మత్స్య మహా పురాణము

Table of Contents

101 - ప్రయాగ మాహాత్మ్యము

నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: (స్నాన ప్రసంగమున) పూర్వము పాండుపుత్తడగు ధర్మరాజునకు మార్కండేయుడు చెప్పిన ప్రయాగ తీర్థ క్షేత్రోపవర్ణనమును తెలిపెదను.

మహాభారత యుద్ధానంతరము యుధిష్ఠిరుడు రాజ్యమును పొందియు భ్రాతృశోక సంతప్తుడయ్యెను.

మా భ్రాత దుర్యోధనుడు ఏకాదశాక్షౌహిణీ సేనా నాధుడుగా చక్రవర్తిగా నుం డేనుగదా! ఆతడును అతని వారును మమ్ములను చాల విధముల బాధించి రేకాని తుదకు పోరును మరణించిరిక దా! వాసు దేవుని ఆశ్రయించియు పాండవులము మేము ఐదుగుర మే మిగిలితిమి. భీష్మ ద్రోణ కర్ణులను పుత భ్రాతృ సహితుడగు దుర్యోధనుని చంపి తాము శూరులమను కొను మావీరులందరును తామును మరణించిరి. గోవిందా! మాకు రాజ్యముతోగాని భోగములతోగాని జీవితముతో గాని ఏమిపని? ఛీ! ఎంత దుఃఖకరమిది! అని యుధిష్ఠిరు డేమియు తోచక నిర్విచేష్టుడు నిరుత్సాహుడునునై అధోముఖుడే ఊరకుం డేను. మరల తెప్పరిల్లెను. కానీ చింత అతనిని వదలలేదు. ఏ విధానమును అనుష్టించి నియమ మవలంబించి తీర్థము సేవించి ఈ మహాపాతక దోషమునుండి విముక్తుడను కాగలుగుదును? ఏ క్షేత్రవాసము చేసినచో సర్వోత్తమ విష్ణులోక ప్రాప్తియగును? ఇవి అన్ని యు నాచే జరిపించిన కృష్ణునేమని అడుగుదును? ధృతరాష్ట్రుని నూర్గుర కొడుకులను చంపి అతనినేమడుగుదును? అని ఇట్లు ధర్మరాజు .ఏమియు తోచని వాడయ్యెను. పాండవులందరును కుంతీ ద్రౌపదులును మరియు నచట చేరిన ఇతరులగు పెద్దలును భూమి పై పడి దొరలుచు ఏడువసాగిరి. 

            ఆ సమయమున వారాణసియందుండిన మహాతపస్వి మార్కండేయుడు యుధిష్ఠిరుని ఈ స్థితిని ఎరిగి శీఘ్రమే హస్తినాపురమున కేతెంచి రాజ ద్వారమున నిలువ ద్వారపాలుడు రాజు కడకువచ్చి యాసమాచారము తెలిపినంత ధర్మజుడును త్వరితమే ద్వారము కడకు పోయెను.

అతడు ఆ మునితో మహాభాగా ! స్వాగతము. మహామునీ! స్వాగతము. మీ దర్శనమున ఇపుడు నా జన్మము సఫలమయినది. నా కులమువారు తరించిరి. నా పితరులు సంతుష్టులయిరి. నేను పవిత్ర శరీరుడనయితిని. అని పలికి లోనికి కొనిపోయి సింహాసనమున మునిని కూర్చుండ జేసి పాద ప్రక్షాళ నార్చనాదులతో మహాత్ముడు యుధిష్ఠిరుడా మునిని పూజించెను.

మార్కండేయుడు సంతుష్టుడై యుధిష్ఠిరునితో “రాజా! నీవేల ఏడిచితివి; నీవేల ఏమియు తోచని వాడ వయితివి? నీ బాధ ఏమి? నీకు కలిగిన అప్రియము ఏమి?” అని యడిగెను. అతడును “మునీ! మాకు రాజ్యము విష యమున జరిగినదంతయు తలచి తలచి చింతావశుడనయితిని." అనగా మార్కండేయుడనెను: “రాజా! క్షత ధర్మమున యుద్ధము చేయునపుడు ఇది పాపము అనునది లేదు. విశేషించి రాజధర్మముననుసరించి యుద్ధము చేయుటలో పాపము లేదని చెప్పవలసిన పనియేలేదు. క్షత్రియుడు సైనికుడై యుండి జీవనమున కే కాని దీనజన రక్షణమున కేకాని యుద్ధము చేయుట క్షత్ర ధర్మము. రాజై నయతడు తన రాజ్యమును రక్షించుకొనుటకో దానిని శత్రువులనుండి సంపాదించుటకో దీనజన రక్షణమునకో యుద్ధము చేయుట రాజధర్మము. ఇది ఎరిగి వివేకమునంది. నీవు నీకు పాపము కలుగునని ఆలో చింపకుము.” అనెను.

అంతట యుధిష్ఠిరుడు మునిని శిరసా నమస్కరించి వినయో పేతుడై “అయ్యా! తాము తైలోక్య (ధర్మ) ద్రష్టలు; మహాప్రాజ్ఞులరు; పాప మోచనమగు ఉపాయమును సం షేపమున చెప్ప మిమ్ము వేడుచున్నాను.” అనెను. ఆ మునియు "రాజా! వినుము; పుణ్య కర్మాచరణమున పాప మోచనము కోరువారికి ప్రయాగ గమనము శ్రేష్టమయినది.” అని పలికెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను నూట ఒకటవ అధ్యాయము.