మత్స్య మహా పురాణము

Table of Contents

235 - ఉపస్కర వైకృత శాంతి.

 గర్గుడత్రితో ఇట్లు చెప్పెను; (ఉపస్కరములు అనగా బండ్లు రథములు మొదలగు ప్రయాణ సాధనములును మంచములు పీటలు కుర్చీ (కూర్చిక)లు మొదలగు పండుకొను కూర్చుండు వస్తువులును కృషికి వంటకు పనికివచ్చు పనిముట్లును ఇంకను ఇట్టివియును.)

బండ్లు మొదలగు యానములు ఎద్దులు గుర్రములు మొదలగు వానిని పూర్చక యే నడుచుటయు పూన్చినను కదల్చినను తోలినను కదలకుండుటయు మంటలను పొగలను ధూళులను విడుచుటయు మహాభయ నిమిత్తము; విద్య ములు మోగించినను మ్రగకుండుటయు మోగించకయే మ్రోగుటయు కదలరానివి కదలుటయు కదలునవి కదల కుండుటయు ఆకాశమునందు తూర్యనాదములు గీత గంధర్వ ధ్వనులు వినవచ్చుటయు కొయ్యపనిముట్లు గరిటెలు మొద లగు వంటపనిముట్లును గొడ్డలి మొదలగు ఉపకరణములును వికారము నందినను ఆవులు తమ తోక లలో కొట్టినను స్త్రీలు స్త్రీలనే దేబ్బలు కొట్టుచుండినను ఇట్లు ఉపసరాది వైకృతము సంభవించినందు వలన ఘోరశస్త్ర భయము ఏర్పడును. వాయుదేవుని పూజించి పేల పిండి నివేదించవలయును; బ్రాహ్మణులచే వాయుదేవతాక మంత్రములు జపింపజేసి బ్రాహ్మణు లకు సమృద్ధిగా పరమాన్న సంతర్పణము చేయించి దక్షిణలీయవలెను; దీనిచే ఈ దోషము శమించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ఉపస్కరాది వైకృత శాంతియను రెండు వందల ముప్పది ఏడవ అధ్యాయము.