మత్స్య మహా పురాణము

Table of Contents

150 - మహావిష్ణువు గ్రసనాసురుని చంపుట॥

సూతుడు ఋషులకు ఇంక ను ఇట్లు చెప్పసాగెను: దానవులు అతనిని చూచి క్రుద్దులయి తమతమ బలము లతో కూడి తేనెటీగలు తేనెను తెచ్చుట కై కదలిపోవునట్లు అన్ని వైపులకును)నుండియు కదలిరి॥ నల్లని చామర ములసమూహ ముల రాసులును అమృతముతో చేసినట్లున్న దంతపు మొలకలును పలువన్నెల ఐదు పతాక లును కలిగి గండ స్థలపు ఆంచులనుండి మదము స్రవించుచు పర్వతమువలె నున్న దుర్గరమగు భయంకర గజమునా రోహించి బలశాలియగు నిమిదై త్యుడు హరివై పునకు పోయెను॥ ఆతని గజమును రక్షించుటకు కిరీటములతో కవచములతో ప్రకాశించు రాక్షసులిరువదియేడు వేలమంది రౌద్ర దైత్యులుండిరి॥ అశ్వమునెక్కి మథనుడు ఉష్ట్రము పై జంభకుడు ప్రకాశించు శుంభుడు విపులమగు మేషము నౌరోహించియు వచ్చిరి॥ ఇతర దానవేంద్రులును ఖడ్గములను నాస్త్రములను ధరించి క్రుద్ధులయి ఆశ్చర్యకర కర్మాచరణ సమర్థుడగు విష్ణునితో యుద్ధమునకు వచ్చిరి॥ నిమిదై త్యుడు పరిఘముతో మథనుడు ముద్గరముతో శుంభుడు శూలముతో గ్రసనుడు వాడియగు ప్రాసముతో క్రుద్దుడే మహిషుడు చక్రముతో జంభ మహా