మత్స్య మహా పురాణము

Table of Contents

95 - ఫలత్యాగ (పండ్లను తినక మానేడు) వ్రతము

నందికేశ్వరుడు నారదునకు ఇంకను ఇట్లు చెప్పెను. నారదా! ఇట్టిదేయగు సర్వఫలత్యాగ వ్రత మాహాత్మ్య మును వినుము. ఇది ఇహపర లోకములందు ఆక్షయమును.సర్వకామ ఫలప్రదమును శుభమునగునది. మార్గశీర్ష మానము నందు కాని పుణ్యములగు ఇతర మాసములలో వేనియందుకాని శుక్లపక్షమున తదియ. అష్టమి-ద్వాదశి, చతుర్దశి-వీనిలో నేడైన తిథినాడు బ్రాహ్మణులచే స్వస్తివాచనము జరిపించి ఈవ్రతము నారంభించవలేను. ఆనాడు బ్రాహ్మణులకు పాయస సహితముగా భోజనము పెట్టించి దక్షిణనీయవలెను. ఔషధ (ఆరోగ్య) కారణము లేకుండగనే సంవత్సరము పాటు పదునెనిమిది విధములగు ధాన్యములు తప్ప మిగిలిన ఫలములు (కూరగాయలు కూడ) దుంపలు వేళ్ళు ఏవియు తినక వదలవలయును.

పిమ్మట (వ్రత పూర్తికే) బంగారుతో ఎద్దును రుద్రుని ధర్మరాజును చేయించవలయును. బూడిద గుమ్మడి కాయ మాదీఫలము పందిలివంగ కాయ పనస మామిడిపండ్లు ఆమాతపు ఫలము (అంబాళము.దీని రసము మామిడిపండు రసమువలె నుండును. అని నిఘంటువు) వెలగపండు కళింగము అనేడు (విష్ణు ప్రీతికరమగు) పండు ఖర్బూజా దోస పండు మారేడుపండు రావికాయ రేగుపండు నిమ్మపండు అరటిపండు గుమ్ముడు దుంప దానిమ్మపండు ఇవి , పదునారును తన శ క్తికి తగినట్లు బంగారుతో చేయించవలెను. ముల్లంగి ఉసిరిగ నేరేడు చింత కాయ కలివిపండు తకోల ఫలము ఏలకికాయ నిమ్మపండు వెదురు మొలక కోడి నెకాయ జమ్మి కాయ మేడి కాయ టెంకాయ ద్రాక్షపండు చిన్న పందిలి వంగకాయ వాకుడుకాయ ఈ పదునారును వెండితో చేయించవలేను. తాటిపండు అవిసికాయ పొగడపండు కపిల ద్రాక్ష పండు కందదుంప చిలగడదుంప మొగలిపూవు (కాయ) చిద్భటము (ఒక కాయ) మంజిష్ఠ (తీగకు కాచిన) కాయ కొండ బూరుగుకాయ గంధపు కాయ బొబ్బర కాయ ఇప్పకాయ మర్రికాయ గార కాయ పొట్లకాయ-ఇవి పదునారును రాగితో చేయించవలేను.

రెండు నీటి పాత్రలు చేయించవలెను. వీటిని ధాన్యము పై పరచిన నూతన వస్త్రము పై ఉంచవలెను. మంచము. దాని పైకి పర పులు మొదలగునవియు దుప్పటియు రెండు రాగిపాత్రలు (పళ్లెరములు) యమ రుద్ర వృషభముల ప్రతిమలు ధేను ప్రతిమ ఇవి అన్నియు శాంతుడు కుటుంబి సపత్నీ కుడు అగు బ్రాహ్మణునకు శుభ దినమున అతనిని దంపతులను) పూజించి ఈయవలెను.

సర్వఫలముల యందును దేవతలు అందరును నివసింతురు. కావున ఈ సర్వఫల త్యాగ వ్రత మాహాత్మ్యమున నాకు శివునియందు భక్తి సిద్ధించుగాక ! శివుడును ధర్మదేవుడును సదా అనంత ఫలప్రదులు. కావున వారి (ప్రతిమల)తో కూడ చేసెడి ఫలదానము వలన వారును అనంత ఫలప్రదులగుదురుగాక ! శివ భక్తులయందు (వలన) సదా అనంతఫల ములు నిలిచి (కలుగుచు) ఉండును. కావున నాకును జన్మజు స్మమునందును అనంత ఫలసిద్ధి యగుగాక! శివునికి - విష్ణు రవి బ్రహ్మలకు నడుమ నేను భేదమును భావన చేయను. కావున విశ్వాత్ముడగు శంకరుడు సదా నాకు శంకరు (శుభము కలిగించు వా) డగుగాక!” అను ఆర్థమునిచ్చు మంత్రముతో వారిని అలంకరించి ఆ విప్ర దంపతులకు ఇవి అన్నియు దానమీయవలెను. శక్తి ఉన్న చో సర్వోపస్కరములతో కూడ మంచమును ఈయవలెను. శ క్తిలేనిచో ఈ చెప్పిన ఫలము లను మాత్రము యథా విధానముగ ఈయవలెను. ఉద కుంభములను రెంటినీ శివుని ధర్ముని ప్రతిమలను తప్పక ఈడు వలేను. పిమ్మట ఆ బ్రాహ్మణుని శ క్తియున్న చో ఇంకను చాలమంది బ్రాహ్మణులను కూడ. భుజింపజేసి తానును పండ్లు ఏవియు లేకుండ భుజించవలెను.

వేదతత్వ వేత్తలును ప్రశంసిం చేడు ఈ సర్వఫల త్యాగ వ్రతము శివ విష్ణు భక్తులగు వారికిని - యోగులకును స్త్రీలకును గూడ క రవ్యము. ఇహపరముల రెంటియందును అనంతఫలముల నీయగల వ్రతము దీనిని మించినది మరియొకటి లేదు. ఈ వ్రతమున పూజింపబడు ఫల ప్రతిమల కుపయోగించిన సువర్ణ రజత తామములందు ఎన్ని పర మాణువులు కలవో అన్ని వేల యుగములపాటు రుద్ర లోకమునందు ఈ వ్రతక ర పూజితుడయి సుఖించును.

ఈ వ్రతము దాని నాచరించిన నరుల సమస్త కలుషములను హరించును. ఇహలోకమున సంజీవనమయి సర్వదా సుఖింపజేయును. జన్మాంతరముల యందును అట్టి వారికి పుత్తవియోగ దుఃఖము కలుగదు; ఇంద్రాది దేవత లనుభవించెడి స్వర్గ సుఖములు లభించును.

దీని నాచరించుటకు శక్తి లేనివారు పుణ్యకరమగు ఈ వ్రత విధానమును ధార్మికులెవరైన దేవాలయములందో భవనములందో చెప్పుచుండగ వినినను తామే చదివినను పాప విముక్తులై ఇహలోకమున సుఖించి పరమున విష్ణు స్థానమును పిమ్మట ఆనందప్రదమగు శివ స్థానమును పొందుదురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలత్యాగ వ్రత మాహాత్మ్య కథనమను తొంబదియైదవ అధ్యాయము.