మత్స్య మహా పురాణము

Table of Contents

75 - విశోక సప్తమీ వ్రతము

ఈశ్వరుడిట్లనెను: మునిపుంగవా! ఇట్టిదే యగు విశోక సప్తమి విషయము చెప్పెదను: ఈ సప్తమినాడుపవాస మున ఎప్పుడును శోకమునందడు. మాఘశుక్ల పంచమినాడు దంతధావన పూర్వకముగా తిల (చూర్ణము-తై లము)లతో స్నానము చేసి పులగము మా తము తిని ఉపవసించి రాత్రియందు బ్రహ్మచర్యము పాటించవలయును. తెల్లవారి లేచి స్నాన జపములు చేసి శుచియై 'ఆర్కాయ నమః' అను మంత్రముతో ఎర్రని కరవీర పుష్పములతో రవిని పూజించి ఆయనకు ఎర్రని వస్త్ర ద్వయమునర్పించవలెను. “మూడు లోకములకు విశోక త్వము (శోక ము లేక పోవుట) కలిగించు ఆదిత్యా! నాకును విశాక త్వమును జన్మ జన్మములందును నీయందు భక్తిని ప్రసాదింపుము." అను మంత్రముతో ప్రార్థించుచు షష్టినాడు రవిని పూజించి బ్రాహ్మణులను కూడ పూజించవలెను. ఆనాడు గోమూత్రము మాత్రము ఆహా రముగా గడపి రాత్రి నిద్రించిలేచి సప్తమి నాడుదయము నిత్యానుష్టానము ముగించుకొని విప్రుల నన్న దానపూర్వకముగా ఆరాధించి ఆ వస్త్రద్వయమును బంగారు పద్మమును బ్రాహ్మణున కీయవలయును. మౌనవ్రతముతో తె లలవణ రహి తముగా భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గడుపవలయును. ఇట్లు చేయుటచే సుఖమును ఐశ్వర్యమును కలుగును.

ఈ విధానమున అది మొదలు ప్రతి మాసమున పక్షద్వయమునను మరల మాఖ శుక్ల సప్తమి వచ్చువరకు చేయ వలయును. వ్రతాంతమున సువర్ణ కమలముంచిన కలశమును అన్ని పరికరములతోడి మంచమును పాన్పును పాడి కపిల గోవును దానము చేయవలెను.

ఈ విధమున విత్త శాఠ్యము ధనలోభముతో కొంటెతనము) చేయక ఈ వీశోక సప్తమీ వ్రతమును చేయు వాడు ఉత్తమ గతి చెందును. వేయి నూరుకోట్ల (కోటి 1000x100) జన్మముల కాలము శోకరహితుడై ఆమృతత్వా నందమును పొందును. కోరిక తో చేసినవానికి కోరినదెల్ల సిద్దించును. నిష్కాము డై చేసినవానికి పరబ్రహ్మ పదము లభించును. దీనిని చదివినను వినినను ఇంద్రలోక మునందును. విశోకుడగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశోక సప్తమీ వ్రతకథనమను డెబ్బదియైదవ యధ్యాయము.