేకు శుకి - శ్యేని-భాసీ-సుగ్రీవా-గృధికా-శుచి-అను ఆరుగురు కుమార్తెలు. శుకి-చిలుక లను గ్రుడ్ల గూబలను శ్యేని-డేగలను భాసి కురర పక్షులను గృధీ గ్రద్దలను పావురములను పావురపుజాతి పక్షులను కనెను. శుచి హంసలను బేగ్గురులను నీరు కోడులను నీరు కాకులను కనెను. సుగ్రీవ ఆను ఆమె మేకలను గొట్టెలను ఒ0 టెలను గాడిద లను కనెను. ఇది తామ్ర సంతానము.
ఇక వినత సంతానమును వినుడు. పక్షులకు నాథులగు అరుణుడు (సూర్యుని రథమునకు సారథియగు అనూరుడు గరుడుడును ఆకాశమున కనబడుచు ప్రసిద్ధురాలగు సౌదామిని ( మెఱపు) అను కన్యయు కలిగిరి. అరుణు సకు సంపాతి జటాయువులు సుపొతికి బహశ్వుడు అతి ప్రసిద్దుడగు శీఘ్రగుడు జటాయువు కర్ణికారుడు వి శ్రుతుడగు శీఘ్రగామీ సారసుడు రజుపాలుడు అరుణుడు అను వారు కుమారులు. ఈ పక్షులకు అనంతమగు పుత్రపౌత్రాది సంతో నము కలిగేను.
సురస అను కశ్యప భార్యకు వేయేసి శిరసులు కల వేయి సర్పములు సంతానమయ్యెను.
కద్రువకు వేయి సర్పములు కలిగెను. వారిలో ఇరువది ఆరు మంది ప్రసిద్ధులు; వారు : శేషుడు వాసుకి కర్కో టుడు శంఖుడు ఐరావతుడు కంబళుడు ధనంజయుడు మహానీలుడు పద్ముడు అవతరుడు. తక్షకుడు ఏలాపుతుడు మహా పద్ముడు ధృతరాష్ట్రుడు వలాహకుడు శంఖపాలుడు మహాశంఖుడు పుష్పదంష్ట్రుడు శుభాననుడు శంఖరోముడు నహుషుడు వామనుడు పాణిని కపిలుడు దుర్ముఖుడు పతంజలి అనువారు. వీరి పుత్ర పౌత్రాది సంతతి అనంతముగా ఆయ్యెను. వీరిలో చాలమంది జనమేజయుని గృహమున దగ్దులేరి.
క్రోధవశ అనునా మేకు అపరిమిత సంఖ్యగల. వక్షసులు జన్మించిరి. వారు అందరు కోరలు గలవారు. వారిలో లక్షమందిని భీముడు చంపెను.
సురభి అను కశ్యప పత్నికి రుదులగణమును గోవులు గేదేలును కలిగెను.
ముని అనునా మెకు మహాముని గణమును అప్పదోగ ణమును కలిగేను.
అరిష్టకు కిన్నరులు గంధర్వులు అనేకులు గలిగిరి.
ఇర అను ఆమెకు తృణజాతులు వృక్షములు లతలు గుల్మములు (గుబురు పొదలు మొదలగునవి) సంతాన మయ్యెను.
విశ్వకు కోట్లకొలది యక్షరాక్షసులు కలిగిరి.
ఇట్లు కశ్యపునకు నూర్ల-వేల-లక్షల కోట్లకొలది సంతతి కలిగేను. ఇది స్వారోచిష మన్వంతరమునందలి సృష్టి క్రమము. అనంతరము దితికి కశ్యపుని వలన నలువది తొమ్మిది మంది మరుత్తులను కుమారులు కలిగిరి. వారందరును ధర్మము ననుసరించి నడచువారును దేవతలకు ఇష్టులు నైరి .
ఇది శ్రీమత్స్యమహాపురాణమున కశ్యప సంతతి అను షష్ఠాధ్యాయము.
